16/08/2023
ప్రియదర్శినీ బాలవిహార్ లో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయురాలు అద్దంకి సాహిత్య పతాకావిష్కరణ చేసారు. ఉపాధ్యాయినులు భరతమాత చిత్రపటాన్ని పూలమాలలతో అలంకరించి జ్యోతి ప్రజ్జ్వలనం చేసారు. ప్రైమరీ చిన్నారులు పలు దేశభక్తి గీతాలను గానం చేసారు. 5వతరగతి విద్యార్ధులు హింద్ దేశ్ కే నివాసీ సభీ జన్ ఏక్ హై మ్యూజిక్ కు కన్నుల పండుగగా చేసిన మాస్ డ్రిల్ తో గ్రౌండు యాక్టివిటీస్ ముగిసాయి.
అనంతరం వేదికపై ప్రీ ప్రైమరీ విద్యార్ధులు రైమ్స్, చిట్టిపొట్టి గీతాలు ఆలపించారు. యుకేజీ చిన్నారులు జాతీయ పతాకాలను చేతబూని మా తుఝే సలాం అంటూ చేసిన నృత్యం విశేషంగా ఆకట్టుకుంది.
హైస్కూలు విద్యార్ధినీ విద్యార్ధులు వందేమాతరం పూర్తి గీతానికి, హమ్ కరే రాష్ట్ర ఆరాధన అనే హిందీ గీతానికి, మన జాతీయ పతాకము గనరా గీతానికి, తేరే మిట్టీ అనే హిందీ గీతానికి, పాడవోయి భారతీయుడా గీతానికి, జనగణమన పూర్తి గీతానికి దేశభక్తి ప్రేరితులై నృత్యాలు చేసారు.
ఈ కార్యక్రమాలలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్ధినీ విద్యార్ధులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.