09/02/2023
ఎస్ఎఫ్ఐ అనకాపల్లి నూతన జిల్లా కమిటీ ఎన్నిక విప్లవ అభినందనలు కామ్రేడ్స్ ✊️✊️✊️
This page helps to students,who suffering from educational issues they can contact and solve thier educational problems by student's federation of India (SFI)
09/02/2023
ఎస్ఎఫ్ఐ అనకాపల్లి నూతన జిల్లా కమిటీ ఎన్నిక విప్లవ అభినందనలు కామ్రేడ్స్ ✊️✊️✊️
09/02/2023
ఎస్ఎఫ్ఐ అనకాపల్లి జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులు గా ఎన్నిక..... అయినా కామ్రేడ్స్ కి
విప్లవ అభినందనలు ✊️✊️✊️
09/02/2023
అనకాపల్లి ఎస్ఎఫ్ఐ 32వ జిల్లా మహాసభల్లో ముఖ్య వ్యక్తలుగా విచ్చేసి మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు ఆర్. శంకర్ రావు గారు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పావని, ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు, అదేవిధంగా అనకాపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడారు.... నూతన జిల్లా కమిటీ ఎన్నిక జరిగింది...
05/02/2023
యూటీఏఫ్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో CPS రద్దు కోరుతూ సంకల్ప దీక్షకు సంగిభావం తెల్పిన ఎస్ఎఫ్ఐ నాయకులు...
03/02/2023
03/02/2023
*ఇది చాలా విచారకరం విద్యార్థులతో అసత్యాలు పలికించడం గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు తగదు*
●●●●●●●●●●●●●●●●●●●●●◆●◆◆
విద్యార్థులకు భయపెట్టి మాట్లాడిఇంచి నంత మాత్రంనా
నిజాలు మారిపోవు
విద్యార్థులతో అసత్యా లు పలికించిన వారు ఎవ్వరైనా బహిరంగ చర్చలకు రావాలి మేము సిద్ధంగా ఉన్నాం విద్యార్థులు, విద్యార్థుల తల్లితండ్రు కు బహిరంగ చర్చలకు ఆహ్వానిద్దాం నిజా నిజాలు ఏంటో బయటకు వస్తుంది.
ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు సవాల్
ఒకే విద్యార్థులు రెండు రకాల అభిప్రాయాలు ఎలా సాధ్యం
విద్యార్థులతో
చెలగాటమాడుతున్నది ప్రజా సంఘ నాయకుల లేక గిరిజన సంక్షేమ శాఖ అధికారుల సమాజానికి తెలియాలి
నిజం తేలేంతవరకు ఉద్యమిస్తాం
జిల్లా కలెక్టర్ గారితో ఈ విషయం మీద చర్చలు జరుపుతాం విద్యార్థులను పక్కదోవ పట్టిస్తున్న ఎంతటి వారైనా వారి ఆటలు కట్టిస్తాం
గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజు ఆగ్రహం
విద్యార్థులు సమస్యలతో బాధపడటం వాస్తవం
సంక్రాంతి సెలవుల తర్వాత మరింత దయానియాకంగా మెనూ అమలు చెయ్యడం వాస్తవం
విద్యాసంస్థల బంధుకు ఒకరోజు ముందే విద్యార్థుల అందరితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాం మీరు విద్యార్థితో మాట్లాడించిన అసత్యాల వీడియోని బయట పెట్టిన తర్వాత కూడా విద్యార్థులు మాతో మాట్లాడుతూ
విద్యాబుద్ధులు నేర్పే వారే మాకు అబద్ధాలు చెప్పమని ఒత్తిడి చేశారంటూ విద్యార్థులు ఆవేదన చెందుతూ రిపోర్ట్ ఇచ్చి ఉన్నారు.
నిర్భయంగా నిజాలు మాట్లాడే విద్యార్థులను ప్రలోభాలు పెట్టి భయపెట్టి బలవంతము చేసి అబద్ధాలు పలికించిన వారు బహిరంగ చర్చకు సిద్ధం కావాలి
విద్యాసంస్థల్లోకి మమ్మల్ని రానివ్వనంత మాత్రాన విద్యార్థుల సమస్యలు బాధలు మాకు తెలియదనుకోవడం సరికాదు
ప్రతి విద్యార్థి మనసును గెలుచుకున్న నాయకులు మేము అటువంటిది విద్యార్థులకు అన్యాయం జరిగితే మేమెలా ఊరుకుంటాం మీరు అసత్యాలు మాట్లాడించిన విద్యార్థి బడిలో లేదు అదే రోజు వారి గ్రామం నుండి నాలుగు రోజుల తర్వాత వచ్చారు మీరు అబద్ధాలు మాట్లాడించిన తర్వాత అదే విద్యార్థులు తమతో ఏ విధంగా నిజం చెప్పారో స్వయానా ఈ వీడియో ద్వారా మీరే వినండి సమస్యల కుంపటిలో విద్యార్థులకు నెట్టేసి ఆ సమస్యలు బయటకు పోకకుండా ఎన్ని రోజులు కంచ కట్టి కాపలా కాస్తారో చెప్పాలి. నిజమే ఆశ్రమాల్లో ఏం జరుగుతుందో తమ స్వప్రయోజనాల కోసం విద్యార్థులను ఎవరు వాడుకుంటున్నారో తేలాలి వారు ఎంతటి వారైనా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి నేటి బాలలే రేపటి పౌరులు అంటూనే తప్పుడు వార్తలు పుట్టించి తప్పుదోవ పట్టిస్తూ నేటి బాలలే రేపటి బానిసలు అనే చందంగా గిరిజన సంక్షేమ శాఖ అధికారుల తీరు కనిపిస్తున్నాయి.
విద్యార్థులకు ఎవరు ఏ రకంగా ప్రలోభాలు పెట్టారో అన్న సంగతి ప్రజా సంఘ నాయకులకు తెలియందేమి కాదు అందుకే సుఖమెరిగిన వాడు కష్టం విలువ తెలీదు కాబట్టి గౌరవ అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారిని సవినయంగా కోరుకుంటున్నాం విద్యార్థులు ఎక్కడ నిద్రపోతున్నారో
వారి గురువులను అక్కడే నిద్రపోనివ్వమని విద్యార్థు తినే తిండి తింటూ చెంబు పట్టుకొని ప్రతిరోజు బట్టకు వెళ్ళమని ఆదేశాలు ఇవ్వగలరు దాన్నిబట్టి విద్యార్థులు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో తెలుస్తుంది.
అప్పుడు మేము ఇబ్బంది పడి చదువుకున్నాం కాబట్టి మీరు అలాగే ఇబ్బందులు పడి చదవాలని విద్యార్థులకు ఇత బోధ చేస్తున్నారు నాటి పరిస్థితులు వేరు ఈ డిజిటల్ యుగంలో వచ్చిన మార్పులను బట్టి కావాల్సిన సదుపాయాలు కల్పించాల్సి ఉండగా కల్పించకపోవడం వల్లనే ఈ సమస్యలు వెల్లువెత్తుతున్నాయన్నవాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారు.
పాఠశాలలో నిజంగా సమస్య లేకపోతే ఎందుకని తరగతి గదుల్లో బెంచీలు పక్కన జరిపి బెంచీల సందుల్లో నిద్రపోతారు ఎందుకని పెట్టెల మధ్యన చలిలో వణుకుకుంటూ నిద్రిస్తారు ఒక ప్రహరీ గోడ ఉండదు మంచి మరుగుదొడ్లు ఉండవు సరైన రూములు ఉండవు. భోజనం చేయాలంటే రోజుకు మూడు పూటలా కంచాలు పట్టుకొని మరో పాఠశాలకు వెళ్లాల్సిన దౌర్భాగ్య పరిస్థితి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎవరు కల్పించారు దానికి బాధ్యులు ప్రజాసంఘాల? వీటన్నిటికీ కారణం గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఐటీడీఏ పీవో ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులుకాద
కనుక దీనిబట్టి విద్యార్థుల జీవితాలతో ఎవరాడుకుంటున్నారో చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది తల్లితండ్రులతో మాట్లాడతం జరుగుతున్న ద్రోహాన్ని ఎండగడతాం విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకుంటాం.
03/02/2023
గురువులు విద్యార్థులతో ''అబద్ధాలు" చెప్పించడం సిగ్గుచేటు || Alluri Zilla || ASR9 NEWS || గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ప్రభుత్వం ఇచ్చిన మెనూ అమలు చేయకుండా విద్యార్ధులతో అబద్ధాలు గురువులు అబద్ధాలు...
02/02/2023
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల సమరయాత్ర జనవరి 25 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 2 తేదీన అనకాపల్లి జిల్లాకు చేరుకోవడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులతో 500 మందితో ఎన్టీఆర్ విగ్రహం రోడ్డు వద్ద బహిరంగ సభ జరిగింది. ఈ సభకు అధ్యక్షులు ఎస్వీ నాయుడు, ఎస్ రమణ, వియ్యపురాజు, వహించడం జరిగింది. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై రాము మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ,, పెట్రోలియం యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ లకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని, రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో ఈ సమస్యల అన్నింటి పైన తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు అనకాపల్లి కేంద్రంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి చలసాని శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీలు ఇవ్వటంలో కేంద్ర ప్రభుత్వం , రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను, విద్యార్థులను, యువకులను ఐదు కోట్ల మంది ని మోసం చేసింది ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఏ అశోక్, ఏ ఏ వై ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు పి.రాజేంద్ర, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు వై రాము, ఏ ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి, పి డి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు పి భూషన్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు, అల్లూరి సీతారామరాజు మేనల్లుడు సత్యనారాయణ, పి డి ఎస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజేష్, రాష్ట్ర కో గర్ల్స్ కన్వీనర్ సిహెచ్ పావని , సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే లోకనాథం, సిపిఐ జిల్లా కార్యదర్శి బాలపల్లి వెంకటరమణ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్ రమణ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్ వి నాయుడు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫణీంద్ర కుమార్ పిడిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ భాస్కర్ అనకాపల్లి డివిజన్ సెక్రెటరీ ఎస్ఎఫ్ఐ గొర్లి తరుణ్ తదితర జేఏసీ నాయకులు పాల్గొన్నారు
01/02/2023
ఈ రోజు విద్యార్థి, ప్రజాసంఘాల ఆధ్వర్యంన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో విద్యాసంస్థల బంద్ దృశ్యాలు....
31/01/2023
Remembering Mahatma Gandhi on his death anniversary!