17/12/2025
NRI కళాశాల ఆద్వర్యంలో 3k వాకతాన్ - ఛైర్మన్ వెన్నపూస విశ్వనాథ్ రెడ్డి
అనంతపురం పట్టణంలో శారదానగర్ గల NRI ఇంటర్నేషనల్ జూనియర్ కళాశాల వారు అనంతపురం పట్టణంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిస్కవర్ అనిల్ గారు, డ్రగ్స్ ఈగల్ అనంతపురం జిల్లా ఇంచార్జ్ SI హనుమంతు గారు, NRI విద్యాసంస్థల ఛైర్మన్ వెన్నపూస విశ్వనాథ్ రెడ్డి గారు,వైస్ ఛైర్మన్ దివ్యా రెడ్డి గారు, ఎం.డి వెన్నపూస చంటిరెడ్డి గారు,డైరెక్టర్ అనూషారెడ్డి గారు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఛైర్మన్ వెన్నపూస విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ 3k వాకతాన్ ద్వారా జిల్లా ప్రజలను, యువతను మరియు విద్యార్థులను ఉత్తేజపరచడమే కాకుండా వాళ్ళలో చైతన్యం తీసుకురావడానికి కృషి చేయడమే మా విద్యాసంస్థల ధ్యేయం అని అన్నారు. అంతే కాకుండా ఏ విద్యాసంస్థ కూడా తీసుకెళ్లని విధంగా ఈ రోజు NRI విద్యాసంస్థల తరపున ఇలాంటి కార్యక్రమం చేయడం గర్వకారణంగా భావిస్తున్నాము అని తెలిపారు.డిస్కవర్ అనిల్ గారూ మాట్లాడుతూ ప్రస్థుత జిల్లా ఎస్పీ జగదీష్ గారు డ్రగ్స్ పైన యుద్ధం ప్రకటించి ఎన్నో అవగాహన సదస్సులు మరియు సమావేశాలు నిర్వహించి మన జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా నెలకొల్పడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని అదే కాకుండా ప్రతి విద్యాసంస్థ NRI విద్యాసంస్థల మాదిరిగా ఆలోచించి ఇటువంటి బృహత్తర కార్యక్రమాలలో పాలుపంచుకోవాలని సూచించారు. పోలీస్ ఈగల్ సెల్ జిల్లా ఇంచార్జ్ హనుమంతు గారు మాట్లాడుతూ గౌరవ IG గారి ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఎన్నెన్నో అవగాహనల ద్వారా డ్రగ్స్ రహిత అనంతపురం ను సాధించుకుందామని, అదే కాకుండా డ్రగ్స్ ద్వారా ఎన్నెన్నో కుటుంబాలు ఈ రోజు ఛిద్రమైనాయని అటువంటి పరిస్థితి మన జిల్లాల్లో ఇంకెవరికి రాకూడదని పునరుద్ధరించారు.ఈ కార్యక్రమంలో అడ్మిన్ ప్రిన్సిపాళ్లు మరియు వైస్ ప్రిన్సిపాళ్లు అంబికా రెడ్డి,హర్షవర్ధిని,అపర్ణ రెడ్డి,విద్యారెడ్డి,కవితా,ప్రశాంత్ నాయక్ దివ్యవాణి రెడ్డి,మల్లిక,రజిత,రామంజినా రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు