14/06/2016
రాయలసీమ సాగు నీటి సాధన సమితి
రాయలసీమ పట్ల పాలకుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రాయలసీమ ప్రజలచే సిద్దేశ్వర అలుగు శంకు స్థాపన కార్యక్రమం దిగ్విజయంగా జరిగిన తదనంతరం చేపట్ట వలసిన కార్యచరణను నిర్ణయించడానికి రాయలసీమ సాగు నీటి సాధన సమితి ఆధ్వర్యంలో 12 జూన్ 2016 న నంద్యాలలో రాయలసీమ తాగు, సాగు నీటి సాధన కార్యచరణ సదస్సు జరిగింది.
అనేక మంది రైతులు, రైతు , ప్రజా, విద్యార్థి, ఉద్యగ సంఘాల ప్రతినిదులు ఈ కార్యక్రమంలో క్రియా శీలకంగా పాల్గొన్నారు.
ఈ సదస్సు ఈ క్రింది తీర్మాణాలను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది.
1. సిద్దేశ్వరం అలుగు శంకు స్థాపనకు సహకరించిన రైతులకు, అన్ని ప్రజా సంఘాలకు ధన్యవాధాలు తెలుపుతు, వారి సహకారం ఎల్లప్పుడు ఉండాలని కోరుతు తీర్మాణించడమైనది.
2. సిద్దేశ్వరం అలుగు శంకు స్థాపన లక్ష్యమైన రైతుల అవగాహనతో మరియు భాగస్వామ్యంతో రాయలసీమ తాగు, సాగు నీటి ఇబ్బందంలను సభ్యసమాజం ముందుంచడంలో సఫలీకృతమైందని తీర్మాణిించడమైనది.
3. వేలాది మంది రాయలసీమ రైతులు, ప్రజలు పాల్గొని అత్యంత శాంతి యుతంగ జరిపిన ఉధ్యమం, రాయలసీమ వాసులు గూండాలు, రౌడీలు కాదు, అత్యంత స్నేహశీలలు అన్న విషయాన్ని మరొక్కసారి ఆవిష్కరించింది. ఈ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు గుర్తుంచుకొని రాయలసీమ వాసులను చిన్న బుచ్చుతు మాట్లడవద్దని తీర్మాణించింది.
4. హింసాత్మకంగా జరిగె ఉధ్యమాలకే ప్రాధాన్యతను ఇస్తున్న రాజకీయ పార్టీలు, గొంతు తడుపుకొన డానికి గుక్కెడు నీళ్ళు, ఆరుతడి పంటలను బతికించుకొనడానికి కాసిన్ని నీళ్ళు అంటు చావు బతుకుల మద్యనున్న రాయలసీమ రైతన్న శాంతి యుతంగా ఉద్యమం చేస్తుంటే ఉలకని, పలకని రాజకీయ పార్టీలు ఏ సందేశాన్ని సమాజానికి పంపిస్తున్నాయో ఆ పార్టీలు వివరించాలని తీర్మాణించడమైనది.
5. రాయలసీమ తాగు, సాగు నీటి అవసరాలను తీర్చడానికై చేసిన ప్రతిపాదనల విజ్ణప్తిని ముఖ్య మంత్రి గారికి, సాగు నీటి శాఖ మంత్రి గారికి, అన్ని రాజకీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు రాయలసీమ ప్రతినిదుల బృందం ద్వార అందచేయాలని తీర్మాణించడమైనది.
6. రాయలసీమ తాగు, సాగు నీటి అవసరాలను తీర్చడానికై చేసిన ప్రతిపాదనల విజ్ణప్తిని శాసన సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు రాయలసీమ జిల్లాల ప్రతినిదుల బృందం ద్వార అందచేయాలని తీర్మాణించడమైనది.
7. గ్రామ, మండల స్థాయి రైతు సంఘాల ద్వార రాజకీయ నాయకులకు వినతి పత్రాలను అందించాలని తీర్మాణించడమైనది.
8. జులై 2 లేదా 3 వ వారంలో కర్నూలు జిల్లాలో రైతు భహిరంగ సభ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించడమైనది. ఈ సభలో రాయలసీమ తాగు, సాగు నీటి సమస్యలపై రాజకీయ పార్టీల స్పందనపై చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటించాలని నిర్ణయించడమైనది.
9. ఈ సంవత్సరం కర్నూలులో జరిగే సాగునీటి సలహ మండలి సమావేశానికి వేలాది మంది తరలి పోయి, ఆ సమావేశం లో పాల్గొనే రాజకీయ నాయకులకు, అదికారులకు తమ తాగు, సాగు నీటి ఆశలను, ఆకాంక్షలను శాంతియుతంగా వ్యక్తపరచాలని తీర్మాణించడమైనది.
10. రాయలసీమలోని నాలుగు జిల్లాలో కొన్ని సాగునీటి ప్రాజక్టుల ఆయకట్టు రైతులను గ్రామ గ్రామన 60నుండి 70రోజులలో కలిసి మన నీటి వాట హక్కులపై అవగాహన కల్గించే కార్యక్రమాన్ని చేపట్టాలని, దానికి అవసరమైన సన్నాహక కార్యక్రమాలు రెండు వారాలలో మోదలు పెట్టాలని తీర్మాణించడమైనది. కర్నూలు జిల్లాలో జరిగే భహిరంగ సభలో ఈ కార్యక్రమం వివరాలు ప్రకటించాలని తీర్మాణించడమైనది.
11. పై కార్యక్రమ అనంతరం 2016 అక్టోబర్ నెలలో విజయవాడలో వెయ్యి మందితో మన సాగునీటి డిమాండ్ డిక్లరేషన్ సమావేశం ఏర్పాటు చెయ్యాలని తీర్మాణించడమైనది.