APUTF Andhrapradesh

APUTF Andhrapradesh Works for the welfare of Teachers and Education

15/10/2013

సాక్షరభారతిలో అవినీతి గబ్బు..

అక్షరాస్యతా కార్యక్రమాన్ని ఉద్యమ స్పూర్తితో చేపట్టిన ఘనత ఒకప్పుడు మన దేశానికే దక్కింది. కానీ ఇప్పుడు సీన్‌ పూర్తిగా రివర్స్ అయ్యింది. 80వ దశకంలో ప్రారంభించిన అక్షరాస్యతా కార్యక్రమానికీ, మన్మోహన్‌సింగ్‌ హయాంలో ప్రారంభించిన సాక్షరభారతికి అసలు పోలికే లేకుండా పోయింది.

80లలో ఉద్యమ స్ఫూర్తితో అక్షరాస్యతా కార్యక్రమం

80వ దశకంలో అక్షరాస్యతా కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడో ఎందరో ఔత్సాహికులు ఎంతో ఉత్సాహంతో నిరక్షరాస్యులు గుండెలను తట్టారు. వారిని మేలుకొల్పారు. అక్షరగంధానికి నోచుకోలేని అభాగ్యుల దగ్గరకు వెళ్లి, రాత్రిపూట ఓనమాలు నేర్పారు. నాలుగు అక్షరాలు నేర్చుకోవాలనే బలమైన కోరికను రగిలించారు. ఎందరో వాలంటీర్లు నయా పైసా ఆశించకుండా స్వచ్ఛదంగా ఈ కార్యక్రమాన్ని నడిపించారు. పల్లెల్లో, మురికివాడల్లో అక్షర కుసుమాలు విరబూయించారు. వాటి ఫలితంగా జనంలో చైతన్యం వచ్చింది. పెద్దలు తాము రాత్రిబడుల్లో అక్షరాలు నేర్చుకోవడమే కాకుండా, అప్పటి దాకా తమతో కూలిపనులకు వస్తున్న పిల్లలను సైతం బడిలో చేర్చించారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే కాంక్షను రగిలించడంలో నాటి అక్షరాస్యతా కార్యక్రమం చాలావరకు సఫలీకృతమైంది. రాత్రి బడుల్లో చదువుకుంటున్న అమ్మలక్కల్లో కొత్త చైతన్యాలు రగిలించింది. మన రాష్ట్రంలో సారా ఉద్యమం ఉవ్వెత్తున రావడానికి అక్షరాస్యతా కార్యక్రమమే ప్రేరణ ఇచ్చింది. మరికొన్ని రాష్ట్రాల్లో క్వారీ యజమానులకు వ్యతిరేకంగా ఉద్యమాలొచ్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే తమ జీవితాలను తామే మెరుగుపరచుకోవాలనే చైతన్యాన్ని నాటి అక్షరాస్యతా కార్యక్రమం అందించిందని ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం తెలిపారు. అదే ఆ కార్యక్రమానికి శాపమైంది. ఆ తర్వాత అక్షరాస్యత కార్యక్రమానికి ప్రభుత్వాలే తూట్లు పొడవడం మొదలుపెట్టాయి. కొంతకాలం పాటు అటకెక్కించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఉద్యమాల ద్వారా చదువు చెపితే ప్రజా ఉద్యమాలు పుట్టుకు వస్తాయని దానికి మంగళం పాడరని తెలిపారు.

2009లో సాక్షరభారతి ప్రారంభం

మళ్లీ 2009 సెప్టెంబర్‌ 8న మన దేశంలో సాక్షరభారతి పేరుతో అక్షరాస్యతా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఎన్నో ఘనమైన లక్ష్యాలు ప్రకటించిన ఈ కార్యక్రమం రూపకల్పనలో నే తప్పటడుగులు వేశారు. ఔత్సాహికుల భాగస్వామ్యం లేకుండా కేవలం అధికారుల, పంచాయతీ సర్పంచ్‌ల కనుసన్నల్లో నడిచేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను, సర్పంచ్‌ల మనుషులను వాలంటీర్లుగా నియమించి, వారికి జీతాలిచ్చి ఉద్యమ స్పూర్తికి తూట్లు పొడిచారనే విమర్శలున్నాయి.

అవినీతికి అడ్డా

ఔత్సాహికుల సేవలను ఏమాత్రమూ వినియోగించుకోలేదు. దీంతో ఈ పథకం గతి తప్పింది. అవినీతిపరులకు అడ్డాగా మారింది. ఒక్క అక్షరమూ నేర్పకుండానే పుస్తకాలు చదవడం నేర్పినట్టు రికార్డులు రాసేసుకోవడం మొదలుపెట్టారు. సాక్షరాభారతి పేరుతో వయోజన విద్య అధికారులు, కార్యకర్తలు, బుక్‌ పబ్లిషర్స్, ఏజెంట్లు అడ్డగోలుగా డబ్బులు నొక్కేశారు. కోట్లాది రూపాయలు మెక్కి, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారు. ఈ విషయాన్ని సాక్షాత్తు కాగ్‌ రిపోర్టే బయటపెట్టింది. వరుసగా రెండేళ్లు కాగ్‌ రిపోర్ట్‌ సాక్షరభారతిలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టినా దానిని సరిదిద్దిపనే ప్రభుత్వం చేయడం లేదు. కాగ్ రిపోర్టు ద్వారా ఇది బోగస్ కార్యక్రమం అని బయటపడిందని ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం స్పష్టం చేశారు.

14/10/2013

సమైక్య సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయుల్లో ఆందోళన :

సమైక్యాంధ్ర కోసం సమ్మె చేసిన ఉపాధ్యాయులను ప్రభుత్వం చిక్కుల్లో పడవేసే ధోరణిలో వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినవస్తున్నాయి. సమ్మె కాలానికి వేతనం చెల్లించే విషయంలో అనేక కొర్రీలు పెడుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో అక్కడి ఉపాధ్యాయుంతా ఒకేరోజు సమ్మెలోకి వచ్చి, ఒకేరోజు సమ్మె విరమించటంతో 151 జీవో ప్రకారం ప్రభుత్వం వారికి వేతనాలు చెల్లించింది.
సీమాంధ్రలో ఉపాధ్యాయులు విడతల వారీగా సమ్మెలో పాల్గొనటంతో ఏ ప్రాతిపదికన వేతనాలు చెల్లించాలనే అంశంపై విద్యాశాఖ డెరైక్టర్ న్యాయశాఖకు లేఖ రాసినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి, ఉపాధ్యాయ జేఏసీ నాయకుల మధ్య జరిగిన సమావేశంలో సమ్మె కాలంలో కోల్పోయిన పని దినాలను భర్తీ చేస్తామనే ఒప్పందం జరిగినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. జీవో విడుదలయ్యేవరకూ ఆగాల్సిందే!

సమైక్యాంధ్రకు మద్దతుగా ఆగస్టు 22 నుంచి అక్టోబరు 10 వరకు ఉపాధ్యాయులు సమ్మెలో పాల్గొన్నారు. వీరిలో మూడొంతుల మంది సమ్మెలో పాల్గొనగా ఒక వంతు పాఠశాలలకు హాజరయ్యారు.
ఆగస్టు 22 నుంచి అక్టోబరు 10 వరకు సమ్మె జరపగా సెలవు దినాలు పోను పనిదినాలు 33 రోజులుగా ఉన్నాయి. ఆయా రోజులకు గాను ప్రభుత్వం వేతనాలు చెల్లించేందుకు ప్రత్యేక జీవోను విడుదల చేయాల్సి ఉంది.
ఈ జీవో విడుదలకు న్యాయశాఖ అనుమతి కావాల్సి ఉండటంతో ఇప్పట్లో ఉపాధ్యాయుల వేతనాలు చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ కావనే భయం ఉపాధ్యాయులను వెంటాడుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఆగస్టు 22 నుంచి కొంతమంది, ఆగస్టు 27 నుంచి మరికొందరు, సెప్టెంబరు 3 నుంచి అలాగే 11 నుంచి ఇంకొందరు ఉపాధ్యాయులు సమ్మెలోకి వచ్చి అక్టోబరు 10 వరకు ఉద్యమంలో కొనసాగారు. వీరిలో కొంతమంది అక్టోబరు ఒకటో తేదీనే సమ్మెబాట వీడి విధులకు హాజరయ్యారు. ఇలా విడతలవారీగా ఉపాధ్యాయులు సమ్మెలో పాల్గొనటం, సమ్మె విరమించటం వల్ల వీరికి సమ్మె కాలంలో వేతనం ఎలా చెల్లించాలనే అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
మరిన్ని సందేహాలు...
ఉపాధ్యాయులు విడతలవారీగా సమ్మెలోకి రావటం, విరమించటంతో వారికి సీఎం ఇచ్చిన హామీ అమలు నేపథ్యంలో మరిన్ని సందేహాలు ఎదురవుతున్నాయి.

ఒక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే ఒకరు సమ్మెలో పాల్గొనగా మరొకరు పాఠశాలను నడిపారు. పాఠశాల తెరిచి ఉండటంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశారు. ఉపాధ్యాయులు సమ్మె విరమించే సమయంలో సమ్మె జరిగిన 33 రోజులను రానున్న రోజుల్లో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒక ఉపాధ్యాయుడు పనిచేసి మరొకరు సమ్మెలోకి వెళితే ఆ పాఠశాల మళ్లీ 33 రోజులు ఎలా పనిచేస్తుందనే ప్రశ్న ఉదయిస్తోంది. అనుకోని పరిస్థితుల్లో 33 రోజులు పాఠశాలను అదనంగా పెడితే పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేస్తారా, దీనికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది.
సమ్మె కాలంలో విధినిర్వహణలో పాల్గొన్న ఉపాధ్యాయులు మళ్లీ పనిచేయాలా అనే ప్రశ్న కూడా వస్తోంది.
177 జీవో ప్రకారం ఉపాధ్యాయులు సమ్మె చేయడానికి వీలు లేదని.. నో వర్క్, నో పే అమలులో ఉంటుందని గతంలో హైకోర్టు స్పష్టం చేసినట్లు టీచర్లు చెబుతున్నారు.

సమైక్యాంధ్ర కోసం 33 రోజుల పని దినాల్లో ఉపాధ్యాయులు సమ్మె చేస్తే వారికి వేతనం చెల్లించేందుకు ప్రత్యేక జీవో విడుదల చేయాలని ముఖ్యమంత్రి విద్యాశాఖ డెరైక్టర్‌కు సూచన చేయటం, ఈ అంశంపై వారు న్యాయశాఖ వివరణ కోరటంతో ప్రత్యేక జీవో విడుదల ఆలస్యమైందనే వాదన వినిపిస్తోంది.
న్యాయశాఖ ఈ అంశంపై పరిశీలన చేసిన అనంతరం సాధారణ పరిపాలనా విభాగానికి ఈ ఫైలు వెళ్లి ఆమోదం పొందిన తరువాతే ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించే అంశం కొలిక్కివచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
2012 ఫిబ్రవరి 28న దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆ ఒక్క రోజుకు సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయులకు ఇంతవరకు వేతనం చెల్లించలేదు. దీని కారణంగా ఉపాధ్యాయులకు రావాల్సిన ఇంక్రిమెంట్లు, పే ఫిక్సేషన్ తదితర అంశాలన్నీ పెండింగ్‌లోనే ఉంచారు.
ఒక్కరోజు సమ్మె చేస్తేనే ఇన్ని ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో 33 రోజుల సమ్మె కాలానికి ఉపాధ్యాయులకు వేతనం ఎలా చెల్లిస్తారు, దానికి సంబంధించి జీవో ఎలా విడుదల చేస్తారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. సమ్మె విరమించేవరకు బుజ్జగించిన పాలకులు వేతనాలు చెల్లించే జీవో విడుదల విషయంలో ఎలా వ్యవహరిస్తారోనని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

Address

Hyderabad
500001

Opening Hours

Monday 3am - 1am
Tuesday 3am - 1am
Wednesday 3am - 1am
Thursday 3am - 1am
Friday 3am - 1am
Saturday 3am - 1am
Sunday 3am - 1am

Telephone

6889977999

Alerts

Be the first to know and let us send you an email when APUTF Andhrapradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share