ABVP Jagtial

ABVP Jagtial ABVP jagtial district official page
world no 1.STUDENT ORGANISATION
Bharath matha ki jai

ఈరోజు ఎబివిపి జగిత్యాల నగర శాఖ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్...
07/08/2025

ఈరోజు ఎబివిపి జగిత్యాల నగర శాఖ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాల్గొన్నారు. BANDHAN

*ఇంజనీరింగ్ కళాశాలల ఫీజు పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి : ABVP*ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులను పెంచొద్దని ఏబీవీపీ జగిత్...
21/05/2025

*ఇంజనీరింగ్ కళాశాలల ఫీజు పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి : ABVP*

ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులను పెంచొద్దని ఏబీవీపీ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం జిల్లా వ్యాప్తంగా మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని ఫోక్సో కేసులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా *ABVP రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాల్యాల రాకేశ్ మరియు కరీంనగర్ విభాగ్ కన్వీనర్ అజయ్ మాట్లాడుతూ* రాష్ట్రంలో మూడేళ్లకు ఒకసారి పెరిగే ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులను ఇష్టారీతిన పెంచడానికి ప్రతిపాదనలు పంపిన TAFRC నిర్ణయాన్ని ఎబివిపి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది . కళాశాలలు తప్పుడు అడిట్ లెక్కలు చూపిస్తూ ఫీజులు పెంచుకొని పేద విద్యార్థుల దగ్గర లక్షలకు లక్షలు డబ్బులు వసూలు చేయడానికి సిద్ధం అవుతున్నాయి. TAFRC పంపిన ప్రతిపాదనలను విద్యాశాఖ ఉన్నత అధికారులు తిరస్కరిస్తూ చివాట్లు పెట్టారు. దీనితో మనం అర్థం చేసుకోవచ్చు ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజుల పెంపును ఆశాస్త్రీయ బద్దంగా పెంచడానికి అనుమతి అడుగుతన్నాయి. డిమాండ్ లో ఉన్న కోర్సులకు లక్షల రూపాయలు డొనేషన్ల పేరుతో వసూలు చేస్తూ ఉన్నాయి అయినప్పటికీ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల యజమాన్యాల దాహం తీరకుండా ప్రభుత్వానికి ఫీజులు పెంపు చేయమని తప్పుడు లెక్కలు సమర్పించడం ఎంతవరకు సమంజసం. ఇంజనీరింగ్ బి కేటగిరి అడ్మిషన్లను కూడా మెడికల్ కాలేజీల విధానంవలె ఆన్లైన్లో నిర్వహించాలని ఎబివిపి డిమాండ్ చేస్తుంది.టీచింగ్ ,నాన్ టీచింగ్ ,లైబ్రరీ ,ల్యాబ్స్ ఇలా ఎటువంటి వసతులు లేకున్నా తప్పుడు ఆడిట్ రిపోర్ట్స్ తో దోచుకోవడానికి సిద్ధం అవుతున్నాయి ప్రైవేట్ కళాశాలలు . కొన్ని కళాశాలలు ఏకంగా 2 లక్షలు పెంచుకునేందుకు ప్రతిపాదనలను పెట్టింది .ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల తీరు చూస్తుంటే పేద ,మధ్య తరగతి విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య అందని ద్రాక్ష లాగా మారేలా ఉంది. ఒక వైపు కళాశాలలు ఫీజులు పెంచుతుంటే మరోవైపు ప్రభుత్వం నుంచి వచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రం పెంచక విద్యార్థుల జేబులో నుండి డబ్బులు కట్టే పరిస్థితి నెలకొంది.వెంటనే విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి పేద విద్యార్దులకు ఇంజినీరింగ్ విద్య అందుబాటులో ఉండే విధంగా ఫీజులను నిర్ణయించాలని ఎబివిపి డిమాండ్ చేస్తుంది. తప్పుడు ఆడిట్ లెక్కలు చూపించిన కళాశాలలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. కళాశాలలు సమర్పించిన ఆడిట్ రిపోర్టుపై సమగ్ర విచారణ జరిపి కళాశాలలపై చర్యలు తీసుకోవాలి. అలాగే నాణ్యత ప్రమాణాలు పాటించని కళాశాలల పైన చర్యలను తీసుకోవాలని ఎబివిపి విజ్ఞప్తి చేస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో విభా

నరహంతక నక్సలైట్లను ఎదిరించి అసువులు బాసినజాతీయ విప్లవ వీరులు రామన్న, గోపన్న వర్ధంతి నేడు......భరతమాత చరణకమలాల పై తమ జీవన...
19/02/2025

నరహంతక నక్సలైట్లను ఎదిరించి అసువులు బాసిన
జాతీయ విప్లవ వీరులు రామన్న, గోపన్న వర్ధంతి నేడు......
భరతమాత చరణకమలాల పై తమ జీవన పుష్పాలను ఉంచి మాతృభూమికి అర్పించిన వీరుల గాధలు మనల్ని రోమాంచితం చేస్తాయి. వారి పేర్లను విన్న, వారి చరిత్ర చదివినా ఒళ్ళు పులకించిపోతుంది..వారి త్యాగం మనందరినీ లక్ష్యం వైపు నడిపిస్తుంది, ప్రేరేపిస్తుంది. నూనూగు మీసాలు అయినా మొలవని యువకులు భారత్ మాతాకీ జై, ఏబీవీపీ జిందాబాద్
అంటూ పిరికిపందల తుపాకి గుండ్లకు తమ గుండెలను
అడ్డుపెట్టి తల్లి పాదాలను తమ రక్తంతో అభిషేకించిన వీర
కిశోరాలు నడయాడిన గడ్డ ఇది.
వారి రక్తం నేలపై చిందడంతో ఈ మట్టి పులకించింది. ఆ నేల ఇంకిన ప్రతి రక్తపు చుక్కలోని కణం కణం నుండి మీ రక్తం వృధా కాదు మీ ఆశయం ఆగిపోదు అంటూ
నినదిస్తూ వేలాదిగా పుట్టుకొచ్చిన
జాతీయ వాదుల తో నిండిన పవిత్ర కర్మభూమి తెలంగాణ.
బోయినపల్లి రామచందర్ రావు విద్యార్థి పరిషత్ కార్యకర్త, న్యాయవాదిగా జగిత్యాల పట్టణంలో పనిచేస్తూ- విద్యార్థ పరిషత్ కు పెద్దరికంగా నిలిచి కార్యకర్తలకు మార్గదర్శనం చేసేవారు. రాచకొండ గోపాల్ రెడ్డి విద్యార్థి పరిషత్ కు పూర్తి సమయం కేటాయించి జాతీయవాద ప్రేరిత కార్యకర్తలను గ్రామ, గ్రామానికి తీసుకెళ్లి కార్యక్రమాలు నడిపిస్తూ ఉండేవారు.జాతీయ వాద భావజాలం పట్ల, ప్రజలు
ప్రజాస్వామ్యం పట్ల అవగాహన లేని పీపుల్స్ వార్ గ్రూప్,
విద్యార్థులను ప్రజలను చైతన్యవంతులను చేస్తున్న
రామన్న,
గోపన్నల కార్యకలాపాలను సహించ
లేకపోయింది. గ్రామంలో జన జాగృతి కార్యక్రమాలు
నిర్వహించే రామన్న,
గొపన్నలు ఇద్దరూ ఒకేసారి
'గోవిందపల్లి' అనే గ్రామం నుండి జగిత్యాల వైపు వస్తున్న
సంగతి ముందే పసిగట్టి,
జగిత్యాల పట్టణ శివార్లలో
మాటువేసి బస్టాండ్ దగ్గర సాయంకాలం వేళ ఏడు
గంటల సమయంలో మోటార్ సైకిల్ పై వస్తున్న రామన్న,
గోపన్నలను ముందునుండి ఎదుర్కోలేక, సిద్ధాంత పరంగా
జవాబు చెప్పలేక పిరికిపందలు వెనక నుండి తుపాకి
బుల్లెట్ల వర్షం కురిపించారు. తుపాకి గుండ్లను గుండెలతో
ఎదురించిన వీర కిశోరాలు గోపన్న రామన్న లు
అక్కడికక్కడే వీర స్వర్గం అలంకరించారు.ప్రజలలో చైతన్యం కోసం, జన జాగృతి కోసం
ఆహరహమూ శ్రమించిన రామన్న,
గోపున్నలపై పీపుల్స్ వార్ గ్రూప్ సాగించిన దమనకాండను నిరసిస్తూ జగిత్యాల ప్రజానీకమంతా బందు జరిపి విషణ్ణవదనాలతో భరతమాత ముద్దు బిడ్డల అంతిమయాత్రలో పాల్గొన్నది.యావత్ తెలంగాణ నుండి విద్యార్థులు, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు జగిత్యాలకు చేరుకొని అశ్రునయనాలతో నివాళులర్పించారు. ఆంధ్ర ప్రదేశ్ బార్ కౌన్సిల్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది.

22/11/2024
22/11/2024
22/11/2024
ABVP జగిత్యాల నూతన నగర కార్యదర్శిగా కుందారపు రాజు ఎన్నిక...అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల నగర అభ్యాసవర్గ నిర్వహి...
22/08/2024

ABVP జగిత్యాల నూతన నగర కార్యదర్శిగా కుందారపు రాజు ఎన్నిక...అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల నగర అభ్యాసవర్గ నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కరీంనగర్ విభాగ్ సంఘటన కార్యదర్శి రామకృష్ణ మరియు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.అనంతరం నగర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.

*ABVP జగిత్యాల ఆధ్వర్యంలో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు* *అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో...
15/08/2024

*ABVP జగిత్యాల ఆధ్వర్యంలో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు*

*అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు*
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం 1947 కు ముందు అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ పేద బడుగు కులమతం వర్ణం భేదం లేకుండా బానిసలుగా కాలం గడుపుతూ బ్రిటీషన్స్ పాలనలో ఎంతోమంది తమ ధన ప్రాణలన్ని కోల్పోయి ఆంగ్ల పాలన విసిగిపోయి ఎంతోమంది స్వాతంత్ర వీరులు వీరోచిక పోరాటంతో భారతదేశానికి స్వాతంత్ర సిద్ధించింది అప్పటినుండి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైన అనంత ఒక్కటే అనే భావనతో స్వాతంత్రం వచ్చిన రెండు సంవత్సరాలకే ఏబీవీపీ 1949లో ప్రారంభమై జాతీయ పున నిర్మాణమైన ధ్యేయంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు దేశభక్తుడై మనమంతా జీవించాలని నిరంతరం విద్యార్థుల్లో ఎంతోమంది మహనీయుల జీవిత చరిత్ర ఆదర్శంగా తీసుకుని సమాజ శ్రేయస్సు కోరుకుంటూ దేశ హితం కోసం, జ్ఞాన శీల ఏకత సాధనలో ప్రతి ఒక్క విద్యార్థి భాగస్వామ్యం చేస్తుంది. స్వాతంత్ర కోసం ప్రాణాలు కోల్పోయిన ఎంతోమంది మహానుభావుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా పనిచేస్తూ నేడు యువత అంటేనే భారతదేశం అంటూ గర్విస్తుంటాం యువత అంతా చెడు అలవాట్లకు బానిస కాకుండా మన యొక్క సామాజిక బాధ్యతను తెలుసుకొని దేశాభివృద్ధిలో జాతీయ పున నిర్మాణంలో భరతమాత సేవ కోసం సమిధలు కావాలని తెలియజేశారు. అలాగే 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా మనమంతా భాగస్వామ్యం కావడం ఎంతో అదృష్టకరమని మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి కుందారపు రాజు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మనవాడ నందు,SFD ఇన్చార్జి కళ్యాణ్,అజయ్,విఘ్నేష్,
హరీష్,నిఖిల్, సిద్ధార్థ్,కార్తీక్,ప్రవీణ్,విశాల్,ప్రవీణ్,పునీత్,మని,శివ వివిధ కళాశాల అధ్యక్షులు పూర్వ కార్యకర్తలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

*అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన గురుకుల విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి* జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పెద్దాపూర్ ల...
09/08/2024

*అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన గురుకుల విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి*

జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పెద్దాపూర్ లో గల బాలుర గురుకుల పాఠశాలలో అనుమాన స్థితిలో మృతి చెందిన విద్యార్థి అనిరుద్ కుటుంబానికి న్యాయం చేయాలని మృతి పట్ల విచారణ జరిపించి, నిర్లక్ష్యం వహించిన అధికారులను కఠినంగా శిక్షించాలని అదేవిధంగా ఇలాంటి సంఘటన మరలా జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని ,బాధిత కుటుంబానికి 50 లక్షల ఎక్ష్స్ గ్రేషియా మరియు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ABVP ఆధ్వర్యంలో *ప్రభుత్వ విప్ MLA అడ్లూరి లక్ష్మణ్* గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

UP UP NATIONALISMDOWN DOWN COMMUNISMజోహార్ ABVP 🐅 టైగర్ ముదిగంటి జితేందర్ రెడ్డి....దేశ ద్రోహుల సింహ స్వప్నo...జాతీయ వాద...
09/04/2024

UP UP NATIONALISM
DOWN DOWN COMMUNISM

జోహార్ ABVP 🐅 టైగర్ ముదిగంటి జితేందర్ రెడ్డి....
దేశ ద్రోహుల సింహ స్వప్నo...
జాతీయ వాదుల పురిటి గడ్డ అయిన
జగిత్యల లొ నరహంతక నక్సలైట్ గుండాల చేతిలో అమరుడుఅయి నేటికీ 09-04-1987, 37 సం లు
భారత మత నుదుటి సిందూరంగ ఎందరో జాతీయ వాదులకు స్పూర్తిగా
జాతీయ వాద సిదంతము కోసము దేశ ద్రోహులను ఎదురించిన దిరుడు.15-30 మంది నరహంతక నక్సలైట్లు కపుకాచి ఒంటరిగా ఉన్న జిత్తన్న పై అదను చూసి తుట్ల వర్షం కురిపించి కాల్చి చంపటం జరిగింది.
మీ రక్తం వృధా కాదు ...మీ ఆశయం ఆగిపోదు...

చంద్రుని పక్కన చుక్కలం... జిత్తన్నా తమ్ములం...

షాహిద్ జిత్తన్న....

Address

Jagtial

Website

Alerts

Be the first to know and let us send you an email when ABVP Jagtial posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category