02/02/2023
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల సమరయాత్ర జనవరి 25 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 2 తేదీన అనకాపల్లి జిల్లాకు చేరుకోవడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులతో 500 మందితో ఎన్టీఆర్ విగ్రహం రోడ్డు వద్ద బహిరంగ సభ జరిగింది. ఈ సభకు అధ్యక్షులు ఎస్వీ నాయుడు, ఎస్ రమణ, వియ్యపురాజు, వహించడం జరిగింది. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై రాము మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ,, పెట్రోలియం యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ లకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని, రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో ఈ సమస్యల అన్నింటి పైన తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు అనకాపల్లి కేంద్రంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి చలసాని శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీలు ఇవ్వటంలో కేంద్ర ప్రభుత్వం , రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను, విద్యార్థులను, యువకులను ఐదు కోట్ల మంది ని మోసం చేసింది ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఏ అశోక్, ఏ ఏ వై ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు పి.రాజేంద్ర, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు వై రాము, ఏ ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి, పి డి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు పి భూషన్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు, అల్లూరి సీతారామరాజు మేనల్లుడు సత్యనారాయణ, పి డి ఎస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజేష్, రాష్ట్ర కో గర్ల్స్ కన్వీనర్ సిహెచ్ పావని , సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే లోకనాథం, సిపిఐ జిల్లా కార్యదర్శి బాలపల్లి వెంకటరమణ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్ రమణ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్ వి నాయుడు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫణీంద్ర కుమార్ పిడిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ భాస్కర్ అనకాపల్లి డివిజన్ సెక్రెటరీ ఎస్ఎఫ్ఐ గొర్లి తరుణ్ తదితర జేఏసీ నాయకులు పాల్గొన్నారు