19/06/2024
2024 - 25 విద్యా సంవత్సరం కి గాను ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ (IBO) ఎగ్జామినేషన్ క్యాలెండర్ పోస్టర్ ఆవిష్కరించిన ‘’ తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి’’
2024 - 25 విద్యా సంవత్సరం కి గాను ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్(IBO) ఎగ్జామినేషన్ క్యాలెండర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల్లో సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ వారిని అభివృద్ధి బాటలో నడిపించాలని, ప్రతి సంవత్సరం ఇలాంటి పోటీ పరీక్షలు విద్యాసంస్థల్లో నిర్వహించి, ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులు అందరిని సన్మానిస్తూ వారిని ముందుకు నడిపించడంలో సమాజానికి ఉపయోగకరముగా వారిని తీర్చిదిద్దటంలో ఇండియన్ బ్రిలియన్స్ ఒలంపియాడ్ సంస్థ మరియు యాజమాన్యం యొక్క కృషిని అభినందించారు.
పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో ఇలాంటి పోటీ పరీక్షల్లో పాల్గొనట్లయితే భవిష్యత్తులో వారు ఏదైనా సాధించడానికి మానసికంగా సంసిద్ధులవుతారు అని తెలియపరిచారు.
అదే విధంగా ఇండియన్ బ్రిలియన్స్ ఒలంపియాడ్ సంస్థ డైరెక్టర్ అంతోటి రామకృష్ణ మాట్లాడుతూ 2016 నుంచి ఇప్పటివరకు తమను ప్రోత్సహిస్తున్న ప్రతి స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ 2024-25 విద్యా సంవత్సరంలో కూడా ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ని ఆదరించాలని, విద్యార్థులను ఈ యొక్క పోటీ పరీక్షల్లో పాల్గొని వారి యొక్క సత్తా చాటే విధంగా వారిని ప్రోత్సహించాలని తెలియపరిచారు.
2016 సంవత్సరం నుండి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, రాష్ట్ర వ్యాప్తంగా టాలెంట్ పరీక్షల్లో నిర్వహిస్తూ ప్రతిభ ఉన్న విద్యార్థులకు సర్టిఫికెట్ మరియు బహుమతులతో సత్కరించడం జరుగుతుంది . గతంలో తెలుగు ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 5వేల స్కూళ్లలో ఈ పోటీలు నిర్వహింపగా అందులో 600 మంది విద్యార్థులు తమ ప్రతిభను చాటి జిల్లా మరియు రాష్ట్రస్థాయిలో బహుమతులను గెలుచుకున్నారు. ఈ విద్యా సంవత్సరం (2024-25) కి గాను ఒలంపియాడ్ లో పోటీ పరీక్షలు జులై నెల నుండి ప్రారంభం అవుతున్నాయని తెలిపారు. ఈ పోటీ పరీక్షలు విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. పెయింటింగ్ (CPO),మాథ్స్ (SMO) ,సైన్స్(SSO), ఇంగ్లీష్(SEO) ,సైబర్ (SCO), జనరల్ నాలెడ్జ్ (NGKO), మరియు ఆస్ట్రానమీ(SAO) నిర్వహించడం జరుగుతుంది. కావున తల్లిదండ్రులు మరియు స్కూల్ యాజమాన్యం గుర్తించి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ ఫౌండర్ అండ్ సౌత్ ఇండియా డైరెక్టర్ అంతోటి రామకృష్ణ, స్టేట్ ఇంచార్జ్ కే . కావ్య , డిస్ట్రిక్ట్ కోర్డినేటర్స్ మరియు దివ్య , సతీష్ పలువురు పాల్గొన్నారు.