29/12/2024
*పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం ఒక చారిత్రక ఘట్టం*
ఈరోజు జరిగిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎక్కువ మొత్తంలో వచ్చి విజయవంతం చేసినందుకు ప్రతి పూర్వ విద్యార్థికి మరియు ఆచాజీ మాతాజీలకు పేరుపేరునా మా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము🙏
ఆర్మూరు,డిసెంబర్ 29,
శ్రీ సరస్వతి శిశుమందిర్ ఆర్మూర్ పాఠశాల 1981 వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. హుస్నాబాద్ లోని అద్దె భవనంలో మొదటగా ప్రారంభించి గోల్పంగ్లాలోని పాఠశాల భవనంలోకి మార్చి మొదటగా శిశు 1వ తరగతులను నిర్వహించడం జరిగింది. తదుపరి 1986-87వ సంవత్సరంలో టీచర్స్ కాలనీలో గల పాఠశాలను ప్రారంభించి 10వ తరగతి వరకు క్లాసులు నడపడం జరిగింది.
ఈ 43 సంవత్సరాలుగా పాఠశాలలో వివిధ తరగతిలో చదువుకొని అభివృద్ధి పథంలోకి వెళ్లి మంచి హోదాలో వివిధ రంగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు పాఠశాల తరఫున తెలిపారు.
సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ గారు మాట్లాడుతూ పాఠశాల కార్య విభాగాల గురించి చెపుతూ ప్రస్తుత సమాజం లోని విద్యా వ్యవస్థ గురించి వివరంగా తెలిపారు .కుటుంబ ప్రబోధన్ గురుంచి తెలిపారు .
సరస్వతీ శిశు మందిరం అంటే నిజంగా సాక్షాత్తు ఆ సరస్వతి అమ్మవారు కొలువై ఉన్న ప్రదేశం ఈ ప్రాంగణం .సరస్వతి శిశు మందిరాలు అంటే విద్యతో పాటు సకల కలలకు పెట్టింది పేరు . భావి భారత పౌరులకు చదువుల తల్లి గుడిలోనే విద్య తో పాటు మన దేశ సంస్కృతి ,సాంప్రదాయాలను బోధించే ఏకైక విద్యా మందిరాలు శిశు మందిరాలు. విద్యార్థులను కేవలం చదువుకు మాత్రమే పరిమితం చేయకుండా సమాజంలో మనుగడ సాధించేందుకు అవసరమైన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని బోధిస్తూ విలువలతో కూడిన విద్యను అందిస్తూ జాతి వికాసంలో జాతీయ పునర్నిర్మాణం వైపు అడుగులు వేస్తున్న ఏకైక విద్యాసంస్థలు శిశు మందిరాలు ఏర్పడి అర్థ శతాబ్దము అవుతున్న కూడా విద్యలో కానీ విలువలలో కానీ ఎటువంటి మార్పు లేదు .మొక్కగా ప్రారంభమై నేడు మహావృక్షంగాఎదిగి ఎందరో విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలబెట్టి వారిని జాతీయ పున నిర్మాణంలో భాగస్వామ్యాన్ని చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం. విద్యార్థి దశలో ఉండే విద్యార్థులకు విద్యతో పాటు శారీరక ,మానసిక ,ఉల్లాసం కోసం ఆటలు,వ్యాయామం యోగా సంగీతం కళాత్మకం నైతిక ఆధ్యాత్మిక సంస్కృతిక అందించి జాతిని గర్వకారణం క్రమశిక్షణ కుమార్ పేరు శిశు మందిరం నోవిద్యార్థులు నేడు సమాజంలో ఉన్నత స్థానాల్లో ఐఏఎస్ ,ఐపీఎస్ బిజినెస్ మాన్ గా రాజకీయ నాయకులుగా ,ఎందరో ఉన్నత స్థానంలో నిలబెట్టి ఎక్కడ ఉన్న ఏ స్థానంలో ఉన్న ఈ ప్రదేశం కోసం ధర్మం కోసం జాతీయ పునర్ నిర్మాణం కోసం వారిని కంకణ బద్దులుగా చేసిన ఘనత శిశు మందిరాలదే . ఇక్కడ చదువుకోవడం మన అందరి అదృష్టం అని తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా నిజామాబాద్ అర్బన్ ఎం ఎల్ ఏ దన్ పాల్ సూర్య నారాయణ , క్షేత్ర సంఘటన కార్య దర్శి సుధాకర్ గారూ,ప్రాంత సంఘటన కార్య దర్శి పతాకమూరి శ్రీనివాస్ గారు ,భూపతి రెడ్డి గారు ,హరిష్మరన్ గారు,బొడ్డు శ్రీనివాస్ గారు ,రవి నాథ్ గారు ,పక్కి శ్రీనివాస్ గారు ,పెద్దోళ్ల గంగా రెడ్డి గారు ,కoచేట్టి గంగాధర్ గారు ,పాఠశాల ప్రిన్సిపల్ వినోద్ కుమార్ గారు, ప్రభాంధ కారిణి అధ్యక్షులు వంశిక్రిష్ణ గారు,కర్తన్ శ్రీనివాస్ గారు,పూర్వ ప్రదానా చార్యలు ,మాతాజీ లు ,ఇందురు విభాగ్ ప్రదానాచార్యలు ,మాతాజీ లు తదితరులు పాల్గొన్నారు.