01/10/2023
*న్యాయ విద్యార్థుల పరీక్షల నిర్వహణ లో మార్పు* - *ఐలు విద్యార్థి విభాగం, నెల్లూరు లా స్టూడెంట్స్ అసోసియేషన్*
ఈరోజు నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటిలో ఐలు విద్యార్థి విభాగం, నెల్సా ఆధ్వర్యంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ను నెల్లూరు న్యాయ విద్యార్థులు కలిశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ పచ్చా కిరణ్ మాట్లాడుతూ అక్టోబర్ 5 నుండి జరిగే రెండవ సెమిస్టర్ పరీక్షలను రోజు మార్చి రోజు జరపాలని, తద్వారా విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉంటారని కోరగా, స్పందించిన రిజిస్ట్రార్ పరీక్షల నిర్వహణలో మార్పు చేస్తామని చెప్పారు.అలాగే
త్వరిత గతిన ప్రోవిజినల్స్ ఇవ్వాలని,యూనివర్సిటీ రీవాల్యూషన్ రిజల్ట్ త్వరగా ఇవ్వాలని,ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి,న్యాయ విద్యార్థులకు కాన్వగేషన్ నిర్వహించాలన్నారు.మెరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్ ఇవ్వడం ద్వారా విద్యార్థులను ప్రోత్సహించాలని కోరారు. విక్రమ సింహపురి యూనివర్సిటీలో లా డిపార్ట్మెంట్ ను ప్రారంభించాలి.LLB,LLM కోర్సులు ప్రారంభించాలి.సానుకూలంగాస్పందించిన రిజిస్ట్రార్ ,తగిన చర్యలు తీసుకుని విద్యార్థులను ప్రోత్సహిస్తామని మాట్లాడారు.ఈకార్యక్రమంలో నెల్లూరు లా స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు షాజీర్, మణి , వినీష్, ధనుష,ప్రియ, సింధు, పావని,శిరీష, రాణా, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.