25/06/2021
విషయం:- రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాల భర్తీకై నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాల భర్తీకై నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలులోని కలెక్టర్ ఆఫీస్ వద్ద అర్ధనగ్నప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో రామంజనేయులు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖల్లో 2.35,794 ఉద్యోగ ఖాళీలున్నాయని ఆర్థికశాఖ చెబుతోంది. ఎపీలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడచిన పిదప ఇటీవల కేవలం 10,143 ఉద్యోగాల భర్తీకి మీరు అత్యంత ఆర్భాటంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. ఏపీలో గంపెడాశలతో కాంపిటేటివ్ ఎగ్జామ్క ప్రిపేరవుతున్న లక్షలాది మంది నిరుద్యోగుల భవిత మీ జాబ్ క్యాలెండర్ తో అగమ్యగోచరంలో పడింది. ప్రకాశం జిల్లా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి ఇప్పుడు వాలంటీర్లను కూడా ఉద్యోగస్తులుగా ప్రభుత్వ ప్రకటనలలో చూపుతున్నారు. కేవలం నెలకు రు.5 వేల గౌరవ వేతనంపై పనిచేసే వాలంటీర్లు ఉద్యోగస్తులెందుకవుతారు? వాలంటీర్లు తమకు జీతాలు పెంచాలని కోరితే వారిని సేవకులుగా ప్రస్తావించిన మీరు ఇప్పుడు వారిని కూడా ఉద్యోగస్తులుగా ప్రస్తావించడం తగునా? గత రెండేళ్ల పాలనలో 6,03,756 ఉ ద్యోగాలను భర్తీ చేశామని గొప్పలు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏ శాఖల్లో, ఏ ఏ విభాగాల్లో ఎన్నెన్ని ఉద్యోగాలను భర్తీ చేసిందో పూర్తి వివరాలతో సహా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు వర్ధన్ కుమార్ మాట్లాడుతూ
నిరుద్యోగులపట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాల భర్తీకి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయలి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పరుచూరి కుమారి నంద, ప్రకాశం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మారెడ్డి, రామాంజనేయులు, జిల్లా నాయకులు వర్ధన్ కుమార్, నగర ఉపాధ్యక్షులు గోపీచంద్, నగర నాయకులు సాయి పాల్గొన్నారు.