31/03/2023
కపీలేశ్వరపురం...31.03.2023....
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా
కపీలేశ్వరపురానికి చెందిన ప్రముఖ మృదంగ విద్వాంసుడు వక్కలగడ్డ నాగేశ్వరరావు (88) మృతిచెందారు. గడచిన యాభైఏళ్లుగా ఆయన కపీలేశ్వరపురం లోని శ్రీ సర్వారాయ హరికథా పాఠశాలలో మృదంగ ఉపాధ్యాయునిగా సేవలందిస్తున్నారు. దేశంలోని ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో హరికథా ప్రదర్శనల్లో మృదంగ సహకారమందించి మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి వంటి ఎంతో మంది ప్రముఖుల నుండి పురస్కారాలను, అభినందనలను అందుకున్నారు. అలాగే ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ కచేరీల్లోను మృదంగ సహకారమందించి మన్ననలు పొందారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ రాష్ట్రపతిగా ఉండగా రాష్ట్రపతి భవన్ లో తమ శిష్య బృందంతో హరికథా ప్రదర్శననిచ్చి కలాం మెప్పు పొందారు. సంగీతంలో ఎంతోమంది శిష్యులకు విద్యనందించిన నాగేశ్వరరావు తన మరణానంతరం కళ్ళను
కాకినాడ బాదం బాలకృష్ణ ఐ బ్యాంకుకు
దానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్భంగా గ్రామంలో
ప్రముఖుల నివాళులు అర్పించారు...