ప్రియమైన తల్లిదండ్రులకు SFI పల్నాడు జిల్లా కమిటీ విజ్ఞప్తి
ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో విద్యార్థులను చేర్పించండి.
SFI Palnadu Unit
STUDENT'S FEDERATION OF INDIA
చట్ట సభల్లో ప్రజాప్రతినిధులు ఎక్కడ ఉన్నారు? మొత్తం కార్పొరేట్లు, వాళ్ళ ఏజెంట్ల తో నిండిపోయింది. . ప్రశ్నిద్దాం. . దొంగలని తరిమికొడదాం # FightBack
*నిబంధనలను తుంగలో తొక్కి.. మెరిట్ కు అన్యాయం చేస్తున్న డిఇఓ పై చర్యలు తీసుకోవాలి- ఎస్ఎఫ్ఐ, డిమాండ్*
పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలని సోమవారం కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓకి ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ఐ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ పల్నాడు జిల్లా కన్వీనర్ కోట సాయికుమార్ మాట్లాడుతూ పల్నాడు జిల్లా సమగ్ర శిక్ష- GCDO, ALSCO పోస్టుల భర్తీపై - DEO పల్నాడు జిల్లా-
అక్రమాల గురించి
2026 ఏప్రిల్ నెలలో పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ( సమగ్ర శిక్ష) ఖాళీగా ఉన్న GCDO మరియు ALSCO పోస్టులు డిప్యూటేషన్ పై భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నారు. సదరు పోస్టులకు సంబంధించి మెరిట్ లిస్టులు మే 1 వ తారీఖున సిద్ధమైనప్పటికీ DEO నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని అభ్యర్థులకు అదనపు మార్పులు కలపాలని దుర్బుద్ధితో మెరిట్ లిస్టులను కలెక్టర్ కార్యాలయానికి పంపకుండా ఆపేశారు. 10 రోజుల జాప్యం తరువాత డిఇఓ తను నిర్ణయించుకున్న అభ్యర్థులకు అర్హత లేకున్నా కమిటీపై ఒత్తిడి తెచ్చి అదనపు మార్కులు కలపడం జరిగినది . DRP( డిస్ట్రిక్ రిసోర్స్ పర్సన్) ట్రైనింగ్ ఇచ్చిన అభ్యర్థులకు మాత్రమే అదనపు మార్కులు కలపాలి. కానీ సదరు DEO తను ఎంచుకున్న అభ్యర్థులకు DRP ట్రైనింగ్ ఇచ్చినట్టు సర్టిఫికెట్ లేకున్నా DRPగా ట్రైనింగ్ తీసుకున్నారు అనే నెపంతో అదనపు మార్పులను కలిపి ఆ లిస్టులను తమ కార్యాలయానికి పంపారు. ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ కొంతమంది అభ్యర్థులు మెరిట్ లిస్టులో వెనకబడే ఉండడంతో మెరిట్ లిస్టులో మొదటి స్థానంలో ఉన్న అభ్యర్థులకు కాకుండా రెండవ స్థానంలో ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వేసి పోస్టులు భర్తీ చేయాలని దురాలోచనతో DEO వ్యవహరిస్తున్నారు. 15 మార్కుల ఇంటర్వ్యూలో కలెక్టర్ గారితో పాటు డీఈఓ, ఏపీసీ, డైట్ కాలేజీ ప్రిన్సిపల్ సభ్యులుగా ఉండాలి. అయితే డిఇఓ, ఏపీసీ, డైట్ కాలేజ్ ప్రిన్సిపల్ ఈ మూడు బాధ్యతలు DEO నే నిర్వహిస్తున్నారు. కావున నిబంధనలను తుంగలో తొక్కిన డిఈఓపై చర్యలు తీసుకుని ఇంటర్వ్యూ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగేటట్లుగా చూసి మెరిట్ను కాపాడవలసిందిగా పల్నాడు జిల్లా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ కమిటీ కోరుచున్నది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మస్తాన్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ధన్యవాదములతో,
ఇట్లు
కోట . సాయి కుమార్
SFI పల్నాడు జిల్లా కన్వీనర్.
#ప్రచురణార్ధం
అవకాశవాదం, కార్పొరేట్ల సంక నాకటం, విభజన రాజకీయాలు, సామ్రాజ్యవాదం తొత్తులుగా ఉండటం నేర్చుకోవాలా? .. చే గువేరా స్ఫూర్తి ఎటుపోయింది?
#పల్నాడు జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష విభాగం GCDO, ALSCO పోస్టులు మెరిట్ ఆధారంగా పూరించాలి - DYFI పల్నాడు జిల్లా కమిటీ
#మెరిట్ ఉన్న అభ్యర్థులకు కాకుండా అనర్హులకు పోస్టు ఇవ్వాలని చూస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారి*
#ప్రచురణార్ధం : #నరసరావుపేట
#పల్నాడు జిల్లాలోని విద్యాశాఖలో సమగ్ర శిక్ష కింద ఖాళీగా ఉన్న జిసిడివో మరియు ఏఎల్ఎస్సిఓ పోస్టులు అర్హులైన అభ్యర్థులకుమెరిట్ ప్రకారం పూరించాలని DYFI పల్నాడు జిల్లా కమిటీ జిల్లా రెవిన్యూ అధికారికి అర్జీ ఇవ్వటం జరిగింది. ఈ విషయం పై పల్నాడు జిల్లా DYFI ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ విద్యా అర్హతలను బట్టి అభ్యర్థులకు మార్కులు కేటాయించి మెరిట్ లిస్టు అందజేయడంలో జిల్లా విద్యాశాఖ అధికారులు తీవ్ర జాప్యం చేయడమే కాక అవకతవకాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చింది అని అన్నారు . మే 1 న మెరిట్ లిస్టు సిద్ధమైనప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారి ఒత్తిడి మేరకు మెరిట్ లిస్టులో అర్హత లేని అభ్యర్థులకు డిఆర్పి ట్రైనింగ్ ఇచ్చినట్లు అదరపు మార్కులు కలపడం జరిగిందని అన్నారు . ఈ విధంగా డిఆర్పి ట్రైనింగ్ ఇచ్చినట్లు అదనపు మార్కులను కలిపిన మెరిట్ లిస్టును కలెక్టర్ ఆఫీస్ కు పంపడం జరిగింది అని అలాగే ఇంటర్వ్యూ ప్యానల్ లో జిల్లా కలెక్టర్ గారితో పాటు డీఈవో, ఏపీసి, డైట్ కాలేజ్ ప్రిన్సిపల్ సభ్యులుగా ఉండాలి అయితే ఇక్కడ డీఈవో గారే ఏపీసి మరియు డైట్ కాలేజ్ ప్రిన్సిపాల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టి మెరిట్ లిస్ట్ లోనే అవకతవకలకు పాల్పడ్డ డీఈవో పర్యవేక్షణలో ఇంటర్వ్యూ పారదర్శకంగా జరిగే అవకాశం లేదన్నారు . ప్రస్తుత డీఈవో ఆలోచనల మేరకు జిసిడివో మరియు ఏ ఎల్ ఎస్ సి ఓ రెండు పోస్టుల్లోనూ మెరిట్ లిస్టులో ఉన్న ప్రథమ స్థానంలోని వ్యక్తులకు కాకుండా ద్వితీయ స్థానంలో ఉన్న వ్యక్తులకు ఈ పోస్టులు ఇచ్చే విధంగా కుట్రలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చింది అని కావున కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ పారదర్శకంగా జరిగేటట్లు చేసి మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు .
15/05/2026
ఉపాధి లేని అభివృద్ధి ఎవరి కోసం? కార్పొరేట్ల బానిసలుగా పాలకులు
ఐపీల్ అంటే క్రికెట్ మాత్రమే అనుకుంటున్నారా? క్రికెటర్స్, ఫ్రాంచైజీలకు ఫాన్స్ అంటే ఎవరు? వీడియో పూర్తిగా చూడండి
02/03/2026
ఎస్.సి సంక్షేమ హాస్టళ్ల సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ పోస్ట్ కార్డు ఉద్యమం...
పల్నాడు జిల్లాలో ఎస్.సి సంక్షేమ హాస్టళ్ల సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టామని ఎస్ఎఫ్ఐ పల్నాడు జిల్లా కన్వీనర్ కె.సాయి కుమార్ తెలిపారు. ఈ సందర్బంగా నరసరావుపేట ఎస్.సి హాస్టల్ లో విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని విద్యార్థులతో ఉత్తరాలు రాయించారు. సాయి కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు రూ 3 వేలకు పెంచాలని, ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, వాచ్మెన్ పోస్టులను భర్తీ చేయాలని, అద్దె భవనాల్లో నడుస్తున్న సంక్షేమ హాస్టల్స్ కు సొంత భవనాలు నిర్మించాలన్నారు.ప్రతి ఏడాది సంక్షేమ హాస్టళ్లలో అభివృద్ధి కోసం నిధులు కేటాయించి మరమత్తులు చేసి మౌలిక వసతులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఈసరాజు ఆంజనేయ రాజు,ఎస్ఎఫ్ఐ నరసరావుపేట పట్టణ అధ్యక్షులు ఆనంద్,వైస్ ప్రెసిడెంట్ మస్తాన్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
13/02/2026
పిడుగురాళ్ల పట్నంలో విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని శుక్రవారం గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు గారు కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ కోట సాయికుమార్ మాట్లాడుతూ పిడుగురాళ్ల పట్నంలో 1970 నుంచి గ్రంథాలయం అద్దెభవనంలో నిర్వహిస్తున్నారని గత ప్రభుత్వంలో గ్రంథాలయం సొంత భవనం నిర్మించడం కోసం మున్సిపాలిటీ వారు పది సెంట్లు కేటాయించారని శాసనసభ్యులు దృష్టికి తీసుకువచ్చారు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం వల్ల ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ప్రవేట్ కళాశాలలో చదవడం సాధ్యం కావడం లేదని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మించాలని కోరారు. పల్నాడు జిల్లాలో బస్సుల కొరత తీవ్రంగా ఉంది అని ఉన్న బస్సులు సరిపోవడం లేదు మరియు అధిక రద్దీతో నడుస్తున్నాయి. విద్యార్థులు ఉద్యోగులు మరియు వృద్ధులు రోజు ఇబ్బందులు పడుతున్నారని శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు గారు దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. సానుకూలకంగా స్పందించిన యరపతినేని శ్రీనివాసరావు గారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల త్వరలోనే నిర్మిస్తామని అన్నారు, ఈ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అతి త్వరలోనే పరిష్కరిస్తాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పిడుగురాళ్ల మండల అధ్యక్ష కార్యదర్శులు కడియం రోహిత్,అల్తాఫ్ జిల్లా కమిటీ సభ్యులు షేక్ యాసిన్, జాకీర్, సిద్ధిక్, ఉదయ్ తేజ, చందు, మాలిక్ తదితరులు పాల్గొన్నారు.
Click here to claim your Sponsored Listing.
Location
Contact the school
Website
Address
Guntur