25/03/2026
నంది పాఠశాల పాలకవర్గం వారి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు సెమినార్ కార్యక్రమము:-
"భారతావని స్వాతంత్య్ర జ్యోతి, భారతీయుల స్వేచ్ఛ కోసం అగ్నిపథంలో నడిచిన మహావీరుడు – నేతాజీ సుభాష్ చంద్రబోస్”".
ఈ రోజు నందిపాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ప్రముఖ స్వాతంత్య్ర సమార యోధుడు ఆజాద్ హిందు పౌజ్ ఆర్మీ వ్యవస్థాపకుడు, భారత స్వాతంత్రోద్యమంలో ప్రాణాలర్పించిన భరతమాత ముద్దు బిడ్డ శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జీవిత చరిత్ర గురించి విద్యార్థిని విద్యార్థులకు అవగాహనా కార్యక్రమము నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్, కీ నోట్ స్పీకర్ గా పెదనందిపాడు కళాశాల పూర్వ విద్యార్థి మరియు రిటైర్డ్ హిస్టరీ లెక్చరర్ శ్రీ తోటకూర వెంకట నారాయణ గారు విచ్చేసినారు. వారు ఈ సందర్భముగా అధ్యాపకులు మరియు విద్యార్థుల తో కలసి శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నంది స్కూల్ విద్యార్థిని విద్యార్థుల ను ఉద్దేశించి అనర్గళంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత దేశం కొరకు స్వాతంత్రోద్యములో కొన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేసినారని, వారిలో నేతాజీ గారి ప్రయాణం కీలకమైనదని వారు అతి చిన్న వయసులో తన కుటుంబం కన్నా దేశానికే ప్రాముఖ్యతను ఇచ్చి అతివాద నాయకుడిగా నాటి బ్రిటీష్ గవర్నమెంట్ నుండి ఎన్నో ఇబ్బందులు ఎదురుకొని దేశ స్వతంత్రం కొరకు ఉద్యమించారని వారి గురించి వివరిస్తూ
• ప్రారంభ జీవితం మరియు విద్య : నేతాజీ చిన్ననాటి నుంచే దేశభక్తి భావంతో పెరిగారు. ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరి స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.
• ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి: 1938 మరియు 1939లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కానీ స్వాతంత్ర్యం సాధనలో తక్షణ చర్యలు అవసరమని భావించి నాటి మితవాద నాయకులతో విభేదించారు.
• ఫార్వర్డ్ బ్లాక్ స్థాపన : ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను విడిచి 1939లో ఫార్వర్డ్ బ్లాక్ ను స్థాపించారు. దీని ద్వారా ఆయన స్వతంత్ర పోరాటాన్ని మరింత దృఢంగా కొనసాగించారు.
• విదేశీ సహాయం కోసం ప్రయత్నం: బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జర్మనీ, జపాన్ వంటి దేశాల సహాయం కోరారు. అంతర్జాతీయ స్థాయిలో భారత స్వాతంత్ర్య పోరాటాన్ని చాటిచెప్పారు.
• ఆజాద్ హింద్ ఫౌజ్ (INA): ఆయన నాయకత్వంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ ను బలపరిచారు. ఈ సైన్యం నాటి బ్రిటిష్ పాలకులపై యుద్ధం చేసి స్వాతంత్య్రం సాధించేందుకు కృషి చేసింది.1943లో సింగపూర్లో ప్రోవిషనల్ గవర్నమెంట్ అఫ్ ఫ్రీ ఇండియా ను ఏర్పాటు చేసి స్వతంత్ర భారతానికి సంకేతంగా నిలిచారు.
• ప్రసిద్ధ నినాదం: “తుమ్ ముఝే ఖూన్ దో, మై తుమ్హే ఆజాదీ దూంగా” అనే నినాదం ద్వారా యువతలో ఉత్సాహాన్ని నింపారు. అనగా “మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను.” అని అర్ధం. దీని భావం: స్వాతంత్ర్యం అనేది ఉచితంగా లభించదు; దాని కోసం త్యాగం, సాహసం, సంకల్పం అవసరం. యువత తమ ప్రాణాలను కూడా సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉంటేనే, నిజమైన స్వాతంత్ర్యం సాధించగలమని నేతాజీ చెప్పిన ఈ వాక్యం నేటి తరానికి కూడా ఉత్తేజాన్నిస్తుంది.
• త్యాగం మరియు ప్రేరణ: ఆయన జీవితం త్యాగం, ధైర్యం, అంకితభావానికి ప్రతీకగా నిలిచింది. నేటి యువతకు గొప్ప స్ఫూర్తి అని తెలియజేసినారు.
భారత స్వాతంత్రోద్యమంలో అజరామరమైన పాత్ర పోషించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జీవిత గాధ ప్రతి విద్యార్థికి ధైర్యం, దేశభక్తి, త్యాగస్ఫూర్తి అనే విలువలను నేర్పిస్తుంది. ఆయన ఆశయాలు మనకు మార్గదర్శకం, ఆయన సంకల్పం మనకు ప్రేరణ. ఈ సెమినార్ ద్వారా యువతలో దేశ సేవా భావం పెంపొందించి, భవిష్యత్తు నాయకులుగా ఎదగడానికి ప్రేరణ కల్పిద్దాం అని వారు పేర్కొన్నారు.
తదనంతరం కళాశాల ప్రిన్సిపాల్ మరియు ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ "త్యాగమే ధ్యేయంగా, సాహసమే ఆయుధంగా – భారత మాతకు స్వాతంత్ర్యం అంటే జీవితాన్ని అర్పించిన మహానాయకుడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత ప్రయాణం నేటి తరానికి ఒక స్ఫూర్తి. ఆయన ఆలోచనలు, దేశభక్తి, సంకల్పబలం మనలో స్వయం ప్రేరణను రగిలించాలి. ఈ సెమినార్ ద్వారా విద్యార్థులు ఆ మహనీయుని ఆదర్శాలను అర్థం చేసుకొని, భవిష్యత్తులో దేశ సేవకు సంసిద్ధులవ్వాలని ఆకాంక్ష."
ఈ కార్యక్రమములో పాల్గొన్న పాఠశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు శ్రీ తోటకూర వెంకట నారాయణ గారిని పాలకవర్గం తరుపున ఘనంగా సత్కరించారు.