Admission s open 26-27
Bhagyaradhi Junior & Degree College
Bhagyaradhi Educational Institutions established in 2010, with the prime objective of satisfying var
Admissions open 2026-27
Admissions open 2026-27....
13/04/2026
12/04/2026
📰 ప్రెస్ నోట్
రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన భాగ్యరధి విద్యార్థులు
నిన్న వెలువడిన ఇంటర్ ఫలితాల్లో భాగ్యరధి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. ప్రథమ సంవత్సరం MPC గ్రూపులో బి. అస్మిత 468/470, BiPC గ్రూపులో జి. విష్ణు తేజ 433/440, MEC గ్రూపులో బి. శ్రీ లక్ష్మి 491/500, CEC గ్రూపులో అంబ్రిన్ బేగం 485/500 మార్కులు సాధించారు.
ద్వితీయ సంవత్సరంలో BiPC గ్రూపులో అవేజ్ 993/1000, MPC గ్రూపులో అమృత్ మరియు శివం ప్రసాద్ 982/1000, CEC గ్రూపులో శ్రావణి 981/1000, MEC గ్రూపులో సానియా బేగం 979/1000 మార్కులతో ప్రతిభ కనబరిచారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఎన్. వెంకటరెడ్డి మాట్లాడుతూ, పదవ తరగతిలో సాధారణ మార్కులు సాధించిన విద్యార్థులు కూడా సరైన మార్గదర్శకత్వంతో ఇంటర్లో అత్యుత్తమ ఫలితాలు సాధించగలరని, అటువంటి విద్యార్థులకు కళాశాల యాజమాన్యం ఎల్లప్పుడూ ఆర్థికంగా మరియు విద్యాపరంగా అండగా ఉంటుందని తెలిపారు.
డైరెక్టర్ నల్ల జై శంకర్ గౌడ్ మాట్లాడుతూ, ప్రథమ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ద్వితీయ సంవత్సరంలో ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించారు.
అలాగే డైరెక్టర్ కె. రామకృష్ణ మాట్లాడుతూ, ఇంటర్ ఫలితాలతో పాటు JEE Mains, NEET, EAPCET వంటి ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందిస్తామని తెలిపారు.
జి. రమేష్ బాబు మాట్లాడుతూ, విద్యతో పాటు క్రమశిక్షణలో కూడా భాగ్యరధి విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్నారని, దీనికి సహకరించిన అధ్యాపకులు మరియు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
— భాగ్యరధి డిగ్రీ & జూనియర్ కాలేజ్ యాజమాన్యం
16/03/2026
భాగ్యరధి డిగ్రీ కాలేజ్లో ట్రాఫిక్ అవగాహన సదస్సు
చింతల్లోని భాగ్యరధి డిగ్రీ కాలేజ్లో విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు మరియు రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వి. నర్సింహా రావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన ట్రాఫిక్ నియమాలు, రహదారిపై పాటించాల్సిన జాగ్రత్తలు, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించారు. మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్లో మెసేజ్లు టైప్ చేస్తూ నడవడం లేదా డ్రైవింగ్ చేయడం, రోడ్డు దాటే సమయంలో జాగ్రత్తలు పాటించకపోవడం వలన జరిగే ప్రమాదాలు మరియు మరణాలపై వీడియోలు చూపించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
అలాగే భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 105 గురించి కూడా వివరించి, చట్టాలను ఉల్లంఘించినట్లయితే ఎదురయ్యే శిక్షల గురించి విద్యార్థులకు తెలియజేశారు. ట్రాఫిక్ నియమాలు ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలి, అలా చేస్తేనే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నవీన్ రాజ్, డైరెక్టర్ నల్ల జై శంకర్ గౌడ్, బోధన మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం మరియు మూడో సంవత్సరం విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై ట్రాఫిక్ భద్రతపై అవగాహన పొందారు.
ఈ కార్యక్రమం విద్యార్థుల్లో రహదారి భద్రతపై బాధ్యతా భావాన్ని పెంపొందించేందుకు ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.
*భాగ్యరధి డిగ్రీ కాలేజీలో మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు*
కుత్బుల్లాపూర్,
చింతల్లోని భాగ్యరధి డిగ్రీ కాలేజీలో యువతలో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థుల్లో డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు, వాటి దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని కళాశాల యాజమాన్యం ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమానికి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సీఐ మల్లేష్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును పూర్తిగా నాశనం చేసే ప్రమాదకరమైన అలవాటు అని పేర్కొన్నారు. మొదట ఆసక్తిగా ప్రారంభమయ్యే ఈ అలవాటు క్రమంగా వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, చదువు మరియు కెరీర్పై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించేందుకు చదువుపై దృష్టి పెట్టి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
అదేవిధంగా ఎస్ఐ నాయుడు, డీఐ ధనుంజయ్ మరియు పోలీస్ సిబ్బంది కూడా ఈ సదస్సులో పాల్గొని మత్తు పదార్థాల వల్ల ఆరోగ్యానికి కలిగే తీవ్రమైన సమస్యలు, కుటుంబాలకు కలిగే ఇబ్బందులు మరియు సమాజంపై పడే ప్రతికూల ప్రభావాల గురించి వివరించారు. డ్రగ్స్ వినియోగం చట్టవిరుద్ధమని, అలాంటి కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఎవరైనా మత్తు పదార్థాల విక్రయం లేదా వినియోగం గురించి సమాచారం తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు కూడా పోలీసులను వివిధ ప్రశ్నలు అడిగి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. మత్తు పదార్థాల ప్రమాదాలపై పోలీసులు ఇచ్చిన సూచనలు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని విద్యార్థులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ నవీన్ రాజ్, డైరెక్టర్ నల్ల జై శంకర్ గౌడ్, బీకాం, బీఎస్సీ, బీబీఏ విభాగాల విద్యార్థులు, బోధన మరియు బోధనేతర సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు కళాశాల యాజమాన్యం పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు భవిష్యత్తులో కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కళాశాల యాజమాన్యం వెల్లడించింది.
12/02/2026
భాగ్యరధి డిగ్రీ కాలేజ్, చింతల్ ఆధ్వర్యంలో “భాగ్యరధి బాన్వోయేజ్ బాష్–2026” ఘనంగా నిర్వహణ
భాగ్యరధి డిగ్రీ కాలేజ్, చింతల్ ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ మరియు ఫేర్వెల్ పార్టీ సందర్భంగా “భాగ్యరధి బాన్వోయేజ్ బాష్–2026” కార్యక్రమాన్ని భగత్ సింగ్ నగర్ మల్టీపర్పస్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భాగ్యరధి విద్యాసంస్థల డైరెక్టర్లు నెవలి వెంకట రెడ్డి గారు, కూచిపూడి రామకృష్ణ గారు, నల్ల జై శంకర్ గౌడ్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అకుల సతీష్ గారు గౌరవ అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నవీన్ రాజ్ గారు, అధ్యాపకులు, మొదటి, రెండో, మూడో సంవత్సరం విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నెవలి వెంకట రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో పాటు విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని, భవిష్యత్లో సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని సూచించారు. భాగ్యరధి సంస్థలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికే ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తాయని తెలిపారు.
కూచిపూడి రామకృష్ణ గారు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని నిర్ధారించుకుని, నిరంతర శ్రమతో ముందుకు సాగితే విజయాలు తథ్యమని అన్నారు. విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు.
నల్ల జై శంకర్ గౌడ్ గారు మాట్లాడుతూ ఈ రోజు విద్యార్థులే రేపటి నాయకులని పేర్కొంటూ, ఆత్మవిశ్వాసం, కష్టపడే తత్వం, సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులుగా మారాలని పిలుపునిచ్చారు.
గౌరవ అతిథి అకుల సతీష్ గారు మాట్లాడుతూ కళాశాల వాతావరణం విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడంలో కీలక పాత్ర పోషిస్తుందని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు మరపురాని జ్ఞాపకాలుగా నిలుస్తాయని అన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ నవీన్ రాజ్ గారు మాట్లాడుతూ విద్యార్థుల అకడమిక్ ప్రగతితో పాటు సాంస్కృతిక, క్రీడా రంగాల్లోనూ ప్రతిభను ప్రోత్సహించడమే భాగ్యరధి డిగ్రీ కాలేజ్ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అధ్యాపకులు, విద్యార్థులను అభినందించారు.
కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన క్రికెట్, ఖో-ఖో, షటిల్, త్రోబాల్, అలాగే చెస్, క్యారమ్స్ వంటి ఇండోర్ గేమ్స్ టోర్నమెంట్లలో విజేతలు మరియు రన్నర్స్కు బహుమతులు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన ఆకట్టుకునే నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అదేవిధంగా మిస్టర్ ఫ్రెషర్ & మిస్ ఫ్రెషర్, అలాగే మిస్టర్ భాగ్యరధి & మిస్ భాగ్యరధి పోటీలతో కూడిన రాంప్ వాక్ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఉత్సాహం, ఐక్యతను పెంపొందిస్తూ అత్యంత విజయవంతంగా ముగిసిందని కళాశాల యాజమాన్యం వెల్లడించింది.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Telephone
Address
CHINTHAL MAIN Road
Hyderabad
500054
Opening Hours
| Monday | 9am - 5pm |
| Tuesday | 9am - 5pm |
| Wednesday | 9am - 5pm |
| Thursday | 9am - 5pm |
| Friday | 9am - 5pm |
| Saturday | 9am - 5pm |