Sabarmati STUDY Circle

Sabarmati STUDY Circle let us drink and discuss

గొప్ప అవకాశం....................18 సంవత్సరాలు నిండిన ప్రతిమహిళ అప్లై చేసుకోవచ్చు. ఎల్ఐసి లో ఏజెంట్లుగా చేరవచ్చు మూడు సంవ...
09/12/2024

గొప్ప అవకాశం....................
18 సంవత్సరాలు నిండిన ప్రతిమహిళ అప్లై చేసుకోవచ్చు. ఎల్ఐసి లో ఏజెంట్లుగా చేరవచ్చు మూడు సంవత్సరాల పాటు నెలకు 5 ,6,7 వేలదాకా స్టైఫండ్ వస్తుంది, పాలసీలు చేపిస్తూ ఉంటే బోనస్ కూడా అదనం.

Empowering women for a prosperous India. With the visionary leadership of Hon. PM Shri Narendra Modi, LIC’s Bima Sakhi Yojana is here to support women on their journey to financial independence and a brighter future.

19/08/2024

**మెగా సప్లమెంటరీ నోటిఫికేషన్ **. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 1990 నుండి 2015 వరకు చదివి ఒక సబ్జెక్టు ,రెండు సబ్జెక్టులు ,లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్ అయిన విద్యార్థులకు యూనివర్సిటీ మరొక్కసారి ఎగ్జామ్ రాసి పాస్ అవ్వడానికి అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి వినియోగించుకుని తమ డిగ్రీ పూర్తి చేసుకోవాలని కోరుచున్నాను.
Last date 30 SEP
With fine 10 Oct

13/04/2024
10/12/2023

Uujjogam....,.

గతంలో కరోనా బారిన పడ్డ వారే గుండెపోటుకు ఎక్కువ గురవుతున్నారా???
08/11/2023

గతంలో కరోనా బారిన పడ్డ వారే గుండెపోటుకు ఎక్కువ గురవుతున్నారా???

07/11/2023

మానసిక యుద్ధం (సైకలాజికల్ వార్‌ఫేర్) అంటే ఏమిటి?.........................
ఒక రాజుకు దుర్దశ దాపురించి ఆయన వద్దనున్న అష్ట లక్ష్ముల్లో అందరూ వెళ్లిపోయే స్థితి వచ్చిందట. రాజు అందరు లక్ష్ములూ వెళ్లిపోయినా ఫర్వాలేదు కానీ ఒక్క ధైర్య లక్ష్మి ఉంటే చాలని కోరుకున్నాడట. ఆవిడ ఉంది. ఈ వెళ్లిన ఏడుగురు లక్ష్ములకు ధైర్య లక్ష్మి లేక భయం ఆవహించిందట. ఎలా వెళ్లారో అలానే రాజు వద్దకు వచ్చేశారు. ధైర్యం అంత గొప్పది అని నీతి చెప్తారు. ఈ నీతి యుద్ధంలోనూ పనికివస్తుందని ఆధునిక, ప్రాచీన, మధ్య యుగాల నాటి యుద్ధాలు అనేకం నిరూపించాయి.

యుద్ధంలో భౌతికమైన బలిమి కన్నా మానసికమైన బలం చాలా కీలకం. ధైర్యం, ఉత్సాహం ఉన్న సైన్యం తనకన్నా మూడింతలు బలం ఉండీ, ఈ ధైర్యం లోపించిన సైన్యాన్ని దెబ్బతీస్తుంది. "In war, morale forces are to physical as three to one" అన్నాడు నెపోలియన్.

మానసికమైన ఎత్తుగడలతో శత్రువును దెబ్బతీయడం, యుద్ధాన్ని తమవైపుకు మలుచుకోవడం - మానసిక యుద్ధం.

ఇందులో రకరకాల పద్ధతులు ఉన్నాయి, ముఖ్యమైనవి ఇవి:

ప్రచారాన్ని ఉపయోగించి శత్రువును నిరుత్సాహపరచడం, ప్రజాభిప్రాయాన్ని వాళ్ళకు వ్యతిరేకంగా మలచడం వంటివి
ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమింపజేసి భయపెట్టడం, ఒత్తిడికి గురిచేయడం
ప్రపంచ చరిత్రలో

రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ చేసిన అబద్ధపు ప్రచారం చాలా ప్రభావవంతమైనదని చెప్తారు. హిట్లర్ నియమించిన ప్రచార మంత్రి జోసెఫ్ గోబెల్స్ ఈ విషయంలో ఎంతగా పేరుపడ్డాడంటే ఇప్పటికీ ఎవరైనా అసత్య ప్రచారం చేస్తే "గోబెల్స్ ప్రచారం" అని తిడతారు. అప్పటి బ్రిటీష్ ప్రభుత్వమూ ఇందులో ఏమీ వెనుకబడలేదు. వాళ్ళూ ప్రచారం సమర్థంగ చేసి మానసిక యుద్ధం చేసింది.

ఛెంఘిజ్ ఖాన్ దండయాత్రల్లో గుర్రాల తోకలకు ఏవో వస్తువులు, బట్ట వంటివి కట్టీ నేలమీదున్న దుమ్ము విపరీతంగా రేగేలా చేసేవాడట. వస్తున్న సైన్యం సంఖ్యకు పది రెట్లు సైన్యం వస్తున్న భ్రమ కలిగేది అలాగ. అలానే, రాత్రిపూట ఒక్కో సైనికుడు మూడు మూడు కాగడాలు వెలిగించి డేరాల్లో పెట్టించేలా ఏర్పాట్లు చేసేవాడు.

నెపోలియన్ ఊహించనలవి కాని వేగంతో శత్రువు మీదికి వెళ్లి, చుట్టూ తన సైన్యమే కనిపించేలా చేసి - విపరీతమైన షాక్ కి గురిచేసేవాడు. ఆ అయోమయంలో చెల్లాచెదురై, దెబ్బతినేవారు అతని శత్రువులు.

రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఈ వ్యూహంలో వేగం అన్నదాన్ని ఇంకా మెరుగ్గా అమలుచేశాడు. బ్లిట్జ్‌క్రిగ్ (Blitzkrieg) విపరీతమైన వేగం, కేంద్రీకరించిన దాడి ఉపయోగించి అవతలి సైన్యాన్నే కాక, శత్రు దేశాల కూటములను షాక్ కీ, భయానికీ లోనుచేసేవాడు.[1]

మహాభారతంలో

"అశ్వత్థామ హతః" (కుంజరః) అన్న ధర్మరాజు మాట విని కుమారుడు చనిపోయాడని భావించి ప్రాణాలు విడిచిపెడుతున్న ద్రోణాచార్యుడు; క్రెడిట్స్: రామనారాయణదత్త అస్త్రి, హిందీ గీతాప్రెస్ మహాభారతం

మహాభారతంలో చాలా సందర్భాల్లో మానసిక యుద్ధం వాడుక కనిపిస్తుంది:

ద్రోణాచార్యుడిని పడగొట్టడానికి వేరే ఏ మార్గమూ లేకపోవడంతో అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయిన వార్తను ధర్మరాజుతో "అశ్వత్థామ హతః" అని బిగ్గరగా అని, "కుంజరః" అని మెల్లిగా చెప్పించారు. దానితో తన కుమారుడు అశ్వత్థామే చనిపోయాడని నమ్మిన ద్రోణుడు శరీరాన్ని విడిచిపెట్టాడు. ఇది మానసిక యుద్ధమే.
అర్జునుడు తన కొడుకు అభిమన్యుడి మరణానికి కారణమైన సైంధవుడిని తర్వాతి రోజు సూర్యాస్తమయంలోపు చంపుతాననీ, లేకుంటే ప్రాయోపవేశం చేస్తాననీ భీషణ ప్రతిజ్ఞ చేశాడు. సైంధవుడిని సాయంకాలం లోగా కాపాడుకుంటే అర్జునుడు తనంత తానే చస్తాడు కదా అని కౌరవ సైన్యమంతా సైంధవుడిని కాస్తుంది. సాయంత్రం కావస్తూంటుంది. సూర్యుడు కుంగినట్టు అయింది. అర్జునుడి ప్రతిజ్ఞ పోయింది. ప్రాణం దక్కింది అన్న అత్యుత్సాహంతో సైంధవుడు వ్యూహం నుంచి బయటకు వచ్చి గెంతులేస్తాడు. హఠాత్తుగా అప్పటివరకూ సూర్యుడిని కమ్మి ఉంచిన కృష్ణుడి చక్రం తొలగిపోయింది. అంటే - సూర్యాస్తమయం కాలేదన్నమాట. సైంధవుడి తలను అర్జునుడి బాణం తెగవేసింది. సైంధవుడిని బయటకు రప్పించేందుకు చేసిన మాయ కూడా మానసిక యుద్ధమే.
శల్యుడి కథ మరింత ప్రత్యేకం.
శల్యుడు మాద్రి సోదరుడు, పాండవులకు మామ. ఆయనకు గొప్ప సైన్యం ఉంది, స్వయంగా సుప్రసిద్ధుడైన రథ సారధి. ఆయన యుద్ధానికి ససైన్యంగా తరలి వస్తూండగా, ధర్మరాజులా నటించి, నమ్మించిన దుర్యోధనుడు గొప్ప విందు ఏర్పాటుచేసి, అతన్ని సంతృప్తిపరిచాడు. యుద్ధంలో "నా సాయం నీకే" అని మాట తీసుకున్నాడు. అప్పుడు చెప్పాడు తాను దుర్యోధనుడినని. శల్యుడు మాట మీరలేడు. ఇది మొదటి మానసిక యుద్ధం. ఇందులో విజయం దుర్యోధనుడిది.
"మామా! కర్ణుడికి సారధివి కమ్మని నిన్ను కోరుతారు. అంగీకరించి అతనిని యుద్ధంలో నీ మాటలతో దుర్బలుడిని చేయి" అని ధర్మరాజు శల్యుడికి చెప్పాడు. అనుకున్నట్టే శల్యుడిని యుద్ధంలో కర్ణుడికి సారధ్యం చేయమని దుర్యోధనుడు కోరాడు. దీనికి కారణం సూతపుత్రుడని అన్నవారి ఎదుటే సారధ్యంలో కృష్ణుడు అంతటివాడైన శల్యుడిని తన సారధి చేసుకోవాలని ఆశించి, దుర్యోధనుడిని అలా కర్ణుడు కోరుకోవడం. శల్యుడు కావడానికి మహా నిపుణుడైన, సుప్రసిద్ధుడైన సారధియే. కానీ, ముందే చెప్పినట్టు వంచితుడు, మనస్ఫూర్తిగా కౌరవ పక్షం వహించినవాడు కాదు. దానితో "నేను ఏ మాట మాట్లాడినా ఊరుకోవాలి" అని షరతు పెట్టి మరీ సారధ్యం చేశాడు. శల్యుడు యుద్ధం సాగుతున్నంత సేపూ కర్ణుడిని ఆ మాట ఈ మాట అని మానసికంగా దెబ్బతీశాడు. అతని మానసిక స్థైర్యాన్ని ఎప్పటికప్పుడు హరించివేసి అతని చావులో తనవంతు పాత్ర పోషించాడు. అందుకే మన పక్కనే ఉంటూ నిరుత్సాహపరిచేవారిని "శల్య సారధ్యం" అని తిడతారు. ఇదీ దుర్యోధనుడు ప్రారంభించిన ఆ సైకలాజికల్ వార్‌ఫేర్‌కి ధర్మరాజు ఎదురుదెబ్బ.
ఫుట్‌నోట్స్

[1] Blitzkrieg - Wikipedia

07/11/2023

Why godsey killed Gandhi????.........................
మహాత్మా గాంధీ హిందూ ము సుగు లో ఉన్న ఒక ముస్లిం అని వారి తల్లి ద్వారా కొంత ఆధారం దొరికిందని చాలామంది ఆర్ఎస్ఎస్ వారు బిజెపి వారు వారి మీడియా ప్రచారం చేసింది అంతవరకు నాకు కూడా తెలియదు.

గాంధీ గారు మహమ్మద్ అలీ జిన్నా కోరిక మేర పాకిస్తాన్ విడగొట్టడానికి ఒప్పుకోవటం ఒక తప్పు

స్వతంత్రం వచ్చేవరకు ఒక మాట కూడా మాట్లాడని జన్మ వర్గీయులు మాకు ముస్లిం కంట్రీ వేరే కావాలని అడగటం మరియు దానికోసం అల్లర్లు చేయుట సుమారు 20 లక్షల మంది హిందువులను ఉత్తరాదిన చంపటం రెండో తప్పు

విడిపోయిన తర్వాత వాళ్లకు నష్టపరిహారం 50 కోట్లు రూపాయలు ఇవ్వాలి ఇవ్వవలసిందే అని గాంధీ గారు పట్టుబట్టి ఇవ్వకపోతే సత్యాగ్రహం చేస్తాను అని బెదిరించడం మూడో తప్పు.

ఎందరో ఉద్యమకారులు స్వరాజ్యం కోసం తమ ప్రాణాలు ఇచ్చారు బ్రిటిష్ వాళ్లకు అందులో జలియన్వాలాబాగ్ అనే దహనకాండ అత్యంత దారుణమైన బ్రిటిష్ వాళ్ళ చేసిన కార్యక్రమం. భగత్ సింగ్ పోరాటయోధుడు బ్రిటిష్ వాళ్ళు ఉరిశిక్ష వేస్తే గాంధీ గారు అడ్డుపడలేదు ఆయనకు ఉరిశిక్ష వేయాలి అనుకుంటే ముందు నన్ను శిక్షించండి అని సత్యాగ్రహం చేయాలి కదా మరి ఎందుకు చేయలేదు నాలుగో తప్పు

సుభాష్ చంద్రబోస్ విరోచితంగా తుపాకి ద్వారానే మన స్వతంత్రం రావాలి ఈ శాంతి మార్గంలో రాదు బ్రిటిష్ వాళ్ళు మన మాట వినరు రాజీ పడే ప్రసక్తే లేదు అని పోరాడుతుంటే ఆయనను వదిలించుకోవాలని విశ్వ ప్రయత్నం చేశారు గాంధీ గారి గ్రూపు బ్రిటిష్ వాళ్ల గ్రూపు.

అలాగే ఆయన గారిని సుభాష్ చంద్రబోస్ ని రెండో ప్రపంచ యుద్ధ సందర్భంగా డిఆర్ తరపున బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని వెళ్ళవలసిందే అని పంపించారు గాంధీ వద్దు అనలే లేదు.

అనేక కార్యక్రమాలు ఉన్నాయి ప్రతి కార్యక్రమంలోనూ బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా సత్యాగ్రహం రూపంలో సహాయం చేసినట్టు గాంధీ గారు కనిపించారు.

వాళ్లకి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇక మనం ఎక్కువ కాలం ఎక్కడ ఉండలేము ఈ విప్లవకారులు ఎక్కువైపోతున్నారు మనకు వాళ్ళు మనతో సమానంగా తుపాకులు సంపాదిస్తున్నారు తిరుగుబాటు వస్తుంది అని సుభాష్ చంద్రబోస్నే రెండవ ప్రపంచ యుద్ధానికి వెళ్లిన నాయకుడిని వెనక్కి రాకుండా చేశారు దాని గురించి ఎవరు మాట్లాడలేదు గాంధీ గారు అనే నెహ్రూ గాని సుభాష్ చంద్రబోస్ ఏమయ్యారు అన్న మాట లేదు.

ఇది ఆరో తప్పు. ఈ రకంగా బ్రిటిష్ వాళ్లు గాంధీ నెహ్రూలతో రహస్య ఒప్పందం వాడొక కావలసిన ఇండియాలో ఉండేటట్టు మనకు కావలసినవి చేస్తున్నట్టు స్వతంత్రం ఇచ్చి వెళ్లిపోయారు.

గాడ్సే కూడా అలాంటి వాడే భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ ఝాన్సీ లక్ష్మీబాయి మొదలగు మహా నాయకులు అలాంటి వాడే గాడ్సే గాంధీ చేస్తున్న ఆ రహస్య కార్యక్రమాలు నచ్చక ఏమీ చేయలేక ఒక్కడే ఈ రకంగా గాంధీ గారిని హత్య చేశాడు.

తాను చనిపోవటానికి సిద్ధమై చేశాడు దొంగ పని చేయలేదు. నాకు ఉరిశిక్ష వెయ్యమని లొంగిపోయాడు అదర లేదు బెదరలేదు కోర్టుకు ఉత్తరం రాసి చనిపోయాడు.....by. ... తులసీ రావు జక్కంపూడి

26/10/2023

అగ్నివీర్‌’ అమరుడైతే ఆర్థిక సాయం ఎంత మేరకు?...........................................

ఇండియన్‌ ఆర్మీలో ‘అగ్నిపథ్’ పథకం ప్రారంభమైనప్పటి నుంచి విమర్శలకు గురవుతూనే ఉంది. కేవలం నాలుగేళ్ల పరిమితితో సైన్యంలో చేరిన అగ్నివీరుడు అమరుడైతే ఆర్థిక సాయం అందిస్తారా? అనే అంశంపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఇటీవల ఒక సైనికుడు మరణించిన నేపధ్యంలో అతనిని ‘అమరవీరుడు’గా గుర్తించలేదు. అలాగే ఆర్మీ తరపున తగిన గౌరవం అందించలేదు. దీనిపై విమర్శలు చెలరేగడంతో సైనికాధికారులు సమాధానమిస్తూ ఆ సైనికుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.

అయితే సియాచిన్‌లో విధులు నిర్వహిస్తున్న అగ్నివీర్ అక్షయ్ లక్ష్మణ్ గవాటే వీరమరణం పొందారు. లక్ష్మణ్‌ ‘అగ్నివీరుడు’ కావడంతో అతని కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సహాయం చేయరా? అంటూ ప్రతిపక్షం ఇండియన్‌ ఆర్మీకి సవాల్‌ విసిరింది. ఈ ఆరోపణలపై భారత సైన్యం స్వయంగా క్లారిటీ ఇచ్చింది. ఆర్మీ ఒక ప్రకటనలో ‘అగ్నివీర్’ స్కీమ్ కింద రిక్రూట్ అయిన సైనికుడు అమరుడైన సందర్భంలో అందించే ఆర్థిక సహాయంపై సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే వాదనలు జరుగుతున్నాయి. అందుకే దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం.

అగ్నివీర్ యోజన కింద రిక్రూట్ అయిన సైనికులకు అందించే ప్రయోజనాలివే..
రూ. 48 లక్షల జీవిత బీమా
సేవా నిధి సొమ్ము. ఇందులో అగ్నివీర్ జీతం నుంచి 30 శాతం జమ అవుతుంది. అంతే మొత్తాన్ని ప్రభుత్వం దానికి జత చేరుస్తుంది. ఈ డబ్బుపై వడ్డీని కూడా అందిస్తారు.
రూ. 44 లక్షల ఆర్థిక సహాయం
మిగిలిన సర్వీస్ జీతం.. ఇటువంటి సందర్భంలో రూ. 13 లక్షలకు మించి అందిస్తారు.
ఆర్మ్డ్ ఫోర్సెస్ బ్యాటిల్ క్యాజువాలిటీ ఫండ్ నుండి రూ.8 లక్షల సహాయం.
ఏడబ్ల్యుడబ్ల్యు నుండి రూ.30 వేలు సత్వర సహాయం
అగ్నివీర్ అమరవీరుడైతే సుమారు రూ. ఒక కోటి రూపాయల ఆర్థిక సహాయం అతని కుటుంబానికి అందుతుంది. సేవా నిధి రూపంలో వచ్చిన డబ్బుపై పన్ను ఉండదు. ఒక అగ్నివీర్ జవాన్ విధులలో లేని సమయంలో మరణిస్తే, అతని కుటుంబానికి రూ. 48 లక్షల బీమా, మరణించిన తేదీ వరకు లెక్కించిన సేవా నిధి సొమ్ము, కార్పస్ ఫండ్ సొమ్ము అందిస్తారు.

26/10/2023

హోమియోపతిని నమ్మవచ్చా????..........................................
హోమియోపతి గురించి కాదు. శాస్త్రీయం ఏది అనే దాని మీదే నా ఈ పల్కు.

దీని కోసం అని నేను 19వ శతాబ్దం మొదట్లో ఆస్ట్రియా-హంగేరీ రాజ్యంలో అప్పటి వైద్య విధానాలని సవాలు చేస్తూ ఒక్క జర్మన్ డాక్టర్ కనుగొన్న ఒక్క క్రొత్త విషయం గురించి మీకు చెబుతాను. ఆ డాక్టర్ పేరు
ఇగ్నస్ సెమ్మెల్వైస్ (Ignaz Semmelweis - Wikipedia)

ఈ ఇగ్నస్ వియన్నా ఆసుపత్రిలో పెద్ద పోస్టులో పని చేసే వారు. వియన్నా ఆసుపత్రిలో రెండు కాన్పుల క్లినిక్లు ఉండేవి. ఒక దానిలో మంత్రసానులు కాన్పులు చేసే వారు ఇంకో దానిలో పెద్ద చదువులు చదివిన డాక్టర్లు కాన్పులలో సహాయం చేసే వాళ్ళు. కానీ గమ్మత్తుగా డాక్టర్లు కాన్పులు చేసే చోట ఎక్కువ మంది తల్లులు చనిపోయే వారు. కాన్పు అయ్యాక జ్వరం [ఆ జ్వరాన్ని childbed fever అనే వారు] వచ్చి ఈ తల్లులు చనిపోయే వారు. మంత్రసాని కాన్పులు చేసిన చోట తక్కువ మందికి ఆ జ్వరం వచ్చేది.

ఈ రెండు క్లినిక్ల నడుమ చనిపోయిన వారి శాతంలో తేడా పైన గ్రాఫ్ లో చూడవచ్చు. ఎక్కడ ఎక్కువ మంది చనిపోతున్నారు అనే విషయం వియన్నా ప్రజలకి బానే తెలుసు.

సోమ, బుధ, శుక్ర వారాలు డాక్టర్ల క్లినిక్ లో కాబోయే తల్లులని జేర్చుకుంటూ ఉంటె. మంగళ, గురు, శని వారాలలో మంత్రసానులు పని చేసే క్లినిక్ లో కాబోయే తల్లులని చేర్చుకునే వారు (రోజు విడిచి రోజు అన్న మాట). వియన్నా నగరం లో తల్లులకి కాన్పు నెప్పులు ఏ సాయంత్రమో మొదలు అయ్యితే తల్లులు ఆ నెప్పులని అర్థ రాత్రి వరకు భరించి ఆ తరువాత రోజు మొదలు అవ్వగానే మంత్రసానులు కాన్పు చేసే ఆసుపత్రికి వెళ్లే వాళ్ళు. ఈ ప్రయత్నంలో కొందరికి ఇల్లలోనో వేరే చోటో కాన్పులు అయ్యిపోయేవి.

ఎంతో సుశిక్షుతులైన డాక్టర్లు ఉన్న క్లినిక్లో ఎక్కువ మంది చనిపోయి, మంత్ర సానులు ఉన్న క్లినిక్లో తక్కువ మంది ఎలా చనిపోతున్నారు అనే ప్రశ్న ఇగ్నస్ ని తొలిచివేసింది. దాని గురించి చాలా ఆలోచించడం మొదలు పెట్టాడు. రెండు క్లినిక్ల నడుమ తేడా ఏంటా అని ఆలోచించడం మొదలు పెట్టాడు. రెండు పక్క పక్క వీధులలో ఉన్నాయి కాబట్టి వాతావరణంలో తేడా లేదు. రెండిట్లోను దాదాపు ఒకే జాతి తల్లులు వచ్చే వాళ్ళు కాబట్టి జాతులకు సంబంధించిన తేడాలు లేవు. ఇలా ఏ విధంగా చూసిన ఒక చోట మంత్రసానులు ఇంకో చోట డాక్టర్లు తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ తేడాలు లేవు.

అప్పుడు అనుకోకుండ ఒక్క సంఘటన జరిగింది. ఒక్క రోజు శవ పంచనామా చేస్తున్న ఒక్క మెడికల్ విద్యార్ధి ఆ శవాన్ని కోస్తున్న కత్తితో అనుకోకుండ మరొక్క డాక్టర్ అయ్యిన ఇగ్నస్ యొక్క నేస్తం జాకబ్ ని (Jakob Kolletschka - Wikipedia) గాయపరిచాడు. అప్పుడు జాకబ్ కి జ్వరం వచ్చి ఆ జ్వరంతో కొన్ని రోజులు తరువాత చనిపోయాడు. ఆ చనిపోయిన నేస్తం యొక్క జ్వరం లక్షణాలు ఇంకా చనిపోతున్న తల్లుల జ్వరం లక్షణాలు ఒక్క లానే ఉన్నాయి అనేది ఇగ్నస్ గమనించాడు. శవాల దగ్గర పని చేసే చాలా మంది డాక్టర్లు ప్రసవిస్తున్న తల్లులకి సహాయంగా రావడం ఇగ్నస్ కి తెలిసిన విషయమే. ఈ రెండు విషయాలకి ఒక్క లంకె వేసి చూస్తే ఇగ్నస్ కి అర్థం అయ్యిన విషయం ఏంటంటే శవాల నుంచి చేతులకి ఏదో అంటుతోంది (దానిని ఆయన dead material అనే వారు), అవే చేతులతో కాన్పులు చేయడం వల్లే ఈ జ్వరాలు అటు పైన సావులు. మంత్ర సానులు శవాల దగ్గర పని చేసే వారు కాదు కాబట్టి అక్కడ జ్వరాలు తక్కువ వస్తున్నాయి. అప్పట్లో germs గురించి ఇంకా ప్రపంచానికి తెలియదు కానీ చేతులు కడుక్కోడం వల్ల "dead material" పోయి ఆరోగ్యకరమైన కాన్పులు జరుగుతాయి అనే conclusion కి వచ్చారు ఇగ్నస్. maternity ward లో డాక్టర్లు చేతులు కడుక్కోవాలి అనే నిబంధన పెట్టారు. ఆ తరువాత మరణాల శాతం తగ్గింది కూడా.

ఇదే విషయం ఆయన మెడికల్ జర్నల్స్లో ఇంకా అనేక కాన్ఫరెన్స్ లలో తెలియజేయడానికి ప్రయత్నించారు, కానీ ఆయన మాటలకి ఎటువంటి evidence లేదు అని ఆయన చెప్పింది వేరే డాక్టర్లు కొట్టి పడేసారు. ఆయన వియన్నా ఆసుపత్రిలోని పోస్ట్ కూడా పోయింది. డాక్టర్లు ఆయన చెప్పింది పట్టించుకోక పోవడం వల్ల ఆయన ఎంతో అసహనానికి గురి అయ్యి వాళ్ళ మీద పరుషంగా విరుచుకు పడ్డారు. హంతకులకి, ఆయన చెప్పిన మాటలు వినని డాక్టర్ లోకానికి పెద్ద తేడా లేదు అనేది ఆయన అభియోగం. ఈ పోరాటంలో ఆయనకి మానసిక వ్యాధి కూడా వచ్చి చివరికి పిచ్చి ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ కొందరు గార్డ్స్ ఆయన్ని కొట్టడం వల్ల ఆ గాయాలతో చనిపోయారు. సమాజం ఎంతగానో గౌరవించాల్సిన ఒక్క వ్యక్తి ఇలా దురదృష్టకరమైన విధంగా చనిపోయారు .

దాదాపుగా ఆయన చనిపోయిన దశాబ్ధాలలోనే ఫ్రాన్స్ దేశంలో "లూయి పష్టుర్" (Louis Pasteur - Wikipedia ) Germ Theory develop చేసి సూక్ష్మ జీవుల వల్ల వచ్చే జబ్బులు; చేతులు కడుక్కోడం, పాలు వేడి చేయడం వగైరా వల్ల వాటి భారిన ఎలా పడకుండా ఉండగలం అనేది నిరూపించారు. అప్పుడు లోకం కళ్ళు తెరిచి ఇగ్నస్ విషయంలో వారు చేసిన తప్పు తెలుసుకుని ఇప్పుడు ఘనంగా కీర్తిస్తున్నారు. నేను ఈ నడుమ మొదటి "anti biotic" అది కనుకున్న గెరాడ్ డోమాక్ (Gerhard Domagk - Wikipedia) మీద ఒక్క పుస్తకం చదివా, దానిలో ఇగ్నస్ చేసిన ఈ అద్భుతం గురించి చర్చించారు.

పై కథ అంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒక జీవి శరీరం చాలా సంక్లిష్టమైనది. దాని గురించి సైంటిఫిక్ గా అన్ని ఇప్పటికే కనుక్కుని ఉండరు. బహుశా ఎప్పటికి కనుక్కోరు కాబట్టి సైన్స్ కి అంతు చిక్కనివి మానవ శరీరంలో ఎన్నో ఉంటాయి. పై కథలో డాక్టర్లు చేతులు కడుక్కోడం లేదు. చేతులు కడుక్కోవాలి అని చెప్పిన వారు వినలేదు. alternate medicine లో డాక్టర్స్ కి తెలియని లేదా డాక్టర్లు ఒప్పుకోని కొన్ని విషయాలు ఉండవచ్చు.

అలాగని alternate medicine ని పూర్తిగా నమ్మ వద్దు, పూర్తిగా తీసి పాడేయవద్దు. మనకి ఉన్న జబ్బుని బట్టి కొంత మేర ప్రయత్నించి చూస్తే వచ్చే నష్టం ఏమి లేదు. Alternate మెడిసిన్ పేరు చెప్పి చెలరేగుతున్న దొంగలు కోకొల్లరు. అది గమనించి కొంచెం జాగ్రత్త పడటం మంచిది

Address

Giddalur

Website

Alerts

Be the first to know and let us send you an email when Sabarmati STUDY Circle posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category