పెళ్లికి ముందు మీరివి తెలుసుకుంటే మంచిది.
1. మీరు పెళ్లెందుకు చేసుకుంటున్నారో అన్న ఆలోచన లేకుండా సిద్ధం అయిపోయినట్లే అవతలి వాళ్లు కూడా సిద్ధం అయిపోతారు లేదా చేయబడతారు.
2. మీకెలా అయితే బలాలు బలహీనతలూ ఉంటాయో అవతలివాళ్లకి కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరూ వాళ్ల వాళ్ల సంచులు మోసుకొస్తారు. ఆ సంచుల్లో అలవాట్లు, అగచాట్లు, పొరపాట్లు, పోగొట్టుకున్నవి, ఆశలు, అత్యాశలు ఇలా ఎన్నో. పెళ్ళికిముందే ఆ సంచిలో ఏముందో పూర్తిగా తెలుసుకోవడం కుదరదు. అలాగే ఎవరూ సంపూర్ణం కాదు. ఎవరి లోటుపాట్లు వాళ్లకుంటాయి.
3. మీరు చదువు, ఉద్యోగం, ఎత్తు ఇలా ఒక పది అంశాల చిట్టా పట్టుకుని తిరిగితే అందులో కనీసం ఆరు ఉన్నవాళ్లని వెంటనే కట్టేసుకోవాలి. పదికి పదీ కావాలి అని పట్టుబడితే పెళ్లికాకుండానే కాటికెళ్లిపోతారు. కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే, మనకి కావాల్సిన పదికి పది ఉన్నవాళ్లు మనల్నెందుకు చేసుకుంటారు అన్న ఆలోచన వస్తుంది.
4. భార్య/భర్త అందం ట్రోఫీ కాదు అందరికీ చెప్పుకోడానికి, నీకు నచ్చితే చాలు అందరికీ నచ్చక్కర్లేదు. అలాగే మీ సంపాదన మీకుంటే మంచిది.
5. పెళ్లి కుదిరిన దానికీ/ నిశ్చితార్థానికి , పెళ్లికీ మధ్య కొన్ని నెలల సమయం ఉండాలి. ఆ సమయంలో ఇరువురూ మాట్లాడుకోవడం, వీలైతే కలిసి బయటికెళ్లటం, సరదాగా తిరగటం, ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం చెయ్యాలి. ఇది బంధాన్ని బలపరచడానికి ఒకరిగురించి ఒకరు తెలుసుకోడానికి, అభిరుచులు అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.
6. కాబోయే భార్య/భర్తలో మనకి నచ్చని విషయాలు ఖచ్చితంగా ఉంటాయి. వాటిని అది వారి వ్యక్తిత్వం అని వదిలేస్తారో, లేక సౌమ్యంగా చెప్పి మారుస్తారో, లేక తాడో పేడో తేల్చుకుంటారో అన్నది పూర్తిగా మీమీదే ఆధారపడి ఉంది. కానీ పెళ్లైన చాలా ఏళ్లకి ఇవి పూర్తిగా మారిపోవటం కానీ, లేదా అసలు ఇబ్బంది కలిగించనంతగా అలవాటు పడిపోవడం గానీ జరుగుతుంది.
7. పెళ్ళైన తర్వాత కచ్చితంగా రెండు మూడేళ్లు రోలర్ కోస్టర్ రైడ్ ఉంటుంది. భయపడకూడదు, అది కూడా ఆనందించాలి. ఆ కల్లోలంలో వైవాహిక నావని మీరెలా దిక్సూచి లేకుండా నడుపుతారు అన్న దాని బట్టి మీ దాంపత్య జీవితం
ఆధారపడి ఉంటుంది.
8. పెళ్లికి ముందే అన్ని విషయాలూ నిర్ణయించడం వాటికి కట్టుబడి ఉండటం కుదరదు. ఉదా ఎంతమంది పిల్లలు, ఎక్కడ స్థిరపడాలి లాంటివి. ఇదేమీ రాసింది రాసినట్లుగా ఎక్సిక్యూట్ అవ్వటానికి సాఫ్ట్వేర్ కోడ్ కాదు.
9. ప్రతి వ్యక్తికీ కొన్ని విలువలు, నమ్మకాలు, ఆదర్శాలు, అభిప్రాయాలు ఉంటాయి. అవి మీకు నచ్చకపోవచ్చు లేదా వాటితో విభేదించవచ్చు. దానిని మీరు ఎదుటివారికి వ్యక్తపరచవచ్చు కానీ కాదు కూడదు అనే అధికారం లేదు.
10. ఎన్ని ఎక్కువ సంబంధాలు చూస్తే అంత విసుగొస్తుంది. ప్రతి ఒక్కరికీ పెళ్లికి సంబంధించి ఒక అనువైన సమయం (వయసు, అందం, కోరిక మొదలైనవి) ఉంటుంది. అది దాటాక, చేసుకుంటే ఏదో ఒకటి అవ్వగొట్టాం అని అనిపిస్తుంది కానీ అందులో ఆనందం తగ్గిపోతుంది.
11. పెళ్లి అనేది ఒక పెద్ద జూదం, ఇందులో అనుభవం లేకుండా మీరు ఆడటానికి వెళతారు. ఈ ఆటని నెగ్గాలి అని కాకుండా ఆనందించాలి, ఎత్తుపల్లాలు చూడాలి, ఎక్కువసేపు ఆడవలసి వస్తుంది అని సిద్ధమై వెళ్లినవాళ్లే విజయం సాధిస్తారు.
12. పెళ్లయ్యాక ఎలా ఉండాలి అని ఎవరూ నేర్పరు. పెళ్లయ్యాక ఎడాపెడా ఊరికే అడగకుండా సలహాలిచ్చేవాళ్లని ఎంత దూరంగా ఉంచితే మంచిది. అది అమ్మానాన్నైనా, స్నేహితులైనా ఇంకెవరైనా. మీకేదైనా సమస్య వస్తే ముందు మీ ఇద్దరూ మాట్లాడుకోవాలి.
13. మీరు బంధంలో ఎప్పుడూ పైచేయి కోసం ప్రయత్నించకూడదు. మీ బలహీనతలు మీరు ఎదుటివారికి బయల్పరచడం ద్వారా వారి విశ్వాసాన్ని తద్వారా వారి మద్దతుని పొందగలరు. మీరేంటో మీ భాగస్వామికి తెలీకపోతే వాళ్లు మీకు మానసికంగా దగ్గరకాలేరు.
14. పెళ్లిలో శృంగారం అనేది సహజమైనది. ఇందులో ఒకరి కోరికలకు ఇంకొకరు ప్రాధాన్యతని ఇవ్వటం ముఖ్యం. అసహజం కాని ఏ శృంగార చర్యనైనా మీరు నిరభ్యంతరంగా చెయ్యవచ్చు.
15. పెళ్లయ్యాక ఒకరికిఒకరు, ఇంకా తల్లిచాటు కొడుకు, తండ్రిభుజాన కూతురు అంటే కుదరదు. మీరు ఈ మార్పుని ఎంత త్వరగా గుర్తించి భర్త/భార్య పాత్రలో ఒదిగిపోతారో అంత త్వరగా మీ బంధం బలపడుతుంది. హక్కులకంటే బాధ్యతల కోసం పాటుపడేవాళ్లకే దీర్ఘకాలిక ఆనందం.
16. పెళ్లికి ముందే హింసాప్రవృత్తిని అంచనా వేయాలి. వంచన, ద్రోహం, గోప్యత, మాటమార్చటం, అబద్ధాలు, దుర్వ్యసనాలు ఇలాంటివన్నీ ముందే చూసుకోవాలి. ఆస్తులు, డబ్బు కాదు. ఆరోగ్యం గురించి కనుక్కోవడంలో తప్పులేదు. ప్రతిఒక్కరిలో ఒకటీ అర ఆరోగ్య సమస్యలు ఉంటాయి, అవేమీ పెళ్లికి అడ్డంకి కాదు. ఒకసారి సదరు వైద్యులతో మాట్లాడితే సందేహాలు తీరిపోతాయి.
చక్కగా సమయానికి పెళ్లి చేసుకోండి, కిందమీదా పడి కొట్టుకోండి, కలిసి శ్రమించండి, కలిసి సాధించండి, కలిసి ముసలివాళ్లైపోండి.
Addagudur village
Addagudur is a village located in mothkur mandal NALGONDA district in TELANGANA
24/06/2024
నీటిపారుదల లేని వర్షాధార భూమి
తొలకరి వర్షం మురిపించింది.
దుక్కి దున్నాడు.
అచ్చు తోలాడు.
విత్తు నాటాడు.
కాని మళ్ళా ఎండ మొదలైంది.
నేలలో పదును(తేమ) ఆరిపోతుంది.
ఉన్న పదును చాలక నానిన గింజ మొలక రావడానికి ప్రయాస పడుతుంది.
రెండు లీటర్లు నీళ్ళు పట్టే పాలిధిన్ కవర్లు తీసుకున్నాడు.
నీటితో నింపాడు.మూతి దగ్గర చిన్న బెజ్జం పెట్టాడు.
చుక్కా చుక్కా పడుతు నానిన గింజకు అందించేలా చేశాడు.
అతను ఇంజనీర్ కాదు..అతను శాస్త్రవేత కాదు..
అతనే రైతు..అతని కన్నా ఇంజనీర్లు,శాస్త్రవేతలు ఉన్నారా?
జై కిసాన్,,...
అతను ఏ ఎమ్మెల్యేకో మినిస్టర్కో కొడుకై ఉంటాడు. ఇంకా పాతికేళ్ళు కూడా వచ్చి ఉండవు.
అతను ఒక పెద్ద ప్యాలెస్ లాంటి తన ఇంటినుంచో, కోట్ల రూపాయలు ఖరీదు చేసే కారులోంచో దిగి నడిచొస్తుంటాడు. పక్కనే ఫోన్ మోయడానికి కూడా ఒక మనిషి.
దీన్ని వీడియో తీసి కేజీఎఫో, యానిమలో బ్యాక్గ్రౌండ్ స్కోరేసి ఇన్స్టాలో పెట్టి - 'మై లీడర్' అంటావు నువ్వు!
ఇంగెప్పుడురా మనం బాగుపడేది!
డాక్టర్ గారితో ముఖాముఖి
ఫీజు కట్టేశాను, మొదలెడదామా?
సంధించు.
పెరుగు తినొచ్చా?
తినొచ్చు.
ఎప్పుడైనా?
ఎప్పుడైనా.
ఎలా అయినా?
ఎలా అయినా.
పెరుగు తినటం వలన నష్టాలున్నాయా?
లేవు. భారతీయులు కనిపెట్టిన ఒక గొప్ప దివ్య ఆహారం పెరుగు. మనకి రోజుకి కావాల్సిన కాల్షియం, కొంచెం ప్రొటీను, వెన్నతీయనిదైతే కొవ్వులు, ఇంకే శాఖాహారంలోనూ దొరకని విటమిన్ బి12 తో పాటు, మంచి బాక్టీరియా ఇవన్నీ లభిస్తాయి.పైగా పెరుగు రుచికరమైంది కూడా.
పెరుగు పుల్లగా ఉంటుంది?
అవును అమ్మ ప్రేమ కూడా కమ్మగా ఉంటుంది. మిర్చీ బజ్జీ కారంగా ఉంటుంది.
సైడెఫెక్టులు లేని మందులుంటాయా?
సైడెఫెక్టులు లేకపోతే ఎఫెక్టు కూడా లేనట్లే. డబ్బులు దండగ. అన్ని సైడెఫెక్టులు అందరిలో రావు. వచ్చినవన్నీ ఎక్కువకాలం ఉండవు. సైడెఫెక్టులని దాటి లాభం ఉంటేనే మందులు రాస్తారు.
గ్రహణం వలన పిల్లలు అవకారాలతో పుడతారా?
లేదు, పిల్లలు అవకారాలతో పుట్టడానికి జన్యువులు, ఇన్ఫెక్షన్లు, పౌష్టికాహారలోపం, అరుదుగా వాడే మందులు ముఖ్యమైన కారణాలు.
పిల్లలకి పంచదార తినిపించవచ్చా?
మీ పిల్లలు మీ ఇష్టం. కానీ పిల్లలకి పంచదార ఏ రూపంలోనైనా అవసరం లేదు. పైగా పంచదార తీయని విషం. పంచదార వలన మిగతా ఆరోగ్యకరమైన ఆహారం మీద ఆశ సన్నగిల్లుతుంది.
పిల్లలకి వేసే టీకాలకి సైడెఫెక్టులు ఉంటాయా?
చాలా అరుదుగా ఉంటాయి. వాటివలన వేయటం మానేస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉంది. తర్వాత మీ ఇష్టం.
పాలిస్తే వక్షోజాలు వదులైపోతాయా?
అవుతాయి. వక్షోజాల ముఖ్యమైన పని పిల్లలకి పాలివ్వటం. పిల్లలు కనని వాళ్లలో, ఆలస్యంగా కనే వాళ్లలో, పాలివ్వని వాళ్లలో రొమ్ము క్యాన్సరు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కచ్చితంగా వస్తుందని కాదు.
తల్లిపాల కంటే మంచి పాలపొడి మార్కెట్లో ఉందా?
లేదు.
ఐదేళ్ల లోపు పిల్లలు ఎంతసేపు ఆడుకోవాలి?
అలసిపోయేంత వరకు. పిల్లలకి ఆటే పని. దానిద్వారానే వాళ్లు నేర్చుకుంటారు. ఎబిసిడి ల వల్ల కాదు.
పిల్లలకి ఎంత తిండి పెట్టాలి.
మీరు అనుకున్నంత కాదు. వాళ్లకి కావలసినంత. వద్దని ముఖం తిప్పేసినా, చేత్తో తోసేసినా ఆపెయ్యాలి. కాదని కుక్కేస్తే కక్కేస్తారు.
పిల్లలకి మనం తిండి పెట్టాలా?
అక్కర్లేదు. వాళ్ల ముందు పెట్టేస్తే వాళ్లే తింటారు. కొంత తింటారు, కొంత విసురుతారు, కొంత ముఖానికి రాసుకుంటారు, కొంత వదిలేస్తారు. మీరు అదంతా ఎత్తుకుంటారు. కొన్నాళ్లలో వాళ్లే చక్కగా పెట్టిందంతా తింటారు. మీక్కూడా వాళ్లెంత తింటారో తెలిసిపోతుంది.
ఏడాది పిల్లలకి ఏం పెట్టాలి?
మీరు తినేవి అన్నీ పెట్టొచ్చు. కాకపోతే గొంతుకి అడ్డం పడే చిన్న చిన్నవి బటానీలు, ద్రాక్షపళ్ళు వంటివి అలాగే ఇవ్వకూడదు. గొంతుకి అడ్డం పడతాయి.
జుట్టుకి రంగెయ్యొచ్చా?
ఫీజు టైమ్ అయిపోయింది. మళ్లీ వారం తర్వాత రా.
కొత్త ప్రభుత్వం మరియు కొత్త MLA గారికి అభినందనలు,
అలాగే అడ్డగుడుర్ ప్రజల యొక్క కొన్ని సమస్యలు మీ ముందుకు
1. మండల కేంద్రము నుండి అన్ని గ్రామాలకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించడం.
2. మండల కేంద్రము మరియు మిగతా గ్రామాలకు బస్సు సౌకర్యం.
3. రామారం x road నుండి శాలి గౌరారం వరకు డబుల్ రోడ్ సౌకర్యం కల్పించడం ద్వారా నకిరేకల్ కి ప్రయాణం సులువుగా ఉంటుంది.
4. మండల కేంద్రము లో ని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించడం.
5. మండల కేంద్రము లో లైబ్రరీ ఏర్పాటు చేయడం వలన నిరుద్యోగులు పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవ్వడానికి సహాయం అవుతుంది.
6. బునది గానీ కాల్వ పూర్తి చేసి రైతులకి సహాయం.
పై పనులలో కొన్ని మన ఉమ్మడి జిల్లా మంత్రుల శాఖ ల పరిధి లో కి వచ్చును, కావున మన ఎమ్మెల్యే గారు మరియు మన జిల్లా మంత్రుల సహాయంతో అడ్డగుడూర్ ప్రగతి నీ ముందుకు తీసుకెళ్తారు అని భావిస్తున్న. ...... ఒక సగటు నివాసి
*చీమ మిడత కథ అందరూ చిన్నప్పుడు పుస్తకాల్లో చదివే ఉంటారు . అదే కథకు ఇండియన్ వెర్షన్ ఇక్కడ ఇవ్వబడింది* .
*ఒరిజినల్ కథ :*
ఒక చీమ మండు వేసవిలో చెమటలు కక్కుకుంటూ శ్రమించి పుట్ట ని నిర్మించుకుని ఆహార ధాన్యాలను సంపాదించుకుంటూ పుట్టలో నిలవ చేసుకుంటూ ఉంటుంది . అదే సమయంలో మిడత చీమని చూసి బుద్ధిహీనురాలని హేళన చేస్తూ , ఆడుతూ పాడుతూ వేసవికాలం అంతా గడిపేస్తుంది . శీతాకాలం లో చీమ తన పుట్టలో వెచ్చగా తలదాచుకుంటూ , ఆహార కొరత లేకుండా హాయిగా జీవిస్తూ ఉంటుంది . మిడత మాత్రం గూడు తిండి లేక చలికి గజ గజ లాడుతుంది . ముందుచూపు లేని తన తెలివితక్కువ తనానికి విచారిస్తుంది .
*ఇదే కథకి ఇండియన్ వెర్షన్ :*
చీమ వేసవికాలంలో చెమటలు కక్కుకుంటూ శ్రమించి పుట్టని నిర్మించుకుని ఆహార ధాన్యాలను నిల్వ చేసుకుంటూ ఉంటే , మిడత దానిని అవహేళన చేస్తూ వేసవికాలం అంతా ఆడుతూ పాడుతూ గడిపేస్తుంది . శీతాకాలం లో చీమ తన పుట్టలో వెచ్చగా జీవిస్తూ ఆహార కొరత లేకుండా ఉంటుంది .
మిడత ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తాను ఈ సమసమాజం లో వివక్షకు గురవుతున్నానని , చీమ హాయిగా పుట్టలో వెచ్చగా జీవిస్తూ కడుపునిండా భోజనం చేస్తుంటే తాను మాత్రం ఎందుకు ఆకలితో అలమటిిస్తూ చలికి గజ గజ లాడాలి అని ప్రశ్నించి తనకి జరుగుతున్న అన్యాయాన్ని సరి చెయ్యాలని డిమాండ్ చేస్తుంది .
NDTV , CNN IBN , Times Now , India Today, tv 9 , మొదలైన టీ వీ చానల్స్ మిడత నీ , చీమనీ పక్క పక్కన చూపించి , బ్రేకింగ్ న్యూస్ తో వాయించడం మొదలు పెడతాయి . ప్రపంచం మొత్తం మిడత కి జరుగుతున్న ఘోరమైన అన్యాయానికి విస్తుపోతుంది . R. నారాయణా, cpi నారాయణా , కత్తి మహేష్ , అరుంధతి రాయ్ మిడత కి సంఘీభావం ప్రకటిస్తూ టీ వీ ల్లో జరిగే చర్చల్లో ప్రభుత్వాన్ని ఏకి పారేస్తుంది . మేధా పాట్కర్ ఇతర పార్టీలతో కలిసి మిడత కి ఉచితంగా ఇల్లూ ఆహార సౌకర్యం కల్పించాలని రిలే నిరాహారదీక్ష లు ప్రారంభిస్తుంది . మాయావతి దీన్ని మైనారిటీల మీద జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తుంది . మిడత కి న్యాయం చేయాలని ఇంటర్ నెట్ లో ఆన్ లైన్ పిటిషన్ లు వెల్లువెత్తుతాయి . కేరళ ప్రభుత్వం చీమలకి మిడత లకీ మధ్య సమానత్వం ఉండాలని , అందుకోసం చీమలు వేసవికాలంలో పని చేయడాన్ని నిషేధిస్తుంది .
విద్యా శాఖా మంత్రి మిడత జాతికి అన్ని విద్యాలయాలలో ఉచిత అడ్మిషన్ మరియు రిజర్వేషన్ కల్పిస్తారు .
రైల్వే మినిస్టర్ ఉచిత ప్రయాణం తో బాటు మిడత జాతి కోసం ప్రతి రైల్ లో ఒక ప్రత్యేక బోగీ ఏర్పాటు చేస్తారు .
ప్రభుత్వం మిడత జాతి మీద జరిగే అన్యాయ వ్యతిరేక చట్టం చేసి , చీమని అరెస్ట్ చేస్తుంది . చీమ ఇంటిని మిడత కి కేటాయించి ఒక పెద్ద సభ పెట్టి తాళాలని అందజేస్తుంది . దీన్ని అన్ని టీ వీ లు లైవ్ కవరేజ్ ఇస్తాయి . బృందా కారత్ దీన్ని ప్రజాస్వామ్య విజయం గా పేర్కొని , ప్రతి సంవత్సరం ఆరోజున వివక్ష వ్యతిరేక దినం గా పాటించాలని పిలుపు నిస్తుంది . సామాజిక న్యాయం జరగడానికి ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందో సవివరంగా పత్రికలన్నీ ఆర్టికల్స్ రాస్తాయి .
జైలు నుండి విడుదలైన తర్వాత చీమ అమెరికా వెళ్ళిపోతుంది .
కొన్నాళ్ల తర్వాత సిలికాన్ వేలీ లో చీమ వందలాది బిలియన్ డాలర్లతో ఒక కంపెనీ ప్రారంభిస్తుంది .
ఇండియాలో సాలీడు జాతికి కూడా మిడత జాతికి కల్పించిన సౌకర్యాలు ఇవ్వాలని ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి .
మరో వంద సంవత్సరాలు గడిచినా ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం అని ప్రపంచం నలుమూలల అనుకుంటూ వుంటారు .
Hats off to the Great Democratic India..
*_సోమరిపోతులకకి_* ,
*_బిక్షగాళ్ళ తయారీకి_*
*_కొన్ని కుటుంబ పాలన రాష్ట్రాలు ఆత్మ గౌరవం తుంగలో తొక్కి వెధవలుగా బతికే మార్గం చూపెడుతున్నారు._*
*_అన్నీ ఉచితం ! అంతా ఉచితం !_*
✍🏻
45 ఏళ్ళదాకా నిరుద్యోగ భృతి,
45 ఏళ్ళనుండి వృద్ధాప్య పెన్షను.
*_ఇంక జీవితంలో లేదు టెన్షన్,_*
ఆకలేస్తే అన్నపూర్ణ క్యాంటిన్
రోగమొస్తే ఆరోగ్యశ్రీ కార్డు
నిద్దరొస్తే సర్కారిచ్చిన ఇల్లు,
చుట్టాలొస్తే రూపాయికిలోసన్నబియ్యపువిందు !
పండగొస్తే 2 gas సిలిండర్లు,పండుగ కానుకగా ఒక సంచిలో 5 ఐటమ్స్.
అంతా బాగానే ఉన్నది !
భూతల స్వర్గం భారతదేశం !
కానీ
అన్నపూర్ణ క్యాంటిన్ లో వంట ఎవరు చేస్తారు ? ఎందుకు చేస్తారు ?
రోగానికి మందిచ్చి సేవచేయటానికి ఎవరుముందుకొస్తారు ?
ఇంటినిర్మాణానికి రాళ్ళెత్తే కూలీవస్తాడా ?
వ్యవస్థ ,సమాజం ఛిన్నాభిన్నం కాదా ! అసలు మన నాయకులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ, మనలోని ఆత్మ గౌరవాన్ని నాశనం చేస్తున్నారు.
*5 రూపాయల భోజనం ప్రజలు అడిగారా??*
*పండుగలకు బహుమతి అడిగారా??*
లేదు
*నాణ్యమైన జీవితం కావాలని అడిగారు.*
*రోడ్లు అడిగారు, కరెంటు,నీరు,విద్య , ఉద్యొగ కల్పన అడిగారు.*
కానీ
అవి కాకుండా ఇదేమి విచిత్రం.
అసలు మనం ఎటు పోతున్నాం.
అసలు సంఘర్షణ లేని జీవితం ఒక జీవితమేనా ?
*Is it worth living ???*
ఒక గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారాలంటే *"సంఘర్షణ"*
ఒక లాల్ బహదూర్ శాస్త్రి ఒక ప్రధాని పీఠం దాకా రావాలంటే *"సంఘర్షణ "*
ఒక టీ అమ్ముకునే వ్యక్తి ప్రధాని అయ్యడంటే అతను పడ్డ తపన *"సంఘర్షణ "*
తన కలలు పండించుకోవడానికి ఒక "కలామ్ " పడ్డది *"సంఘర్షణ "*
*మనిషి ఎదగాలంటే కావాల్సింది సంఘర్షణ!*
*_పథకం చూడటానికి గొప్పదే_*
ఇప్పటికే ప్రతి రంగం లోను పని చేసేవారు లేక కుదేలయిపోయింది !
*వ్యవసాయానికి కూలీలేడు*
*కొట్లోకి గుమాస్తా దొరకడు !*
పనికి రమ్మంటే ఒక్కడూ రారు ! వచ్చినా సరిగా పని చేయరు.
*మనిషిని పనికి పురికొల్పేది అతని ఆకలే ! ఆకలి తీర్చాలి* !
కానీ ఉచితంగా కాదు ! అది తీరేమార్గం చూపించాలి !
*చైనా లో ఒక సామెత. ఆకలితో ఉన్నవాడికి చేపలు ఇవ్వకండి, చేపలు పట్టడం నేర్పండి*.
*అతనికి ఎప్పుడు ఆకలేసిన, ఆకలి తీరుతుంది.*
అంతే గాని అన్ని ఉచితంగా ఇస్తాను. ఏమిటిది ???
*_ఎవరికి ఉచితమివ్వాలి_*?
*పని చేసుకోలేని వారికి ,వృద్ధులకు ,అనాధలకు* *అభాగ్యులకు.*
*వారికి చేయూతనిచ్చే వ్యవస్థ ను* *రూపొందించండి*.
అందరికీ అన్నీ ఉచితం అని సోమరిపోతులను తయారుచేయవద్దు !
*పనిచేయని వాడికీ, పని చేసే వాడికీ కూడా ప్రభుత్వమే అన్నీ సమకూరుస్తే, చివరకి పని చేసే వాడు కూడా పని చేయడం మానేస్తాడు. వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుంది,*
*_ఆలోచించండి.... ప్రజలారా....., ఉచిత మెదవులరా... !!
20/07/2023
మణిపూర్ అల్లర్లకు కారణం ఏంటి? దేని కోసం మారణహోమం!
మణిపూర్ రాష్ట్రంలో చోటుచేసుకున్న మారణ హోమం నేడు దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. మణిపూర్ అల్లర్ల కారణంగా తీవ్ర స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఈ అల్లర్లలో వంద మంది కి పైగా తమ ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది గాయపడ్డారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. మణిపూర్లో ఇంతలా విధ్వంసం జరగటానికి కారణం ఏంటి? ఇంతకీ మణిపూర్లో ఏం జరుగుతోంది?
మణిపూర్ రాష్ట్రంలో ప్రధానంగా మూడు జాతులు ఉన్నాయి. అవి మైతీ, నాగా, కుకి జాతులు. మైతీలలో ఎక్కువ శాతం హిందువులు, కొంతమంది ముస్లింలు ఉన్నారు. తర్వాతి జాతులైన నాగా, కుకీలలో క్రిస్టియన్లు అధికం. నాగా, కుకీలను ప్రభుత్వం షెడ్యూల్డ్ ట్రైబ్స్గా గుర్తించింది. ఇక, మైతీలు రాష్ట్ర జనాభాలో 53 శాతం ఉన్నారు. జనాభా పరంగానే కాదు రాజకీయ పరంగా కూడా మైతీలది రాష్ట్రంలో పైచేయి. మణిపుర్లో 60 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వీరిలో 40 మంది మైతీ తెగకు చెందిన వారు ఉండటం గమనార్హం. అంతేకాదు! ఇప్పటివరకు 10 మంది మైతీకి చెందిన వారు ముఖ్యమంత్రులుగా పని చేశారు. కేవలం రెండు సార్లు మాత్రమే నాగా, కుకీ జాతికి చెందిన వారు పని చేశారు.
రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్న మైతీలు చాలా ఏళ్లనుంచి తమకు ఎస్టీ హోదా కావాలని పోరాటం చేస్తున్నారు. ఈ మేరకు మైతీలు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. 1949కి ముందు తమకు ఎస్టీ హోదా ఉండేదని అంటున్నారు. 2012లో ఓ కమిటీని సైతం ఏర్పాటు చేసుకున్నారు. తమను ఇతర తెగలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు మైతీల పిటిషన్ను విచారణకు స్వీకరించింది. దానికి సంబంధించి ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు జారీ చేసింది. మైతీల ఎస్టీ హోదా డిమాండ్ పదేళ్లుగా పెండింగ్లో ఉందని.. నాలుగు వారాల్లో జవాబు ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దీనిపై కేంద్రం అభిప్రాయాన్ని సైతం కోరింది. అయితే, కోర్టు ఆదేశాలను అప్పటికే ఎస్టీలుగా ఉంటున్న వారు తప్పుగా అర్థం చేసుకున్నారు. దీంతో గొడవ మొదలైంది. మైతీలను ఎస్టీల్లో చేర్చొద్దంటూ వారు తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఆల్ ట్రైబల్స్ సూడెంట్స్ దీనిపై నిరసనకు దిగారు. మణిపూర్లో ఒక ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా అనుకోని ఘటన జరిగింది. గిరిజన తెగల వారికి, మిగిలిన తెగ వారికి గొడవ జరిగింది. ఆ గొడవ చినికి, చినికి గాలి వాన అయింది. ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించింది. ఈ మారణ హోమానికి దారి తీసింది ...
Subject To correction 📌
ఓట్లు కూడా వేయరాని గ్రాడ్యుయేట్ లను చూస్తే మన విద్యావ్యవస్థ ఎంత దిగజారుతుందో అర్థం అవుతోంది. కనీసం ఓటు వేయరాని వాడు ఏ ఉద్యోగానికి అర్హుడు??? ఒక్క నిరుద్యోగ భృతి కి తప్ప.
ఇది సెలెబ్రెటీల లిస్ట్ మాత్రమే. కానీ మనకు పరిచయం వున్నవారు, తెలిసినవారు, సోషల్మీడియాలో తెలిసినవారు లెక్కేసుకొంటే చాలా మంది యువకులు చనిపోయారు.
వ్యాక్సిన్ కావచ్చు. లేదా కరోనా లాక్ డౌన్ నుండి మారిన జీవనశైలి కావచ్చు. లేదంటే నిత్యం ఆందోళకర మీడియా వార్తలు కావచ్చు.
తమ కెరీర్ పై ఆందోళన కావచ్చు. లేదా అతి ఎంగ్జైటీ కావచ్చు. నిద్రలేమి లేదా అతి తిండి నిద్ర కావచ్చు.
ఒక పాజిటివ్ దృక్పథంతో వీలైనకాడికి శారీరక శ్రమ చేస్తూ.. చెమటలు పట్టేలా కొంతైనా కష్టపడవలసిన జీవితాన్ని అలవాటు చేసుకోవడం అత్యవసరం. #చాకిరేవు
***
★ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నుంచి శనివారం తుదిశ్వాస వదిలిన నందమూరి తారకరత్న దాకా.. ఇలా గుండెపోటుతోనే చనిపోయారు.
_*పునీత్ రాజ్ కుమార్.. (2021 అక్టోబర్ 29)*_
★ కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ జిమ్ లో కసరత్తు పూర్తిచేసిన తర్వాత ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్ తో కుప్పకూలారు. ఆసుపత్రికి తరలించేలోపే తుదిశ్వాస వదిలారు. 46 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. అప్పూ అని ప్రేమగా పిలుచుకునే అభిమానుల గుండెల్లో చెప్పలేనంత దుఃఖాన్ని మిగిల్చి వెళ్లిపోయాడు.
_*మేకపాటి గౌతమ్ రెడ్డి (2022 ఫిబ్రవరి 21)*_
★ ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి 49 ఏళ్ల వయసులోనే హఠాన్మరణం పాలయ్యారు. నిత్యం జిమ్ లో వర్కౌట్స్ చేసే గౌతమ్ రెడ్డి కూడా గుండెపోటుతో చనిపోయారు. ఆరోగ్యం విషయంలో అత్యంత శ్రద్ధ చూపే గౌతమ్ రెడ్డి ఇలా గుండెపోటుతో మరణించడం ఆయన కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, అనుచరులను షాక్ కు గురిచేసింది.
_*సింగర్ కెకె (2022 మే 31)*_
★ ప్రముఖ గాయకుడు కెకె 53 ఏళ్ల వయసులో హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. కోల్ కతాలోని ఓ కాలేజీ ఫెస్ట్ లో ప్రదర్శన ఇస్తుండగా ఉన్నట్టుండి కెకె కుప్పకూలారు. నిర్వాహకులు ఆసుపత్రికి తరలించేలోపే ఆయన తుదిశ్వాస వదిలారు.
_*సిద్ధార్థ్ శుక్లా (2021 సెప్టెంబర్ 2)*_
★ బాలికా వధు, బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకుల మన్ననలు చూరగొన్న నటుడు సిద్ధార్థ్ శుక్లా 40 ఏళ్లకే హార్ట్ ఎటాక్ తో తుదిశ్వాస వదిలారు. రాత్రి 10 గంటల వరకు దాదాపు 3 గంటలు జిమ్ చేసి, డిన్నర్ చేసి పడుకున్న శుక్లా నిద్రలోనే చనిపోయారు.
_*సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ (2022 నవంబర్ 11)*_
★ ప్రముఖ టీవీ నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ 46 ఏళ్ల వయసులో కన్నుమూశారు. జిమ్ లో వ్యాయామం చేస్తూ చేస్తూనే కుప్పకూలారు. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినా ఉపయోగంలేకుండా పోయింది. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
_*రాజు శ్రీవాత్సవ (2022 సెప్టెంబర్ 21)*_
★ ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ ద్వారా గుర్తింపు పొందిన స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాత్సవ కూడా చిన్న వయసులోనే మరణించారు. జిమ్ లో వర్కౌట్లు చేస్తుండగా శ్రీవాత్సవ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 41 రోజుల తర్వాత శ్రీవాత్సవ తుదిశ్వాస వదిలారు.
_*నందమూరి తారకరత్న (2023 ఫిబ్రవరి 18)*_
★ నందమూరి తారకరత్న కూడా 40 ఏళ్ల వయసులోనే హార్ట్ ఎటాక్తో చనిపోయారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జనవరి 27న కుప్పంలో పాదయాత్ర ప్రారంభించగా.. మొదటి రోజు తారకరత్న కూడా పాల్గొన్నారు. లోకేశ్ తో కలిసి నడిచారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే ఆయనను కుప్పం ఆసుపత్రికి, అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించేందుకు విదేశాల నుంచి నిపుణులను పిలిపించారు. ఆసుపత్రిలో 23 రోజుల చికిత్స తర్వాత శనివారం తారకరత్న కన్నుమూశారు.
*100 మంది సామర్ధ్యం గల ఒక హాస్టల్ నందు ప్రతిరోజూ ఉదయం టిఫిన్ లో ఉప్మా ను వడ్డించేవారు. ఆ 100 మందిలోని 80 మంది మాత్రం ఉప్మా కాకుండా భిన్నమైన టిఫిన్ ను చేసి పెట్టాల్సిందిగా ప్రతిరోజూ ఫిర్యాదు చేసేవారు.*
*కానీ,... మిగతా 20 మంది మాత్రం ఉప్మా తినడానికి సంతోషంగా ఉండేవారు. మిగతా 80 మంది మాత్రం ఉప్మా కాకుండా మరేదో ఒకటి వండి పెట్టాల్సిందిగా కోరేవారు.*
*ఈ గందరగోళ పరిస్థితిలో ఎదో ఒక నిర్ణయానికి రావాలి కాబట్టి ఆ హాస్టల్ వార్డెన్ వోటింగ్ పద్ధతిని ప్రతిపాదించడం జరిగింది. దీని ప్రకారం ఏ టిఫిన్ కైతే ఎక్కువ ఓట్లు వస్తాయో, ఇక రోజు ఆ టిఫిన్ నే వండిపెట్టడం జరుగుతుంది.*
*ఉప్మా కావాలి అనుకున్న 20 మంది విద్యార్థులు తమ ఓటును ఖచ్చితంగా వేశారు. మిగతా 80 మంది మాత్రం ఈ క్రింది విధంగా తమ ఓటును వేయడం జరిగింది.*
*18 - మసాలా దోసా*
*16 - ఆలూ పరోటా & దహి*
*14 - రోటి & సబ్జి*
*12 - బ్రెడ్ & బట్టర్*
*10 - ఇడ్లీ సాంబార్*
*10 - వడ*
*కావున...., ఓటింగ్ ఫలితాల ప్రకారం, ఉప్మా కు అత్యధిక ఓట్లు పడటం వలన, మరలా అదే ప్రతి రోజు వడ్డించబడుతుంది.*
*గుణపాఠం: 80% జనాభా స్వార్ధంతో, విభజించబడి, చెల్లాచెదురై దిక్కులు చూస్తున్నంత కాలం, 20% మనల్ని పాలిస్తూ ఉంటుంది.*
*ఇదొక నిశబ్ద సందేశం.*🙏
07/11/2022
30/10/2022
హోమి జహంగీర్ భాభా అతి విశిష్టుడైన అణు విజ్ఞానశాస్త్రవేత్త. 30.10.1909లో బొంబాయిలోని సంపన్న కుటుంబంలో జన్మించారు
బాల్య జీవితం
భాభా అతని ఆరంభ విద్యను బొంబాయిలోని కథడ్రల్ గ్రామర్ పాఠశాలలో పొందారు, అది తరువాత 1922లో కథడ్రల్ అండ్ జాన్ కోన్నన్ పాఠశాలగా జాన్ కోన్నన్ పాఠశాలతో విలీనం చెందిన తరువాత అయ్యింది, దీనిని నగరం యెుక్క స్కాటిష్ ఎడ్యుకేషన్ సొసైటీచే నిర్వహించబడుతోంది. అతను ఆనర్స్తో సీనియర్ కేంబ్రిడ్జ్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణుడయిన తరువాత 15 ఏళ్ళ వయసులోనే ఎల్ఫిన్స్టన్ కళాశాలలో ప్రవేశించారు. అతను రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ 1927 వరకూ హాజరైనారు, దాని తరువాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం యెుక్క కైస్ కళాశాలలో చేరారు, ఆయన మామయ్య దోరబ్ టాటా గతంలో ఇక్కడ చదువుకున్నారు.అతని తండ్రి మరియు మామయ్య దోరబ్ టాటా యోచన ప్రకారం భాభా ఇంజనీరింగ్ డిగ్రీని కేంబ్రిడ్జ్ నుండి పొందిన తరువాత భారతదేశానికి తిరిగి రావాలని ఇక్కడ జంషెడ్పూర్లోని టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలో చేరాలని అనుకున్నారు. అయినప్పటికీ, అతని అభ్యాస సమయంలో, భాభా ఇంజనీరింగ్కు బదులుగా గణితశాస్త్ర రంగంలో అత్యంత ఆసక్తిని కనబరిచారు.
ఉన్నత విద్య మరియు కేంబ్రిడ్జ్ వద్ద పరిశోధన
భాభా తండ్రి అతని కుమారుని యెుక్క స్థితిని అర్థం చేసుకున్నాడు, మరియు అతను కనుక మెకానికల్ సైన్సుల ట్రిపోస్ పరీక్షలో ప్రథమ తరగతిలో ఉత్తీర్ణుడయితే గణితశాస్త్రంలో అధ్యయనం చేయడానికి ధనాన్ని ఇస్తానని ఒప్పుకున్నాడు. భాభా ట్రిపోస్ పరీక్షను జూన్ 1930లో వ్రాసి మొదటి తరగతిలో ఉత్తీర్ణుడయ్యాడు. తరువాత, అతను, అతని గణితశాస్త్ర అధ్యయనాలను పాల్ డిరాక్ పర్యవేక్షణలో చేశాడు, ఈ లుకాసియన్ గణితశాస్త్ర అధ్యాపకుడికి 1933లో ఎర్విన్ స్చోరోడింజర్తో కలసి "అణుసిద్ధాంతం యెుక్క నూతన ఉత్పాదక ఆకృతుల యెుక్క అన్వేషణకు" భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని పొందారు. ఆ సమయంలో, ఆ ప్రయోగశాల అనేక శాస్త్రీయ విజయాలకు కేంద్రంగా ఉంది. జేమ్స్ చాడ్విక్ న్యూట్రాన్ను, జాన్ కాక్క్రోఫ్ట్ మరియు ఎర్నెస్ట్ వాల్టన్ అధిక-శక్తివంతమైన ప్రోటాన్లను మారిన లీథియంతో కనుగొన్నారు, మరియు పాట్రిక్ బ్లాకెట్ మరియు గ్యుసెప్పె ఒచ్చియాలిని ఉపయోగించి ఎలెక్ట్రాన్ జంట ఉత్పత్తిని మరియు గామా ప్రసరణచే ప్రవాహాలను మేఘపు గదులను ఉపయోగించి ప్రదర్శించారు. 1931–1932 విద్యా సంవత్సర సమయంలో, భాభా ఇంజనీరింగ్లో సాలోమన్స్ ఉపకారవేతనాన్ని పొందాడు. 1932లో, అతను మొదటి తరగతి మ్యాథమెటికల్ ట్రిపోస్ మీద పొందాడు మరియు గణితశాస్త్రంలో విద్యార్థి ఉపకారవేతనంగా రౌస్ బాల్ పురస్కారం పొందాడు. ఉపకారవేతనంతో ఉన్నప్పడు, అతను జూరిచ్లో వోల్ఫ్గ్యాంగ్ పౌలి, రోమ్లో ఎన్రికో ఫెర్మీతో మరియు ఉట్రెచ్ట్లో హంస్ క్రమెర్స్తో కలసి పనిచేశాడు.
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చి, 1945 సంవత్సరంలో “ TATA Institute of fundamental research” ను స్థపించారు. వీరు 1937లోనే ‘‘కాస్మిక్ రేడియేషన్’’ పై పరిశోధనలు జరిపి ‘‘మిసాన్’’ అనే కణాలను కనుగొన్నారు. దీనితో వీరు విశ్వవిఖ్యాతి గాంచారు.
1948లో ఆటమిక్ కమీషన్ కు అధ్యక్షునిగా ఎన్నికై భారతీయ అణుశక్తి నిర్మాణానికి రూపు దిద్దాడు. ఇది వారి దూరదృష్టికి చక్కని తార్కారణం. దీని వలన భారతదేశం ఇతరుల మీద ఆధారపడకనే స్వంతంగా అణుశక్తి రంగంలో స్వావలంబన సాధించింది.
1963 సంవత్సరంలో తారాపూర్ లో తన మొదటి అణురియాక్టర్ ను భారతదేశం నిర్మించింది. ఇది బాబా చలవే. మరో రెండు సంవత్సరాల కాలంలోనే ప్లూటోనియం ప్లాంట్ నిర్మించి ప్రపంచాన్ని ఆశ్ఛర్యపరచారు.
జనవరి 24, 1966వ సంవత్సరంలో ఒక విమాన ప్రమాదంలో బాబా మరణించటం భారతజాతికి ఒక తీరని శాపంగానే చెప్పవచ్చు. కానీ ఆయన మరణానంతరం ప్రపంచం భావించినట్లుగా భారతీయ అణుకార్యక్రమం కుంటుపడలేదు. బాబా రూపకల్పన చేసినట్లుగానే 1974 సంవత్సరంలో పొక్రాన్ మొదట అణుశాస్త్ర ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసింది. దీనితో ప్రపంచంలో అణుప్రయోగం చేసిన ఆరవ దేశంగా భారతదేశం అవతరించింది.
నేడు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే అణురియాక్టర్ లలో ‘‘ఫాస్ట్ బ్రీడర్ టెక్నాలజీ’’ ని దూరదృష్టితో ఆనాడే బాబా రూపకప్పన చేశాడు. అణురియాక్టర్లలను మూడు దశలలో వినియోగించుకునే విధానం రూపుదిద్దింది కూడా బాబానే.
అణు కార్యక్రమాలకు కావలసిన యూరేనియమ్ అనే ఇంధనం భారతదేశంలో అంతగా లభించదు. కాబట్టి, దానికి ప్రత్యామ్నాయంగా థోరియం అనే ఇంధనాన్ని ఉపయోగించి అణుశక్తి ద్వారా విద్యుత్పత్తి చేసే కార్యక్రమాన్ని ఆనాడే బాబా రూపకల్పన చేశాడు.
నేడు భారతీయులందరూ గర్వించగలిగే అణుశాస్త్రవిజ్ఞానంలో ముందంజ వేయటానికి కారణం హోమీ బాబా స్ఫూర్తి అని ఆయనతో కలిసి పనిచేసిన మన మాజీరాష్ట్రపతి కలాం గారి అభిప్రాయం.
Click here to claim your Sponsored Listing.
Location
Contact the school
Telephone
Website
Address
Addagudur, Yadadri Bhuvanagiri
Hyderabad
508277