Martyrs' Memorial Research Institute

Martyrs' Memorial Research Institute

Share

Bhagat Singh : " Love for our Motherland will not part our heart even after death.

The MMRI aims at commemorating the sacrifices of all those men and women who had laid down their lives while safeguarding the unity and integrity of the Nation. From our dust will spread the fragrance of the Motherland"

All martyrs were dreamers. They visualized a nation that was strong, prosperous, free from hunger and exploitation, world leader in knowledge and bacon for the entire mankind. The

Photos 02/05/2017

FINS - Forum for Integrated National Security
&
MMRI
Invites you all to
"Paying homage to the Martyred Jawans
Maoist attack in Sukma that massacred 25 CRPF Jawans"

Speakers : Sandeep Unnithan - Executive Editor, India Today, New Delhi
Perala Sekhar Rao - Vice President of Nehru Yuva Kendra Sanghatan
Dr M Bapu Rao - Educationalist / Social Activist

Young Speakers : Research Scholors from Universities

Presided by : Maj Gen A B Gorthi AVSM, VSM(Retd)
FINS National Vice President

Venue :
ICSSR Hall, OU
Date : 6th May 2017
Time : 4.30 pm

01/03/2017

కేరళ లో జాతీయవాదుల పై సిపిఐ-మ్ CPIM పార్టీ సభ్యులు చేస్తున్న హత్యల, మహిళల పై చేస్తున్న దురాగాతాలును వివరిస్తున్న వీడియో. మార్చ 3, 2017 నాడు భాగ్యనగర్ ( హైదరాబాద్ ) లో నిరసన ప్రదర్శన

Photos 01/03/2017

కేరళలో మార్క్సిష్టుల హత్యా రాజకీయాలను ఖండిస్తూ మహాధర్నా 03-03-2017 శుక్రవారము ఉదయం 10.00గం. లకు ధర్నా చౌక్ ఇందిరాపార్క్ వద్ద
హింసా రాజకీయాలను వ్యతిరేకిద్దాం
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం

Photos 28/02/2017

కేరళ కమ్యూనిస్టుల కరడుగట్టిన హింసోన్మాదంకు నిరసనగా జాగృత భారత్, MMRI వారు 3-మార్చ్-2017, ఉదయం 10 గంటలకు ధర్నా చౌక్, ట్యాంక్ బండ్, భాగ్యనగర్ లో “మహాధర్నా” ను నిర్వహిస్తున్నారు.

Photos 28/02/2017

కేరళ లో జరుగుతున్న దాడులకు నిరసనగా జాగృత భారత్, MMRI వారు 3-మార్చ్-2017, ఉదయం 10 గంటలకు ధర్నా చౌక్, ట్యాంక్ బండ్, భాగ్యనగర్ లో “మహాధర్నా” ను నిర్వహిస్తున్నారు .

కేరళ కమ్యూనిస్టుల కరడుగట్టిన హింసోన్మాదం

విమల…28 డిసెంబర్‌, 2016..భర్త రాధాకృష్ణ, ఇతర బంధువులతో ఉన్నప్పుడు ఇంటికి నిప్పుపెట్టారు. భర్త, ఒక బంధువు అప్పుడే మరణిస్తే, తీవ్రగాయాలతో విమల చికిత్స పొందుతూ మరణించింది.
నిర్మల్‌…21ఏళ్ళ యువకుడు…12 ఫిబ్రవరి, 2017…దారుణంగా హతమార్చారు.
సంతోష్‌..18 జనవరి, 2017…సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గం ధర్మదంలో..పట్టపగలు..ఇంటి దగ్గరే కాపుకాచి అమానుషంగా నరికి చంపారు.
కె. రామిత్‌…నవయువకుడు, ఇంటికి ఏకైక జీవనాధారం..12, అక్టోబర్‌, 2016…మందులు తేవడానికి బయటకు వస్తే అతి దారుణంగా దాడి చేసి చంపారు..14 ఏళ్ళక్రితం అతని తండ్రి ఉత్తమన్‌ను కూడా ఇలానే పొట్టనపెట్టుకున్నారు.
సి.కె. రామచంద్రన్‌.. కార్మిక నాయకుడు..11 జూలై, 2016… పట్టపగలు భార్య ముందే అత్యంత కిరాతకంగా నరికి చంపారు..
టి.పి. చంద్రశేఖరన్‌…మాజీ మార్క్సిస్టు కార్యకర్త…4 జూలై, 2012..ఒకప్పటి సహచరుడని కూడా చూడకుండా ప్రాణాలు తీశారు..

ఏమిటి వీళ్ళు చేసిన పాపం?.. జాతీయ సంస్థల్లో క్రియాశీలంగా పనిచేయడం, దేశం కోసం, పేద ప్రజల కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించడమేనా?

కేరళలో కమ్యూనిస్టులు సాగిస్తున్న నరమేధానికి పైవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. కేరళలో కమ్యూనిస్టు కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుండి 270మంది జాతీయవాదులను బలితీసుకున్న ఈ మార్క్సిస్టు వ్యవస్థీకృత నరమేధం 1957 లోనే ప్రారంభమైంది. ఒక్క కన్నూరు జిల్లాలోనే 80మందికి పైగా పొట్టనపెట్టుకున్నారు.

1969లో దర్జీ పని చేసుకుంటున్న రామకృష్ణ హత్యలో ప్రధాన నిందితుడు నేటి ముఖ్యమంత్రి పినరాయ్‌ విజయన్‌. తమ విఘటనవాద, విచ్ఛిన్నకర, ద్వేషపూరిత విధానాలకు విరుగుడుగా విశుద్ధ, జాతీయవాద, స్నేహపూర్వక, సమరసతామయ భావంతో ముందుకు వచ్చిన రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ అంటే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్ట్‌) నేతలకు మింగుడు పడడంలేదు.

మా ‘మార్గమే నిజమైనద’నే సెమెటిక్‌ సంకుచితత్వం, ప్రత్యర్థుల్ని మట్టుపెట్టి మార్గం సుగమం చేసుకోవాలనుకునే నాజీ, ఫాసిస్ట్‌ ధోరణి నరనరాన జీర్ణించుకున్న మార్క్సిస్టులు హింసావాదాన్నే నమ్ముకున్నారు. తమ హింసోన్మాదానికి ‘విప్లవం’, ‘పోరాటం’ అని ముద్దుపేర్లు పెట్టుకున్నారు.

బెంగాల్‌ లాంటి రాష్ట్రాల్లో మూడు దశాబ్దాలకు పైగా హింసారాజకీయాల్ని అవిచ్ఛిన్నంగా సాగించారు. అలాంటి విధానాన్నే ఉపయోగించి కేరళలో కూడా అధికారాన్ని నిలబెట్టుకోవాలని తహతహలాడుతున్నారు. తమ దారికి అడ్డువచ్చేవారిని అత్యంత కిరాతకంగా హతమార్చేందుకు కొత్తకొత్త పద్ధతుల్ని కూడా కనిపెట్టారు. బతికుండగానే మనిషిని ఉప్పుబస్తాలతోపాటు గోతిలో పూడ్చిపెట్టడంవంటి అమానుషమైన పద్ధతితో వారి కర్కశత్వాన్ని ప్రదర్శించుకుంటున్నారు. అలాంటి పద్ధతులతో బెంగాల్‌ను ‘ఏలిన’ మార్క్సిస్టులు ఆ ‘బెంగాల్‌ నమూనా’ను ఇప్పుడు కేరళలో కూడా అమలు చేయాలని ఊవ్విళ్ళూరుతున్నారు.

ప్రత్యర్థుల్ని తొలగించేందుకు ఎలాంటి మార్గాన్నైనా ఎంచుకోవచ్చన్న ఒకప్పటి పార్టీ ప్రధాన కార్యదర్శి పినరాయి విజయన్‌ ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి కావడంతో మార్క్సిస్టు మూకలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. పిల్లలు, మహిళలు, వృద్ధులనే విచక్షణ కూడా లేకుండా అందరిపై విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతున్నారు.

యశోద, విమల, కౌసల్య, అమ్ము అమ్మ మొదలైన అనేకమంది మహిళలను హత్య చేయడం, సజీవ దహనం చేయడం వారి అకృత్యాలకు ప్రత్యక్ష నిదర్శనం. కేవలం వారి కుటుంబ సభ్యులు జాతీయ సంస్థల్లో పనిచేస్తున్నారనే నెపంతో బీద, దళిత మహిళలను కూడా అమానుషంగా హత్య చేస్తున్నారు. ముఖ్యంగా తమ కంచుకోటగా భావించే కన్నూర్‌ జిల్లాలో ఈ మూకలు పెచ్చుమీరిపోయాయి.

సాక్షాత్తు హోంమంత్రిత్వశాఖ పరోక్ష ఆదేశాలతో పోలీసు యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుంటే మార్క్సిస్టు మూకలు సంఘ శాఖలపై, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నాయి. పంట తగలబెట్టడం, ఇల్లువాకిళ్ళు ధ్వంసం చేయడం, పాఠశాల భవనాల్ని కూల్చేయడం, ప్రైవేటు వాహనాల్ని నాశనం చేయడం వారికి నిత్యకృత్యాలయ్యాయి.

నీచ, దుర్మార్గపూరిత, హింసాత్మక విధానాలను ప్రశ్నించి, సంఘ స్వయంసేవకులుగా మారుతున్న, మారిన మాజీ మార్క్సిస్టులపై కూడా దాడులు జరుగుతున్నాయి. ‘ప్రజాహక్కులు’, ‘ప్రజాస్వామ్య పోరాటం’ అంటూ గొంతు చించుకునే మార్క్సిస్టులు అనుసరిస్తున్న అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలను ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలి. హత్యారాజకీయాలను యావత్తు సమాజం కలిసికట్టుగా ప్రతిఘటించాలి. ప్రజలచే ఎన్నుకోబడిన ఏ ప్రభుత్వానికైనా ఆ ప్రజలందరినీ రక్షించాల్సిన రాజ్యాంగ పరమైన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను విస్మరించి, హింసాత్మక మూకల కొమ్ముకాస్తున్న కేరళ ప్రభుత్వపు వైఖరిని ఎండగట్టాలి. హింసారాజకీయాలను వ్యతిరేకిద్దాం..ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం.

Photos 28/02/2017

గత 5దశాబ్దాలు గా కేరళ లో కమ్యూనిష్టులు నరహంతకులై పిండారిలను మరిపించేలా జాతీయవాద శక్తులపై సాగించిన నరమేధం యొక్క మచ్చుతునకలు.
ప్రస్తుతం అక్కడ అధికారాన్ని చేపట్టిన గత కొన్ని నెలలుగా ఈ రక్తదాహం పెచ్చు పెరిగింది.
హింస తో సాధించగలిగేది ఏం లేదు. ప్రపంచ చరిత్ర దీనికి నిదర్ళనం.
బీదలు,పేదలు, గిరిజనులు, హరిజనులు, ఆడ,మగ చిన్న పెద్ద తేడాలేకుండా జరుగుతున్న ఈ దారుణ మారుణకాండను మేధావులు, ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో ఖండించాలి. మానవ హక్కులను కాపాడాలి.
కేరళ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టి తగిన బుద్ది చెప్పాలి.

Photos 14/01/2017

******VIVEK BANDS AVAILABLE HERE *****

Prime Minister of India, President of India, Chief Justice of India: Withdraw the Padma Bhushan... 30/01/2016

Pl sign this petition to stop Padma Bhushan given to a Soft P**n Writer Dr Yarlagadda Lakshmi Prasad

Prime Minister of India, President of India, Chief Justice of India: Withdraw the Padma Bhushan... To, The Prime Minister’s Office, Government of India, New Delhi -110 001 Respected Sir, Attn : Prime Minsiter of India, Sri Narendra Modi Ji Sub : The Unfortunate awarding of Padma Bhushan to Dr. Yarlagadda Lakshmi Prasad who insulted Draupadi and Lord Krishna in his Literary works With lot…

Photos 20/06/2015

ప్రపంచానికి భారత దేశం ఇచ్చిన ఎన్నో కానుకల్లో అపూరుపమైనది ‘యోగ’. ప్రతి ఏటా జూన్ 21ని అంతర్జాతీయ యోగ దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. ఈ గుర్తింపు లాంఛనం మాత్రమే. యోగా ఏనాడో మన దేశ సరిహద్దులు దాటి ప్రపంచ వ్యాప్తమైంది. పతంజలి మహర్షి సూచించిన అష్టాంగ యోగ సూత్రాల నుండి రూపు దిద్దుకున్న యోగకు అధికారికంగా ప్రపంచ గుర్తింపు రావడం భారతీయులుగా మనందరికీ గర్వకారణం..
ఇంతకీ యోగలో ఏముంది? ఎందుకు దీనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఇది ఒక మత ప్రచారంలో భాగం కాదా?.. ఇలాంటి ప్రశ్నలు రావడంతో తప్పులేదు. వాటన్నింటికీ సమాధానం ఉంది. మనం ముందుగా యోగా వల్ల ఉపయోగాలు ఏమిటి అన్న విషయానికి మాత్రమే ప్రాధాన్యత ఇద్దాం.. మొదటి ఉపయోగం సంపూర్ణ ఆరోగ్యం, రెండోది మానసిక ప్రశాంతం.. మన సనాతన ధర్మం (హిందూ మతం) ఒక రూపాన్ని సంతరిచుకోకముందే యోగా పుట్టింది. ఒక మతానికి చెందిన అత్యధికులు ఆచరిస్తున్నారనే సాకుతో యోగకు మతం రంగు పులమడం మూర్ఖత్వమే అవుతుంది.
యోగలో ప్రధానంగా కనిపించేవి ప్రాణాయామం, సూర్యనమస్కారాలు, ముద్రలు, క్రియలు, ఆసనాలు.. ఇందులో ఆసనాలు కనిపిస్తున్నా ప్రధానంగా 25 వరకూ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ ఆసనాలు వేయడం వల్ల తల నుండి కాలి చిటికన వేలు వరకూ మన శరీరమంతా చురుగ్గా పని చేస్తుంది. శరీరం చక్కగా వంగటం వల్ల రక్త ప్రసరణ అన్ని అవయవాలుకు సక్రమంగా జరుగుతుంది. శ్వాస మెరుగవుతుంది. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మెదడు, వెన్నుపూస చురుగ్గా పని చేస్తాయి. చక్కగా యోగాసనాలు చేసే వారికి శారీరక కష్టాలు తగ్గుతాయి. గుండెపోటు, రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం వంటి సమస్యలను ప్రాథమిక దశలోనే అడ్డుకోవచ్చు. ఇప్పటికే ఉంటే పూర్తిగా నియంత్రణలో పెట్టుకోవచ్చు. తద్వార మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. బద్దకాన్ని విడిచిపెట్టి చురుగ్గా పని చేసుకోగలుగుతాం. మెదడు చురుగ్గా పని చేయడం వల్ల మనలో కొత్త ఆలోచనలు పుంతలు తొక్కుతాయి. మొత్తం మీద సంపూర్ణ ఆరోగ్యానికి యోగ పూర్తి గ్యారంటి ఇస్తుంది..
యోగ ఖరీదైనదనే అపోహలు కొందరిలో వినిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ధనికులు, ప్రముఖులు యోగాసనాలను చేయడం, కొన్ని సంస్థలు భారీగా ఫీజులు వసూలు చేసి యోగా నేర్పడం చూసి తెలియని వారికి ఇలా అనిపించడం సహజం. మన ఆరోగ్యం కోసం ఎన్నో మందులు కొని వాడుతున్నాం. వీటి వల్ల మన జేబుకు చిల్లు మాత్రమే కాకుండా సహజ సిద్దంగా ఉండే శరీర రోగ నిరోధక శక్తిని క్రమంగా కోల్పోతున్న విషయాన్ని గ్రహించడం లేదు. అలాగే శరీరాన్ని నియంత్రణలో ఉంచుకోవడం కోసం జిమ్ములు, ఆరోబిక్స్, ఇతర పాశ్చాత్య వ్యాయామాల కోసం డబ్బును ఖర్చు చేస్తున్నాం.. కానీ యోగాకు ఇవేమీ అవసరం లేదు.. చక్కగా మీ ఇంట్లో, లేదా శుద్దమైన గాలి, వెలుతురు సక్రమంగా ఉన్న తగిన చోటు చూసుకొని ఆసనాలు వేసుకోవచ్చు. ఇలా చేసినందుకు మిమ్మల్ని డబ్బు ఇమ్మని అడిగేవారెవరు?
అందరూ యోగాసనాలు వేయండి.. సంపూర్ణ ఆరోగ్యవంతులు కండి.. యోగతో రోగ రహిత సమాజాన్ని రూపొందిద్దాం......

::The Hans India:: 30/12/2012

::The Hans India:: In the last two centuries, no individual has captured the hearts of the youth of Bharat the way Swami Vivekananda did. He blew energy into Bharat which was indulging in self-loathe. He exhorted people with his words: “This is the ancient land where wisdom made its home before it went into any other ...

25/07/2011

Bill intented to create differences among people: RSS chief RSS Chief Mohan Bhagwat today alleged motive of the proposed 'Communal Violence Bill,'' which was posted on the government website, appears to be to create differences among people in the country. Addressing a bi-decennial celebrations of the Martyrs' Memorial Research Institute (MMRI) here, t

Want your school to be the top-listed School/college in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address


1-8-701/3, Padma Colony, Nallakunta
Hyderabad
500044