07/11/2025
🇮🇳🇮🇳వందేమాతరం గీతం 150 సంవత్సరముల సందర్భంగా ఉ10 గంటలకు
సాధన పాఠశాలలో ఈరోజు “వందే మాతరం కార్యక్రమం”ను ఘనంగా నిర్వహించారు.
వందేమాతరం భారతదేశ జాతీయ గేయం (National Song).
ఈ గీతాన్ని ప్రముఖ బెంగాలీ రచయిత బంకించంద్ర ఛటర్జీ 1875 నవంబర్ 7వ తేదీన మొదట సంస్కృతం మరియు కొంత బాంగ్లా భాషలో రచించారు.
ఇది 1882 లో పబ్లిష్ చేయబడిన ఆయన రాసిన 'ఆనందమఠ్' నవలలో భాగం.
“వందే మాతరం” అంటే “ఓ తల్లీ! నీకు నమస్కారాలు” అని అర్థం. ఈ గీతం మాతృభూమిని పూజించే భావనను ప్రతిబింబిస్తుంది.
భారత స్వాతంత్ర్య పోరాటంలో ఈ గీతం రణన్నినాదంగా మారి, దేశభక్తిని, జాతీయ భావాన్ని ప్రజలలో పెంపొందించింది. లక్షలాది మంది భారతీయులను ఉద్యమం వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషించింది.
గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ దీనికి సంగీతం కూర్చి, 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా ఆలపించారు.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, 1950 జనవరి 24న భారత రాజ్యాంగ సభ ఈ గీతంలోని మొదటి రెండు పద్యాలను అధికారిక జాతీయ గేయంగా (National Song) స్వీకరించింది.
'జనగణమన' జాతీయ గీతంతో సమానమైన హోదాను, గౌరవాన్ని పొందింది. ఇది మన దేశంలోని వివిధ భాషలు, సంస్కృతులు గల ప్రజలందరినీ ఐక్యం చేసే జాతీయ ఐక్యతకు చిహ్నం. ఈ పాట ద్వారా బంకించంద్ర ఛటర్జీ తమ మాతృభూమిని ప్రేమించి, గౌరవించమని భారతీయులకు సందేశం ఇచ్చారు.
ఈ సందర్భంగా
*ప్రధానోపాధ్యాయులు సాదిక్ భాషా గారు తమ ప్రసంగంలో* —
*“వందే మాతరం” కేవలం ఒక గీతం కాదు, ఇది మన భారతీయుల గర్వ ప్రతీక*. విద్యార్థినీ,విద్యార్థులు దేశాన్ని ప్రేమించే భక్తి భావాన్ని కలిగి ఉండాలని,
సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు, *ఇలాంటి ఎన్నో కార్యక్రమల నిర్వహణలో ముందుండే మన సాధన పాఠశాల*.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు