Letting Oppressed Voice Emerge

Letting Oppressed Voice Emerge Letting the oppressed classes/people raise their voice and emerge. The underlying principle is LOVE.

This is an effort to unite those who are interested in letting the oppressed classes/people raise their voice and emerge as emeralds.

No "end of the world" nor " there is no alternative" (TINA) theories propounded by Francis Fukuyama !  Yes such theories...
19/08/2024

No "end of the world" nor " there is no alternative" (TINA) theories propounded by Francis Fukuyama ! Yes such theories have been proved nonsense and capitalism has pushed the world to the deepest crisis that the humanity across the globe cannot bear no longer.
That's why this unrest and upsurge in this most developed and number one economy of the world.

History has produced a generation of communists in the United States. Now, a new political party has been officially founded to unite them under a common ban...

https://youtu.be/dS6noZ64v4o?si=qbsxUaiITERZ7iNY
14/05/2024

https://youtu.be/dS6noZ64v4o?si=qbsxUaiITERZ7iNY

ఈ వీడియోలో, వాట్సాప్ ద్వారా వ్యాపిస్తున్న తప్పుడు సమాచారం యొక్క విస్తృత ప్రభావం గురించి తీవ్రమైన చర్చ, వ్యక్తి...

https://youtu.be/lH-L-_ODvu8?si=eK06YNXo53m0dm0F
14/05/2024

https://youtu.be/lH-L-_ODvu8?si=eK06YNXo53m0dm0F

For Business Enquiries and Advertise on 3tv Youtube Channels Contact : +91 970 333 8500 / +91 6301 252 183 సెలెబ్రిటీల క్యాన్సర్ వైద్యులు డాక్టర్ నోరీ దత్తా...

02/05/2024

ఎం కోటేశ్వరరావు
1-5-2024

పేరు పెట్టి చెప్పకపోయినా చైనాకు పరోక్ష హెచ్చరికలు చేయటంలో మననేతలు తక్కువ తినలేదు. అవి సరిహద్దు సమస్యల మీద కావచ్చు, చైనా స్థానంలో ప్రపంచ ఫ్యాక్టరీగా మనం మారబోతున్నాం అన్న కోతలు ఏవైనా కావచ్చు. మాటలు కోటలు దాటినా చేతలు గడపదాటటం లేదన్న సామెత తెలిసిందే. గత పదేండ్లుగా మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత వంటి నినాదాలు మన చెవుల తుప్పు వదలగొడుతున్నాయి. కానీ పదేండ్ల పాలనలో చైనాకు నరేంద్రమోడీ సమర్పించిన మొత్తం ఎంతో తెలుసా ? యాభై లక్షల కోట్ల రూపాయలకు పైమాటే అంటే ఎవరైనా నమ్ముతారా ? తమ విశ్వగురువు ఇలా చేశారంటే వీర భక్తులు అసలు నమ్మరు. కానీ చేదు నిజం. గడచిన పది సంవత్సరాలలో చైనాతో మన వాణిజ్య లోటు 614బిలియన్‌ డాలర్లు.(గత ఐదేండ్లలో 387బి.డాలర్లు) బిలియన్‌కు వంద కోట్లు అంటే 61,400, ఒక డాలర్‌కు మన రూపాయి మారకం విలువ ఇది రాసిన సమయంలో 83.47 ఉంది. ఆ లెక్కన చైనాకు మనం సమర్పించుకున్న మొత్తం రు.51,25,058 కోట్లు. ఈ వివరాలను 2024 ఫిబ్రవరి 29న ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలో విశ్లేషణ రాసిన గ్రూప్‌ కెప్టెన్‌ ప్రవీర్‌ పురోహిత్‌(ఐఎఎఫ్‌ విశ్రాంత ఉద్యోగి) పేర్కొన్నారు.” చైనాతో పెరుగుతున్న భారత వాణిజ్యలోటు వ్యూహాత్మక దుర్బలత్వం ” అనే శీర్షికతో సదరు విశ్లేషణ ఉంది. ఒక వైపు ఏటికేడు చైనా నుంచి దిగుమతులను పెంచుకుంటూ మరోవైపు చైనా నుంచి ముప్పువస్తోంది గనుక అమెరికాతో చేతులు కలపాలి, ఆయుధాలు కొనుగోలు చేయాలి అంటూ జనాన్ని తప్పుదారి పట్టిస్తున్న నరేంద్రమోడీ విధానాలను ఎలా అర్ధం చేసుకోవాలి ?మన దేశం కూడా ఇతర దేశాలతో పోటీ పడి వృద్ధి చెందాలని, జనానికి ఉపాధి కల్పించి సరిపడా ఆదాయకల్పన చేసి మెరుగైన జీవితం గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దానికి అనువైన విధానాలను అనుసరించటం లేదనేదే పాలకుల మీద విమర్శ. మనోభావాలను రేకెత్తించటం మీద ఉన్న శ్రద్ద అభివృద్ది మీద లేదు. తమ సరకులను దిగుమతి చేసుకోవాలని ఏ దేశాన్నీ చైనా దేబిరించటం లేదు. మా ఊళ్లో దుకాణం తెరవాలని గ్రామస్తులు ఎవరినైనా వేడుకుంటారా ? ఉన్న దుకాణానికి తోడు కొత్తది వెలిస్తే అక్కడ తక్కువ ధరలకు వస్తువులను అమ్మితే జనం అక్కడే కొనుక్కుంటారు.ప్రపంచ మార్కెట్‌లో ఎప్పటినుంచో ఉన్న అమెరికా, జపాన్‌, జర్మనీ,బ్రిటన్‌ సరసనే చైనా కూడా దుకాణం తెరిచింది.అక్కడ సరసమైన ధరలకు ఇస్తున్నందున ప్రపంచ దేశాలన్నీ ఎగబడి కొనుక్కుంటున్నాయి. గిరాకీని తట్టుకోలేకపోతున్నాము, ఎవరైనా వచ్చి మా దేశంలోనే వస్తూత్పత్తి చేయండి అంటే వివిధ దేశాల నుంచి పెట్టుబడిదారులు అక్కడకు వెళ్లి ఉత్పత్తి చేసి నాలుగురాళ్లు వెనుకేసుకుంటున్నారు. ఆపని చేయలేక మనం కూడా చైనా, ఇతర దేశాల నుంచి కావాల్సినవి కొనుక్కుంటున్నాం.ఎవరూ ఎవరిని బలవంతం చేయటం లేదు. చైనా వస్తువులను బహిష్కరించాలని మనదేశంలో చాలా మంది వాట్సాప్‌ ద్వారా సందేశాలను పంపారు. పెద్ద జోకేమిటంటే అందుకోసం వారు కూడా చైనా ఫోన్లనే వాడుతున్నారు.

తాజాగా గ్లోబల్‌ ట్రేడ్‌ రిసర్చ్‌ ఇనీషియేటివ్‌(జిటిఆర్‌ఐ) అనే సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం పదిహేను సంవత్సరాల క్రితం మనం దిగుమతి చేసుకున్న పారిశ్రామిక వస్తువులలో చైనా వాటా 21 ఉంటే ఇప్పుడు 30శాతానికి పెరిగింది. విదేశాల మీద ప్రత్యేకించి చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించటమే కాదు, అసలు మనమే ప్రపంచానికి ఎగుమతి చేద్దామంటూ నరేంద్రమోడీ ఎంతో హడావుడి చేస్తున్నపుడే ఇదంతాజరిగింది.ఇప్పటికి తాను చేసింది ట్రైలర్‌ మాత్రమే అని చెప్పిన మోడీ రానున్న రోజుల్లో చైనా నుంచి ఇంకా పెద్ద ఎత్తున దిగుమతులకు పూనుకుంటారా ? మరింత గట్టిగా పని చేస్తానంటూ రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత గత ఐదేండ్లలో చైనాకు మన ఎగుమతులు ఏటా 16బిలియన్‌ డాలర్లకు అటూ ఉండగా అక్కడి నుంచి దిగుమతులు 70.3 నుంచి 101 బి.డాలర్లకు పెరిగాయి. ఇది సమర్ధతా, అసమర్ధతకు చిహ్నమా ? చైనా మీద ఆధారపడటం పెరుగుతున్న తీరు ఆందోళనకరంగా ఉందని జిటిఆర్‌ఐ అన్నది, దేశం కోసం, ధర్మం కోసం అంటూ కబుర్లు చెప్పే నరేంద్రమోడీలో అలాంటిదేమైనా ఉందా ? రామాలయం మీద, దాని ద్వారా ఓట్లు దండుకోవాలన్న యావలో కొంచెమైనా పారిశ్రామికీకరణ మీద ఉందా ? రాజ్యసభలో వైసిపి సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి చైనాతో పెరుగుతున్న మనదేశ వాణిజ్య లోటు గురించి ఒక ప్రశ్న అడిగితే దానికి 2023 డిసెంబరు ఎనిమిదిన కేంద్ర ప్రభుత్వం ఒక సమాధానమిచ్చింది.దానిలో గడచిన తొమ్మిది సంవత్సరాల్లో ఎంతో మార్పు వచ్చిందంటూ గాలిపోగేసి రోజూ చెప్పే కబుర్లను పునరుద్ఘాటించటం తప్ప అసలు సంగతి మన ఎగుమతులు ఎందుకు పెరగటం లేదో దిగుమతులు రికార్డులను ఎందుకు బద్దలు కొడుతున్నదీ చెప్పలేదు.

మనకు అవసరమైన వస్తువులు లేదా ముడి పదార్దాలను చైనా నుంచి దిగుమతి చేసుకోవాలా మరొక దేశం నుంచా అన్న అంశం మీద కూడా చర్చ జరుగుతున్నది. మనవి కానపుడు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నా ఒకటే. ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరాం గనుక చైనా నుంచి కొన్ని దిగుమతులు చేసుకోక తప్పదు అంటూ కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతారు. అదే వాస్తవమైతే పాకిస్తాన్‌ కూడా దానిలో సభ్యురాలే కదా ? అక్కడి నుంచి ఎందుకు దిగుమతులు చేసుకోవటం లేదు. పూర్తిగా చైనా మీద ఆధారపడితే ప్రపంచ రాజకీయాల్లో తేడా వస్తే, అక్కడి నుంచి నిలిచిపోతే పరిస్థితి ఏమిటని కొందరు అంటున్నారు. అసలు అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి. మన విధానాలు సరిగా ఉంటే ఎవరితో నైనా వివాదాలు ఎందుకు వస్తాయి. అమెరికా లేదా దాని కనుసన్నలలో పనిచేసే దేశాల మీద ఆధారపడినా అదే జరగదా ? గతంలో అంతర్జాతీయంగా తమ కూటమిలో చేరకుండా ఉన్నందుకే కదా పరిశ్రమలు, అంతరిక్ష ప్రయోగాలకు అలాంటి సహకారం అందించేందుకు అమెరికా నిరాకరించింది. ఆ కారణంగానే మన దేశం సోవియట్‌ వైపు మొగ్గింది.చైనాను మనదేశం శత్రుదేశంగా భావిస్తే ఏ ప్రధానీ కలవనన్ని సార్లు చైనా నేతలను రికార్డు స్థాయిలో నరేంద్రమోడీ ఎందుకు కలసినట్లు ? ఇరు నేతలూ అటు ఊహాన్‌ ఇటు మహాబలిపురంలో కలసి ఉయ్యాలలూగారు. గాల్వన్‌లోయ ఉదంతాల తరువాత చైనా నుంచి వచ్చే పెట్టుబడులు మనదేశానికి ముప్పు తెస్తాయంటూ కేంద్ర అనుమతి లేకుండా అంగీకరించకూడదని గిరిగీసుకున్నది మనమే. దానికి ప్రతిగా చైనా మన దిగుమతుల మీద లేదా అక్కడి నుంచి వస్తుదిగుమతుల మీద ఎలాంటి ఆంక్షలు లేవు. మరింత పెరిగాయి, వాటితో ముప్పురాదా ?

పోనీ చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించారా అంటే అదీ లేదు. ఇతర దేశాలతో పోలిస్తే చైనా నుంచి దిగుమతుల వేగం 2.3రెట్లు పెరిగిందని, 2023-24 మనదేశం 677.2 బి.డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటే దానిలో 101.8 బి.డాలర్లు చైనా నుంచి అంటే 15శాతం ఉన్నట్లు జిటిఆర్‌ఐ నివేదిక పేర్కొన్నది.కీలక రంగాలలో దిగుమతులు ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జనవరి మధ్య మనదేశం మొత్తం 67.8 బి.డాలర్ల మేర ఎలక్ట్రానిక్స్‌, టెలికాం, ఎలక్ట్రికల్‌ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే వాటిలో చైనా నుంచి చేసుకున్నవాటి విలువ 26.1 బిలియన్‌ డాలర్లు, 38.4శాతం,యంత్రాల దిగుమతిలో కూడా అక్కడి నుంచి 39.6శాతం,రసాయనాలు, ఫార్మా ఉత్పత్తులు 29.2శాతం ఉంది.మొత్తం దిగుమతుల్లో 50శాతం యంత్రాలు, ఇతర ఉత్పాదక సంబంధమైనవే ఉన్నాయి. శత్రుదేశమంటూ మన మీడియా, సంఘపరివార్‌కు చెందిన సంస్థలు సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తి పోస్తున్నా చైనా వాటిని పెద్దగా పరిగణనలోకి తీసుకోవటం లేదు. జపాన్‌ తదితర దేశాల సముద్ర ఉత్పత్తులను తిరస్కరించినట్లుగా, ఆస్ట్రేలియా ఉత్పత్తుల మీద ఆంక్షలు విధించినట్లుగా మన వస్తువులను తిప్పిపంపిన దాఖలాలు లేవు. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులు ఇతర దేశాల్లో కూడా దొరుకుతాయి, అయితే అంత చౌకగా దొరకవు గనుక మోడీ ప్రభుత్వ మెడలు వంచి దిగుమతిదారులు, పారిశ్రామికవేత్తలు విదేశీమారకద్రవ్యాన్ని కేటాయింప చేసుకొని వస్తు దిగుమతులు చేసుకుంటున్నారు. మనదేశంలో చిన్న పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహమిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు.ఎంఎస్‌ఎంఇ సంస్థలు మనదేశంలో ఉత్పత్తి చేయగలిగిన వస్త్రాలు, దుస్తులు,గాజువస్తువులు, ఫర్నీచర్‌, కాగితం, చెప్పులు, బొమ్మలను కూడా దిగుమతి చేసుకుంటున్నట్లు జిటిఆర్‌ఐ నివేదిక ఆవేదన వెలిబుచ్చింది.రానున్న రోజుల్లో మనదేశ రోడ్ల మీద తిరిగే ప్రతి మూడు విద్యుత్‌ వాహనాల్లో ఒకటి చైనా సంస్థలు లేదా వాటితో భాగస్వామ్యం కుదుర్చుకున్న లేదా దిగుమతి చేసుకున్నవే ఉంటాయని జిటిఆర్‌ఐ పేర్కొన్నది.మన మార్కెట్‌లోకి చైనా సంస్థలు ప్రవేశిస్తే వాటి ఉత్పత్తులకు అవసరమైన విడిభాగాలన్నింటినీ చైనా నుంచి దిగుమతి చేసుకొనేందుకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నందున దిగుమతులు మరింతగా పెరుగుతాయని తెలిపింది.మన జిడిపిలో పారిశ్రామిక ఉత్పత్తి ఇప్పుడున్న 17 లేక 18శాతం స్థితి నుంచి 25శాతానికి పెరగాలంటే చైనా నుంచి మరిన్ని దిగుమతులు అవసరమని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు.

అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్దంలో భాగంగా చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల మీద భారీ మొత్తంలో దిగుమతి పన్ను విధిస్తున్నారు. ఆ మొత్తం అక్కడి వినియోగదారుల మీదనే మోపుతున్నారు తప్ప దిగుమతులను నిలిపివేయలేదు. ప్రత్యక్షంగా వాణిజ్య పోరుకు దిగినట్లు ప్రకటించకపోయినా మనదేశం కూడా చేస్తున్నది అదే. రెండుదశాబ్దాల క్రితం ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా ప్రవేశించినపుడు మనదేశంతో వాణిజ్య లావాదేవీల విలువ 3.6బిలియన్‌ డాలర్లు మాత్రమే. దానిలో మనలోటు కేవలం 0.19బి.డాలర్లు మాత్రమే. అదే 2022లో ద్విపక్ష వాణిజ్యం 136 బి.డాలర్లకు చేరగా మనలోటు 101బి.డాలర్లు ఉంది.మరుసటి ఏడాది పరిస్థితి కూడా అలాగే ఉంది.దిగుమతులు మన పరిశ్రమలు, వాణిజ్యం మీద ప్రతికూల ప్రభావం చూపుతుండటంతో కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి దిగుమతి పన్ను 500 రెట్లు పెంచింది. అయినా తగ్గలేదు, అంటే పెంచిన పన్ను మొత్తాలను భరిస్తున్నది మన వినియోగదారులే. మన దేశంలోనే వస్తూత్పత్తి చేసి జనానికి ఉపాధితో పాటు చౌకగా సరకులను అందించాల్సిన నరేంద్రమోడీ దిగుమతి చేసుకున్న వస్తువుల మీద కూడా పన్నులు మోపి జనం జేబులు గుల్లచేస్తున్నారు.రష్యా నుంచి చౌకగా దిగుమతి చేసుకున్న ముడి చమురు మీద కూడా అంతే చేస్తున్న సంగతి ఎరిగిందే.వినియోగదారులకు ఒక్క పైసా అయినా తగ్గించారా ? ఫార్మాదిగుమతులపై పన్ను పెంపును మనదేశంలోని పరిశ్రమ వర్గాలు వ్యతిరేకించటంతో 76 ఔషధాలపై పెంపుదలను వెనక్కు తీసుకున్నారు. అనేక వస్తువులపై దిగుమతి పెంపును ఉత్పత్తిదారులు స్వాగతిస్తే దిగుమతిదారులు వ్యతిరేకించారు. ఆర్థికశాఖ తీసుకున్న నిర్ణయాలను ఇతర మంత్రిత్వశాఖలు వ్యతిరేకించాయి.ఈ ఏడాది తాత్కాలిక బడ్జెట్‌కు ముందు అనేక వస్తువులపై పన్నులను తగ్గించారు. ఉత్పాదకత ఎగుమతులతో ముడిపెట్టిన ప్రోత్సాహక పధకం(పిఎల్‌ఐ) రాయితీలను ఉపయోగించుకున్న సంస్థలు పన్నెండింటిలో పదకొండు చైనా సరఫరా గొలుసు భాగస్వాములు లేదా సేవలు అందించే సంస్థలున్నట్లు వార్తలు వచ్చాయి. గత పది సంవత్సరాల కాలంలో అనేక ప్రోత్సాహాకాలు, రక్షణ చర్యలు చేపట్టినా మన పారిశ్రామిక ఉత్పత్తి వాటా జిడిపిలో 15శాతం చుట్టూ తిరుగుతున్నది తప్ప పెరగలేదు. గాల్వన్‌ ఉదంతాల తరువాత మనదేశం నుంచి ఎగుమతులు నిలిపివేస్తే చైనా మన కాళ్లదగ్గరకు వస్తుందని అనేక మంది కలలు గని అలాంటి పిలుపులే ఇచ్చారు. మొత్తం చైనా చేసుకునే దిగుమతుల్లో మనదేశ వాటా కేవలం మూడుశాతమే, అదే మనం దిగుమతి చేసుకుంటున్నది 15శాతం ఉన్నాయి.చెరువు మీద అలగటం మంచిది కాదని మన విధాన నిర్ణేతలకు అర్ధమైంది.

https://youtu.be/p1Ee7ZVqHv0?si=l1xRdswi1GU51Wvi
23/04/2024

https://youtu.be/p1Ee7ZVqHv0?si=l1xRdswi1GU51Wvi

కాంగ్రెస్ పై ఆ విమర్శలు మోడీ భయాన్ని సూచిస్తున్నాయి || Such criticism on Congress reflects Modi fears ||...

21/04/2024

" భారత సైన్యం దండకారణ్యంలో ఆదివాసీలపై చేస్తున్న యుద్దాన్ని నిలిపి వేయాలి"
_ ప్రజాస్వామ్య సంఘాల ఐక్య వేదిక
*****
ఛత్తీస్ ఘడ్, దండకారణ్యం లోని ఆదివాసీలపై భారత సైన్యం ఆపరేషన కగార్ పేరిట చేస్తున్న యుద్దాన్ని నిలిపి వేయాలని కోరుతూ, గత వారం రెండు విడతలుగా జరిగిన నలభై మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్ లను నిరసిస్తూ ' ప్రజాస్వామ్య సంఘాల ఐక్య వేదిక ' ఆధ్వర్యంలో నేడు కర్నూల్ లోని ప్రగతిశీల మహిళా సంఘం కార్యాలయం లో విలేఖరుల సమావేశం జరిపింది. వేదిక కన్వీనర్ రామకృష్ణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముందుగా వేదిక కన్వీనర్ రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ గత పదిరోజులుగా దండకారణ్యం ప్రాంతంలో భారత సైన్యం రెండు విడతలుగా కాల్పులు జరిపి యాభై మంది ఆదివాసీలను మావోయిస్ట్ ల పేరిట చంపివేసిందని అందులో ఎక్కువ భాగం మహిళలే అని తక్షణమే భారత సైన్యం ఆదివాసీలపై చేస్తున్న యుద్దాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విప్లవ రచాయిల సంఘం బాధ్యులు పాణి మాట్లాడుతూ ' ఆపరేషన్ కగార్, ఆపరేషన్ సమాధాన్ ల పేరిట దండకారణ్యంలో బాంబ్ దాడులను చేస్తూ వుందని, అత్యాధునిక డ్రోన్ విమానాల ద్వారా బాంబులను వేస్తూ వుందని, దండకారణ్యం ప్రాంతంలో నుండి, ఆదివాసీలను తరిమివేసి, ఆ ప్రాంతంలోని విలువైన ఖనిజ సంపద లను దోచుకోవడానికి కార్పోరేట్ శక్తులకు ఆయా ప్రాంతాలను అప్పగిస్తూ వుందని, ఆ ప్రాంతంలో ఆదివాసీలకు మద్దతుగా నిలిచిన మావోయిస్టులను ఎన్కౌంటర్ లు చేసి నిర్మూలిస్తూ వుందన్నారు. తక్షణమే ఆదివాసీ ప్రాంతంలో సైన్యం చేస్తున్న యుద్దాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రజా అభ్యుదయ సంస్థ నాయకులు భార్గవ మాట్లాడుతూ కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం దండకారణ్యం ప్రాంతంలో నీ సంపదలను, సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి, దండకారణ్యం నుండి, అడవులనుండి ఆదివాసీలను వెళ్లగొడుతూ వుందని, వారిపై యుద్దాన్ని ప్రకటించి డ్రోన్ విమానాల ద్వారా బాంబులను వేస్తూ వుందని, తక్షణమే బాంబు దాడుల ను నిలిపివేయాలని, డిమాండ్ చేశారు. రాయలసీమ విద్యా వంతుల వేదిక కో కన్వీనర్ రత్నం ఏసేపు మాట్లాడుతూ ఝార్ఖండ్, ఛత్తీస్ ఘడ్ ప్రాంతంలో రెండు వందల పోలీసు బేస్ క్యాంపు లను ఏర్పాటు చేసిందనీ, ఈ జనవరి నెల నుండి మార్ హో వరకు వంద మంది ఆదివాసీలను చంపివేసిందని, శత్రు సైన్యాలపై ఉపయోగించవలసిన ఆయుధాలను ఆదివాసీలపై, వారికి అండగా ఉంటున్న మావోయిస్టులపై ప్రయోగిస్తూ వందల సంఖ్యలో చంపి వేస్తూ వుందని, ఆపరేషన్ కగార్, ఆపరేషన్ సమాధాన్ లను తక్షణమే ఉపసంహరించాలని, డిమాండ్ చేశారు.
ఈనాటి విలేఖరుల సమావేశంలో ఇంకా CPI నాయకులు మనోహర మాణిక్యం, రైతు కూలీ సంఘం నాయకులు సుంకన్న, కులనిర్మూలన పోరాట సమితి నాయకులు AV సుబ్బారాయుడు, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులువెంకటేశ్వర్లు, ప్రజా అభ్యుదయ సంస్థ నాయకులు యోహాను, జన విజ్ఞాన వేదిక బాధ్యులు రామాంజ నేయులు، సీమ విద్యార్థి సంఘం నాయకులు పాల్గొని ప్రసంగించారు.
రిపోర్ట్ : రత్నం ఏసేపు.

21/04/2024

👨‍⚕️ఆంధ్ర ప్రదేశ్ లోని మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి @183 ఎకరాల మంచి వాతావరణం లో, 1610 కోట్ల తో, 960 బెడ్లతో, షుమారు 600 మంది పైగా నిష్ణాతులైన ఉద్యోగులతో తో, 24/7 సేవలతో సెంట్రల్ గవర్నమెంట్ (జాతికి అంకితం చేసిన ) యొక్క యూజర్ చార్జీలు....
అద్భుతమైన హాస్పిటల్....
సరిహద్దు జిల్లాల (తెలంగాణ) సోదరులు కూడా ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు....
అతితక్కువ చార్జీలు....
ఓపీ కేవలం పది 10/- రూపాయలు....
ఆ పది రూపాయల ఫీజ్ తోనే జనరల్ మెడిసిన్, ఆర్థో, కళ్ళు, చెవి, ముక్కు, గొంతు (ENT) దంత వైద్యం, స్కిన్ లాంటివి చూపించుకోవచ్చు....
న్యూరో విభాగం ఇంకా ప్రారంభం కాలేదు....
అతిత్వరలో పూర్తిగా ఆపరేట్ చేస్తారు....
అలాగే క్యాంటీన్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తూ రుచికరమైన ఆహారం 75 రూపాయలకే....
బయట 5 నుంచీ 10 వేల రూపాయలు అయ్యే టెస్టులు కేవలం 500 నుంచీ 600 రూపాయలు మాత్రమే..
విజయవాడ నుంచీ హాస్పిటల్ కు బస్సులు ఉన్నాయి....
మంగళగిరి బస్ స్టాండ్ నుంచి బస్సులు ఉన్నాయి కేవలం 10 రూపాయలు..
ఆటో ఐతే 30 నుంచి 50 రూపాయలు..
అత్యంత శుభ్రత...
డాక్టర్స్ కూడా అంకితభావంతో పని చేస్తున్నారు....
ఉదయం 9 గంటలకు వెళ్తే మధ్యాహ్నానికి బయటకు రావొచ్చు..
ఈ అద్భుతమైన హాస్పిటల్ ను పూర్తిగా వినియోగించుకుందాం....
వివిధ టెస్టులు వాటికి అయ్యే చార్జీలు కింద ఉన్నాయి...

కన్సలటేషన్ ఫీజు - Rs.10

కంప్లీట్ బ్లడ్ కౌంట్ (Hb%, TLC, DLC) - Rs.135

ఫాస్టింగ్ & రాండం బ్లడ్ షుగర్ - Rs.24+24

లివర్ ఫంక్షన్ టెస్ట్ - Rs.225

కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ - Rs.225

లిపిడ్ ప్రొఫైల్ - Rs.200

థైరాయిడ్ ప్రొఫైల్ - Rs.200

ECG - Rs.50

చెస్ట్ X-Ray - Rs.60

మామ్మోగ్రఫీ -Rs.630

అల్ట్రాసోనోగ్రఫీ - Rs.323

యూరిన్ ఎనాలిసిస్ - Rs.35

HIV రాపిడ్ టెస్ట్ - Rs.150

HBs యావరేజ్ రాపిడ్ టెస్ట్ - Rs.128
మిగిలిన టెస్టుల రేట్లు బిల్ కౌంటర్ వద్ద అందుబాటులో కలవు ( కౌంటర్ No 06).

దీని గురించి తెలిసిన వారికి మెసేజ్ పెట్టండి కోంతమంది లేనివారు ఉంటారు వారికి మనం మెసేజ్ ద్వారా తెలియజేస్తే కోంత మీర మేలు జరుగుతుంది.... సర్వేజనా సుఖినోభవంతు🙏

18/04/2024

మోదీ పాలనలో అంతా సుభిక్షమేనా?
-ఎ. కృష్ణారావు
ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

భారతదేశం 2047 నాటికి ప్రపంచంలో అమెరికాను సైతం తలదన్ని అగ్రరాజ్యంగా మారడం ఖాయమని, ఈ లక్ష్యం సాధించేందుకు తాను ఒక్క క్షణం కూడా వృథా చేయదలుచుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ‘మోదీకా గ్యారంటీ’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ ఆయన చేసిన ప్రసంగం విన్నవారెవరికైనా ఆయన ఆత్మవిశ్వాసం అబ్బురం కలిగిస్తుంది. కవర్ పేజీపై ‘మోదీ కా గ్యారంటీ’ క్రింద ‘ఫిర్ ఏక్ బార్ మోదీ కా సర్కార్’ (మరోసారి మోదీ ప్రభుత్వం) అన్న వాక్యాలతో ప్రింట్ చేసిన ఈ మేనిఫెస్టోలో మోదీ అన్న పదంతో పాటు అడుగడుగునా నరేంద్రమోదీ ఛాయా చిత్రాలు మనను అలరిస్తాయి. గ్యాస్ సిలిండర్‌లను మహిళలకు ఇస్తున్నట్లు, వృద్ధులను ఆలింగనం చేసుకుంటున్నట్లు, ఆడపిల్లలను దీవిస్తున్నట్లు, యువకులతో మాట్లాడుతున్నట్లు, మెట్రో రైలులో ప్రయాణిస్తున్నట్లు, ఆవులను నిమురుతున్నట్లు, విదేశీ నేతలతో చెట్టపట్టాలేసుకున్నట్లు, పార్లమెంట్‌లో రాజదండంతో నమస్కరిస్తున్నట్లు, పట్టుపంచెలతో తిరుగాడుతున్నట్లు ఊర్థ్వ పుండ్రాలతో వెలిగిపోతున్నట్లు రకరకాల మోదీలు, రకరకాల హావభావాలతో ఎంతో హృద్యంగా మనకు దర్శనం ఇస్తారు. ఏ పేజి తిప్పినా ప్రతి వాగ్దానం ముందు మోదీ గ్యారంటీ అన్న పదాలను చేర్చారు.

ఎవరు అవునన్నా, కాదన్నా 1951లో ఏర్పడిన జనసంఘ్, 1980లో రూపాంతరం చెందిన భారతీయ జనతా పార్టీలు రెండూ ఏడు దశాబ్దాలకు పైగా కొనసాగిన తమ అస్తిత్వాన్ని ఇవాళ నరేంద్రమోదీ అనే మహా అస్తిత్వంలో విలీనం చేసినట్లు కనపడుతోంది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, ప్రేమ్‌నాథ్ డోగ్రా, డిపి ఘోష్, బలరాజ్ మధోక్, దీనదయాళ్ ఉపాధ్యాయ, నానాజీ దేశ్ ముఖ్, కుశాభావ్ థాక్రే, అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ ఆడ్వాణీ మొదలైన నాయకుల చారిత్రక పరంపర ఇవాళ ఒక మహా కేంద్ర బిందువు వద్ద ఆగిపోయినట్లు కనిపిస్తోంది. ఆ బిందువు ఎవరో కాదు నరేంద్రమోదీ. ప్రజలకు వాగ్దానాలను నెరవేరుస్తామన్న నమ్మకం కలిగించడం కోసమే ‘మోదీ కా గ్యారంటీ’ అన్న పదాలను ఉపయోగించామని ప్రధానమంత్రి చెప్పుకున్నారు. అంటే పార్టీ పేరు కన్నా తన పేరుకే ఎక్కువ విలువ ఉన్నట్లు ఆయన భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఇక్కడే మోదీ ఆత్మవిశ్వాసం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏ దేవుడూ మనకు ఫలానా మేలు చేస్తానని వాగ్దానం చేయడు. కాని దేవుడి దగ్గరకు వెళితే తమకు మంచే జరుగుతుందని ఈ దేశంలో కోట్లాది ప్రజలు విశ్వసిస్తారు మోదీ కూడా ఆ విశ్వాసాన్ని మనకు కలుగచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దేవుడు కాకపోయినా దైవాంశ సంభూతుడు అనే అభిప్రాయాన్ని కలుగ చేస్తున్నారు. మోదీని విశ్వసిస్తే భారతదేశం భూతల స్వర్గంగా మారుతుందని, ఒక అందమైన కలల సామ్రాజ్యంగా మారుతుందని, ఆకలి దప్పులు లేని సమాజం ఏర్పడుతుందని, అంతటా అభివృద్ధి, సంపద విలసిల్లుతాయని, మోదీ అనే శక్తి ముందు పాకిస్థాన్, చైనాతో పాటు పలు దేశాలు మోకరిల్లుతాయని, ఎలాంటి ఉగ్రవాదమైనా తోకముడుస్తుందని, అవినీతిని పూర్తిగా రూపుమాపేందుకు ఆయన కంకణం కట్టుకున్నారని నమ్మించేందుకు అనేక గ్యారంటీలు ఇస్తున్నారు. ఈ గ్యారంటీలను మనస్ఫూర్తిగా నమ్మి 400కు పైగా సీట్లతో తనకు పట్టాభిషేకం చేస్తారని మోదీ స్వయంగా విశ్వసిస్తున్నారు. పార్లమెంట్ భవనాన్ని, అయోధ్యలో రామమందిరాన్ని తానొక్కడే ఆవిష్కరించినట్లు ఈ దేశంలో బీజేపీని తానొక్కడే గెలిపించగలనని ఆయన భావిస్తున్నారు. పోలింగ్ బూత్‌కు వెళ్లి ఈవీఎంలో బటన్ నొక్కే ప్రతి వ్యక్తి మనసులో తానే మెదలాలని ఆయన ఆశిస్తున్నారు.

ఎలాగూ ఎన్నికల సమయంలో తప్పదు కాబట్టి మొక్కుబడిగా బీజేపీ కూడా ఎన్నికల మేనిఫెస్టోను ఆవిష్కరించింది కాని కళ్ల ముందు మోదీ లాంటి మహావ్యక్తి ఉండగా వేరే మేనిఫెస్టోను ఆవిష్కరించాల్సిన అవసరం లేదు. అందువల్లే బీజేపీ మేనిఫెస్టోలో పెద్ద ఆర్భాటాలు లేవు. వివాదాస్పద, భావోద్వేగ అంశాలు లేవు. గత మేనిఫెస్టోలో చెప్పినట్లు జాతీయ పౌరుల రిజిస్టర్‌ను ఏర్పాటు చేసి అక్రమంగా వలస వచ్చిన వారిని ఏరి పారేస్తామన్న వాగ్దానం లేదు. ధరలను తగ్గిస్తామని, రైతుల ఆదాయం ఫలానా సంవత్సరానికల్లా రెట్టింపు చేస్తామన్న అలవిమారిన హామీలూ లేవు. మధుర, కాశీ వంటి వాటి జోలికి పోలేదు. రైతులకు మద్దతు ధరపై చట్టబద్ధత కల్పిస్తామని, యువకులకు శిక్షణతో పాటు భృతి కల్పిస్తామని, ప్రతి పేద మహిళకూ రూ. లక్ష నగదు ఇస్తామని, ఖాళీలుగా ఉన్న ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తామని, కులజనగణన జరిపి అన్ని వర్గాలకు సరైన సామాజిక న్యాయం చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లాంటివేవీ బీజేపీలో మనకు కనపడవు. అసలు అలాంటి హామీలు ఇవ్వాల్సిన అవసరమే లేదని బీజేపీ భావిస్తున్నట్లు కనపడుతోంది, అంతేకాదు, ఎన్నికల సంస్కరణలు, పోలీసు సంస్కరణలు, న్యాయవ్యవస్థకు చెందిన సంస్కరణలు వంటి బృహత్తర ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదని బీజేపీ భావిస్తోంది. ఉమ్మడి పౌర స్మృతి ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో అమలు చేస్తున్నారు కనుక బీజేపీ ఈ స్మృతిని అమలు చేస్తుందన్న విషయంలో ఎవరికీ సందేహం లేదు. మొత్తంగా 78 పేజీల మేనిఫెస్టోలో చాలా వాగ్దానాలు పాతవే. ఈ మేనిఫెస్టోను చదివిన వారికి మోదీ రాజ్యంలో అంతా సుభిక్షంగా సంతోషంగా ఉన్నట్లు బీజేపీ బలవంతంగా విశ్వసిస్తున్నట్లు అర్థమవుతుంది. అందువల్ల కొత్తగా ఏమీ చేయనవసరం లేదని, ఇదే వేగంతో పనిచేసి దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చగల శక్తి మోదీకే ఉన్నట్లు బీజేపీ నేతలు విశ్వసించకతప్పడం లేదు.

తాను చేస్తున్న పనులన్నీ సరైనవేనని ఒక నాయకుడు భావిస్తున్నారంటే ఆయనకు తనపై తనకే తిరుగులేని నమ్మకం ఉన్నట్లు అర్థమవుతుంది. ఈ దేశంలో ప్రతిపక్ష నేతలందర్నీ అవినీతిపరులుగా చిత్రించి ఈడీ, సీబీఐ సంస్థలు జైళ్లలో వేయడాన్ని సరైన చర్యగానే ఆయన భావిస్తున్నారు. అవినీతిపై పోరాటం చేస్తున్నానని చెప్పుకుంటున్నారు. ఈడీ, సీబీఐలు తాను చెప్పినట్లు నడుచుకుంటున్నాయన్న ఆరోపణలను ఆయన తాజాగా ఒక సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొట్టి పారేశారు. ఎన్నికల బాండ్ల ద్వారా నిధులు సేకరించడం రాజ్యాంగ వ్యతిరేకమని, అక్రమమని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తే అది న్యాయపూరితమేనని మోదీ బావిస్తున్నారు. నల్లధనాన్ని అరికట్టేందుకే తాను ఎన్నికల బాండ్లను ప్రవేశపెట్టానని ఆయన వాదిస్తున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం సవ్యంగా ఉన్నదని, ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు అనుభవిస్తున్నారని ఆయన అన్నారు. ఇజ్రాయిల్–హమాస్, రష్యా–ఉక్రెయిన్ యుద్ధాలను కూడా ఉటంకించి దేశాన్ని సురక్షితంగా ఉంచగలిగిన దివ్యశక్తి తానేనని సంకేతాలు పంపుతున్నారు. తానెవర్నీ భయపెట్టడం లేదని కూడా చెప్పుకున్నారు. మోదీ తన విశ్వరూపాన్ని తానే పెంచుకుని ప్రతిపక్షాలను పిపీలికాలుగా భావిస్తున్నారు.

తాను జరిపే ఉధృత ప్రచార యుద్ధంలో ప్రతిపక్షాల హామీలు గాలికి కొట్టుకుపోతాయని, ద్రవ్యోల్బణం, అవినీతి, నల్లధనంపై తాను చెప్పే మాటల్నే జనం విశ్వసిస్తారని ఆయన అనుకుంటున్నారు. ఈ క్రమంలో తలెత్తే ప్రశ్నలకు జవాబివ్వడం అనవసరమని, అసలు తను ప్రశ్నలకే అతీతుడననేది ఆయన అభిప్రాయంలా కనపడుతోంది. మోదీ మహా బల సంపన్నుడనే సందేశం ప్రజలకు వెళ్లేందుకు, మానవమాత్రులైన ఏ ప్రతిపక్షనేతకూ తనను ప్రశ్నించే యోగ్యతలేదని వారు భావించేలా చేసేందుకు ఆయన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఆయనలోని గురుత్వాకర్షణ శక్తికి తిరుగులేదని బీజేపీ నేతలు సైతం భావిస్తున్నారు. అచ్చేదిన్ ఆయేగీ, సబ్ కా సాథ్ సబ్ కా వికాస్, హర్ హర్ మోదీ, విశ్వగురు, అమృతకాల్ అంటూ ఆయన ఇచ్చిన నినాదాలన్నీ వారు వల్లెవేస్తున్నారు.

విచిత్రమేమంటే ఏ పార్టీ ఎన్ని వాగ్దానాల వర్షం కురిపించినా అనంతపురం లాంటి కరువు ప్రాంతాల్లో యువకులు వలస వెళ్లకుండా ఉండలేరు. బిహార్‌లోని పల్లెల్లో వృద్ధులు ఢిల్లీలో పనిచేసే తమ పిల్లలు పంపించే కూలి డబ్బుల కోసం ఎదురు చూడకుండా ఉండలేరు. యూపీలో పిహెచ్‌డి చేసిన యువకులు సైతం రూ. 8 వేల జీతానికి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేయక తప్పడం లేదు. ఉపాధి హామీ పథకాలు నిర్వీర్యమై కూలి గిట్టుబాటు అయ్యే పరిస్థితులు ఎక్కడా లేవు. గ్రామీణ నిరుద్యోగిత శాతం రోజురోజుకూ పెరుగుతోందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ చెబుతోంది. ప్రపంచ ఆకలి సూచికలో భారతదేశ స్థానం 111 ర్యాంకు నుంచి పడిపోవడం లేదని, అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో 80 కోట్ల మంది ఉచిత ఆహార ధాన్యాలపై ఆధారపడాల్సి రావడం కూడా వాస్తవాలే. ప్రతి ఏటా లక్షలాది విద్యాధికులు, వృత్తి నిపుణులు ఇతర దేశాల్లో ఉపాధి కోసం ఆశగా వెళుతున్నారు. అగ్రరాజ్యంగా మారనున్న మన భారతదేశంలో ఉపాధి కోసం వచ్చే వారెంతమంది? ఎందుకు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఆదాయం కన్నా అప్పులు ఎక్కువై శ్రీలంక వంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి?

అందువల్ల మరో కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే లోక్‌సభ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావు. ఇది మోదీ అనే మహా వ్యక్తికీ ప్రతిపక్షాలకూ మధ్య జరుగుతున్న ఒక మహా పోరాటం. మోదీ వశీకరణ శక్తికి, ప్రచార నైపుణ్యానికి, పార్టీ నేతలు, కార్యకర్తలు గత్యంతరం లేక లోబడవచ్చేమో కాని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం మోదీ మయం కాగలుగుతుందా? ప్రజలు తమ విచక్షణా శక్తిని, వివేచనను ఉపయోగిస్తారా? వాస్తవాలకూ, ప్రచారానికీ మధ్య తేడాను గమనిస్తారా అన్న ప్రశ్నలకు ఈ ఎన్నికల ఫలితాలు సమాధానమిస్తాయి.

03/04/2024

హిందూత్వతో సామాజిక న్యాయం సాధ్యం కాదు
– బి.వి. రాఘవులు
సిపిఐఎం పొలిట్‌బ్యూరో సభ్యులు

ప్రధాని నరేంద్ర మోడీ, ‘సనాతన ధర్మానికి’ తన మద్దతును బహిరంగంగా ప్రకటించినప్పుడే అసలు గుట్టు బయట పడింది. సామాజిక న్యాయాన్ని, సమానత్వ భావనను ‘సనాతన ధర్మం’ తిరస్కరిస్తుందని ఉదయనిధి స్టాలిన్‌ గతేడాది సెప్టెంబరులో చాలా పదునైన, విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసినప్పుడు, మోడీ ఆ సనాతన ధర్మాన్ని గట్టిగా సమర్థించారు. ‘సనాతన ధర్మ’ వినాశనమే లక్ష్యంగా ఓ రహస్య ఎజెండా నడుస్తోందంటూ తమ వ్యతిరేకులను తీవ్రంగా నిందించారు. సనాతన ధర్మ’ విరోధులపై ఎదురుదాడి చేయడానికి హిందూత్వ ప్రచారదళంలో భాగస్వాములయ్యేలా మంత్రుల్ని, తన పార్టీ సభ్యుల్ని సైతం పురిగొల్పారు. ఒకవైపు సామాజిక న్యాయం కోసం, దళితుల గౌరవ ప్రతిష్టల కోసం తాను కట్టుబడి వున్నట్టు పదే పదే మోడీ చేస్తున్న ప్రకటనలు బూటకమని, అంబేద్కర్‌పై ఆయన కురిపిస్తున్న ప్రశంసలు, సంత్‌ రవిదాస్‌ విగ్రహం పట్ల ఆయన చూపిస్తున్న భక్తి యావత్తూ ఒట్టి డొల్ల మాత్రమేనని మోడీ తాజా ప్రకటన తేటతెల్లం చేస్తోంది.
”భారత దేశాన్ని వేల సంవత్సరాల పాటు ఐక్యంగా ఉంచిన ఆలోచనలు, విలువలు, సాంప్రదాయాలు అన్నీ కలిసి ‘సనాతన ధర్మం’గా ఉన్నట్టు మోడీ ప్రకటించారు. అయితే ‘ప్రాచీన’, ‘శాశ్వత’, ‘సార్వత్రిక సత్యాలు లేదా ధర్మాలు’ లాంటి అస్పష్టమైన పదాలను తప్ప, ‘సనాతన ధర్మం’ చెప్పే ఆలోచనలు, విలువలు, సాంప్రదాయాలు ఏమిటి అన్న సంగతిని మోడీగానీ, ఎదుటివారిని తిట్టిపోయడమే పనిగా పెట్టుకున్న అతగాడి అనుచర దళంగాని వివరించలేదు. ‘సనాతన ధర్మం’ యొక్క మౌలికమైన, ప్రత్యేకమైన ‘వర్ణ లేదా కుల వ్యవస్థ’ లక్షణాన్ని మరుగుపరచడం కోసమే ఏ వివరణా ఇవ్వలేదు.
అన్ని హంగులూ కలిగివున్న అతగాడి సేనానులు తమ మాటల గారడీతో సనాతన ధర్మానికి కొమ్ము కాయడానికి తయారయ్యారు. లోకజ్ఞానం, మానవ విలువలు, వ్యక్తిగత విధులు, బాధ్యతలు, ప్రవర్తనా ప్రమాణాలు, నైతిక విలువలు లాంటి మాటల ముసుగులో దాని అసలు సారాంశాన్ని కప్పిపుచ్చుతున్నారు. ‘సనాతన ధర్మం’ యొక్క నిజ స్వభావాన్ని దాచిపెట్టడానికి దాని చుట్టూ కళ్లకు పొరలు కమ్మేలా మాయావాదాన్ని అల్లుతున్నారు. దీనిని సద్గురు వాసుదేవ్‌ లాంటి ప్రముఖులిచ్చిన వివరణల్లో మనం చూడవచ్చు. ”ఈ సనాతన ధర్మం అనే ప్రక్రియ నీలో ప్రశ్నలు రేకెత్తించడం కోసమే ఉంది. ఆ ప్రశ్నల లోతుల్లోకి పోయి దీనంతటికీ మూలం ఏమిటో నువ్వే సహజంగా తెలుసుకుంటావు”. ఇలాంటి మరొక గురువు ‘సనాతన ధర్మం’ ”అందర్నీ ప్రేమించి, అందర్నీ కలుపుకొని పోతుందని” వ్యాఖ్యానించాడు. ఒకవేళ మనం ఈ వాదనలను ‘సనాతన ధర్మం’ యొక్క సారంగా అంగీకరించినా, ఇలాంటి శాశ్వతమైన సత్యాలే మనకు అన్ని మతాల్లో నూ కనిపిస్తాయి. కాని, అమానవీయ కుల, లింగ వివక్షతను ఎదుర్కొంటున్న దళితులు, ఇతర బలహీన కులాల వారి దైనందిన జీవితానుభవాల నుండి తలెత్తే ప్రశ్నలకు ఇటాంటి వాదనలు ఏ సమాధానాన్నీ ఇవ్వగల పరిస్థితి లేదు.
ఇంతకూ సనాతన ధర్యం ప్రత్యేకత ఏమిటి? ఏ మాత్రమూ సమర్థించుకోలేని స్థితిలో ఉన్న హిందూత్వ తత్వవేత్తలు తప్పించుకోవడానికి ఇచ్చే వివరణలు, వ్యక్తం చేసే ధర్మాగ్రహం మాట ఎలా వుందన్నదానితో నిమిత్తం లేకుండా వారు సనాతన ధర్మంలో ఉన్న శాశ్వతమైన సత్యాన్ని కప్పిపుచ్చలేరు. కఠినమైన, అమానవీయ, వారసత్వ, పుట్టుక ఆధారిత, నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను దాచి ఉంచలేరు. అత్యంత నిరంకుశమైన, హానికరమైన ‘వర్ణాశ్రమ ధర్మం’ లేక ‘కుల ధర్మం’ కొన్ని వేల సంవత్సరాలుగా భారతదేశమంతా విస్తరించివున్న ఏకైక ముఖ్యమైన ఆలోచన, విలువ, సాంప్రదాయం అనే వాస్తవాన్ని వారు విస్మరిస్తున్నట్టు భావించాలి. కాబట్టి మోడీ, సంఫ్‌ు పరివార్‌ ప్రత్యేకమైన బుద్ధి మాంద్యంతో బాధపడుతున్నట్లు భావించాలి. వేదాలు, ఉపనిషత్తులు, ధర్మ సూత్రాలు, గఅహ్య సూత్రాలు (గృహస్థులు ఆచరించాల్సిన ధర్మాలు, సంస్కారాలు), పురాణాలు, భగవద్గీత అన్నీ వర్ణ లేదా కుల వ్యవస్థను సమర్థిస్తాయి. ఈ వాస్తవాన్ని వారు నిరాకరించగలరా? వర్ణ ధర్మం నుండి పక్కకు మళ్ళుతున్నందుకు కఠినమైన శిక్షను విధించడమే కాక, వర్ణ ధర్మ పరిరక్షణ పాలకుల ప్రాథమికమైన బాధ్యత అని చెప్పే మనుస్మృతిని మనం పట్టించుకోకూడదని వారు కోరుకుంటున్నారా?
ఒకవేళ ‘కుల వ్యవస్థ వేరు, సనాతన ధర్మం వేరు’ అని కుల వ్యవస్థను బలపరిచే వాదనలతో విడగొట్టు కోవాలనుకుంటే, మోడీ ఆ విషయాన్ని ముందు స్పష్టం చేయాలి. ఆ తర్వాతనే తన వ్యతిరేకుల మీద విమర్శలకు పూనుకోవాలి.
అది అతనికి కచ్చితంగా తెలియకుంటే శ్రేణీగత, వివక్షాపూరిత ‘వర్ణ లేదా కుల ధర్మం’ వారి పవిత్రమైన గ్రంథాల్లో భాగంగా ఉన్నాయా లేవా అనే విషయంపై వివరణ ఇమ్మనమని వారు సాధువుల్ని, మత ప్రచారకులని, శంకరాచార్యుల్ని వేడుకోవచ్చు. అయితే, మోడీ ఈ పని చేస్తారని ఎలా ఆశించగలం? అలా అది అతని కపటత్వం బైట పడుతుంది కదా?
ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యల నుండి తలెత్తిన వివాదం హిందూత్వ దళం అసలు రంగును ప్రజల ముందు బయటపెట్టింది. మోడీ, ఆయన అనుచర గణం తాము 19వ శతాబ్దానికి చెందిన అభివృద్ధి నిరోధకులైన సనాతనవాదులకు నిజమైన వారసులుగా మన ముందు నిలబడ్డారు. ఆ కాలంలో బ్రహ్మ సమాజం, ఆర్య సమాజ్‌, ప్రార్థనా సమాజ్‌, రామకృష్ణ మిషన్‌ వంటి సంస్థలు హిందూ మతానికి అనేక సంస్కరణలు ప్రతిపాదించాయి. ఆ సంస్కరణలను వ్యతిరేకిస్తూ పలు ఛాందసవాద, సాంప్రదాయ హిందూ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఆ సంస్థల నాయకులే, ‘సనాతన ధర్మానికి’ ప్రాచుర్యం కల్పించారు. ‘హిందూ’ అనే పదం పర్షియన్‌ మూలాలు కలిగి ఉన్నందువల్ల ఈ ‘సనాతన వాద’ సేవా తత్పరులు ‘హిందూ’ పదాన్ని ఇష్టపడక, దానికి బదులుగా ‘సనాతన ధర్మం’ అనే పదానికి ప్రాధాన్యత ఇవ్వడం ఆసక్తికరమైన విషయం.
దళిత గౌరవానికి ప్రతీకగా ఉన్న అంబేద్కర్‌ యొక్క సమానత్వ, ఆత్మగౌరవ దార్శనికతను నెరవేర్చడానికి తాను కృషి చేస్తున్నట్టు మోడీ చెప్పుకునేదంతా ఒట్టి నటనేనని గత దశాబ్దపు మోడీ పాలనా కాలపు అనుభవం స్పష్టం చేస్తోంది. నిజానికి మన దేశంలో పీడితులు, దోపిడీకి గురైన ప్రజలు పోరాటాల ద్వారా సాధించుకున్న కొన్ని అధికారిక హక్కులు, కొద్దిపాటి గౌరవాన్ని అతని పాలన ఒక క్రమపద్ధతిలో ధ్వంసం చేసింది. పెరిగిపోతున్న నేరాల రేటు, కుంచించుకుపోతున్న ఉద్యోగావకాశాలు, పెరిగిపోతున్న ఆర్థిక వివక్షత, దిగజారుతున్న దళితుల, గిరిజనుల జీవన స్థితిగతులు చూస్తే మనకు ఈ సంగతి స్పష్టంగా కనిపిస్తుంది.
మోడీ హిందూత్వ, కార్పోరేట్‌ పాలనలో దళితులపై, గిరిజనులపై సాగుతున్న అత్యాచారాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇది, సమాజం మొత్తంగా మనువాద భావజాల ప్రభావంలో చిక్కుకుపోయిన వైనాన్ని సూచిస్తుంది. 2018 నుండి గడిచిన నాలుగేళ్ల కాలంలో దళితులపై 1.9 లక్షలకు పైగా అత్యాచారాలు జరిగినట్టు కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌ ఈ ఆగడాలకు, దాడులకు (మొత్తం 49,613 కేసులతో) ప్రధాన కేంద్రంగా నిలిచింది. 2022వ సంవత్సరాన్ని 2021తో పోల్చితే షెడ్యూల్డ్‌ కులాల వారిపై 13 శాతం అత్యాచార కేసులు పెరగ్గా, షెడ్యూల్డ్‌ తెగలపై 14.3 శాతం పెరిగాయి. ఎస్సీలపై ఆత్యాచారాల కేసుల్లో ఉత్తరప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. అంటే మొత్తం కేసుల్లో 26 శాతం. రాజస్థాన్‌ 15 శాతం, మధ్యప్రదేశ్‌ 14 శాతంగా ఉంది. ఎస్టీలపై అత్యాచారాల కేసుల విషయం పరిశీలించినట్లయితే మొత్తం కేసుల్లో 30 శాతంతో మధ్యప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉండగా, 24 శాతంతో రాజస్థాన్‌, 7.6 శాతంతో ఒడిశా ఉన్నాయి.
అత్యాచారాల సంఖ్య పెరగడంతోపాటు, ఆ ఘటనలలోని క్రూరత్వం దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఏడుగురు దళిత యువకులను గుజరాత్‌ లోని ఉనాలో బహిరంగంగా కొట్టడం, ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఒక దళిత మహిళపై అత్యంత క్రూరంగా జరిపిన సామూహిక అత్యాచారం ఆమె మరణానికి దారితీయడం, మధ్యప్రదేశ్‌లో సోధీ ఘటనలో ఓ బిజెపి నాయకుడు ఓ గిరిజనుడిపై మూత్ర విసర్జన చేయడం లాంటి సంఘటనలు దేశం అంతరాత్మను కుదిపివేశాయి. సంఫ్‌ు పరివార్‌, హిందూత్వ శక్తుల అండతో బిజెపి ప్రభుత్వాలు సృష్టించిన మనువాద వాతావరణంలో దళితులకు, గిరిజనులకు వ్యతిరేకంగా ఇలాంటి హేయమైన నేరాలు పాల్పడడానికి కులతత్వ శక్తులెలా ప్రోత్సాహం ఇస్తున్నాయో ఈ భయంకరమైన చర్యలు తెలియజేస్తున్నాయి.
ఇవే శక్తులు, సమాజంలోని సామాజిక పీడిత వర్గాలకు సహాయ పడేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకుంటూ తీసుకునే చర్యలను సైతం వ్యతిరేకించే శత్రుపూరిత వాతావరణాన్ని ఒక క్రమపద్ధతిలో పెంచి పోషిస్తున్నాయి. బిజెపి పాలనలో బలహీన వర్గాలకు లభించే కొద్దిపాటి ప్రయోజనాలను కాలరాసేందుకు ప్రభుత్వమే ఈ శక్తులతో లాలూచీ పడుతున్నది.
బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పనితీరు చాలా అన్యాయంగా ఉంది. 2022 మార్చి 24న పార్లమెంట్‌లో సమర్పించిన సమాచారం ప్రకారం తొమ్మిది మంత్రిత్వ శాఖలుారైల్వేలు, ఆర్థిక, ఆటమిక్‌ ఎనర్జీ, రక్షణ, గృహ నిర్మాణం, హోం శాఖలతోాసహా కేంద్ర ప్రభుత్వ శాఖలన్నింటిలో మొత్తం 82,022 ఖాళీలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వ్‌ చేయబడిన పోస్టులున్నాయి. కానీ వాటిలో కేవలం 42 శాతం పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. యూనివర్శిటీలు, ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది. ఎస్సీలకు రిజర్వ్‌ చేయబడిన 42 శాతం ఖాళీ పోస్టులు, ఎస్టీలకు రిజర్వ్‌ చేయబడిన 39 శాతం, ఓబీసీ లకు రిజర్వ్‌ చేయబడిన 54 శాతం ఖాళీ పోస్టుల్ని భర్తీ చేయడంలో 45 సెంట్రల్‌ యూనివర్సిటీలు విఫలమయ్యాయి. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో ఎస్సీలకు రిజర్వ్‌ చేయబడిన 80 శాతం ఖాళీ పోస్టులను ఇంత వరకు భర్తీ చేయకపోవడం ఆ సంస్థలో సామాజిక న్యాయం అత్యంత అధ్వాన్నమైన స్థితిలో వున్నదని తెలియజేస్తోంది.
మోడీ నాయకత్వంలో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ సేవలు, ఉన్నత విద్య ప్రైవేటీకరించబడుతున్నాయి. దానికి తోడు ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్ల విధానమే లేదు. ఈ విధంగా ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో రాజ్యాంగ ఆదేశాలను పాటించకపోవడమేగాక ఆ ఆదేశాలనే నీరుగారుస్తోంది. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి కేటాయింపుల గణనీయమైన తగ్గింపు, ఖర్చులలో కోతలు విధించడం ద్వారా వివక్షత కొనసాగింపులో మోడీ ప్రభుత్వమే ప్రత్యక్షంగా భాగస్వామి అయ్యింది. 2014-20 మధ్య జనాభా దామాషా ఆధారంగా జరిగిన మొత్తం కేటాయింపుల్లో కేవలం 20.8 శాతం మాత్రమే వారి సంక్షేమానికి ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ పత్రాలు తెలియజేస్తున్నాయి. అంటే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు న్యాయంగా చెల్లించాల్సిన 7.51 లక్షల కోట్ల రూపాయలను నిలిపివేశారన్నమాట. దీనితో పాటు 2017-18లో ఎస్సీ సబ్‌ప్లాన్‌, ఎస్టీ సబ్‌ప్లాన్లను రద్దు చేయడం ద్వారా మోడీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఉద్దేశించబడిన యంత్రాంగాన్ని ధ్వంసం చేసింది.
ఈ మార్పుల ఫలితంగా మోడీ రెండోసారి ప్రధాని పదవి చేపట్టిన 2019-2024 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వ, కేంద్ర రంగ ప్రాయోజిత పథకాల కేటాయింపుల మొత్తం నిధుల్లో ఎస్సీలకు కేవలం 10.6 శాతం మాత్రమే కేటాయించారు. కేటాయింపుల్లో కూడా కేవలం 3.3 శాతం మాత్రమే ఎస్సీల పథకాలకు మళ్ళించారు. మిగిలినవి సాధారణ పథకాలకు కేటాయించారు. ఎస్టీలకు ఉద్దేశించబడిన కేటాయింపుల్లో కూడా ఇదే వైఖరిని ప్రదర్శించారు. ఎస్టీలకు కేటాయించిన మొత్తం నిధుల్లో కేవలం 2.5 శాతం మాత్రమే లక్ష్య పథకాలకు కేటాయించారు. కేటాయించిన నిధుల్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగించలేదు.
స్వాతంత్య్రం సిద్ధించిన ఏడున్నర దశాబ్దాల తర్వాత కూడా సాధారణ దళితుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. 58 శాతం దళితులకు భూమి లేదు. మోడీ పరిపాలనలో ఆదివాసీలను, దళితులను పెద్ద సంఖ్యలో అభివృద్ధి పేరుతో వారి భూముల నుండి బలవంతంగా వెళ్ళగొడుతున్నారు. స్వంత భూములున్న 50 శాతం దళితులకు సాగునీటి సౌకర్యాలు లేవు. సాధారణ జనాభాలో 33.3 శాతం జనాభాతో పోల్చినప్పుడు 65.8 శాతం దళితులు, 81.4 శాతం గిరిజనులు బహు మితీయ (మల్టీ డైమెన్షనల్‌) పేదరికంలో జీవిస్తున్నారు, ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. ఎస్సీలలో అక్షరాస్యతా రేటు కేవలం 66 శాతంగానే ఉండగా, ఎస్టీల్లో అది 59 శాతం కన్నా తక్కువగా ఉంది, అంటే జాతీయ సగటు రేటు 73 శాతం కంటే కూడా తక్కువగా ఉంది. అంతే కాకుండా 2022 నాటికి ఎస్సీలలో నిరుద్యోగ రేటు 8.4 శాతంగా చాలా ఎక్కువగా ఉంది. ఎస్సీలలో అసంఘటిత రంగ కార్మికులు చాలా ఎక్కువగా 84 శాతంగా ఉన్నారు. ఈ గణాంకాలు మోడీ నాయకత్వంలోని మతతత్వ, కార్పోరేట్‌ ప్రభుత్వం యొక్క దళిత వ్యతిరేక, పేద ప్రజల వ్యతిరేక స్వభావాన్ని తెలియజేస్తుంది. మోడీ హిందూత్వ లేక ‘సనాతన ధర్మ’ భావజాలంలో సామాజిక న్యాయాన్ని వెతకడం అంటే ఎండమావిలో నీటిని వెతకడం లాంటిదే.

Address

2-124B, Behind Narayana School, Satrampadu
Eluru
534007

Telephone

+919492240592

Website

Alerts

Be the first to know and let us send you an email when Letting Oppressed Voice Emerge posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Letting Oppressed Voice Emerge:

Shortcuts

Share