Prof. Kodandaram

Prof. Kodandaram

Share

Member of Legislative Council, TJS Party-President, Former Chairman-TJAC, Political science prof-OU

Photos from Prof. Kodandaram's post 22/02/2026

వికారాబాద్: AICC ఆధ్వర్యంలో అనంతగిరిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులలో భాగంగా AICC కార్యదర్శి మీనాక్షి నటరాజన్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు ప్రొఫెసర్ కోదండరాం గారు పాల్గొని తెలంగాణ ఉద్యమం, నేపథ్యం, ఆశయాలు, అమరుల త్యాగాలు, లక్ష్యాలు తదితర అంశాలపై విపులంగా వివరించారు.
అలాగే తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి దారితీసిన పోరాట గాథను స్మరించుకుంటూ, ఉద్యమ స్పూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతను వివరించారు.
ఈ శిక్షణా తరగతులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు అన్ని జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు..
_______________________







14/02/2026

మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు..

13/02/2026

ON THE OCCASSION OF NATIONAL WOMEN'S DAY, WE PAY OUR HEARTFELT TRIBUTES TO SAROJINI NAIDU.
REMEMBERING SAROJINI NAIDU, THE NIGHTINGALE OF INDIA, WHO PLAYED AN IMPORTANT ROLE IN THE FREEDOM MOVEMENT AND WORKED FOR THE DIGNITY AND EMPOWERMENT OF WOMEN. HER LIFE AND LEADERSHIP CONTINUE TO INSPIRE GENERATIONS.

Photos from Prof. Kodandaram's post 12/02/2026

ఖమ్మం: నేలకొండపల్లిలో నిర్వహించిన తెలంగాణ జన సమితి పార్టీ పాలేరు నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నేలకొండపల్లికి చేరుకున్న కోదండరాం గారికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, కళాకారులు కోలాట నృత్యాలతో, ఘన స్వాగతం పలికారు. అనంతరం నెలకొండపల్లి మండల కేంద్రంలో తెలంగాణ జన సమితి పార్టీ జెండాను ఆవిష్కరించారు.

సమావేశంలో కోదండరాం గారు మాట్లాడుతూ ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని తెలంగాణ జన సమితి పార్టీ నిలబడిందని తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. డబ్బుల రాజకీయాలకు భిన్నంగా, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ జన సమితి పని చేస్తోందని అన్నారు. ప్రజా ఆకాంక్షలను రాజకీయ వేదికపై నిలబెట్టడంలో తెలంగాణ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ ఆశయాల సాధన కోసం తెలంగాణ జన సమితి పోరాటం కొనసాగిస్తుందని, అందుకు అందరూ మద్దతు తెలపాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొప్పగాని శంకర్ రావు, పల్లె వినయ్, ఖమ్మం జిల్లా నాయకులు మదాస్ శ్రీనివాస్ రావు, రాజేందర్ నాయక్, యువజన సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ కొత్త రవి తదితరులు పాల్గొన్నారు.

09/02/2026

LIVE : Innerview With Professor Kodandaram | Interview With Professor Kodandaram | V6 News

Photos from Prof. Kodandaram's post 07/02/2026

Council for Green Revolution & Bharath Beej Swaraj Manch ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో నిర్వహించిన Second Telangana Seed Festival కార్యక్రమానికి తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులతో మాట్లాడిన ఆయన, వ్యవసాయ విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వం సహకార సంఘాలను ఏర్పాటు చేసి రైతులను ప్రోత్సహించాలని, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కూడా చొరవ చూపి రైతులకు తోడ్పాటు అందించాలని సూచించారు.
అనంతరం సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కోసం ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి, విక్రయదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె వినయ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దార సత్యం, కార్యదర్శి సామ నిరంజన్, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.

_______________________



Photos from Prof. Kodandaram's post 06/02/2026

ప్రొఫెసర్ కోదండరాం గారితో సమావేశమైన తెలంగాణ బీసీ ఫెడరేషన్ ప్రతినిధులు

తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు జశ్వంత్ గారి అధ్యక్షతన, తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర అధ్యక్షులు బెల్లాపు దుర్గారావు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీర్తి యుగంధర్ గారి ఆధ్వర్యంలో ప్రతినిధులు ఈరోజు టీజేఎస్ కార్యాలయంలో తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం గారిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా 11 బీసీ ఫెడరేషన్లకు, అలాగే మేర మరియు గంగపుత్ర కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించి పాలకమండళ్లను ఏర్పాటు చేయాలని కోరారు. రానున్న బడ్జెట్ సమావేశాలలో బీసీ ఫెడరేషన్లు, బీసీ కార్పొరేషన్లకు భారీగా నిధులు కేటాయించేలా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని ప్రొఫెసర్ కోదండరాం గారిని అభ్యర్థించారు.
దీనిపై స్పందించిన ప్రొఫెసర్ కోదండరాం గారు, కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మేనిఫెస్టోలో పొందుపరిచిన ఈ అంశాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అమలు జరిగేలా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి బోరేద ప్రవీణ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తొవ్విటి సదానంద చారి, రాష్ట్ర కార్యదర్శి చేర్యాల రాకేష్, కాసుల కిరణ్ కుమార్, వన్నేమ్ శంకర్, ఎం. భాస్కరుడు, సంఘ వీరప్ప, బొగ్గుల సునీత, రానా నాగేష్ సింగ్, మసూద్ అలీ, ఇమామ్ పాషా, బాణాల శ్రీకాంత్ చారి, పులి రాజు అశోక్, పిల్లి స్వప్న, కరుణాకర్ రాజు, గంగిరెద్దుల నరసింహ, పిల్లి రవీందర్, కొత్తపల్లి దీన, అప్సర బేగం, బి. అరుణ తదితరులు పాల్గొన్నారు.
_______________________



05/02/2026

తెలంగాణలో విద్యకు కేటాయింపులు పెంచాలని కోరుతూ Child Rights Protection Forum ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం గారు హాజరయ్యారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు ప్రస్తుత కేటాయింపులను పెంచి, నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరంపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో పౌర సమాజ ప్రతినిధులు, బాలల హక్కుల పరిరక్షణ వేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
_______________________



05/02/2026

Prof. Kodandaram’s exclusive interview on iDream Channel.
Shared his views on the public issues, and current political developments.
Watch the promo here and check the full interview through the YouTube link below.

https://youtu.be/XZ30oD3-ljw?si=zmvxxTGqL1re6-0C

31/01/2026

రవీంద్ర భారతి: ప్రజా కవి గద్దర్ 78వ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం గారు గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, గద్దర్ గారు ప్రజల కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన విప్లవ కవిగా ఎప్పటికీ స్మరణీయుడిగా నిలిచిపోతారని పేర్కొన్నారు.

Photos from Prof. Kodandaram's post 31/01/2026

శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (సాన్లామ్ గ్రూప్‌తో అనుబంధ సంస్థ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “చదువుకో తెలంగాణ – మిషన్ 10వ తరగతి” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం గారు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

31/01/2026

తన సాహిత్యం ద్వారా యావత్తు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన విప్లవ కవి, గాయకుడు గద్దర్.
నేడు ప్రజా యుద్ధనౌక గద్దరన్న జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాము..

Want your school to be the top-listed School/college in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Prof.Kodandaram

Telangana Janasamithi Party

Location

Category

Telephone

Website

Address


Hyderabad