ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఆదివాసులు సమస్యలు మరియు ఐకేపీ anm ఆశ వర్కర్స్ గురుకుల పాఠశాల పార్ట్ టైం ఎంప్లాయిస్ రెగ్యులర్ చేయాలనీ గౌరవ సీఎం kcr గారికి తెలియచేయడం జరిగింది
Aathram Sakku mla asifabad
mla asifabad
11/02/2022
06/02/2022
Today visited kbsc study cirkil at hydrabad chikadpally
05/02/2022
ఆసిఫాబాద్ నియోజక వర్గ ప్రజలకు మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు వసంత పంచమి శుభాకాంక్షలు
03/06/2020
*జీఓ నం..3ని సంరక్షించాలని, సుప్రీం కోర్టు లో రివ్యూ పిటిషన్ వెయ్యలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల.చంద్రశేఖర్ రావు గారికి వినతి*
హైదరాబాద్: ఈరోజు అనగా తేదీ.02:06:2020.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సాన్ని పురస్కరించుకొని...గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి శుభసందర్భంలో...
జీఓ నంబర్ 3ను సంరక్షించాలని, సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వెయ్యలని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ కల్వకుంట్ల.చంద్రశేఖర్ రావు గారికి వినతిపత్రం సమర్పిస్తున్న *కుంరంభీము జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గ బడుగు బలహీన అన్నివర్గాల ఆశాజ్యోతి శాసనసభ్యులు గౌరవ శ్రీ ఆత్రం.సక్కు గారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది*.రాష్ర్ట ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి ఆదివాసులను ఆదుకోవాలని కోరారు.అలాగే *ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలు సాగు చేస్తున్న అటవీ భూములపై, ఆదివాసీల అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, అంశాలను సుదీర్ఘంగా ముఖ్యమంత్రి గారితో చర్శించడం జరిగింది* ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ గారు, రాష్ట్ర DGP శ్రీ మహేందర్ రెడ్డి గారు , ప్రణాళిక సంఘము వైస్ చైర్మన్ శ్రీ వినోదకుమార్ గారు, ప్రభుత్వ సలహాదారులు శ్రీ రాజీవ్ శర్మ గారు, రైతు బంధు రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు.
08/04/2020
*ఆపదలో సీఎం రిలీఫ్ ఫండ్ అండ ఎమ్మెల్యే గారు*
ఆసిఫాబాద్:అనారోగ్యం,ప్రమాదాల బారిన పడి దవాఖానలో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిది అండగా ఉంటుందని *ఆసిఫాబాద్ శాసనసభ్యులు గౌరవ శ్రీ ఆత్రం సక్కు గారు* అన్నారు. కుంరం భీం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆసిఫాబాద్ మండలం సాలెగూడా గ్రామానికి చెందిన గుర్నులే పుంజు కి రూ60వేలు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరయ్యాయి.వారికి *ఎమ్మెల్యే గారు* చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా *ఎమ్మెల్యే గారు* మాట్లాడుతూ..ఎవరైనా ప్రాణాంతక వ్యాధి బారిన పడిన,ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోవాలని,పేదల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక పథకాలు ప్రవేశపెడుతునట్లు తెలిపారు.సీఎం రిలీఫ్ ఫండ్ నమ్మకంతో పేదలు కార్పొరేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ అధ్యక్షులు &ఎంపీటీసీ గదేవేని మల్లేష్,తిర్యాని పార్టీ అధ్యక్షుడు హనుమండ్ల జగదీష్,ఆదివాసీ నాయకులు సీడం అర్జు,తుమ్రo సందీప్,ఆత్రం వినోద్, తదితరులు ఉన్నారు.
31/03/2020
*వలస కూలీలకు మనమందరం బాసటగా నిలువాలి ఎమ్మెల్యే గారు*
ఆసిఫాబాద్:పేదలకు ఆకలి తీర్చేందుకు గౌరవ శ్రీ సీఎం కేసీఆర్ గారు చేసిన కార్యక్రమం అభినందనీయమని *ఆసిఫాబాద్ శాసనసభ్యులు గౌరవ శ్రీ ఆత్రం సక్కు గారు* అన్నారు. కుంరం భీం జిల్లా కేంద్రంలో మంగళవారం రోజు హీన మరియు బాలాజీ పత్తి మిల్లు లో బీహార్,చత్తీస్ ఘడ్ ఒరిస్సా,మధ్యప్రదేశ్ రాష్ట్రల నుంచి వచ్చి జీవిస్తున్న వలస కూలీలకు 395మందికి ప్రభుత్వం తరుపున ఒకరికి 500/-రూపాయలు, 12 కిలోల బియ్యం *ఎమ్మెల్యే శ్రీ ఆత్రం సక్కు గారి* చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆకలికి ఎవరు కూడా ఇబ్బంది పడవద్దని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని లాక్ డాన్ సమయంలో ప్రజలు ఇండ్ల నుండి బయటికి రాకుండా కరోనా ను తరిమి కొట్టాలని సూచించారు.పొట్టకూటి కోసం రాష్ట్రాలు దాటి తెలంగాణ అభివృద్ధికి భాగస్వాములై తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన కూలీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అదుకుంటదని అన్నారు.కరోనా వైరస్ తో భయపడాల్సిన పనిలేదని,ఎవ్వరూ ఇంట్లో నుంచి బయటకి రాకుండా జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో RDO దత్తు,ఎంపీపీ అరిగెల మల్లికార్జున్,సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ హైమద్,ఎంపీటీసీ మల్లేష్,సలాం,ఆసిఫాబాద్ MRO, మిల్లు యజమానులు, టిఆర్ఎస్ నాయకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.
30/03/2020
*లాక్ డౌన్ పిలుపును ప్రతి ఒక్కరూ పాటించి కరోనాను తరిమేధం ఎమ్మెల్యే గారు*.
ఆసిఫాబాద్:కరోనా వైరస్ ను అరికట్టేందుకు ఇంటి పట్టునే ఉంటూ మన ప్రాణాన్ని మనం కపుడుకుందమని ఆసిఫాబాద్ శాసనసభ్యులు గౌరవ శ్రీ ఆత్రం సక్కు గారు* అన్నారు. కుంరం భీం జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ లో కూరగాయల వ్యాపారులకు మరియు ప్రజలకు మాస్క్ లను మరియు పోలీస్ అధికారులు, సిబ్బందికి మంచి నీళ్ల బాటిల్స్ ఎమ్మెల్యే ఆత్రం.సక్కు గారు అందజేశారు.వారు ప్రజలకు ఉద్దేశించి మాట్లాడుతూ..ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఏదైనా ఇబ్బందులు తలెత్తితే హెల్ప్ లైన్ నెంబర్లను కూడా అందుబాటులో ఉంచిందని తెలిపారు. లాక్ డౌన్ కు ప్రజలు ఎంతో సహకారం అందిస్తున్నారని,మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలంటే మున్ముందు కూడా మరింత జాగ్రత్తతో ఇంటి పట్టునే ఉండాలని సూచించారు. కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలు ఇదే స్ఫూర్తి కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎక్కడైనా నిత్యావసరాలతోపాటు కూరగాయలు అధిక ధరలకు విక్రయిస్తే అలంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పోలీస్ లకు అధికారులు,సిబ్బందికి ప్రజలు సహకరించలాని కోరారు.
13/03/2020
*హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిని కలిసి వినతిపత్రం సమర్పించిన ఆసిఫాబాద్ శాసనసభ్యులు గౌరవ శ్రీ ఆత్రం సక్కు గారు,ఈరోజు హైదరాబాద్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి గౌరవ శ్రీమతి దివ్య దేవరాజన్ గారికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ మహిళలు రక్త హీనతతో బాధ పడుతున్నరు,అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ లలో మహిళకు పౌష్టికాహారం అందించాలని, కుంరం భీం జిల్లా అంగన్వాడీ వర్కర్ల యెక్క సమస్యలను పరిష్కారం చేయాలని వినతిపత్రం సమర్పించారు*.
Click here to claim your Sponsored Listing.
Location
Contact the school
Telephone
Website
Address
Adilabad
Adilabad
504001