21/02/2020
మహాశివరాత్రి "శివోహం" @వీవిఐటీ
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vasireddy venkatadri institute technology, College & University, Namburu, Guntur.
21/02/2020
మహాశివరాత్రి "శివోహం" @వీవిఐటీ
21/01/2020
""Choosi Choodangaane"" Movie Promotion @ VVIT College on 21-02-2020
One song Released by VVIT Students & chairman Vasireddy Vidya Sagar Garu & Movie Team.
Movie Directed by Sesha Sindhu Rao
Starring Shiva Kandukuri
Varsha Bollamma,Malavika Satheesan
Music by Gopi Sundar
Cinematography:Vedaraman Raviteja Girijala
Edited by:Vedaraman Raviteja Girijala
Production company:Dharmapatha Creations
Distributed by Suresh Productions
Release date January 31, 2020
14/01/2020
VIVA-VVIT Making of Disney castle *Title:-* Making of Disney castle || Hussain sir || Vasireddy Vidya Sagar sir || Vasireddy Mahadev sir || Afreen || Seshu || Jagadeesh
31/12/2019
27/12/2019
22/12/2019
ముగిసిన వివా వీవీఐటీ- 2019 యువజనోత్సవం వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి యువజనోత్సవం వివా-వీవీఐటీ 2019 వేడుకలు ఘనంగా ముగిసాయి.రెండు రోజులపాటు నిర్వహించిన ఈ వేడుకల్లో తెలుగు రాష్ట్రాల నుండి 210 కళాశాల నుండి 13 వేల మంది విద్యార్థులు ఈ వేడుకలో పాల్గొన్నారు. సాంకేతిక సాంస్కృతిక క్రీడల నందు విద్యార్థులు ప్రతిభను సృజనాత్మకతను చాటారు.ఈ వేడుకల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ రచయిత నటుడు తనికెళ్ల భరణి హాజరయ్యారు.ఈ వేడుకలలో ప్రాజెక్ట్ ఎక్స్పో పేపర్ ప్రజెంటేషన్ టెక్నికల్ హబ్ డిబేట్ 40 అంశాలలో పోటీలు నిర్వహించారు. సాంస్కృతిక అంశాలలో భాగంగా శాస్త్రీయ నృత్యం,జానపద నృత్యం,ఆధునిక సంగీతం,వాయిద్యం,తెలుగు పద్యం,పెయింటింగ్ వంటి 40 అంశాలలో పోటీలతో పాటు వాలీబాల్, కోకో,క్యారమ్స్,తదితర క్రీడా అంశాలలో పోటీలు నిర్వహించారు. విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన విద్యార్థులు రూపొందించిన రసాయన ఎరువుల పిచికారి చేస్తే డ్రోన్,విజ్ఞాన విద్యార్థులు రూపొందించిన యూరియా వంటి ఎరువుల పంపిణి యంత్రం,కిట్స్ విద్యార్థులు రూపొందించిన వాహన వేగ నియంత్రణ పద్ధతిపై ప్రదర్శించిన ప్రాజెక్టులు విశేషంగా ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో వీవీఐటీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్య మనకు మంచి ఆదరణ లభించింది.క్రీడ అంశాల నందు వాలీబాల్ అమ్రిత సాయి విద్యార్థులు, త్రో బాల్ నందు తిరుమల విద్యార్థులు,టేబుల్ టెన్నిస్ నందు విజ్ఞాన్ విద్యార్థులు విజేతలుగా నిలిచారు.శాస్త్రీయ సంగీతం సోలో, గ్రూపులనందు కే.ఎల్.యూనివర్సిటీ విద్యార్థులు విజేతలుగా నిలవగా, బాస్కెట్బాల్ నందు వీవీఐటీ విజేతగా నిలిచింది.వివా-వీవీఐటీ-2K19 వేడుకల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మలినేని సంస్థల వైస్ చైర్మన్ మలినేని పెరుమాళ్ళు, నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.శ్రీనివాస్ కుమార్ పాల్గొనగా,విశిష్ట అతిథిగా ప్రముఖ రచయిత,నటుడు తనికెళ్ల భరణి హాజరయ్యారు. రెండు రోజులుగా నిర్వహించిన పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.విశిష్ట అతిథి తనికెళ్ల భరణి మాట్లాడుతూ,విద్యార్థులు ఇంగ్లీష్ నేర్చుకోవాలని,తెలుగు భాషను ప్రేమించాలని,తెలుగు భాష రుచిని అధ్యాపకులు వారికి పరిచయం చేయాలని సూచించారు జీవితంలో సమయం చాలా గొప్పదని దానిని సక్రమంగా వినియోగించుకున్న విద్యార్థులు విజయం సాధిస్తారని అన్నారు. కళాశాలలో తోటి విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగాలని విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు సమాజంపై బాధ్యత ఉండాలని అన్నారు. తల్లిదండ్రుల కలలకు ప్రతిరూపాలైన పిల్లలు వారికి తమ విజయాల ద్వారా ప్రతిఫలం అందించాలని అన్నారు.వీవీఐటీ చైర్మన్ విద్యాసాగర్ మాట్లాడుతూ ఈ రెండు రోజుల కార్యక్రమము విద్యార్థులకు బాల్యస్మృతులను పరిచయము చేయటమేకాక,సృజనాత్మకత,నైపుణ్యం,పరిశోధన శక్తి ప్రేమికులకు దోహదము చేసిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను ఆయన అభినందించారు. మలినేని సంస్థ చైర్మన్ మలినేని పెరుమాళ్ళు మాట్లాడుతూ,విద్యార్థుల ఆలోచనలను వాస్తవ రూపము దాలిచ్చేవిధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని అన్నారు.నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ న్.శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు నూతన ఆలోచనలకు శ్రీకారం చుట్టాలని నూతన ఆవిష్కరణలతో విద్యార్థులు రాణించగలరని లక్ష్యం చేరే వరకు నిష్క్రమించు కూడదని సూచించారు.
21/12/2019
Highlights of VIVA VVIT 2K19
21/12/2019
VIVA VVIT 2019
1st Day Events Celebrations
17/12/2019
ఐఐటీలో ఎనర్జీ కన్సర్వేషన్ పై సదస్సు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఎనర్జీ కన్వర్షన్ డే పురస్కరించుకుని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగం ఆధ్వర్యంలో సి.ఇ. ఒ. ఎ. పి. ఎస్. ఈ. సి. ఎం( స్టేట్ ఎనర్జీ కన్వర్షన్ మిషన్) ఏ.చంద్రశేఖర్ రెడ్డి గారుచే ప్రత్యేక సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా చైర్మన్ హేమచంద్ర రెడ్డి, సెక్రటరీ డాక్టర్" సి. వి. శ్రీరాం, వీవీఐటీ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ గారు పాల్గొన్నార. ఈ కార్యక్రమంలో హేమచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ వనరుల సంరక్షణ విద్యార్థుల బాధ్యత అని భావితరాలవారికి వాటిని అందించడం మన అందరి కర్తవ్యం అని అన్నారు సాంకేతికతను వినియోగించి ఇంధన వనరులను పొదుపుగా వాడడం వలన కాలుష్యాన్ని నియంత్రించవచ్చని అన్నారు. ముఖ్య వక్త చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ,శక్తిని పరిరక్షించడం పర్యావరణ పరిరక్షణలో భాగం అని శక్తి ఉత్పత్తి కన్నా వేగంగా వినియోగం పెరుగుతుందని అన్నారు.బొగ్గు, నూనె గింజల,ఇంధన వనరుల వినియోగం పెరుగుతుందని తద్వారా భవిష్యత్ తరాలకు అవి అందకుండాపోయే ప్రమాదము ఉందని అన్నారు. రేపటి అవసరము కొరకు శక్తిని కాపాడుకోవడం మన బాధ్యత అని తెలిపారు.దేశ ఎదుగుదల శక్తి ఆదా పై ఆధారపడి ఉందని అన్నార.వీవీఐటీ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ గారు మాట్లాడుతూ,అధునాతన సాంకేతికతను విద్యార్థులు అందిపుచ్చుకుని శక్తి వినియోగానికి నియంత్రించాలని ఆ దిశగా విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేపట్టాలని అన్నారు.ప్రతి ఒక్కరు విద్యుత్ పొదుపు గురించి ఆలోచించాలని సూచించారు. వీవీఐటీ ప్రిన్సిపాల్ డాక్టర్" కె.గిరిబాబు గారు మాట్లాడుతూ,శక్తి ఆదా, పరిరక్షణ విద్యార్థులు కృషి చేయాలని గృహ, కార్యాలయాలలో అనవసరపు విద్యుత్ వినియోగాన్ని తగ్గించే విధంగా ప్రాజెక్టుల రూపకల్పన చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఈ ఈ ఈ విభాగ అధిపతి డాక్టర్" కె.వి నరేష్ మరియు అధ్యాపకులు ఐ.ఈ.ఐ. విద్యార్థి విభాగం విద్యార్థులు పాల్గొన్నారు.
15/12/2019
VIVA -VVIT Semi Christmas Celebrations @2019 వివా వీవీఐటీ కళాశాల లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు వివా మరియు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నా....
15/12/2019
వివా వీవీఐటీ కళాశాల లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు వివా మరియు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు తోటి వారిని ఆదరించి ప్రేమించాలని నా యేసు క్రీస్తు బోధనలు అనుసరణీయమని విద్యార్థులు సమైక్యత మెలగాలని కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ గారు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన క్రీస్తు గీతాలాపన అలరించాయి శాంతాక్లాజ్ రూపంలోని విద్యార్థులు సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది శాంతా క్లాస్ విద్యార్థులకు బహుమతులను అందజేశారు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ గారు కేక్ కట్ చేసి విద్యార్థులకు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నీటి వనరుల శాఖ డిప్యూటీ ఇంజనీర్ వి .ఎస్ ఈవాన్స్ గారు హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ క్రీస్తు శాంతిని కోరుకుంటున్నారని శాంతియుత జీవనం సమాజ నిర్మాణానికి మార్గమని తెలిపారు విద్యార్థులు తమ వంతు బాధ్యతను తాము నెరవేరిస్తే భగవంతుని దీవెనలు వారిపై ఉంటాయని అన్నారు .ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ గారు ప్రిన్సిపాల్ డాక్టర్ కె గిరిబాబు గారు వివా ప్రిన్సిపాల్ సిటీ జోషి గారు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
06/12/2019
👇Engineers without Boarders EWB INDIA VVIT STUDENT CHAPTER INAUGURATION
| Monday | 8:35am - 3:55pm |
| Tuesday | 8:35am - 3:55pm |
| Wednesday | 8:35am - 3:55pm |
| Thursday | 8:35am - 3:55pm |
| Friday | 8:35am - 3:55pm |
| Saturday | 8:35am - 3:55pm |