26/11/2023
విశాఖ సేవా సదన్ స్కూల్లో ఘనంగా జరిగిన బాలల దినోత్సవ వేడుకలు.
రాంనగర్ లో జీవీఎంసీ వద్ద ఉన్న విశాఖ సేవా సదన్ పాఠశాలలో నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఏయూ ప్రొఫెసర్ కృష్ణమోహన్ గారు విచ్చేశారు. ఇంకా మిగతా అతిధులు విశ్వనాథ్ గారు, సత్యనారాయణ గారు, అంతర్వేది గారు, రాజ్యలక్ష్మి మేడం గారు, రమణి గారు విచ్చేశారు. పాఠశాలలో చాలా విశాలమైన ఆటస్థలం ఉంది. అందుచేత ఉపాధ్యాయులంతా పిల్లలతో రకరకాల ఆటల పోటీలు నిర్వహించారు. అంతేకాకుండా క్విజ్ పోటీలు, పదాల పోటీలు మాత్రమే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు .పిల్లలందరూ డాన్సులు చేసి చాలా బాగా అందరినీ ఆకట్టుకున్నారు. ఈ పోటీలలో గెలిచిన వారికి స్కూలు యాజమాన్యం తరఫున వచ్చిన అతిధులతో బహుమతులు ఇప్పించారు. పిల్లలందరూ చాలా ఆనందించారు. తర్వాత ముఖ్య అతిధులు తమ విలువైన సమాచారాన్ని పిల్లలకు అందించారు. పిల్లలకు తమ ఆశీస్సులను అందించారు. పిల్లలందరూ చాలా సంతోషించారు. స్కూల్ యాజమాన్యం ముఖ్య అతిధులకు గౌరవంగా సన్మానం చేసి తమ అభిమానాన్ని చూపారు. పిల్లలందరికీ చాక్లెట్స్, బిస్కెట్స్, డ్రింక్స్ పంచారు. విద్యార్థులందరూ ఎంతో ఆనందించారు. ఈ విధంగా విశాఖ సేవా సదన్ పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా జరుపుకున్నాము.