Venkat Gaddam

Venkat Gaddam

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Venkat Gaddam, Education, Memphis, TN.

09/28/2023

మహా కవి,నవయుగ కవితా చక్రవర్తి గుర్రం జాషువా 128వ జయంతి సందర్భంగా ఏపీపీఎస్సీ ఉద్యోగ సమాచారం పక్ష పత్రికలో రెండు దశాబ్దాల నాటి నా వ్యాసం.
---------
ముప్పదిమూడుకోట్ల దేవతలెగబడ్డ దేశమున క్షుదార్తుల ....
రాజు మరణించె ఒకతార నేలరాలె - సుకవి మరణించె ఒకతార నింగికెగసె
రాజు జీవించు శిలా విగ్రహములందు - కవియు జీవించు ప్రజల గుండెలయందు --------------------------------

నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా ఆత్మకథాత్మక పద్యకావ్యo
"గబ్బిలము"
"కనుపడలేదు దైవతము గాని పదార్థము భారతంబునన్ గనుపడలేదు వర్ణనము కన్న మహాకళ భారతంబునన్ కనుపడలేదు సత్కులము కన్న పిశాచము భారతంబునన్ గనుపడలేదు పంచముని కన్నను నీచపు జంతువేదియున్(గబ్బిలము)
వేద చతుష్టయంబు ప్రభవించిన వ్యాసుని దివ్యవాణిలో మాదిగలుందురా! రుధిర మాంసములుం గల యంటరానివా రాదిమవాసులక్కట కటా! తలపోసిన నల్లగుండెలో సూదులు మోసులెత్తును గృశోదరీ! యెట్లు సహించుకొందునో ముసలివాడైన బ్రహ్మకు బుట్టినారు. నలువురు కుమారులనుట విన్నాముగాని, పసరముకన్న హీనుడభాగ్యుడైన యైదవ కులస్థుడెవ్వరమ్మాసవిత్రి!
(ఖండకావ్యం-2)
అస్పృశ్యతా మారణహోమానికి స్పందించిన జాషువా గుండె రాసిడిలోంచీ, హృదయాంతరాళ కల్లోలం లోంచీ పోటెత్తిన చైతన్య తరంగాలు జాషువా పద్యాలు, అసమ సమాజపు వివక్ష గుండెల్లో బాకులుదించి, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయగా ప్రభవించిన అనంత విషాదంలోంచీ తలెత్తిన చైతన్యం నాటి సమాజాన్ని ప్రశ్నల వెల్లువతో ముంచెత్తి దళితులు వేదనకు పద్యరూపమిచ్చిన మహానుభావుడు

వలసపాలనలో ఏకీకృతమైన భరతఖండంలో జాతీయభావం జనించి వేళ్ళూనుకుంటున్న వేళ, కులమత విద్వేషాలు, అంటరానితనం, తీవ్రవిద్వేషాలు, మూఢనమ్మకాలు, బాల్యవివాహాలు, వంటి సామాజిక రుగ్మతలతో సమాజం అతలాకుతలమౌతున్న మోఢ్యదశలో, ఆర్యసమాజం, బ్రహ్మ సమాజం, ప్రార్థనాసమాజం, వంటి సంస్థలు హిందూమత సంస్క రణకు నడుంకట్టిన వేళ, మనిషిని వీథి కుక్క కన్నా హీనంగా చూసే రోజులు నడుస్తున్నవేళ, సాంఘిక వివక్షపై జ్యోతిబాపూలే, నారాయణగురు. వంటి మహనీయుల కృషితో భారతప్రజ నూతన ఆలోచనలతో, అభ్యుదయ పథగామియైన వేళ, రైళ్ళు, తంతితపాలా వ్యవస్థలు దూరాల్ని తగ్గించే ప్రక్రియ ప్రారంభమైన వేళ తన కవితా శంఖతో జాతిని చైతన్యం చేయడానికై అనంతుడై విజృంభించాడు.

తెలుగునాట గుంటూరుసీమలో వినుకొండ లో ఆయన పుట్టేరు. గొల్ల సుద్దులంటే ఎంతో ప్రాణమిచ్చే వీరయ్య అనే యాదవ కులస్తుడు. ఆయన చదువు కోసం ABM మిషసరీ స్కూలులో చేరారు. అక్కడ ఆయనకు మంచాల గ్రామానికి చెందిన 'లింగమాంబ' తో ప్రేమ కలిగింది. ఆమె మాదిగకులానికి చెందినందున ఇరువైపులా పెద్దలు అంగీకరించలేదు. మిషను యాజమాన్యాన్ని ఒప్పించడానికి వీరయ్య క్రైస్తవమతం పుచ్చుకుని ఆమెను వివాహం చేసుకున్నారు. ఆ దంపతులు ఎదుర్కొన్న తీవ్ర నిరాదరణ వర్ణనాతీతం. ఆ ఆదర్శాల సాఫల్యాల సాహసదంపతుల కడుపుపంట 1895అక్టోబరు 28న వినుకొండలో జాషువా జన్మించారు.
ఆయన బాల్యం దుర్భర దారిద్య్రంలో కులవివక్ష, తో గడించింది. చిన్నారిబుడతడైన జాషువాకు పండుగకుతొడగడానికి కొత్తబట్టలు లేవు. తినుబండారమే పెట్టాలంటే చేతిలో చిల్లికానీ కూడాలేని ఆపేద తల్లి లింగమాంబ అప్పైనా దొరుకుతుందేమో నని బయలుదేరింది. కొడుకు తల్లితో నడిచాడు. బాలజాషువఎవరి చేతిలోంచో జారిన తినుబండారాన్ని చూసి, అమాయకంగా చేతిలోకి తీసుకుంటే కొడుకుని వారించలేక కడుపులో సుళ్ళుతిరుగుతున్న బాద ఏడుపు రూపంలో ఉబుకుతుంటే రోదనను గొంతులోనే దిగమింగిందా మాతృమూర్తి.

పంచమజాతి పిల్లలకోసం ప్రత్యేకించిన బెంచీలో, జాతిపై రోతగలిగిన పంతుళ్ళ వద్ద ఎనిమిదోతరగతి దాకా చదివి, బాపట్లలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేసుకుని, వినుకొండ్ చాట్రపాడు గ్రామంలో 1909 నుంచీ 1911 వరకు ఉపాధ్యాయ వృత్తిచేసి, ‘మతబోధకుల అనుగ్రహం తప్పడంవల్ల' ఉద్యోగం మానుకో వలసి వచ్చింది. సహధర్మచారిణి 'మేరి'తో పొట్టకూటికై అనేక తిప్పలు పడ్డాడు. కొన్నాళ్ళు 'టూరింగ్ సినిమాథియేటర్' లలో మూగ చిత్రాలకు కథలు వినిపించే ఉద్యోగం చేశారు. తర్వాత రాజమండ్రి కోటిలింగ ప్రాథమిక పాఠశాలలో ఎనిమిది రూపాయల నెలజీతానికి కుదురుకుని, అది కూడా మానుకు, సమాజాలకు నాటకాలు వ్రాసి, అదికూడా అచ్చిరాక గుంటూరు చేరి ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. ఆ రోజుల్లోస్థాపించబడినిన్న మొన్నటి వరకూ నడిచిన 'భారతి' మాసపత్రికకు వ్రాయటం ద్వారా ఆయన ప్రతిభ లోకానికి వెల్లడైంది. తరువాత గుంటూరు జిల్లా బోర్డు స్కూలులో బాపట్లలో ఉపాధ్యాయ ఉద్యోగంచేరి, అక్కడి నుంచి వినుకొండ బదిలీ చేయిం చుకుని, 1942 దాకా అక్కడే తెలుగు పండితునిగా పనిచేశారు.

ద్వితీయ సంగ్రామ కాలంలో జాషువా కవితాభిమాని ఐన సానెకొమ్ము మాలకొండారెడ్డి ప్రోద్భలంతో యుద్ధ ప్రచారశాఖలో ఉద్యోగం చేసారు. ఆ ఉద్యోగ కాలంలో ఆయన దేశభక్తిని శంకిస్తూ తెలుగుదేశమంతటా దుమారం రేగింది. అయితే ఆయన
'ఉదరార్థంబు ధరించినాడమునుపెన్నోవేషముల్ మాతృశారద వంకం బెరచూపులం బఱపితిన్'
అంటూతన దృక్పధాన్ని మార్చు కున్నాడు. ఆ సమయంలోనే యుద్ధ భీభత్సాన్ని చిత్రిస్తూ 'కాందిశీకుడు' కావ్యం వ్రాశారు. ప్రముఖ జాతీయవాది తిక్కవరపు రామిరెడ్డిగారితో ఏర్పడిన పరిచయంతో నేతాజీ' 'బాపూజీ' ‘స్వయం వరం‘ అనే కావ్యాలు వ్రాశారు. 1956 లో ఆయన భార్య మేరాంబ మరణించిన తర్వాత 1961 లో 'విమలమ్మ' ను ద్వితీయ కళత్రంగా స్వీకరించారు. 1957-69 మధ్యకాలంలో ఆలిండియా రేడియో తెలుగు విభాగంలో 'స్పోకెన్వర్డ్ ప్రొడ్యుసర్ 'ఉద్యోగంచేసి, కుల వివక్షతో అక్కడా అవమానాలు ఎదుర్కొని తిరిగి గుంటూరు వచ్చి, పూర్తిగా కావ్యరచనలో నిమగ్నమయ్యారు. కవితాగోస్టులు, సన్మానాలు ఆయనకు నిత్యకృత్యాలయాయి. 1964 లో ఆయనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనమండలి సభ్యునిగా నియమించి సముచితంగా గౌరవించింది. 1965 లో ఆయన వ్రాసిన క్రీస్తు 'చరిత్ర' కావ్యానికి కేంద్రసాహిత్య అకాడమీ బహుమతినిచ్చి సన్మానించింది. ఆంధ్రాయూనివర్సిటీ 'కళాప్రపూర్ణ' బిరుదాంకితునిగా చేసింది. గండపెండేరం ధరించి, కనాకాభిషేకాలు పొంది, గజారోహణం చేసి, పల్లకీలలో ఊరేగారు. గబ్బిలము, ఫిరదౌసి, స్వప్నకథ, అనాధ, నేతాజీ, కొత్తలోకం, ముసాఫర్లు, బాపూజీ, ముంతాజ్మహలు, నాకథ, స్వయంవరం, నాగార్జునసాగర్, కాందిశీకుడు, క్రీస్తుచరిత్ర, ఏడుభాగాలుగా వచ్చిన ఖండకావ్య సంపుటి మొ|| కావ్యాలేగాక, తెరచాటు, తారాబాయి, రుక్మిణీకల్యాణం, చిదానందప్రభాతం, హినుదమార్క పరిణయం, ధృవవిజయం, వంటి నాటకాలు కన్యకాపరమేశ్వరి మొ।। ఎన్నో రచనలు చేశారు. కవితాభిమానులు, సాహితీ సంస్థలచే వేయికి. పైగా సన్మానాలు పొందేరు. కవికోకిల, కవితావిశారద, కవిదిగ్గజ, మధుర శ్రీనాథ, నవయుగకవిచక్రవర్తి, కవిసామ్రాట్ మొ। బిరుదులు పొందేరు.

జాషువా సాహితీక్షేత్ర ప్రవేశకాలానికి భావకవిత్వం క్షీణదశకు బీజాలు పడ్డాయి. అభ్యుదయ కవితావికాసం మొగ్గతొడగటం ప్రారంభించింది. ఈ సంధికాలంలో వచ్చిన జాషువా భావకవిత్వం లోని ఆత్మాశ్రయ ప్రధానమైన భావానుభూతి, అభ్యుదయ కవిత్వంలోని సామాజిక పరమైన సమస్యలూ ఇతివృత్తంగా రచనలుసాగించారు. ఆయన రచనలన్నీ ఛందోబద్ధంగావున్నా. రూపంలోనూ, కవితావస్తు స్వీకరణలోనూ, పురాణ ప్రబంధయుగపు కవితలాగా రాచరికపు అహంభావ పూరిత పౌరుషాలో, వారి శృంగారకేళి. కలాపాలలో తీసుకోలేదు. బాల్యంలో తండ్రి వీరయ్య నుండి అనుశ్చతంగా నేర్చుకొన్న గొల్లసుద్దులు, పల్నాటివీరచరిత్ర, మొ|| పాటలు ఆయనకు ఆశుకవితా సంప్రదాయాన్ని నేర్పగా, రాగశృతి లయాన్వితమైన ఆ గీతాలు ఆయన పద్యాల స్వరూపానికొక విశిష్టరూపాన్ని ఏర్పరచాయి. ఈయన కవిత్వం జనసామాన్యానికి చేరువైంది. బలిజేపల్లి వారి 'హరిశ్చంద్ర' నాటకంలో కాటిశీనులో ఇమిడ్చిన జాషువా పద్యాలు నేటికీ జానపదుల నోళ్ళలో నానుతూనే ఉన్నాయి. జాషువాకు ముందే పద్యకవిత్వానికి చాలానుంది కవులు వీడ్కోలు చెప్పేశారు. చాలామంది అభ్యుదయకవులు అప్పటికే గేయ, వచన కవిత్వరూపంలోకి వచ్చినా జాషువాగారు పద్యకవితలే వ్రాశారు. ఏ సాహితీ సాంఘిక రాజకీయ ఉద్యమాలతోనూ ఆయన కు ఆచరణాత్మక సంబంధం లేకపోవడం దీనికి కారణం కావచ్చు. 'నాల్గుపడగల హైందవ నాగరాజు బుసబుసలకు, కడుపు దహించే ఆకలి చీకటి చిచ్చులకూ‘ వ్యతిరేకంగా ఆయన వ్యక్తిగత పోరాటం సాగించారు. మహాప్రస్థానానికి యోగ్యతా పత్రం ఇస్తూ చెలం అన్నట్లుగా 'తనకూ, ప్రపంచానికీ సామరస్యం కుదిరిందాకా కనిచేసే అంతర్, బహిర్ యుద్ధారావమే కవిత్వం' అన్నట్లుగా. తనకూ జీవితానికీ మధ్య అగాధాన్ని పూడ్చడానికి పడ్డ సంఘర్షణ సుంచీ ఆయన సామాజిక స్పృహను పొందారు.

అనాటి వరకూ ఆమాట కొస్తే నిన్న మొన్నటి వరకూ తెలుగుదేశంలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించి, ఆ కష్టాల కడలి బాధలలోంచీ గళం విప్పిన దళత కవి ఒక్క జాసువాయే. సామాజిక దురన్యాయాలు, కులవివక్షకు చెందిన ఆవేదనను పద్యకావ్యాలలో రూపెత్తించిన మొదటికవి, బహశా చివరి కవి కూడా జాషువానే అని చెప్పుకోవచ్చు. మాల మాదిగల మధ్య వైమనస్యాన్ని, ఆయన నిర్ద్వందంగా ఖండించి, తాను కులాల గీతల మధ్య నిలబడలేనని విస్పష్టంగా ప్రకటించారు. దుర్భర దారిద్ర్యము, క్రూర సాంఘిక వివక్షా అనుభవించిన ఆయన వాటిని తన కావ్యాల్లో పలికించారు. ఆయన సామాజిక, సాహితీ రంగాల్లో సాగించింది. నిష్క్రియా సాహితీ విప్లవం (Passive Literary Revolution) గా చెప్పుకోవచ్చు, కారుణ్య ఛాయలు తప్ప విప్లవంగానీ, హింసగానీ, లేవు. ఆయన ఏనాడూ గుళ్ళకు గానీ, చర్చిలకు గానీ వెళ్ళలేదు. ఆయన క్రైస్తవుల చేతనేకాక, సవర్ణ హిందువుల వెలినీ చవిచూశారు. ఎవరెన్ని సన్మానాలు చేసినా, ప్రభుత్వం ఆదరించినా. ఆదరించుకున్నా. ఆయన ప్రజాకవి, ప్రజాభిమానంతో నిలిచారు.. వివిధ రకాలుగా ఆర్థిక, సామాజిక సాంస్కృతిక వివక్ష అనుభవిస్తూ, ఆనాటి సామాన్య జనజీవితగాథని కరుణరసస్థావితంగాపద్యీకరించారు. జీవితమంతా అవిశ్రాంత సమరంలో వేసారి నిమ్నోన్నత్యాల్ని చూసిన కవి, తెలుగుజాతి గర్వించదగిన మహామనిషి జాషువా 1971 జులై 24 వ తేదీన మరణించారు.

"రాజుమరణించె, నౌకతార రాలిపోయే
కవియు మరణించే, నొకతారగగనమెక్కె రాజుజీవించే నారాతి విగ్రహములందు.
కవియు జీవించే ప్రజల నాలుకలయందు. "

ఆయన అన్న మాటలు ఆయన విషయంలో అక్షరసత్యాలు,
జాషువారచనలలో ఆణిముత్యం 'గబ్బిలం' జాషువా 'గబ్బిలం' కావ్యం ఆయన స్వీయజీవిత చిత్రణగా చాలామంది పండితులు మేధావులూ భావిస్తున్నారు. కులవ్యవస్థలో అమానుష అసమ సంబంధాల్ని, ఆ వ్యవస్థపట్ల, ఆయన అవగాహన, వైఖరీ 'గబ్బిలం' కావ్యంలో వ్యక్తమౌతాయి. చెప్పులు కుట్టి జీవించుట ఆరుంధతీ సుతుని వృత్తి, అతని శ్రమను దోచుకుంటూ అంటరాని వానిగా పరిగణించిన హిందూ సామాజిక దృష్టిని నిరసించారు. అరుంధతీ సుతుని పాత్ర ద్వారా తన కాలంనాటి సామాజిక దుస్తితిని హృదయానికి హత్తుకొనేలా చిత్రించారు జాషువా. ఆ పాత్రద్వారా ఇక్కడి కులవ్యవస్థ, అంటరానితనం, దోపిడీలను బహిర్గతం చేశారు. సామాజిక చైతన్యంతో విశ్వజనీనతను జోడించి, కారుణ్యం, మానవత్వపు విలువలను కలిపి, అస్పృశ్యుని ఆత్మక్షోభను, అంతరంగిక ఆవేదననూ ఆవిష్కరించారు.

ఆయన నిరాశ్రయుడుగా గుంటూరులో కాలం గడుపుతున్న రోజులలో ఆయనకు ఊరిబయట స్మశానం పక్కన ఒక పాడుబడిన ఇల్లు ఆవాసంగా దొరికింది. రాత్రిళ్ళు చిన్న ఆముదపు దీపం. అక్కడ విహరించే గబ్బిలాలే ఆయనకు నేస్తాలయ్యాయి. ఆయన గబ్బిలం కావ్యంలో ‘
‘ముక్కు మొగమున్న చీకటి ముద్దవోలె
విహరణము సేయసాగే గబ్బిల మొకండు
దాని పక్షానిలంబున వాని చిన్ని
యాముదపు దీపమల్లన నాఱిపోయె‘

అంటూ వివరించారు. ఆచీకటిలో, హృదిలో తృటిలో తటిల్లతల్లా మెరిసిన ఆలోచనా గీతమే. గబ్బిలం కావ్యంగా రూపొందింది. ఇందులోని ప్రతి పద్యంలోనూ ఆయన ఆత్మీయస్పర్శ జ్యోతకమౌతుంది. జాషువా తనవై యక్తిక బాధని, తనజాతి జనుల సమిష్టి బాధనీ ప్రత్యేకించి పలికినా, అది సాధారణీకరణాన్ని పొందింది. సర్వ పాఠక సమాదరణనూ పొందింది.

గురజాడ కావ్య ఖండికల రచనకు బాటవేసినా, ఖండకావ్య ప్రక్రియ మాత్రం రాయప్రోలు సుబ్బారావు గారితోనే మొదలైంది. అది జాషువా చేతిలో కొత్త వన్నెలు పొంది పుష్పంగా ఫలించి తెలుగు సాహితీ సుమంగా నిరంతరం సుగంధాల్ని వెదజుల్లతూ వుంది. గబ్బిలం రెండు భాగాలుగా వ్రాశారు. 117 పద్యాలున్న
గబ్బిలం మొదటి భాగానికి 'విజ్ఞప్తి' పేరుతో ప్రవేశిక (ఇంట్రో) వ్రాస్తూ, కాళిదాసు మేఘసందేశాన్ని మనసులో ఉంచుకొని ఈ కావ్యం వ్రాసాననీ, కులీనుడైన రాజు మన్మద తాప తప్తుడై పంపే ప్రణయసందేశానికి రాజహంస దౌత్యం నేరపగా, తుకతుకనుడికే క్షుధాగ్ని పీడితుడి అశ్రుసందేశం పంపేందుకు అతని జీర్ణకుటీరంలో ఉండే గబ్బిలమే సందేశహారిగా గైకొన్న ఔచిత్యాన్ని గ్రహించమని కోరేరు. "ఇంట ప్రవేశించి దీపమార్పిన గబ్బిలమును జూచి తన కన్నీటి కథ ఈశ్వరునితో చెప్పుమని వీదుప్రార్థించెగాని, నిజమునకతని యుద్దేశ్యము దేశారాధన, అంటూ వివరించారు. 'గబ్బిలం' లో కుల వివక్షావ్యతిరేకతత్వం ప్రధాన వస్తువు.
గబ్బిలాన్ని ప్రతీక కావ్యంగా మలచడంలోనే జాషువా ప్రతీక వాద కవితా తత్వాన్ని నిర్వహించారు. పామునకు పాలు, చీమకు పంచదార పోసి పోషించే హైందవ సమాజంలో అపశకునపు పక్షిగా సమాజ దృష్టిలో వుండిన గబ్బిలాన్ని అరుంధతీ సుతునికి ప్రతీకగా గ్రహించారు. ఎందుకంటే అది వెలుగును చూడలేదు. పంచముల జీవితాలు నాడు మరీ దుర్బరంగా వుండేవి. వారి జీవితాల్లో వెలుగులేదు. వారి చీకటి బ్రతుకులకు పక్షిజాతి చేత కూడా వెలివేయబడిన ప్రాణిగనున్న గబ్బిలాన్ని ప్రతీకగా తీసుకు దళితుల దైన్యాన్ని, దయనీయ పరిస్థితిని వివరించారు.

వాని రెక్కల కష్టంబులేనినాడు
సస్యరమ పండి పులకింప సంశయించు వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు
భోజనము బెట్టు నానికి భుక్తిలేదు

09/25/2023

భారతీయ బ్యాంకుల కు 10 లక్షల కోట్ల రూపాయలు డబ్బును ఎగేసి /(విదేశాలకు పారిపోయి)న 28 మంది వ్యక్తుల జాబితా (27 గుజరాతీలు)..కనీసం కొత్త పార్లమెంటు భవన్‌లోనైనా తిరిగి వసూలు నిర్ణయం తీసుకొండి...అయ్యా!!!

1) విజయ్ మాల్యా (కర్ణాటక)
2) మెహుల్ అటెన్టివ్
3) నీరవ్ మోడీ
4) మోడీ మార్క్
5) పుష్పేష్ బైద్య
6) ఆశిష్ జోబన్ కుమారుడు
7) సన్నీ కల్రా
8)ఆర్తి కల్రా
9) సంజయ్ కల్రా
10) కల్రా
11) సుధీర్ కల్రా
12) జతిన్ మెహతా
13) ఉమేష్ పారిఖ్
14) కమలేష్ పారిఖ్
15) నీలేష్ పారిఖ్
16) వినయ్ మిట్టల్
17) ఏకలవ్య గార్గ్
18) చేతన్ జయంతిలాల్
19) నితిన్ జయంతిలాల్ 2
20) దీప్తి చేతన్
21) రాజీవ్ గోయల్
22) సవియా సేఠ్
23) అల్కా గోయల్
24) లలిత్ మోదీ
25) రితేష్ జైన్
26) హితేష్ నాగేంద్రభాయ్ పటేల్
27) మయూరి బెన్ పటేల్
28) ఆశిష్ సురేష్ సోదరులు దోచుకున్న
మొత్తం రూ. 10,000,000,000,000 /- (పది ట్రిలియన్ రూపాయలు)

అసలు విషయమేమిటంటే...... మొదటి వ్యక్తి విజయ్ మాల్యా (కర్ణాటక వాసి) మినహా, తక్కిన 27 మంది గుజరాత్ వాసులే. ఇలా ప్రజల కష్టార్జితం సొమ్ము బ్యాంకుల్లో దాచుకుంటే, ఆ బ్యాంకులకు ఎగనామం పెట్టి దర్జాగా విదేశాల్లో తల దాచుకోవడం వీరికి పరిపాటిగా మారింది, వీరందరికీ ఎవరి అండదండలు ఉన్నాయో 🙄

09/24/2023

ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ లో రంగాజీ వ్యాసం..!!
సనాతన ధర్మం! అధునాతన ధర్మం! శ్రామిక ధర్మం!
#రంగనాయకమ్మ..
కులవ్యవస్త ద్వారా సామాజిక న్యాయానికి హాని చేసే సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించడమే కాదు దాన్ని పూర్తిగా నిర్మూలించాలి అని తమిళనాడు మంత్రి ఒకరు అన్నారనే వార్త తెలిసిందే..
అప్పటినుంచీ ఆ విషయం మీద వ్యతిరేకులూ, అనుకూలురూ, వాదులాడుకుంటున్నారు..
ఆ వాదనలు విన్నాక సనాతన ధర్మంతో పాటు మరో రెండు ధర్మాల గురించి కూడా చర్చించాలనిపించింది నాకు..

‘ధర్మం’ అనే పదానికి అర్ధం ఏమిటి? ఆ పదం ఎన్ని సందర్భాలలో వస్తుందో ఆ సందర్భాల అర్ధాల మొత్తమే
ఆ పదానికి అర్ధం..
అలా చూసినప్పుడు సమాజంలో ‘ధర్మం’ అంటే మనుషులు పాటించవలిసిన విధీ, నియమం, సూత్రం, న్యాయం, లక్షణం, స్వభావం, విధానం, పద్ధతీ –వగైరాలు..
ఏ పేర్లతో చెప్పుకున్నా ‘ధర్మం’ అనేది సమాజంలో మనుషులంతా ఒకరికొకరు ఆప్తులై శాంతి సౌఖ్యాలతో జీవించడానికి కావలిసినదే..
ఇప్పుడు జరుగుతున్న వివాదం,,
సమాజానికి సంబంధించిన ధర్మం ఎలా వుండాలి – అనే దాని గురించే..
వివాదం అయితే సనాతన ధర్మం మీద విమర్శతో మొదలైంది..

‘సనాతన’ అనే విశేషణానికి అర్ధాలు: శాశ్వతమైన, ప్రాచీనమైన, పవిత్రమైన, నిశ్చలమైన–అని..
‘సనాతన ధర్మాన్ని’ సమర్ధించే వారి ప్రకారం సనాతన ధర్మం అనేది అతి ప్రాచీనమైనది..అందుకే అది పవిత్రమైనది..
అదే శాశ్వితంగా అనుసరించదగ్గదీ..
ప్రాచీనమైన ప్రతీది పవిత్రం కాదనీ; తర్కానికి నిలబడనిదీ, కొందరికే మేలు చేసేదీ అయిన ఏ ధర్మమూ, శాశ్వితంగా వుండిపోదనీ ఎవరైనా అంటే సనాతనులకు చాలా కోపం..

‘సనాతన’ అనే మాటా దాని అర్ధమూ మొట్టమొదట ఏ ప్రాచీన గ్రంధంలో వచ్చిందీ–అనే దాని మీద వేరు వేరు అభిప్రాయాలున్నాయి..
అది మొదటిసారి ‘భగవద్గీత’లో కనపడిందని కొందరు అంటే, వేదాలలో అసలు ఆ మాటే లేదని కొందరు అంటారు..
నేను మళ్ళీ ఒకసారి ఇప్పుడే ‘భగవద్గీత’ తెరిచి పరిశీలిస్తే
ఆ మాట ‘భగవద్గీత’లో రెండు చోట్ల కనపడింది..
1 వ అధ్యాయంలో 40వ శ్లోకంలో: ‘కుల క్షయం వల్ల సనాతన కుల ధర్మాలు నశిస్తాయి..
కుల ధర్మాలు నశించడం వల్ల వంశాన్నంతటినీ అధర్మం కమ్ముకుంటుంది’.. కుల విధానం నశిస్తే అధర్మం కమ్ముకుంటుందట.. ఈ శ్లోకంలో ధర్మం అనేది లేదు
(‘కుల’ అనే సంస్కృతం మాటకి: కుటుంబం, వంశం, సమూహం, తెగ, కులం, వర్ణం–ఇలా దాదాపు 40 అర్ధాలున్నాయి.. ఇక్కడ నేను, ‘భగవద్గీత’కి, చలంగారు చేసిన తెలుగు అనువాదాన్ని ఆధారం చేసుకున్నాను.)
2 వ అధ్యాయంలో 24 వ శ్లోకంలో : ‘ఇది (ఆత్మ) కోతపడదు, కాలదు, తడవదు, ఎండదు, ఇది నిత్యం, సర్వ వ్యాప్తం, నిశ్చలం, సనాతనం, అవ్యక్తం...’ ఈ శ్లోకంలో వున్నదంతా, సనాతన ఆత్మ శాస్త్రం..

‘వేదాలలో ‘సనాతన’ అనే మాట లేకపోయినా వాటిల్లో వున్నదంతా సనాతన ధర్మమే’ అని వాదించేవారున్నారు.. అసలు ప్రశ్న: సనాతన ధర్మం అనేది ఏగ్రంధంలో వున్నా అది బోధించే భావాలు ఏమిటి? ‘కులాలు నాశనం కాకూడదు’ అని చెప్పే అభివృద్ధి వ్యతిరేక భావాలు.. ‘ఆత్మ’ అనే అశాస్త్రీయ భావనలు..
ఇవేనా? స్త్రీల గురించి ఎంత దారుణమైన అభిప్రాయాలో ‘భగవద్గీత’లో, 1 వ అధ్యాయం లోనే చూడొచ్చు: ‘అధర్మం పెరగడం వల్ల కుల స్త్రీలు చెడిపోతారు..
స్త్రీలు చెడిపోతే వర్ణ సంకరమౌతుంది.’
(41వ శ్లోకం) ‘వర్ణ సంకరం చేసే కులనాశకుల దోషాలవల్ల శాశ్వతమైన జాతి ధర్మాలూ, కుల ధర్మాలూ పాడై పోతాయి.(43వ శ్లోకం) ‘వర్ణ సంకరం చేసే కులనాశకుల దోషాలవల్ల శాశ్వతమైన జాతి ధర్మాలూ, కుల ధర్మాలూ పాడై పోతాయి.’
(43వ శ్లోకం) ఇంకో విషయం చూడండి: సనాతన ధర్మం, అసమాన శ్రమ విభజనను సహజమైనదిగా, వాంఛనీయమైనదిగా భావిస్తుంది..
అందుకే అగ్రవర్ణాలకు అవసరమైన సేవలు (‘పరిచర్యాత్మకం’ = పరిచర్య రూపమైనవి) శూద్రులు చేయడాన్ని ఒక సహజమైన ధర్మంగా విధిగా చెప్పింది సనాతన ధర్మం..
దీనికి ఆధారాలు నాలుగు వేదాలలోనే కాదు,,
ఐదవ వేదంగా పిలిచే ‘మహాభారతం’లో కూడా లెక్కలేనన్ని వున్నాయి..

ఈ చిట్టి వ్యాసంలో సనాతన ధర్మం గురించి ఎంతసేపు చెప్పుకుంటాం?
దానితో పాటు అధునాతన ధర్మాన్నీ, శ్రామిక వర్గ ధర్మాన్నీ కూడా చెప్పుకోవాలి..
సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే సిద్ధాంతాన్ని ‘అధునాతన ధర్మం’ అనవచ్చును..
ఈ ధర్మం ప్రకారం ‘కుల భేదాలు’ వుండకూడదు..
ఎందుకంటే, ఇక్కడ వేరు వేరు కులాల వాళ్ళు అనేక పని స్తలాల్లో– ఫ్యాక్టరీల్లో, గనుల్లో, బస్సుల్లో, రైళ్ళల్లో, ఆస్పత్రుల్లో, కాలేజీల్లో, ఆఫీసుల్లో, ఇంకా అనేక చోట్ల కలిసి పని చేసి తీరాలి.. లేకపోతే సమాజ జీవితమే స్తంభించి పోతుంది..
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి.. సనాతనులలాగే, ఆధునికులు కూడా ఇప్పుడు వున్న ‘అసమాన శ్రమ విభజన’ను ఏమాత్రం వ్యతిరేకించరు..
‘అసమాన శ్రమ విభజన’ అంటే
(1) శ్రమలు చెయ్యడంలో కొందరు ఏ శ్రమలూ చెయ్యరు.. అధికులే అన్ని శ్రమలూ..
(2) శ్రమలు చేసే వారిలో కొందరు జీవితాంతమూ మేధా శ్రమలే. మిగతా వారు జీవితాంతమూ శారీరక శ్రమలే..
శారీరక శ్రమలలోనే అట్టడుగున వుండేవి మురికిని శుభ్రం చేసే శ్రమలు..
ఈ అధర్మ శ్రమ విభజన ప్రస్తుత సమాజంలో, అధునాతన ధర్మం..
కాబట్టి ‘ధర్మం’ అనే విషయంలో సనాతన భావాలకూ, అధునాతన భావాలకూ మధ్య పెద్ద తేడా లేదు..
సనాతన ధర్మం అనేది మరీ ప్రాచీనమైన మొరటు రూపంలో(అస్పృశ్యత) వుంటే,,
అధునాతన ధర్మం అనేది నాజూకు రూపంలో (‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’= శ్రమకి గౌరవం) వుంటుంది..
సనాతన ధర్మం పెట్టుబడిదారీ సమాజానికంటే ముందు వున్న సమాజాలకి సంబంధించిన భావజాలం..

అందుకే ఇప్పుడు మనకు కావలిసింది సనాతన ధర్మమూ కాదు,, అధునాతన ధర్మమూ కాదు,, శ్రామిక ధర్మం కావాలి..
దీని ప్రకారం కనీస ఆరోగ్యమూ,, శక్తీ వున్న మానవులందరూ, తమ జీవిత కాలంలో కొన్ని వేరు వేరు రకాల శ్రమల్ని,
కొన్ని నియమాల ప్రకారం చేసి తీరాలి..
ఒక ప్రొఫెసరు ‘నేను ఎప్పుడూ యూనివర్శిటీలోనే పాఠాలు చెపుతానూ లారీలూ బస్సులూ తోలే పనిలోకి డ్యూటీల ప్రకారం వెళ్ళను.. నేను లెట్రిన్లు వాడతాను.. పోనీ వాటిని కడుక్కుంటాను గానీ..
అవసరమైనప్పుడు డ్రైనేజీ మార్గాల్ని శుభ్రం చేసే పనిలోకి రాను’ – అని అనడానికి లేదు..
‘నేను ఆవు పాలు తాగుతాను, ఆవు నెయ్యి వాడతాను,
కానీ ఆ ఆవు చచ్చిపోయినప్పుడు దాన్ని శ్మశానానికి మోసుకెళ్ళే పనిలోకి రాను’– అంటే కుదరదు..
సనాతన కాలంలోనూ,, అధునాతన కాలంలోనూ ఉన్న అసమానత్వ శ్రమ విభజనను సమానత్వ శ్రమ విభజనగా మార్చడమే శ్రామిక ధర్మం లక్ష్యం..
ఇది అటు సనాతన ధర్మానికీ,,ఇటు అధునాతన ధర్మానికీ పూర్తిగా వ్యతిరేకమైనది..

ఈ నాడు సనాతన ధర్మాన్ని సమర్ధిస్తున్న రాజకీయ పార్టీలు గానీ,, దాన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలు గానీ ఈ శ్రామిక ధర్మాన్ని అంగీకరించవు..
అవన్నీ సగం–సనాతన,, సగం–అధునాతన పార్టీలే..
ఒక్క మాటలో చెప్పాలంటే ‘శ్రమ దోపిడీ’నీ,, అసమాన శ్రమ విభజననీ సమర్ధించే పార్టీలే..
అన్ని పార్టీలూ కులాల్నీ,, మతాల్నీ,, ప్రాంతీయ భేదాల్నీ,, తరతమ భేదాలతో ఓట్లకోసం ఉపయోగించుకునేవే..
అన్ని కులాలకూ,, మతాలకూ,, ప్రాంతాలకూ చెందిన
శ్రామికుల నించీ అదనపు విలువని–వడ్డీ,, లాభాలూ,,
కౌళ్ళూ అనే ఆదాయాల రూపంలో–లాగడానికి వీలునిచ్చే ఆర్ధిక విధానాన్ని అనుసరించేవే..
కాబట్టి ఆ రెండు పక్షాలలో ఏదో ఒక దాని పక్షాన శ్రామిక వర్గ దృక్పధం గలవారు నిలబడవలిసిన అవసరం లేదు..

చివరికి గ్రహించవలిసింది ఏమిటంటే,,
సనాతన ధర్మానికీ,, అధునాతన ధర్మానికీ,,
శ్రామిక ధర్మానికీ వున్న తేడాల్ని..!!

-- #రంగనాయకమ్మ..!!

09/19/2023

వినాయకుడి తల అతికించడానికి దేవుడు ఉన్నాడని రాసిన పుస్తకాలలో.! ఏకలవ్యుని వేలు అతికించడానికి దేవుడిని ఎందుకు సృష్టించలేదు.?? సనాతన ధర్మం ఎప్పుడు కూడా బ్రాహ్మణ ధర్మమే ఏనాటికి బ్రాహ్మణ ధర్మం మనుషులందరూ సమానమే అని చెప్పే సమధర్మం కాదు

09/17/2023

#భగవద్గీత_మనుస్మృతులలో_సనాతన_సారాంశం!
!
కుల వ్యవస్థను సమర్థించు కోవడానికి బ్రాహ్మణార్యులు భగవద్గీతను ప్రచారంలోకి తెచ్చారు. భగవద్గీత ఒకటవ అధ్యాయంలో అర్జునుడు ఒక సందేహం వెలిబుచ్చాడు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన వారి భార్యలు చరిత్రహీనులవుతారు. ఎందుకంటే భర్తలు లేనందువల్ల వారు ఇతర కులాల వారితో సంబంధాలు పెట్టుకుంటారు. లేదా, వారిని వివాహం చేసుకుంటారు. వర్ణ సంక్రమణం జరుగుతుంది. సంకర జాతి పిల్లలు పుడతారు. ఇక ఈ కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన మన వీరులకు పిండాలు పెట్టడానికి వారి పిల్లలు ఉండరు కదా? ఆ విధంగా కులం, ధర్మం, నీతి, నియమం అన్నీ నాశనమవుతాయి కదా? అన్నది అర్జునుడి సందేహం.

కృష్ణుడు దానికి నేరుగా సమాధానమివ్వాలి కదా? ఇవ్వడు. విషయాన్ని అటూ ఇటూ తిప్పుతాడు. రెండో అధ్యాయం మూడవ శ్లోకంలో కృష్ణుడు కోపంతో అర్జునుణ్ణి నపుంసకుడా! అని దూషించి, తన కోపాన్ని అదుపులో పెట్టుకుని, మళ్ళీ వెంటనే ‘నీకు స్వర్గం ప్రాప్తిస్తుంద’ని ఆశ పెడతాడు (రెండవ శ్లోకం) రెండో అధ్యాయంలో 23, 24, 25 శ్లోకాలలో కృష్ణుడు ఆత్మగురించి మాట్లాడుతాడే గాని, సరైన వివరణ ఏమీ ఇవ్వడు. చనిపోయిన తర్వాత ఆత్మస్వర్గంలో ఎవరితో ఎలా సుఖపడుతుంది? అన్నదానికి జవాబులేదు. మళ్ళీ కొత్త శరీరం పొందడానికి కొత్త తల్లిదండ్రులు అవసరమవుతారు కదా? స్వర్గంలో పురుషులకు అప్సరసలుంటే మరి స్త్రీలకు ఏ ఏర్పాట్లున్నాయో కృష్ణుడు చెప్పలేదు.
భగవద్గీత రెండో అధ్యాయం 31, 38 శ్లోకాలలో వర్ణవ్యవస్థను తనే సృజించానని, దాన్ని నిలపడమే తన ధ్యేయమని కృష్ణుడు బలంగా చెపుతాడు. భగవద్గీతలోని 18వ అధ్యాయంలో తను సృజించిన వర్ణవ్యవస్థను అర్జునుడు అనుసరించాలని ప్రభోదిస్తాడు. కుల నాశనం జరిగితే సనాతన ధర్మం నశించిపోతుందని మనువాదుల భయం అందుకే అలా రాసిపెట్టుకున్నారు.

నేటి మన ఆధునిక ఆలోచనల ప్రకారం వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ ఎందుకూ పనికిరానివి. మానవత్వాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకుని మసలుకోవాల్సిందే తప్ప – ఏవో కల్పిత పాత్రలతో మనువాదులు చెప్పించిన వర్ణ వ్యవస్థ, వర్ణ సంకరం, జన్మ, పునర్జన్మ, దేవుడి మహిమ వంటి మాటలకు ఎలాంటి విలువా. అర్థమూ లేదు. వైదిక మత ప్రభోదకులు కుట్ర పూరితంగా అల్లుకున్న మతగ్రంథాలు ప్రామాణికం కావు. హిందూ మతమనే కాదు, ప్రపంచంలోని అన్ని మతాలూ అబద్దాలే చెప్పాయి. కనుక, వాటినన్నింటినీ పక్కకు నెట్టేసి, మానవత్వం నిలుపుకునే దిశలో ఆధునికులమైన మనం, సంయమనంతో ప్రయాణించాల్సి ఉంది.

వర్ణ వ్యవస్థను, కుల వ్యవస్థను తనే సృజించానని కల్పిత పాత్ర అయిన ఓ కృష్ణుడితో చెప్పించి, మనువాదులు చేతులు దులుపుకున్నారు. మనుషుల్ని విడగొట్టే ప్రక్రియ భగవద్గీతతో ప్రారంభించి, దాన్ని స్థిరపరిచి, మనుస్మృతిలో వివక్షను తారాస్థాయికి తీసుకెళ్ళారు. వివరంగా విశ్లేషించుకుంటూ ఉంటే, అంతా కళ్ళ ముందే కదలాడుతుంది. అయితే ఇక్కడ దోషులెవరో స్పష్టంగా తెలుస్తూనే ఉంది. తెలిసినా తెలియనట్టే ఉండటం – దోషులను శిక్షించకుండా వదిలేయడం తెలివిగల పనులేం కావుగదా?

మనుస్మృతి రెండవ అధ్యాయం 30వ శ్లోకంలో పది, పన్నెండు రోజుల పిల్లలకు నామకరణం చేయాలని ఉంది. ఇంకా ముందుకు వెళ్ళి 31, 32 శ్లోకాలలో ఎవరికి ఎలాంటి పేరు పెట్టాలో సూచించడం జరిగింది. ఉదాహరణకు బ్రాహ్మణ పిల్లలకు ఉన్నతమైన పేర్లు పెట్టాలనీ – శూద్రులకు హీనమైన పేర్లు పెట్టాలనీ అందులో రాసి ఉంది. ఆ పేర్లతో వారు జీవితాంతం దీనుల్లాగా, దాసుల్లాగానే బతకాలి. మధ్యలో కొంత వ్యతిరేకత వచ్చినందువల్ల ‘వర్ణం జన్మతో కాదు కర్మతో వస్తుంది’ అని కొత్త పాట పాడారు. ఇదే నిజమైతే బ్రాహ్మణులు పెట్టుకునే పేర్లు, శూద్రులను పెట్టుకోనిచ్చారా? లేదు కదా? అలాగే దాసులాంటి శూద్రుల పేర్లు బ్రాహ్మణార్యులు ఎందుకు పెట్టుకోలేదూ? జన్మతో కాదు చేసే కర్మతో ఉచ్ఛం, నీచం ఏర్పడుతాయని ఇంకా కతలెందుకు చెప్తారూ? అంబేద్కర్‌ చదివినంత చదువు బ్రాహ్మణుల్లో ఎవరూ చదవలేదు. ఆయన చేసిన గొప్ప పనులు ఏ బ్రాహ్మణుడూ చేయలేదు. కర్మతో వర్ణం మారుతుందంటే, అంబేద్కర్‌ తన కర్మ ఫలితంతో ఉన్నతవర్ణం వాడు కావాలి కదా? కాలేదు ఎందుకూ? విసిగి వేసారి ఆయన హిందూ ధర్మమే వద్దను కుని, ఆరులక్షల మందితో బౌద్ధం స్వీకరించాడు – మళ్ళీ అది వేరే విషయం.
మనుస్మృతి పదవ అధ్యాయంలో 5-6-66-67-68 శోక్లాలలో వివక్షకు సంబంధించి మరిన్ని విషయాలున్నాయి. బ్రాహ్మణుడు శూద్రజాతికి చెందిన అమ్మాయిని పెండ్లి చేసుకుంటే, పుట్టిన పిల్లవాడు బ్రాహ్మణుడే అవుతాడు. ఒక శూద్రుడు గనక బ్రాహ్మణ స్త్రీని పెండ్లి చేసుకుంటే పుట్టిన పిల్లలు శూద్రులే అవుతారు – ఈ మాత్రం దానికి వర్ణం జన్మతో వస్తుందని ఓ సారి, కర్మతో వస్తుందని మరోసారి చెప్పడం ఎందుకూ? అయినా మహిళలందరినీ శూద్రులుగా పరిగణించిన మనుధర్మ శాస్త్రం చిన్న లాజిక్‌ మరిచిపోయింది. ప్రపంచ మానవులందరూ స్త్రీలకు పుట్టినవారే. అంటే శూద్రులకు పుట్టినవారే. శూద్రుల పిల్లలు శూద్రులే అవుతారు కదా? అలాంటప్పుడు అందరూ సమానమే. వారి శాస్త్ర ప్రకారం అందరూ శూద్రులే. ఏమైతేనేం? తేడాల్లేవ్‌. ఇక నిచ్చెన మెట్ల వర్ణ వ్యవస్థ ఎక్కడుంటుందీ? మరో విషయం మనుధర్మ శాస్త్రాన్ని వివిధ భాషల్లోకి అనువదించిన

మహనీయులందరూ బ్రాహ్మణార్యులే – అన్నది మనం గమనించుకోవాలి! ఇంకా మరికొన్ని వివరాలు చూద్దాం! శూద్రుల పిల్లలకు ఉపనయనం చేసుకునే అర్హత ఉండదు. ఈ కాలంలో ఎవరైనా చేసుకుంటున్నారంటే వారు తమని తాము అగ్రవర్ణం స్థాయి కి తీసుకుపోతున్నారని – పరాయీకరణ చెందుతున్నారనీ అర్థం.

మాంగల్య బ్రాహ్మణస్య సాక్షత్రియస్య బలావితమ్‌.
వైశ్యస్య ధనసూచంక్తు శూద్రస్యతో జుగుప్సితమ్‌ మంగళకరమైన పేరు బ్రాహ్మణుడికి, వీరత్వాన్ని సూచించే పేరు క్షత్రియుడికి, ధన సూచికతో వైశ్యుడికి పేర్లు ఉండాలి. శూద్రుడికి నిందా పూర్వకమైన జుగుప్సాకరమైన పేరుండాలి అని అర్థం.

శర్మ వద బ్రాహ్మణస్య స్థాయోద్రజో రక్ష సమవీతమ్‌
వైశ్యస్య పుష్టి సంయుక్త శూద్రస్య ప్రేశ్య సంయుతమ్‌
అంటే గోపీనాథ్‌ శర్మ వంటి పేరు బ్రాహ్మణుడికి, రఘువీర్‌ సింV్‌ా వంటి పేరు క్షత్రియుడికి, ఘన్‌శ్యామ్‌ గుప్త వంటి పేరు వైశ్యుడికీ ఉండాలి. శూద్రుడికి బలరామ్‌ దాసు వంటి పేరు పెట్టాలి. మొదటి పేరు బలరామ అని పెట్టుకున్నా చివరకు వాడు దాసుడని లేదా బంటు అని స్పష్టంగా తెలిసే విధంగా పేరుండాలి.

వర్ణ వ్యవస్థను రూపొందించడమే కాదు, శతాబ్దాలుగా దాన్ని పరిరక్షించుకునే పనిలో బ్రాహ్మణార్యులు పూర్తిగా నిమగమై ఉన్నారు. అందుకే మనదేశంలో ఒక వ్యక్తి పేరును పూర్తిగా విశ్లేషించుకుంటే అతడి కులం, వర్ణం అన్నీ అర్థమవుతాయి. అలా అర్థమయ్యే విధంగా మనువాదులు డిజైన్‌ చేశారు.

ఉదాహరణకు ఉత్తర భారతదేశంలో వారి పేర్ల చివరి ద్వివేది, త్రివేది, చతుర్వేది అనేవి ఉంటుంటాయి. అంటే వారి గురించి వారు గొప్పగా, ఘనంగా ప్రకటించుకోవడమన్న మాట. ద్వివేది – రెండు వేదాలు చదివిన వాడు, త్రివేది – మూడు వేదాలు చదివినవాడు. చతుర్వేది – నాలుగు వేదాలు అవుపోసన పట్టినవాడు అని అర్థం. రోజుకు మూడుసార్లు పఠనం చేసేవారు ‘త్రిపాఠి’ అని పెట్టుకుంటారు. అలాగే యాగాలు, యజ్ఞాలు చేసినవారు ‘సోమయాజి’ అని పెట్టుకుంటారు. వాళ్ళ జీవితమంతా తమ అగ్రవర్ణ స్థానాన్ని ప్రకటించుకోవడంతోనే సరిపోతుంది. ఆ పరిధిలోనే గిరికీలు కొడుతూ కుంచించుకుపోయి ఉంటుంది.

ఆధునిక విజ్ఞాన శాస్త్రం, గణితం, చరిత్ర అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారుతూ వచ్చాయి. వేదం, పురాణాలు సంస్కృత భాషా ప్రావీణ్యం, పంచాంగం, జ్యోతిషం, వాస్తు వంటి విషయాలు తెలిసిన వారికి గౌరవమిచ్చారు. కానీ, అది మాత్రమే జ్ఞానం కాదు. అనే విషయం సామాన్య పౌరులు గ్రహిస్తూ వచ్చారు. ఇంకా కొందరు గ్రహించే దశలో ఉన్నారు. గతాన్ని అధ్యాయనం చేయడం వల్ల కుట్రలన్నీ వెల్లడయ్యాయి. కుతంత్రాలు బయటపడ్డాయి. మత మౌఢ్యంలోంచి బయటపడి స్వేచ్ఛాలోచనలో జనం విశ్వమానవులుగా ఎదుగుతున్నారు. తాము ఏ కులానికీ ఏ మతానికీ కట్టుబడి లేమని అధికారికంగా ”నో కాస్ట్‌ – నో రిలిజియన్‌” సర్టిఫికేట్లు తీసుకుని మానవ జాతి అంతా ఒక్కటే అని చాటి చెపుతున్నారు. గతంలో జరిగిన పొరపాట్లను ఎత్తి చూపాలన్నదే – ఈ ప్రయత్నం! తప్పితే, ఒక వర్గం వారిని విమర్శించాలని కాదు. శతాబ్దాల క్రితం జరిగిన పొరపాట్లను సరి చేసుకుందామని చెప్పడం తప్ప, సమకాలీనంలో మన జనాభాలో భాగమైన బ్రాహ్మణవర్గం మీద ఉక్రోషం వెళ్ళగక్కడం కాదు. శతాబ్దాల క్రితం జరిగిన పొరపాట్లకు సమకాలీనంలోని వారు ఏ విధంగానూ బాధ్యులు కారు కదా? అయితే అవే పాత పద్ధతులు వర్థిల్లాలని తాపత్రయ పడేవారు కొంచెం వారి ‘మైండ్‌ సెట్‌’ మార్చుకుంటే బావుంటుంది.

ఒక శూన్యానికి ‘దైవం’ అని పేరు పెట్టి, దాన్ని జనానికి మత్తు మందులాగా అలవాటు చేసి ఆ తర్వాత ”ఈ భూమి మీద దైవ స్వరూపులు మరెవరో కాదు, బ్రాహ్మణులే” అని తమ గురించి తామే ప్రకటించుకున్నారు కదా? అంటే ఈ శూన్యంలో తమను తాము ప్రతిష్టించుకున్నారు. సామాన్య జనం నమ్మి పూజారిని అపర పరమాత్మ స్వరూపుడనుకున్నారు. దైవస్తుతిలో ఎవరైనా ఓ కీర్తన పాడితే ఇక ఏకంగా అతణ్ణి దైవ స్వరూపుడన్నారు. అతను చనిపోలేదు – దైవంలో ఐక్యమై పోయాడు అని అన్నారు. ఇన్నిన్ని అభూత కల్పనల మధ్య సామాన్య జనం ఆలోచించలేక, మెదడ్లు మొద్దుబారిపోయి, తరతరాలుగా వాస్తవాలు గ్రహించలేకపోయారు.

భ్రమలు తొలగాలంటే జీవ పరిణామం, జన్యుశాస్త్రం, ఖగోళశాస్త్రం గురించి కొంత ప్రాథమిక పరిజ్ఞానమైనా తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఇంకా పెంచుకోవాలి. కొందరు గౌరవనీయులైన మూర్ఖులుంటారు. అశాస్త్రీయమైన విషయాలకు శాస్త్రీయ వివర ణలివ్వాలని ప్రయత్నిస్తుంటారు. వారిని నిర్దాక్షిణ్యంగా పక్కకు తొలగించు కుంటూ – మానవ జాతి అంతా ఒక్కటే – అందరిదీ ఒకేస్థాయి అని ఎలుగెత్తి చాటుకుంటూ ప్రగతి పథంలోకి కదలాలి – మానవవాదులుగా గెలవాలి! మానవవాద ప్రపంచానికి రూపకల్పన చేయాలి!!

– వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడమీ విజేత, జీవశాస్త్రవేత్త.
డాక్టర్‌ దేవరాజు మహారాజు

09/17/2023

#పెరియార్_రామస్వామి
ఒక పెద్ద దేశం చిన్న దేశాన్ని అణిచివేయాలని చూస్తే నీను చిన్న దేశం వైపు నిలబడతాను
ఆ చిన్న దేశంలో మెజారిటీ మతం చిన్న మతాన్ని అణగద్రొక్కలని చూస్తే..నీను చిన్న మతం వైపు నిలబడతాను..
ఆ మైనారిటీ మతంలో కులాలు ఉండి ఒక కులం మరో కులాన్ని అణగద్రొక్కాలని చూస్తే నీను అణిచివేతకు గురైయ్యే కులం వైపు నిలబడతాను..
ఆ అణిచివేతకు గురైన కులంలో ఒక యజమాని తన నౌకరుని అణిచివేయాలని చూస్తే నీను ఆ నౌకరు వైపు నిలబడతాను..
ఆ నౌకరు తన భార్య హక్కులను కాలరాస్తుంటే నీను ఆ నౌకరి భార్య వైపు నిలబడి గొత్తెత్తుతాను..

చివరికి నీను చెప్పేది ఏంటంటే అణిచివేత అనేది ఎక్కడ ఉంటే ఆ బాదితులవైపు నిలబడతాను ఎందుకంటే అణివేయాలని చూసేవారంత నా శత్రువులు.

09/11/2023

రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే!కానీ...
ఒకరికి ఆదివారం 9గంటల పాటు, ఇంకొకరికి అర్థరాత్రి 3 గంటల వరకు కోర్టులు పని చేస్తాయి.మరొకరికి 4ఏళ్లపాటు కోర్టుకు రాకుండా వుండే వెసులుబాటు వుంటుంది!

09/07/2023

ఈ దేశానికి ఉన్న రోగాన్ని సరిగ్గా గుర్తించిన డాక్టర్

🎯 👉అసలు ఇంతకీ ఉదయనిధీ ఏమన్నారు....❓️

🎯సనాతన ధర్మ నిర్మూలన సదస్సులో మాట్లాడుతూ🎯

️ 🎯♦️👉 సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకం అని

️ ♦️👉 సనాతన ధర్మం ఒక సామాజిక తిరోగమన సంస్కృతి అని ప్రజలను కులాల పేరట విభజించి వివక్షనింపిందని అన్నారు.

♦️👉 ఇది కులం లింగం ప్రాతిపదికన ప్రజలను విభజిస్తుందని సమానత్వం , సామాజిక న్యాయానికి ప్రాథమికంగా వ్యతిరేకిస్తుందని అన్నారు.

🎯👉 సనాతన ధర్మం సమాజం పై ప్రతికూల ప్రభావం పై #అంబేద్కర్ #పెరియార్ రచనలని ఏ వేదికలోనైనా ప్రదర్శించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని.

🎯👉 అనేక సాంఘీక #దురాచారాలకు సనాతన ధర్మమే కారణమని వ్యాఖ్యానించారు.

🎯👉 మహిళల హక్కులకు సమానత్వానికి సాధికారతకు సనాతన ధర్మం వ్యతిరేకం అని ఉదయ నిధి పేర్కొన్నారు.

🎯👉 సనాతన ధర్మం వల్ల #బాధితులైన_అణగారిన వర్గాలవారి తరపున తాను #మాట్లాడానని చెప్పారు.

♦️👉ఎటువంటి సవాలునైనా ఎదుర్కొనడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని చెప్పారు.

#ఉదయనిధీ స్టాలిన్ పేర్కొన్నారు.

09/07/2023

ఉదయనిది స్టాలిన్ తల దొరకకపోతే!!!!
నా తల ఇస్తాను రండి !!!!
ఎందుకంటే????
అంటరానితనం అస్పృశ్యత
నిచ్చిన వ్యవస్థతో కూడిన కుల వివక్షత బాల్యవివాహాలు, సతీసాగమనం
#దేవదాసీ, జోగినీ వ్యవస్థలు
అంటూ మనిషిని మనిషిగా చూడని ఈ సనాతన ధర్మానికి నేను కూడా వ్యతిరేకినే
సృష్టిలో ప్రతి దానిలో అమ్మను చూసే సనాతన ధర్మం ఆడతనంలో మాత్రం అమ్మను చూడలేకపోయింది
ఈ దేశంలో ఆవుకి ఉన్న రక్షణ ఆడదానికి లేకుండా పోయింది

పెళ్లయిన మొదటి మూడు రాత్రులు పురోహితుని పక్కలో పడుకోవాలి అనే సనాతన ధర్మానికి నేను కూడా వ్యతిరేకినే

చదువుల తల్లి సరస్వతి దేవియే అయిన స్త్రీకి మాత్రం చదువుకునే హక్కు లేదనే సనాతన ధర్మంకి నేను కూడా వ్యతిరేకినే

ఆష్టములో పుట్టిన కృష్ణుని దేవుడు గాను అదే ఆడదాన్ని పాడుదానిగాను చూసే ఈ సనాతన ధర్మానికి నేను కూడా వ్యతిరేకినే

ఇంకా ఎన్నో మానవ జీవనానికి వ్యతిరేకమైన నియమ నిబంధనలు సనాతన ధర్మంలో ఉన్నవి వాటిని నిర్మూలించవలసిన బాధ్యత మనకు ఉన్నది

నా దృష్టిలో కుల మతాలు అనేవి మలమూత్రాల కంటే హీనమైనవి

We support Nidhi Stalin

09/06/2023

మన సన్నాతులు చెప్పే ధర్మానికి ఒక మచ్చుతునక

09/05/2023

నా దేశంలో నా ప్రజలు ఎంతకాలం మనుష్యులుగా గుర్తించబడరో అంతకాలం, ఈ తిరుగుబాటుగీతం పాడుతునేఉంటాను నా జాతి నా వారసత్వాన్ని కొనసాగిస్తుంది
- గద్దర్

09/02/2023

ికార_వ్యసనానికి_విరుగుడు_లేదా?
పదేళ్ల క్రితం ఏర్పడిన తెలంగాణలో మనకు తెలియకుండానే జరిగిపోతున్న ఒక ప్రమాదకరమైన పరిణామాన్ని ఎవరూ గుర్తించడం లేదు, గుర్తించినా నోరుమెదపడం లేదు...

ఈ అధికార వ్యసనానికి విరుగుడు లేదా?
పదేళ్ల క్రితం ఏర్పడిన తెలంగాణలో మనకు తెలియకుండానే జరిగిపోతున్న ఒక ప్రమాదకరమైన పరిణామాన్ని ఎవరూ గుర్తించడం లేదు, గుర్తించినా నోరుమెదపడం లేదు. అధికార పొందికను ‘యథాతథ స్థితి’ ఆవరించింది. మూడోసారి అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. యుద్ధమే జరగాల్సిన చోట సర్దుబాటు కోసం గుంజాటనపడుతున్న స్థితి కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్‌లోని చతురత అత్యంత ప్రమాదకరమైంది. మన తెలియకుండానే మన వెన్నెముకకు మత్తు ఇచ్చి చప్పట్లు కొట్టించుకోగల దిట్ట కేసీఆర్. దళితుడికి ముఖ్యమంత్రి పదవి వాగ్దానం సంగతి దేవుడెరుగు. మూడెకరాల భూమి ఇస్తానని ఎందుకు ఇవ్వలేదు? అని ఎవరూ ప్రశ్నించలేదు. పోనీ కనీసం లోతుగా చర్చించనూ లేదు. భూమి ఉపాధి వనరు మాత్రమే కాదు. వ్యక్తిత్వ నిర్మాణంలో కీలకమైంది, మన ఉనికికి చిరునామా భూమి. సామాజిక స్థానాన్ని నిర్ణయించగల శక్తి ఉన్న వనరు. సామాజిక చలన స్వభావాన్ని ప్రభావితం చేయగలదు. అందుకే చరిత్ర నిండా భూమే ఆవరించి ఉంటుంది. దాని చుట్టూ జరిగిన పోరాటాల చరిత్ర నిక్షిప్తమై ఉంటుంది.

కేసీఆర్ పదేళ్ల పాలనను నిశితంగా పరిశీలిస్తే తెలిసేదేమిటి? బడాయి మాటల వెనుక దాగిన ప్రమాద స్థాయిని అంచనా వేయగల పరికరమేదైనా మనవద్ద ఉందా? ‘సంక్షేమం’ పేరిట ఊదరగొడుతున్న పథకాల అసలు సారమేంటి? ఎవరికి సంక్షేమం? ఎవరికి అధికారం? ఈ ప్రశ్నలు వేసుకుంటే... పొరలుపొరలుగా తెలంగాణ సమాజాన్ని ఆవరిస్తున్న ప్రమాదం ఖరీదు ఏపాటిదో అర్థమవుతుంది.

ఉద్యమ సారథ్యమంతా మటుమాయమైంది. ‘ఊక’ మొత్తం అధికారంలో భాగమైంది. ‘మూకల’ ప్రాబల్యం పెరిగిపోయింది. రూకలుగలవారంతా అమాత్యులయ్యారు. మూడెకరాల భూమి, కేజీ టు పీజీ విద్య లాంటి రాష్ట్ర ఆవిర్భావం సమయంలో చేసిన వాగ్దానాలు నీటి మూటలయ్యాయి. కానీ, ఆ తర్వాత వచ్చి చేరిన రైతుబంధు, ఉచిత విద్యుత్ లాంటివి అధికార సాధనలో తిరుగులేని ఆయుధాలయ్యాయి. రైతుబంధు అందుతున్నదెవరికి? ఉచిత విద్యుత్ వల్ల ఏ వర్గాలకు ఎక్కువ మేలు జరుగుతోంది? కేజీ టు పీజీ విద్య అందివుంటే ఏ వర్గాలు బాగుపడేవి అనే ప్రశ్నలే ఉత్పన్నం కాలేదు. అవే ఎన్నికలు, వారే అభ్యర్థులు, అదే వాగ్దానశూరత్వం, అవే జనరంజక ఉపన్యాసాలు. మందుతో మాయపుచ్చే సభలూ, జన సందోహాలు ముందు కలలు ఏకరువు పెట్టే నేతలు.
పథకం ప్రకారం ‘ఒక అధికార పొందిక’ను నిరవధికంగా కొనసాగించే పనిలో ఉన్నారు కేసీఆర్. ప్రశ్నించగల నేతనూ, నిటారుగా నిలబడే నాయకుణ్ని, నిపుణత ప్రదర్శించగల వ్యక్తిత్వాన్ని కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే ఆదరించడం లేదు. ‘అధికారాన్ని’ అలవాటుగా మార్చే క్రమంలో కేసీఆర్ చేస్తున్న యజ్ఞంలో ‘స్వేచ్ఛ’ సమిధ అయిపోతోందన్న ‘ఎరుక’ను కూడా కేసీఆర్ విజయవంతంగా రద్దు చేశారు. గతం కోసం జ్ఞాపకం చేసే పోరాటాన్ని మనకు తెలియకుండానే నిషేధించారు.

‘అధికారం’ అలవాటుగా మారడం అత్యంత ప్రమాదకరమైన పరిణామం. ‘సమ్మతిని సృష్టించి’ దాని ద్వారా ఏర్పడిన సానుకూల వాతావరణంలో ‘అధికారాన్ని’ ఓటు రూపంలో పొందడంలో కనీసం ఐచ్ఛికం కాకపోయినా, ఏదో ఒక ఒప్పుకోలు ఉంటుంది. కానీ, కేసీఆర్ గడచిన పదేళ్లుగా తెలంగాణ ప్రజానీకానికి అర్థంకాకుండా అధికారాన్ని ‘అలవాటు’ చేస్తున్నారు. అట్లా అలవాటు చేసే క్రమంలో ‘అధికార ప్రాయోజిత బృందాల’ను ఏర్పాటు చేస్తున్నారు. అవి మనకు బయటకు కేసీఆర్ అభిమాన ప్రాయోజిత బృందాలుగా కనపడి భ్రమింపచేయవచ్చు కానీ, అంతిమంగా అవి చేస్తున్నది ‘Advertising of Totalitarianism’ అని గుర్తించాలి. ఆశావహుల పేరిట అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆర్భాటాలు చేస్తున్నవారంతా ఈ కోవలోకే వస్తారు.

ప్రశ్నించవీలులేని వాతావరణం మనకు తెలియకుండానే అలవాటుగా మారుతున్న వైనాన్ని నిశిత దృష్టిగలవారు ఎరుక చేసుకోవాలి. బతుకమ్మలు, బోనాలు, నిమజ్జనోత్సవాల్లో ఈ తరహా Sponsor Groups మూలాలు... ఆయా సందర్భాల్లో మనకు కనిపించే రంగుల ఫ్లెక్సీల్లో దర్శనమిస్తాయి. కులవృత్తుల ప్రోత్సాహం పేరిట, దళిత బహుజనోద్ధరణ పేరిట జరుగుతున్న సంక్షేమ యాగంలో ‘అధికార పొందిక’కు తాము దూరమవుతున్నామన్న స్పృహ మూలవాసుల్లో లేకుండా పోతోంది. ‘రైతుబంధు, దళిత బంధు, బీసీబంధు, గిరిజన బంధు’ పథకాల వెన్నంటి అట్టడుగు వర్గాలకు అధికారాన్ని దూరం చేసే బృహత్ ప్రయత్నమొకటి నిరాటంకంగా సాగుతోంది. బడుగు జీవులకు ‘ఏలిక’ ప్రసాదించిందే ప్రాప్తం. ప్రజాస్వామ్యయుతమైన పాలన క్రమంగా వితరణ క్రతువుగా మారుతోందన్న జాగరూకత లేకుండా పోవడమే మహా విషాదం. సాలభంజికల మంత్రివర్గాన్నీ, చప్పట్లు చరిచే జనసమూహాల్నీ, బారులు తీరి ఓట్లు వేసే బడుగు జీవులను తయారు చేసుకున్న తర్వాత ప్రశ్న తానంతటదే రద్దవుతుంది. స్వేచ్ఛ అంతర్ధానమవుతుంది. చైతన్యపూరితమైన ఆందోళనల్లో, ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమబావుటాల్లో పురుడుపోసుకున్న ‘తిరుగుబాటు తత్వం’ క్రమంగా కనుమరుగవుతుంది.

అధికారం అలవాటుగా మారే క్రమం చాలా నిర్దయగా ఉంటుంది. అచేతనత్వం మన స్వభావంలో ఇమిడిపోతుంది. అనస్తీషియా స్థితిలో అంగీకారపత్రం రాసినట్టూ, యథాలాపంగా బడ్డీకొట్టుకెళ్లి సరుకులు కొన్నట్టూ ఓటు కూడా అలవాటుగా చేసే దినచర్యలా మారుతుంది.

‘ప్రశ్న’, ‘స్వేచ్ఛ’ లాంటి మాటలు వినబడే స్థలాలను పాలకులు దుర్భిణీలు పెట్టి వెతుకుతారు. నిఘా డ్రోన్లను పురమాయిస్తారు. ‘ఏకఛత్రాధిపతికి నమోవాకములు’ చెల్లించని చోటును గాలించి మరీ చదును చేస్తారు. ఆత్మహననానికి పురస్కారాలు ప్రకటిస్తారు. ‘ఎదురు నిలిచిన గతాన్ని’ గుర్తు చేసే సంకేత స్థలాలను వేలంపాటలో విక్రయిస్తారు. అందమైన స్మృతి వనాలను, పచ్చదనంతో ఆకర్షించే స్మశానాలను నిర్మిస్తారు. సామాన్యుడి వెతలు వినాల్సిన సచివాలయం శ్వేతసౌధంగా మారి జనాన్ని వెక్కిరిస్తుంది. ఆశల రెక్కలు విరిచి కట్టి, కలల లోకానికి కంచెలు నాటిన తర్వాత రెండు పడకలగది ఇల్లంటే అది ఇంద్రభవనంతో సమానమవుతుంది. విధి తప్ప గతిలేని కాలంలో వృద్ధాప్య ఫించనే ఆదరువు అవుతుంది. నిన్నగాక మొన్న ప్రవేశపెట్టిన ‘గృహలక్ష్మి’ నిరుపేదల పాలిట గగన కుసుమంగా మారుతుంది. దాతృత్వం పాలనా స్వభావంగా మారిన తర్వాత విదిలింపుల కోసం పడిగాపులు కాయడం పరిపాటి అవుతుంది. సామాన్యుల మేలు కోరే సమూహాలు ఒక్కొక్కటిగా అంతరించిపోతాయి. పీడితజనం కోసం పుట్టిన పార్టీలు కూడా అధికారపు దాహర్తిలో బేరాల కోసం బేల చూపులు చూస్తాయి.

తెలంగాణలో జరుగుతున్నది ఇదే! చైతన్యం వెల్లివిరిసిన నేలపై పాలకులకు గులాము చేయాల్సిరావడం ఆత్మహత్యాసదృశం కాదా? అచేతనంగా అయినా సరే... అధికారం ముందు సాగిలబడటం నేరం కాదా? అధికార క్రీడగా మారిన ఎన్నికల్లో సామాన్యుడి స్వరం వినిపించాలని భావించడం అమాయకత్వమే అవుతుంది. బధిరమైపోయిన పాలన ముందు నినాదం ఎవరికీ పట్టని గావుకేక అవుతుంది. ఆక్రందన వినకూడదని భీష్మించుకున్న ప్రభువుకు అంత్యక్రియలు కూడా విధిరాతలే అవుతాయి.

అధికారాన్ని వ్యసనంగా చేసుకున్న పాలకుల రాజకీయాల్లో పాలితులుగా మనం కూడా అదే అధికారాన్ని అలవాటుగా మార్చుకుంటున్నామా? మనుగడను ప్రశ్నార్థకంగా మార్చుతున్న వర్తమానంలో నిశ్చేష్టులమవుతున్నామా? తస్మాత్ జాగ్రత్త!

భార్గవ్ కేశరాజు (జర్నలిస్ట్)

Want your school to be the top-listed School/college in Memphis?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address

Memphis, TN
Other Education in Memphis (show all)
Porter-Leath Porter-Leath
3400 Prescott Road
Memphis, 38118

Since 1850, Porter-Leath has been key resource for Memphis children and families. By focusing on the

RISE Memphis RISE Memphis
1355 Lynnfield Road, Suite, 101 101
Memphis, 38119

Follow RISE no matter what platform you're on! Twitter - @RISEMemphis Instagram - @risememphis

Universal Cheerleaders Association Universal Cheerleaders Association
6745 Lenox Center Court, Ste 300
Memphis, 38115

Welcome to the Official Universal Cheerleaders Association Fan Page! If you have any questions regar

The Memphis Challenge, Inc. The Memphis Challenge, Inc.
516 Tennessee Street
Memphis, 38103

Inspiring and Developing Future Memphis Leaders

Infonet Library Infonet Library
Bert Bornblum And Jess Parrish Library
Memphis, 38101

Welcome to the Reference On the Go virtual desk at the InfoNet Library. We can chat or send a mess

Memphis Historians Memphis Historians
Memphis, 38152

This page is for faculty, staff, students, alumni, and friends of the Department of History at The U

The BLVD Toastmasters The BLVD Toastmasters
Zoom
Memphis

Club was started in November 2018 to reach and connect to a broader audience for invite to club meet

Elle & Marie's Learning Station Elle & Marie's Learning Station
Memphis

The learning station is here for all of your educational needs.

Brilliant Minds Child Development Center Brilliant Minds Child Development Center
1019 Berclair Road
Memphis, 38122

Brilliant Minds Child Development Center is a premier childcare agency dedicated to nurturing and

Chinni Chinni
Memphis

���

The One Room SchoolHouse The One Room SchoolHouse
Tipton County
Memphis

Academic Tutoring: K (age 5) — 3rd Grades (all subjects) and 4th — 8th Grades (Literacy/Language Art