నవరసాలే ఉలిక్కిపడేలా నటనలో జీవించడం ఒదిగి పోవడం అంటే ఏమో అనుకున్నాం గాని మన నటసార్వభౌమ విశ్వగురుని చూసిన తర్వాత బాలీవుడ్, హాలీవుడ్ బలాదూర్.
జర ఆర్టిస్టులను ఎంకరేజ్ చేసి పాతవి పనికిమాలినవి కాకుండా ఏవైనా కొత్తగా ఖండాంతర అవార్డులను కనిపెట్టి ఇయుండ్రి.
మోడీ నా!
మజాకా!!
ఇంతటి శోకసంద్రానికి అందరం కరిగిపోయాం గాని జరసేపు ఆ శోకాన్ని ఆపి గంగా నది శుద్ధి కోసం కేటాయించిన/ఖర్చు చేసిన ఇరువైవేల కోట్ల రూపాయలు ఏమయ్యాయో చెప్పు.
Note:- ( ఏడ్చే మొగోన్ని చూసి నమ్మొద్దు అని అంటారు) 🤣😇🥲😂😅
Venkat Gaddam
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Venkat Gaddam, Education, Memphis, TN.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి సాధారణ ప్రక్రియ మాత్రమే. ప్రజలు దీర్ఘకాలికంగా రాజరికాలకు నియంతృత్వాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు త్యాగాలు చేసి ఏర్పాటు చేసుకున్న ప్రజాస్వామ్య వ్యవస్థను నేటి మన నాయకులు ఎన్నికల స్థాయికి దిగజార్చి ఓట్లు సీట్లు అనే భావనకు ప్రజలను పరిమితం చేసి ప్రజాస్వామ్య లక్ష్యాల ఆశయాలకు విరుద్ధంగా అప్రజాస్వామిక విధానాలను అప్రకటిత నిర్బంధాన్ని కొనసాగించడం ప్రస్తుత పాలకులకు (నియంతలకు) పరిపాటి అయింది.
Fake guarantees
మళయాళం మూవీ Anweshippin Kandethum నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.. హీరో ఇన్స్పెక్టర్ గా మనవాళ్ళు తీసే
రొడ్డకొట్టుడు సినిమాలకు, మళయాళం లో వచ్చే సినిమాలకు తేడా తెలుస్తుంది.దర్శకుడు డార్విన్ కి ఇది తొలి చిత్రం కావటం విశేషం.. కథను ఎంత జాగ్రత్తగా వాళ్ళు ఫాలో అవుతారో....
#SaveConstitution #Savecountry from #Fascist forces by #ProfMadhuprasad #DU #CLC50years celebrations
శ్రామిక మహిళ దినోత్సవం
-------------– –––––––––––
1857మార్చి8న అమెరికా లోనిన్యూయార్క్ లోగార్మెంట్ పారిశ్రామిక మహిళాలు8గంటల పనిదినం.శ్రమకుతగ్గవేతనంకోసంమహిళాకార్మికులుపోరాటంచేస్తున్నవాళ్ళపైకాల్పులుజరిపిరక్తంపారించినదినం.జర్మనీలోరెండవకమ్యూనిస్టుఇంటర్నేషనల్ సమవేశములోమహిళాలపోరాటన్నిగుర్తిస్తుక్లారాజట్కీన్ .రోజలగ్జెంబర్క్ లుమార్చి8న అంతర్జాతీయ మహిళాదినంగా1910లోప్ర కటించడంజరిగింది.
కానిమనదేశంలోమహిళదినంఅంటేప్యాషన్ షోలు.3.5కెరన్ లు.ముగ్గులపోటిలు.బతుకమ్మలు.
ఇక్కడి మహిళాలనుఈదేశబ్రాహ్మణీయభూస్వామ్యసంస్క్రతి
స్త్రీ నిశ్రంగారసాధనంచేస్తే.సామ్రాజ్య వాదసంస్క్రతిఆమేనుసరుకుగామార్చింది.ఇక్కడి మహిళాల అభ్యున్నతికిపోరాడింది.జ్యోతి రావ్ పూలే.సావిత్రి బాయిపూలే.అంబేద్కర్. పెరియార్ లుమత్రమే.విరిపోరాటబాటలొమహిళాలువుద్యమాలుచేయలి.అన్ని రంగలలోమహిళాలుచదువుకోనిఉన్నతస్థాయిలోవున్నరంటేదానికికారాణంసావిత్రిబాయిపూలే
సైన్స్ విజ్ఞానం--మత అజ్ఞానం
*************************
సైన్స్ విజ్ఞానం
************
విజ్ఞాన శాస్త్రం (లేదా సైన్సు) అనేది ఈ ప్రపంచం గురించి, ప్రకృతి గురించి, జీవావిర్భావము గురించి మనకు తెలియని, విశ్లేషించలేనటువంటి విషయాల్ని ప్రశ్నించి, ప్రయోగ, పరికల్పనల ద్వారా విశ్లేషించిన సమాచారాన్ని ఒక పద్ధతి ప్రకారం వివరించే శాస్త్రం.
సైన్స్ ప్రయోగాలు ఈ ప్రపంచంలో ఎక్కడ,ఎవరు చేసినా ఒకే రకమైన ఫలితాలు వస్తాయి. ఇవి కుల, మత, వర్గ, వర్ణ,ప్రాంతీయ బేధాలు లేకుండా అందరికీ వర్తించే విషయాలు.ప్రపంచ మానవాళికి ఉపయోగకరమైన విషయాలను అందిస్తుంది సైన్స్.
ఇది సార్వజనీనం . విశ్వవ్యాప్తం.
ప్రస్తుత మనిషి కరెంటు లేనిదే ఉండలేని పరిస్థితికి వచ్చాడు. నీళ్లు కావాలంటే కరెంటు. గాలి కావాలంటే కరెంటు.ఇంట్లో దీపం వెలగాలంటే కరెంటు. వేళకు భోజనం చేయాలంటే కరెంటు.
నీవు వేసుకునే బట్టలు తయారు కావాలంటే కరెంటు. వంటకు కరెంటు. పంటకు కరెంటు.
కరెంటు లేనిది బతకలేము.
సైన్స్ లేనిది ఏ జీవము బతకదు.
సైన్స్ పుట్టుక
************
మధ్యప్రాచ్య ప్రాంతానికి చెందిన "అల్ హజెన్" అనే శాస్త్రవేత్త కాంతిశాస్త్రంపై ఒక పుస్తకాన్ని ప్రచురించడం ద్వారా ప్రయోగ పూర్వక విజ్ఞాన శాస్త్రానికి నాంది పలికాడు.
ప్రాచీన కాలం నుంచీ 19వ శతాబ్దం వరకు విజ్ఞానశాస్త్రాన్ని ఇప్పుడున్న స్వరూపంగా కాక తత్వశాస్త్రంలో ఒక భాగంగా భావిస్తూ వచ్చారు. పాశ్చాత్య దేశాల్లో ప్రకృతి తత్వశాస్త్రం అనే పేరుతో ప్రస్తుతం విజ్ఞానశాస్త్రాలుగా భావించబడుతున్న ఖగోళ శాస్త్రం, వైద్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మొదలైన రంగాల మీద పరిశోధన చేసేవారు.
ప్రాచీన భారతీయులు, గ్రీకు శాస్త్రవేత్తలు భౌతిక ప్రపంచాన్ని తత్వ శాస్త్రం ప్రకారం నేల, గాలి, నిప్పు, నీరు, నింగి అని విభజిస్తే మధ్యయుగపు మధ్యప్రాచ్యానికి చెందిన శాస్త్రవేత్తలు మాత్రం పరిశోధనలు, ప్రయోగ పూర్వక విధానాల ద్వారా పదార్థాలను వివధ రకాలుగా వర్గీకరించడం మొదలుపెట్టారు.
17, 18 వ శతాబ్దాలలో శాస్త్రవేత్తలు శాస్త్ర పరంగా తాము కనుగొన్న సత్యాలను కొన్ని ప్రకృతి నియమాల రూపంలోకి సూత్రీకరించే ప్రయత్నం చేశారు.
19వ శతాబ్దం గడిచేకొద్దీ విజ్ఞాన శాస్త్రం అంటే కేవలం పరిశోధనల ద్వారా భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమేనన్న భావన బలపడింది.
19వశతాబ్దంలోనే జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం లాంటి శాస్త్రాలు ప్రస్తుతం ఉన్న రూపును సంతరించుకున్నాయి.
ఇదే శతాబ్దంలోనే శాస్త్రవేత్త, శాస్త్రీయ సమాజం, శాస్త్ర పరిశోధనా సంస్థ అనే భావనలు రూపుదిద్దుకున్నాయి.
సైన్స్ లక్ష్యాలేమిటి?
******************
సైన్సు లక్ష్యం, సత్యమును అన్వేషించడం. అన్వేషించిన విషయాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయడం.
సైన్సు ప్రయోగ పరిశీలన పద్ధతి ద్వారా సత్యమును నిర్ధారణ చేయడం.
సైన్సునిత్యాభివృద్ధిని కాంక్షించడం.
సైన్సు వ్యక్తిగతంగా, సామాజికంగా స్వయం సంస్కరణను ప్రోత్సహించడం.
సైన్సు ఒక ఒక విషయం పట్ల భ్రమ పడిన దానిని సరి అయినదా కాదా అని నిర్ధారించడం.
మానవులకు రక్షణగా నిలబడడం.
సైన్సు మనుషులకు జీవన మార్గాన్ని నిర్దేశించడం.
అందరూ మానవులు సమానమేనన్న ఉన్నత భావాన్ని కలగజేయడం.
విశ్వ పరిణామాన్ని ప్రకృతి రహస్యాలను పరిశోదించడం.
సైన్సు ఒక జీవన రంగంలోనే కాదు వ్యవసాయ రంగం ఆర్థిక సంఘం అన్ని రంగాల్లో అభివృద్ధి కాంక్షించడం.
మూఢ విశ్వాసాల గుట్టును బయట పెట్టి, మానవుల అజ్ఞానం నుండి, మూర్ఖత్వము నుండి బయటకు తీసి వైజ్ఞానికులుగా తయారు చేయడం.
మానవులకు స్వేచ్ఛ స్వాతంత్యాలను అందజేయడం.
మానవులలో దాగి ఉన్న హేతుబద్ధ ఆలోచనలను బయటకు తీసి మానవులను విజ్ఞానవంతంగా తయారు చేయడం.
సృష్టికర్త లేడని విశ్వం దానికదే పరిణామం చెందినదని మానవుడు విశ్వంలో అంతర్భాగమని ప్రకటించడం.
దైవభావన, స్వర్గనరక భావనలు తప్పని, పురాణాలలో మత గ్రంధాలలో ప్రవచించిన వన్నీ అసత్యాలేనని నిరూపించడం.
భావ బానిసత్వాన్ని వదిలించి భౌతిక తత్వాన్ని అవగాహన కలిగించడం.
సైన్స్ కార్యక్రమాల
అవగాహన,
****************
ప్రజల్లో , విద్యార్థుల్లో
*****************
సైన్సు పట్ల అవగాహన, మరియు వైజ్ఞానిక దృక్పథం పెరగాలి.
ఏమిటి,ఎలా,ఎందుకు లాంటి ప్రశ్నలతో సైన్సు తత్వాన్ని అవగాహన చేసుకోవాలి.
కరెంటు మన నిత్యజీవితంలో ఎంత అవసరమో వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి.
కరెంటు వల్ల నష్టం కూడా ఉంది. లాభం కూడా ఉంది. అది వాడుకునే విధానం తెలుసుకోవాలి
మనుషులంతా ఒక్కటే అని, మానవ సమానత్వ భావన పెరగడానికి సైన్సు తోడ్పడుతుంది .
సైన్స్ గురించి మనుషులు తాము తెలుసుకున్న వాస్తవాలను ఇతరులకు మంచి అలవాటు నేర్చుకోవాలి.
సైన్స్ వల్లపర్యావరణ కాలుష్యం, జనాభా విస్ఫోటనం , అణు యుద్ధ ప్రమాదం లాంటి సమస్యల పరిష్కారానికి, మానవ వినాశకర పరిస్థితుల పట్ల అవగాహన పెరుగుతుంది.
భూగోళం మానవాళి నివాస యోగ్యం చేసే
స్పృహ పెరుగుతుంది.
భూగోళం చుట్టూ ఉన్న జీవుల మనుగడ కొరకు మానవాళి బాధ్యత వహించ వలసిన అవసరం ఉందనే విషయం అవగాహనకు వస్తుంది.
మత అజ్ఞానం
*************
మతం అంటే నియమాల, ఆచారాల, సంప్రదాయాల మిశ్రమం. మతం పుట్టినప్పుడు కొన్ని నియమాల ఆచారాలతో పుట్టింది,మరికొన్ని కాలాలకు, మరికొన్ని నియమాలు, ఆచారాలు, సంప్రదాయాలు కలిసి అది మతం రూపు దాల్చింది.
మన దేశంలో సుమారు 5000 సంవత్సరాల క్రిందట మత ఆవిర్భావము జరిగింది.
"అతి ప్రాకృతిక శక్తులపై విశ్వాసం, ఆ విశ్వాసాన్ని ప్రదర్శించే ఆచరణే మతం" అన్నారు కొందరు.
ఆ అతి ప్రాకృతిక శక్తులు దేవత కావచ్చు, దయ్యం కావచ్చు, మరేదైనా కావచ్చు. అయితే ఈ దేవత దయ్యాలు అన్ని మతాలకు సామాన్యం కావు. ఉదాహరణకు బౌద్ధానికి, మానవవాద మతానికి ఇది లేదు.అసలు మతం అనగానే మామూలుగా మనకు గుర్తుకు వచ్చేవి దేవుడు - దయ్యం, గుడి - గోపురం, పూజ - పూజారి, పవిత్ర గ్రంథం, ఉపవాసాలు మొదలైనవి. మరి ఇవన్నీ గూడ అన్ని మతాలకు లేవు.
మతాలలో రకాలున్నాయి.
*********************
1)అధికారిక మతాలు, 2)మానవవాద మతాలు.
1) అధికారిక మతాలు తమ అధికారాన్ని ప్రశ్నిస్తే సహించలేవు. పవిత్ర గ్రంథం ఏమి చెబితే అది ఎదురాడక శిరసావహించవలసిందే.
2)మానవవాద మతం పరిస్థితి వేరు. దేనినైనా ఎవరైనా ప్రశ్నించవచ్చు. హేతువుకు నిలబడిన వాటినే స్వీకరించమంటాయి మానవతా వాద మతాలు.
మత అజ్ఞానం
***********
మతాలు పుట్టుకతో ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి మతాలవి గడ్డ కట్టిన సంస్కృతి.
మతాల వల్ల ప్రపంచంలో మానవ మారణ హోమం జరిగినది. రోగాల వల్ల కాకుండా యుద్ధాల వల్ల కాకుండా మతకల్లోలాల వల్లనే అధిక ప్రాణ నష్టం జరిగింది.మతాలే మానవ ధర్మాన్ని మంటగలిపినవి.మతాలే మానవత్వాన్ని మసిచేసినవి.
మతాలే మానవుని క్రియాశూన్యం చేసినవి.
మతాలే కనపడని దేవుడిని కర్త,కర్మ,క్రియ చేసినవి.మతాలే కనబడని దేవుడిని సృష్టికర్త చేసినవి.
మతాలే మానవుని యొక్క ప్రతిభ, నైపుణ్యాన్ని పక్కనపెట్టి రాళ్ళముందు, లోహాల ముందు బోల్తాపడేటట్టు చేసేవి. మతాలే మానవుని
రాళ్లకు, లోహాలకు బానిసలుగా చేసినవి.
మతాలే మానవుని, మానవునిగా చూడకుండా చేసినవి.మతాలే మానవులలో సమానత్వ
భావాన్ని చంపేసినవి.
మతాలే వైజ్ఞానిక దృక్పథానికి అడ్డు తగులుతున్నవి.మతాలే సైన్సు సాంకేతిక
నైపుణ్యాలను అవహేళన చేస్తున్నాయి.
మతాలే సైన్సును, సాంకేతికతను ఉపయోగించుకుంటూ అజ్ఞాన ప్రచారం చేసేవి.
మతాలే మానవుల మధ్య పగ,ద్వేషాలను పెంచేవి.మతాలే మానవజాతిని మానవజాతి చంపుకునేట్టు చేస్తున్నవి.మతాలే మానవుని
విలువలను దిగజార్చినవి.
మతాలే మానవులను వేషధారులను చేసి, మోసకారులను తయారు చేసేవి.
మతాలే భౌతిక ప్రపంచాన్ని మాయ అని అభౌతికమే నిజమని భ్రమింపజేసేవి.
మతాలే మత గ్రంథాలు మనుషులు రాసినవి కావని, దేవుని వాక్కులని, అట్టి గ్రంథాలలోని పాత్రలు దైవాంశ సంభూతులని, దేవుళ్ళని భ్రమింపజేసి,మనుషుల్లో అజ్ఞానాన్ని, మూఢత్వాన్ని, మూర్ఖత్వాన్ని నింపినవి.
మతాలేమనుషుల్లో భక్తిని ప్రేరేపించి, ఉన్మాదంగా మారుస్తున్నవి. ఉన్మాదం పిచ్చిగా మారి, కన్న బిడ్డలను కూడా చంపుకునేటంత కఠినత్వాన్ని పెంచుతున్నాయి.
మతాలు వీడితేనే మానవత్వం.
మతాలు వీడితేనే సమానత్వం.
మతాలను నిషేధించుకుంటేనే వైజ్ఞానికం.
మతాలు వీడితేనే దేశాభివృద్ధి.
మతాలు వీడితేనే మానవునికి స్వేచ్ఛ, సుఖము, సమానత్వము, స్వాతంత్ర్యం.......
మత గ్రంథాల గురించి
మేడూరి గారి మాటల్లో...........
**************************
మత గ్రంథాలు
విశ్వసించమంటాయి.
ప్రశ్నించ వద్దంటాయి.
శోధించ వద్దంటాయి.
సంస్కరణ వద్దంటాయి.
మానవ సమానత్వాన్ని ఆమోదించవు.
జ్ఞానాన్వేషణ కు ఎదురు నిలుస్తాయి.
సత్యాన్వేషణ ను అడ్డుకుంటాయి.
ఈలోకం మాయంటాయి.
ఈలోక విద్యను అవిద్య అంటాయి.
మరు జన్మ మీద దృష్టి పడతాయి.
ఈ జన్మ మీద దృష్టిని నిలపనీయవు.
మరణానంతర ఆత్మ మీద కథలు అల్లుతాయి.
ఆశాభయాలను పెడతాయి.
మానవాభివృద్ధి కి ఎదురు పడతాయి.
విమతాల వారి మీద విద్వేషాలు పెంచుతాయి.
మానవ ప్రయత్నాన్ని నిర్వీర్య పరుస్తాయి.
స్వేచ్ఛాలోచనను అణుస్తాయి.
ప్రత్యక్ష జ్ఞానాన్ని కాదని భ్రమలను కలిగిస్తాయి.
భావ బానిసత్వాన్ని పెంచుతాయి.
సైన్స్ యొక్క ఉపయోగాలు, మతాలలోని దుష్టత్వాన్ని ప్రజలందరూ తెలుసుకొని తమ జీవితాన్ని బాగు చేసుకోగలరని మనవి.
వ్యాసకర్త:--
-------------
అడియాల శంకర్,
అధ్యక్షులు,
తెలంగాణ హేతువాద సంఘం
దేవదాసి వ్యవస్థను రద్దు చేయించిన దేవదాసీ బిడ్డ
====================సనాతన ధర్మశాస్త్రాలలో ఉందని నిమ్న వర్గాల బాలికలకు దేవుడితో పెండ్లి జరిపించి, వాళ్లని వేశ్యలుగా మార్చి సమాజ మంతా వాడుకునేది. వారినే దేవదాసీలనేవారు. ఆ దేవదాసీల వయసు నలభై దాటగానే వారిని వేలం వేసేవారు. వారిని వేలం పాటలో గెలుచుకుని, తీసుకుపోయిన వారు వారిని ఇంటి పనులకు, వ్యవ సాయ పనులకు ఇతరత్రా వాడుకునే వారు.ఇలాంటి నీచ నికృష్ట వ్యవస్థను సనాతన ధర్మం పేరుతో మనువాదులు ఈ దేశంలో వేల సంవత్సరాలు కొనసాగించారు. రాజరాజచోళుని కాలంలో ఒక్క తంజావూర్ దేవాలయంలోనే నాలుగు వందలకు పైగా దేవదాసీలు ఉండేవారని చరిత్ర చెపుతోంది.
8 అక్టోబర్ 1947 మద్రాస్ అసెంబ్లీ సభ్యలు ఒ.పి. రామసామి రెడ్డి యార్, ముత్తులక్ష్మి రెడ్డి దేవదాసీ నిర్మూలన చట్టం కోసం ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. అంతే-సభలో గందరగోళం ప్రారంభ మైంది. సత్యమూర్తి అయ్యార్, శ్రీనివాస్ అయ్యార్, గోవింద రాఘవ అయ్యార్, శేషగిరి అయ్యార్ల బృందం దాన్ని వ్యతిరేకించింది. అలా చేయడం సనాతన హిందూ ధర్మానికి వ్యతిరేకమని మత శాస్త్రాలకు వ్యతిరేకమని ఆందోళన ప్రారంభించారు. సనాతన ధర్మాన్ని వ్యతిరే కించే స్థాయి ఈ చట్టసభకు ఉందా? అని కూడా ప్రశ్నించారు. ఇరు పక్షాల ఆందోళనలను ఎలా అదుపు చేయాలో ఆలోచిస్తూ, సభను నిర్వహిస్తున్న రాజాజీ మౌనం వహించారు. గందర గోళాల మధ్య ఆనాటి సభ ముగిసింది. ఆ సాయంత్రం ముత్తులక్ష్మి రెడ్డి పెరియార్ ఇ.వి. రామసామి దగ్గరికి వెళ్లి సలహా అడిగారు. ఆయన ఆలోచించి కొన్ని సూచనలు చేశారు.
మరునాడు 9 అక్టోబర్ 1947న సభ ప్రారంభం కాగానే సత్య మూర్తి అయ్యార్ చర్చ మొదలుపెట్టారు – ”దేవదాసీలంటే సనాతన ధర్మం ప్రకారం శాస్త్రయుక్తంగా దేవాలయాలలో ఏర్పాటు చేయబడ్డ పరిచారికలు. వారు నేరుగా దైవసేవకులన్న మాట! వారు చేసే పవిత్రకార్యాలను బట్టి వారు భగవంతుని కృపకు పాత్రులవుతారు. వారికి భోగభాగ్యాలు లభిస్తాయి.”- అంటూ శాస్త్ర నియమాలన్నిటినీ ఊటంకిస్తూ సత్యమూర్తి సుదీర్ఘ ప్రసంగం చేశారు. మిగతా వారు కొందరు ఆయన బాణీలోనే మాట్లాడారు. అంతా అయ్యాక ముత్తు లక్ష్మి రెడ్డి లేచి ఇలా అన్నారు- ”అయ్యర్ గారు చెప్పిన శాస్త్ర విషయా లన్నిటితోనూ నేను ఏకీభవిస్తున్నాను. ఇన్ని వందల సంవత్సరాల నుండి మేము చేస్తూ వచ్చిన సేవలకు మాకు అందిన దైవకృప మాకు చాలు. అందుకున్న భోగ భాగ్యాలు కూడా మాకు సరిపొయ్యాయి. ఇటువంటి పనులు- అంటే దేవదాసీలవృత్తి చేయడం వల్ల దేవుడి ఆశిస్సులు లభిస్తాయని నమ్మేవారూ, సనాతన ధర్మాన్ని గౌరవించా లని అనుకునేవారు నిరభ్యంతరంగా వారి ఇంటి ఆడవారిని స్వచ్ఛం దంగా దేవదాసీలుగా మార్చుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు అయితే మా నిమ్న వర్గాల మహిళ లంతా ఈ వృత్తిని తిరస్కరిస్తున్నాం!” – అని ముగించారు.
సనాతన ధర్మం గురించి మహో పన్యాసాలిచ్చిన వారి నోళ్లు మూతప డ్డాయి. దొంగకు తేలు కుట్టినట్టు కిక్కురుమనకుండా కూర్చున్నారు. అప్పుడు అసెంబ్లీ ”దేవదాసీ నిర్మూలన చట్టాన్ని ఆమోదించింది.- ఆ తర్వాత వివిధ రూపాల్లో ఉన్న ‘దేవదాసీ వ్యవస్థ’ రద్దయింది. అప్పటి మద్రాసు రాష్ట్రంలో రాయలసీయ కొస్తాంధ్ర ప్రాంతాలు కలిసి ఉండేవి. కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ‘మాత మ్మ- జోగినీ’ వ్యవస్థలు, మలబార్ ప్రాంతంలో ఉన్న ‘నంగా’వ్యవస్థ: కన్నడ ప్రాంతంలోని ‘బసివి’ వ్యవస్థలు రద్దయ్యాయి. దేవదాసి వ్యవస్థ ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలవబడేది. అవన్నీ దేవ దాసీ నిర్మూలనా చట్టంతో రద్దయ్యాయి. ఆ ఘనత పూర్తిగా ముత్తు లక్ష్మి రెడ్డికి దక్కుతుంది. దేవదాసీ వ్యవస్థ నిర్మూలనా చట్టం కోసం అధికారికంగా అసెంబ్లీలో పోరాడిన డాక్టర్ ముత్తులక్ష్మీ, స్వయంగా ఒక దేవదాసి కూతురు! ఒక దేవదాసి బిడ్డ దేవదాసీ వ్యవస్థను రద్దు చేయించడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకొవాల్సిన అంశం. ఆ జీవి తంలోని సాధక బాధకాలు ఆమె పిన్న వయసులోనే తెలుసుకున్నారు కాబట్టి, ఆ పరిధిలోంచి బయట పడాలని కష్ట పడి చదువుకుని డాక్టర్ అయ్యారు. పెరియార్ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని అనేక ప్రతి కూల పరిస్థితులను ఎదిరించి పోరాడి అసెంబ్లీకి వెళ్ళారు.
సుందర రెడ్డిని వివాహం చేసుకుని సాధారణ జీవితం గడుపు తూనే, అసాధారణ ప్రతిభా పాటవాలతో వైద్య, సామాజిక, రాజకీయ రంగాలలో రాణించారు. ప్రపంచ ప్రఖ్యాత అడయార్ క్యాన్సర్ ఇనిస్టూట్కు ఈమే వ్యవస్థాపకురాలు. ఈ సంస్థకు – భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూను ఆహ్వానించి పునాదిరాయి వేయించారు. 18 జూన్ 1954న అది ప్రారంభ మైనప్పుడు దేశం లోనే అది రెండో క్యాన్సర్ ఆసుపత్రి అయ్యింది. ఇప్పుడది సంవత్స రానికి ఎనభైవేల మంది క్యాన్సర్ రోగులకు చికిత్స నందిస్తోంది. డాక్టర్ ముత్తులక్ష్మి ‘స్త్రీ ధర్మ’ పత్రికకు సంపాదకత్వం వహిస్తూ తమిళ భాషా సాహిత్యాలకు కూడా గణనీయమైన సేవలందించారు. మరో వైపు వుమెన్స్ ఇండియన్ అసోసియేషన్ కు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పనిచేస్తూ ఆల్ ఇండియా వుమెన్స్ కాన్ఫరెన్స్ పత్రిక ‘రోషిని’కి సంపాదకత్వం వహించారు.
30 జూలై 1886-22 జులై 1968 మధ్య కాలంలో 82 ఏండ్లు జీవించిన ముత్తులక్ష్మి, బ్రిటీష్ ఇండియా మద్రాస్ రాష్ట్రంలోని పుదు క్కొటై జిల్లా తిరుకోకర్నం గ్రామంలో జన్మించారు. ఆడపిల్ల్లల చదు వుకు తీవ్రమైన ఆంక్షలున్న ఆ కాలంలో మద్రాస్ మెడికల్ కాలేజి నుండి 1912లో వైద్యశాస్త్ర పట్టా సాధించారు. ఉన్నత విద్యకోసం ఆమె ఇంగ్లాండు వెళ్లారు. కానీ, ఔ×A వుమెన్స్ ఇండియన్ అసోసియేషన్ వారి ఒత్తిడి మేరకు తన బంగారు భవిష్యత్ ద్వారాలు మూసేసుకుని వచ్చి, మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో చేరారు. అక్కడ ఏకగ్రీవంగా డిప్యూటీ ప్రెసిడెంట్గా ఎన్నికై బాధ్యతలు నిర్వహిం చారు. దాంతో మహిళా హక్కుల కోసం పోరాడే ఒక ఉద్యమకారిణి అసెంబ్లీ వ్యవస్థలో ప్రవేశించినట్లైంది. ఆ రకంగా ఆమె పేరు అనేక విషయాలలో ప్రధమ స్థానంలో నమోదయ్యింది. ఇప్పటికీ అవన్నీ రికార్డులుగానే ఉండిపొయాయి.
ముత్తులక్ష్మీ రెడ్డి దేశంలో ప్రప్రథమంగా పురుషుల కళాశాలలో ప్రవేశం సాధించిన తొలి మహిళ. మామూలు ఎకడమిక్ డిగ్రీ కళాశా లలో కాకుండా వృత్తికి సంబంధించిన మెడికల్ కళాశాలలో ప్రవేశం సాధించడం ఆ రోజుల్లో (1907) చాలా గొప్ప విషయం. అందుకే ఆమె తొలి మహిళా హౌస్ సర్జన్. దేశంలో తొలి మహిళా డాక్టర్ కాగ లిగారు. అలాగే నాటి బ్రిటీష్ ఇండియాలో ఆమె తొలి మహిళా లెజి స్లేటర్ సోషల్ వెల్ఫేర్ ఆడ్వయిజరీ బోర్డుకు తొలి మహిళా లెజిస్లేటివ్ కౌన్సిల్కు తొలి డిప్యూటీ ప్రెసిడెంట్ మద్రాస్ కార్పోరేషన్లో తొలి మహిళ కాగలిగారు. వీటన్నిటితో పాటు 1953లో ‘అవ్యరు హామ్’ (అవ్యరు ఇల్లమ్)కు రూప కల్పన చేసి ఆ విషయంలో కూడా తొలి మహిళగా నిలిచారు. ఆడపిల్లల్ని మోసపూరితంగా ఇతర ప్రాంతా లకు తరలించి వేశ్యావృత్తిలోకి దింపడాన్ని ఆపడంలో ఆమె నెలకొ ల్పిన హోమ్ ప్రముఖపాత్ర పోషించింది. అలాంటి బాలికలకు, యువ తులకు, ఆశ్రయం కల్పించి, విద్య నందించి, స్వతంత్రంగా జీవనం గడిపే విధంగా తీర్చిదిద్దేవారు. ముఖ్యంగా ముస్లిం హరిజన బాలిక లకు స్కాలర్షిప్లు అందించి మరింతగా ప్రోత్సహించేవారు.
ముత్తులక్ష్మి తల్లి చంద్రమ్మాళ్ నిమ్న వర్గానికి చెందిన తమిళ స్త్రీ తండ్రి యస్. నారాయణ సామి ఉన్నత వర్గానికి చెందిన అయ్యర్. అభ్యుదయ భావాలు గల నారాయణసామి తన కుటుంబాన్ని, బంధు వర్గాన్ని ఎదిరించి దేవదాసి అయిన చంద్రమ్మాళ్ను పెండ్లి చేసుకు న్నాడు. ఒక మహౌన్నతమైన మానవీయ విలువను నిలిపినందుకు ఆయన బంధు వర్గం ఆయనను దూరం పెట్టింది. ఆయన ఆందుకు బాధపడలేదు. వీరిద్దరికీ కలిగిన కూతురే ముత్తులక్ష్మి. తండ్రి నుండి అభ్యుదయ భావాలు పుణిక పుచ్చుకుని పెరిగింది.కూతురు ఆలోచ నలు పసిగట్టిన తండ్రి నారాయణసామి కూతురిని విద్యావంతు రాలుగా, మానవతామూర్తిగా చూడాలనుకున్నాడు. అందుకే ఆమె ను స్కూలుకు పంపడం ప్రారంభించాడు. ఆ రోజుల్లో అదొక సాహ సోపేతమైన చర్య. ఆమె ఒక ఉపాధ్యాయురాలై బాలికలకు విద్యనం దించాలని తండ్రి నారాయణసామి ఆశించాడు. కానీ, ఆమె అంతకన్నా ఉన్నతంగా ఎదిగి, అనేక సంస్కరణలకు కారణమైంది.
యుక్త వయసు రాగానే పెండ్లి చేసి పంపడం ఆనాటి ఆచారం. కానీ, ముతులక్ష్మి స్వంత నిర్ణయాలు తీసుకోగల స్థాయికి చేరుకుంది. అందుకే ఉన్నత విద్యకోసం ఆరాటపడింది. మెట్రిక్యులేషన్ పూర్తి కాగానే అక్కడి మహారాజా కళాశాలలో ప్రవేశం కోసం ఆర్జీ పెట్టు కుంది. అమ్మాయి కళాశాలలో ప్రవేశిస్తే అబ్బాయిలంతా ఆమె ఆకర్ష ణలో పడిపోతారని. వారి చదువు చెడిపోతుందని ఆ కళాశాల ప్రిన్సి పాల్తో పాటు ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున వ్యతిరే కించారు. ఆ ప్రాంతం పొడుకొట్టై మహారాజుకు అది అనవసరమైన రాద్దాంతమని అనిపించింది. ఆయన వ్యతిరేకతల్ని పట్టించుకోకుండా ముత్తులక్ష్మికి ప్రవేశం కల్పించారు. పైగా ఆమె సాహసానికి మెచ్చి స్కాలర్షిప్ కూడా ప్రకటించాడు. ఆ రకంగా ఆమెకు ఎదురైన అడ్డం కులు తొలగిపోయాయి. ఉన్నత విద్యకు ద్వారాలు తెరుచుకున్నాయి.
1914లో ముత్తులక్ష్మి తన ఇరవై ఎనిమిదవయేట 1872 నేటివ్ మ్యారేజ్ ఆక్ట్ ప్రకారం సుందరరెడ్డిని పెండ్లి చేసుకున్నారు. తనను జీవిత భాగస్వామిగా సమాన స్థాయిలో గౌరవిస్తానని, తన నిర్ణ యాలు తను తీసుకునే స్వేచ్ఛ ఉండాలన్న హామీ కాబోయే భర్త నుండి తీసుకున్న తర్వాతనే ఆమె సుందరరెడ్డితో వివాహానికి ఒప్పుకు న్నారు. అలా పెండ్లి తర్వాత ఆమె పేరుకు రెడ్డి అనే పదం జతకూ డింది. వారికి ఇద్దరు కొడుకులు పుట్టారు. ఒకరు డాక్టర్ కృష్ణమూర్తి, మరోకరు రామ్మెహన్. తమిళ సినిమా నటుడు జెమిని గణేషన్ ముత్తులక్ష్మికి అల్లుడు. తోడబుట్టిన సోదరి క్యాన్సర్తో చనిపోవడంతో ఒక డాక్టరుగా ఆమె క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించగలిగారు. అంతేకాదు, మహిళలకు, పిల్లలకు ప్రత్యేకంగా ఆసుపత్రులుండా లన్నది ఆమె ఆలోచన-అందువల్ల మెటర్నిటీ, చిల్డ్రన్ హాస్పిటల్ కాన్సెప్ట్ ఆమెదే అయ్యింది. 1926లో ప్యారిస్లో జరిగిన వుమెన్స్ కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. లెజిస్లేటర్గా తన అనుభవాలు, ఆలోచనలు ఆమె ”మై ఎక్స్పీరియన్స్ ఏజ్ ఎ లెజిస్లేటర్” పేరుతో 1930లో గ్రంథస్థం చేశారు. 1947లో ఎర్రకోట మీద ఆవిష్కరిం చిన తొలి భారతీయ పతాకంపై దేశంలో ముఖ్యమైన వారి పేర్లు రాశారు. అందులో ముత్తులక్ష్మి పేరు కూడా ఉంది. గాంధీజీ, అనిబి సెంట్, సరోజినీనాయుడు వంటి దేశనాయకులతో ఈమెకు సన్ని హిత సంబంధాలుండేవి. బహుముఖీనమైన ప్రతిభలో అనేక రంగాలలో కృషి చేస్తూ దేశసేవ చేసిన ముత్తులక్ష్మి కృషిని భారత ప్రభుత్వం గుర్తించి 1956లో పద్మ భూషణ్ ప్రకటించింది.
– కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్ర వేత్త
(మెల్బోర్న్ నుంచి)
డాక్టర్ దేవరాజు మహారాజు
"నాపై దాడి, అరెస్టు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో నా విద్యార్థులకు నేను చెప్పాను.2009లో మావోయిస్టులని ఎదుర్కోవడానికి ప్రారంభించిన ఆపరేషన్ గ్రీన్ హంట్ని విమర్శించేవారి నోరు మూయించే ప్రయత్నమిది. అయితే నాలాంటి యాక్టివిస్తులు విశ్వసించేదేమంటే, ఆపరేషన్ గ్రీన్ హంట్ ముఖ్యోద్దేశ్యం "ఆదివాసీల్ని చంపడం, మైనింగ్ తవ్వాకాల కోసం పరిసరాల్ని ఏరివేయడం". -జీ.ఎన్. సాయిబాబా.
#పిలుపు పుస్తక ఆవిష్కరణ సభలో మాట్లాడుతున్న#Dr.పసునూరిరవీందర్ #కేంద్రసాహిత్యఅకాడమీ అవార్డు గ్
#రాహువే_లేనప్పుడు_రాహుకాలం_ఎక్కడిది?
డా. హెచ్.నరసింహయ్య మూఢనమ్మకాలు, దేవుడు పేరుతో జరుగుతున్న దోపిడీని ప్రతిఘటించి, ప్రజల్లో శాస్త్రీయస్పృహ పెంచడానికి విశేష కృషి చేసిన హేతువాది. సత్యసాయిబాబా మహిమలపై పోరాడిన వ్యక్తిగా ప్రసిద్ధుడు. ఆయన ఆత్మకథ ‘హోరాటద హాది’ని ‘పోరాటపథం’ పేరిట కోడీహళ్ళి మురళీమోహన్ కన్నడం నుంచి తెలుగులోకి అనువదించారు. అందులోని కొన్ని భాగాలివి.
నా బాల్యంలో మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ మొదలైన జాతీయ నాయకులు నా ఆలోచనలను, విలువలను రూపొందించారు. నేను అన్నింటినీ గంభీరంగా తీసుకుంటాను. అందువల్లే నేను ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో పాల్గొనింది. శ్రీరామకృష్ణాశ్రమంలో రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు స్వామీ వివేకానంద గారి ‘‘They alone live who live for others. The rest are more dead than alive. – పరుల కోసం ఎవరు బతుకుతారో వారిదే నిజమైన బతుకు. మిగిలినవారు జీవచ్ఛవాలు’’ అన్న సూక్తి నా మనసులో ముద్రపడింది. ఒకటి రెండు సంవత్సరాలు సావధానంగా ఆలోచించి అన్ని సాధక – బాధకాలను పరిగణనలోకి తీసుకుని పెళ్లి చేసుకోకూడదని అంతిమ నిర్ణయం తీసుకున్నాను. ఇది కూడా నేను తీసుకున్న అత్యంత ముఖ్య నిర్ణయాలలో ఒకటి.
పెళ్లి చేసుకోవాలి అనేది అత్యంత సహజమైన, బలమైన ఒత్తిడి. పెళ్లి చేసుకోకుండా ఉండాలి అంటే పెళ్లి చేసుకోవాలన్న ఒత్తిడికి సరితూగే అంతే బలమైన, మక్కువైన ప్రయోజనం, లక్ష్యం జీవితంలో ఉండాలి. ఆలోచనలు అడ్డదిడ్డంగా పోకుండా వాటికి కళ్లెం వేసే ఎల్లప్పుడూ చేతినిండా పని. క్రమశిక్షణతో కూడిన జీవితం. ఏదైనా సాధించాలనే హఠం ఉండాలి. అప్పుడు ఆలోచనలు పక్కదారి పట్టే సంభవం తక్కువ అవుతుంది.
నేను పుట్టింది ఆదివారం నాడు. అయితే నా జీవితంలో ఆదివారమే లేదు అని వెనుక ఎక్కడో చెప్పాను. ఇది అక్షరాలా నిజం. ఇంతవరకూ నాకు ఏ ఆదివారమూ, సెలవురోజూ లేదు. నేను చేసే పని ఎక్కువ శ్రమతో కూడినదైనా నాకు ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. అయినా అప్పుడప్పుడూ ఒంటరితనం గుర్తుకు వస్తుంది. అయితే ఆ ఆలోచన కాలవ్యవధి చాలా కొంచెమే.
నేను మొదటి నుండీ స్వతంత్రంగా ఆలోచించే స్వభావాన్ని అభ్యాసం చేసుకుంటూ వచ్చాను; దేనినీ ప్రశ్నించకుండా ఒప్పుకోను. నేను మూఢనమ్మకాలను, మాయామంత్రాలను, జ్యోతిష్యాన్నీ కటువుగా విమర్శిస్తూ వచ్చాను. మాయలు, మూఢనమ్మకాల గురించి నా ఖచ్చితమైన అభిప్రాయాలను వెనుక చాలా వివరంగా చెప్పాను. జ్యోతిష్యం గురించి సంక్షిప్తంగా కొన్ని విషయాలను చెప్పడం ఉచితం అనిపిస్తుంది.
మనిషిపై గ్రహాల ప్రభావం ఉంది అనే నమ్మకంపై నిర్మించిన సౌధమే జ్యోతిష్యశాస్త్రం. జ్యోతిష్యం ప్రకారం తొమ్మిది గ్రహాలున్నాయి. ఆ తొమ్మిదిలో సూర్యుడు, చంద్రుడు, రాహువు, కేతువులు ఉన్నాయి. సైన్స్ ప్రకారం సూర్యుడు గ్రహం కాదు, ఒక నక్షత్రం. చంద్రుడు ఉపగ్రహం. రాహు కేతు గ్రహాలు లేనేలేవు. ఈ విషయాలన్నీ ఒక హైస్కూలు విద్యార్థికి తెలుసు. జ్యోతిష్కుల తొమ్మిది గ్రహాలలో నాలుగు తప్పుడు లెక్కాచారంతో కూడి ఉన్నాయి. దీనితో జ్యోతిష్యం కథ ముగిసింది కదా! దానికి పునాదే గట్టిగా లేకపోయింది. అందువల్ల దానిమీద కట్టిన జ్యోతిష్యం అనే సౌధం కుప్పకూలిపోయింది.
రాహువే లేనప్పుడు రాహుకాలం ఎక్కడ నుంచి వస్తుంది? రాహుకాలం చెడ్డది అనే భావన చాలామందిలో ఉంది. అది నిజమయితే రాహుకాలంలో బయలుదేరే బస్సులకు, రైళ్లకు, విమానాలకు ప్రమాదాలు జరగాలి. ప్రమాదాలకు రాహుకాలానికీ ఏ సంబంధమూ లేదు. జాతకాలు కూడా జ్యోతిష్యం ఆధారంగానే రచింపబడతాయి. పిల్లవాడు పుట్టినప్పుడు గ్రహాల స్థానం ఆధారంపై జాతకం రాస్తారు. ఆ జాతకంలో పిల్లవాని జీవితంలోని అన్ని విజయాలు, ప్రముఖ ఘట్టాలు కలిగి ఉంటాయి అనే నమ్మకం ఉంది. ఇది శుద్ధ అబద్ధం. విమానప్రమాదంలో చనిపోయే వందలాది మంది జాతకాలలో వారంతా ఇలాగే మరణిస్తారని ఏ జ్యోతిష్కుడూ రాయడానికి సాధ్యం కాదు. 1962లో అష్టగ్రహకూటమి వల్ల అనాహుతం జరుగుతుందని బొబ్బలు పెట్టిన జ్యోతిష్కుల భవిష్యత్తు మట్టి కరిచింది. జ్యోతిష్కులు చెప్పేది అస్పష్టం. గోడమీద పెట్టిన దీపం లాంటిది. ఒక్కొక్కసారి జ్యోతిష్యం కాకతాళీయంగా నిజం కావచ్చు. చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుసార్లు సరియైన సమయాన్ని చూపుతుంది!
చాలామందికి జ్యోతిష్యంపై నమ్మకం ఎలా ఉందో అలాగే పూజాపునస్కారాల వల్ల వ్యక్తుల, సమాజ కళ్యాణం జరుగుతుందన్న నమ్మకమూ ఎక్కువగా ఉంది. స్వతంత్రంగా ఆలోచిస్తే వీటికి అర్థం లేదు. మనయొక్క ఏ కీర్తిప్రతిష్టలకు పూజాదికాలకు సంబంధం లేదు. ప్రపంచంలో లక్షలాది మంది చింతనాపరులూ దార్శనికులూ రాజకీయ నాయకులూ పూజ, ప్రార్థనల సహాయం లేకుండానే గణనీయమైన స్థానాలను గెలుచుకున్నారు. విశ్వవిఖ్యాత ఐన్స్టైన్, రసెల్ వంటివారికి ఇలాంటి నమ్మకాలకూ సంబంధమే లేదు. అజ్ఞయవాది (Agnostic) జవహర్లాల్ నెహ్రూ 14 సంవత్సరాలు ప్రధానిగా ఉన్నారు. అలాగే నాస్తికులు జ్యోతిబసు సుదీర్ఘ కాలంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీరిద్దరూ ఎక్కువ సమయం అధికారంలో ఉండి రికార్డును సృష్టించారు. ఇలాంటి నిదర్శనాలు చాలా ఉన్నాయి.
ఇంకొక సహించరాని విషయం ఏమిటంటే దేవునికి వజ్రవైఢూర్యాలతోనూ, వెండి–బంగారు నగలతోనూ అలంకరించడం. దేవునికి ఇదంతా ఎందుకు? ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే ఇలాంటి శ్రీమంతులైన దేవుళ్ల అమూల్యాభరణాలను మనం – మనుషులం కాపాడాలి. తనను తాను కాపాడుకోలేని దేవుడు మనలను ఎలా కాపాడుతాడు? మనల్ని మనమే కాపాడుకోవాలి.
విశ్వశాంతి కోసం యజ్ఞ యాగాదులను మన దేశంలో ఆచరిస్తారు. ప్రపంచంలోని అనేక దేశాలలో సుఖశాంతులున్నాయి. మన దేశంలోనే ఎప్పుడూ హింస, అశాంతి. అయినా విశ్వశాంతి పేరుతో వీలైనంత దోపిడీ, విలువైన వస్తువుల దహనం చెప్పలేనంతగా జరుగుతూనే ఉంది.
నదులలో, ‘పవిత్ర’మైన నదులలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అనేది మరొక మూఢనమ్మకం. సంవత్సరంలో కొన్ని రోజులు ‘పవిత్ర’ నదులలో స్నానం చేసి పుణ్యం మూటకట్టుకోవడానికి తొక్కిసలాట. గంగానది అత్యంత పవిత్రమైన నది అనే నమ్మకం చాలామందికి ఉంది. అయితే గంగానది వంటి కలుషితమైన నది మరొకటి లేదని శాస్త్రీయంగా నిరూపించబడింది. గంగానదిని మనమే శుద్ధి చేయవలసిన పరిస్థితి వచ్చింది. చర్మాన్ని కడిగితే ఖర్మం పోతుందా?
మనలో నిదర్శనానికన్నా ప్రదర్శనానికే ఎక్కువ విలువ. బంట్రోతు మొదలుకొని రాష్ట్రపతి వరకూ చాలామంది తమ తలనీలాలను దేవునికి సమర్పిస్తారు. తలలు బోడులు కావడానికన్నా తలపులు బోడులవుతున్నాయి. ఇలాగే చాలా మూఢనమ్మకాల ప్రస్తావనను శాస్త్రీయంగా విశ్లేషించడం అవసరం. భయం, అహేతుకమైన భావనలే మూఢనమ్మకాల ఆస్తి.
నేనిలాగే మూఢనమ్మకాలను, మాయలను, అర్థరహితమైన సంప్రదాయాలని విమర్శిస్తే చాలామందికి అనుమానం వచ్చి నాకు దేవునిపై నమ్మకం ఉందా? అని అడుగుతారు. చాలామంది తమ స్వార్థానికి దేవుణ్ణి ఉపయోగించుకుంటారు. ఇలాంటి లావాదేవీ దేవునిపై నాకు నమ్మకం లేదు. అయితే ఒక చైతన్యశక్తి ఉండవచ్చన్నది నా నమ్మకం. దేవుడు ఉన్నాడా లేడా అనే సమస్య శతాబ్దాల నుండి బుద్ధిజీవులను పీడిస్తోంది. ఎంత ఆలోచించినా ఈ సమస్యకు సమాధానం లభించలేదు. దేవుడు ఉన్నాడు లేదా లేడు అనేది నమ్మకం అవుతుంది. దేవుడు ఉన్నాడని శాస్త్రీయంగా నిరూపించడం సాధ్యం కాదు. అలాగే లేడు అని ధ్రువీకరించడం కూడా సాధ్యపడదు. అందువల్లే ప్రపంచంలోని అనేకమంది చింతనాపరులు, తత్వవేత్తలు, అజ్ఞేయతావాదులు దేవుడు ఉన్నాడని చెప్పరు. లేడనీ చెప్పరు. ‘‘దేవుడు, ఆత్మ మొదలైన వాటి గురించి చర్చించడం వ్యర్థం. అందువల్ల మంచిపని చేయి, మంచివాడివి కా – Do good and be good’’ అని బుద్ధుడు పదేపదే తన శిష్యులకు బోధించేవాడు. ఇది అత్యంత వ్యవహారికమైన Practical ఉపదేశం. దేవుడు లేకపోతే పోనీ మనుష్యుడు ఉన్నాడు కదా. అందువల్ల మన ధర్మానికి మనుష్యుడు కేంద్రబిందువు కావాలి. దేవునిపై నిజంగా నమ్మకం ఉంటే వారు చెడ్డపనులు చేయరాదు; లంచం పుచ్చుకోరాదు; కర్తవ్య ప్రజ్ఞతో ప్రామాణికంగా పనిచేయాలి.
***
స్వర్గం, మోక్షం ఉందో లేదో నాకు తెలియదు. వాటి గురించి నేను పట్టించుకోను. అవి ఉన్నా, నాకు స్వర్గమూ వద్దు, మోక్షమూ అక్కరలేదు. కోట్లాదిమంది ఈ ప్రపంచంలో కష్టనష్టాలతో బతుకుతున్నప్పుడు వారినంతా వదిలి నేను స్వర్గానికి వెళ్ళాలన్న ఆశ నాకు లేదు. స్వర్గంలో చేయడానికి పనిలేదు. ఎదుర్కోవడానికి సమస్యలు లేవు. సవాళ్ళు లేవు. దివ్యపురుషులు లేరు అన్న తరువాత అక్కడ ఊరికే కూర్చుని ఏమి చేయాలి? పునర్జన్మ ఉంటే నాకు వచ్చే జన్మలో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నిరంతరంగా పనిచేసే అవకాశం లభిస్తే చాలు, నాకు ఇంకేమీ అక్కరలేదు.
డా. హెచ్.నరసింహయ్య
హమ్మయ్య.. !
ఇవ్వాల్టి నుంచి,
మన దేశానికి తిరుగు లేదు.. !!
ఇకపై మనకు ఎదురనేదే ఉండదు.. !!!
""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
ఇవ్వాల్టి నుంచి మన దేశాన్ని చూసి చైనా వాడు జడుసుకుంటాడు, పాకిస్తానోడు పారిపోతాడు... అమెరికా వాడు అల్లకల్లోలం అయిపోతాడు...
ఎందుకంటే ఇవ్వాళ్ళ అయోధ్యలో రామాలయం ప్రారంభం అయింది...
🤣🤣🤣
ఇవ్వాళటి నుంచి దేశంలో ఆకలి, నిరుద్యోగం, దరిద్రం కరువు కాటకాలూ... ఇవేమీ ఉండవు !
ఎందుకంటే ఇవ్వాళ్ళ అయోధ్యలో రామాలయం ప్రారంభం అయింది...
🤔🤔🤔
ఇవ్వాళటి నుంచి దేశంలో అవినీతి ఉండదు, బ్యాంకు లను మోసం చేసి పారిపోయే వాళ్ళు, బ్యాంకులకు లోన్లు ఎగొట్టే వాళ్ళూ ఉండరు...
ఎందుకంటే ఇవ్వాళ్ళ అయోధ్యలో రామాలయం ప్రారంభం అయింది...
🤑🤑🤑
ఇవ్వాళటి నుంచి దేశంలో ఆశాంతి ఉండదు, అక్రమాలు ఉండవు, హత్యలూ, దోపిడీలూ, మానభంగాలూ ఉండవు...
ఎందుకంటే ఇవ్వాళ్ళ అయోధ్యలో రామాలయం ప్రారంభం అయింది...
🫣🫣🫣
ఇవ్వాళటి నుంచి దేశంలో అజ్ఞానం, మూఢ నమ్మకాలూ, మూర్ఖత్వలూ అసలు ఉండనే ఉండవు...
ఎందుకంటే ఇవ్వాళ్ళ అయోధ్యలో రాముడి గుడి ప్రారంభం అయింది...
😜😜😜
ఇవ్వాళటి నుంచి దేశ ప్రజలు ఎటువంటి కష్టాలూ, బాధలూ లేకుండా.. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో.. ఆనందంగా జీవిస్తారు...
ఎందుకంటే ఇవ్వాళ్ళ అయోధ్యలో రామ మందిరం ప్రారంభం అయింది కాబట్టి...
🤣🤣🤣🤣🤣
వీటన్నిటికీ రామ మందిర ప్రారంభానికి సంబంధం ఏమిటో తెలుసుకోవాలంటే...
ఈ 2024 లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు ఆగండి...
@ రామాయణం పై ప్రశ్నలు@
విశ్వాసం ప్రశ్నకు అతీతమైనది ఒప్పుకోవల్సిందే కానీ అది ఒక విశ్వాసమే కాదు చరిత్ర కూడా అంటున్నందుకే ప్రశ్నలు!
1) రాముడి కాలం ఏమిటి? ఏ కాలాల మద్య జీవించాడు?
2) ఆయన రాజ్యంలో వాడుకలో ఉన్న నాణాలు ఏమిటి? వెండి నాణాల, బంగారు నాణాలా, రాగి నాణాలా? అవి ఎందుకు లభ్యం కావడం లేదు.?
3) బండ మీద రాముని అడుగులు అని పూజలందుకుంటున్న రాళ్ళను చూస్తున్నం అలాంటప్పుడు రాముడు వేయించిన శాసనాలు ఏమైనా ఉన్నయా?
4) జూరాసిక్, శిలా, కంచు నాగరికథ కాలంనాటి ఆదారాలు లభిస్తున్నప్పుడు దేవుడుగా కొనియాడబడుతున్న రాముడి ఆధారాలు ఎందుకు ఉండవు?
5) ఆయన రాజ్యం ఎక్కడినుంచి ఎక్కడికి ఉంది?
6) ఆయనను సందర్శించిన రాజులు ఎవరు?
7) ఏ రాజ్యాలతో వ్యాపార సంబందాలు పెట్టుకున్నడు?
8)కట్టుకథల్లో తప్ప చరిత్రలో రామునికి స్థానం ఎందుకు లేదు?
9)రామాయణం అంటే తన సొంత విషయమో, పిన్నికిచ్చిన మాట ప్రకారం అడవులకు వెళ్ళాడు, మనసుపడిన సూర్పనక ముక్కు చెవులు కోపించాడు, రావణుడు ప్రతికారంగా సీతను అపహరించాడు ఇవి చరిత్రలో ఆధారాలకు నిలబడవు.
10) రాజ్యవిస్తరణ కోసం రాముడు ఏఏ రాజులతో యుద్దం చేశాడు. రావణునితో యుద్ధం భార్యం కోసం చేసింది మాత్రమే.
11) అశ్వమేధ యాగంలో అశ్వం ఏఏ ప్రాంతాలకు పోయింది?
12) రామరాజ్యం అంటున్నారు ఎటువంటి రూల్స్ ఆయన రాజ్యంలో ఉన్నాయి.? అది ఎలా ఆదర్శ రాజ్యం?
13) చరిత్రకారులంతా జెందెం పోగుల వారసులే మరి ఎందుకు ఆదారాలు నిరూపించలేక పోతున్నారు.?
14) ఆడమ్స్ బ్రిడ్జ్ వానరులు నిర్మించారని చెబుతున్నారు.. సింహలం తమిళనాడు మద్య ప్రకృతి వైపరీత్యాల వలన భూమి మునిగిపోగా సహజంగా మిగిలిన కొంత భూబాగాన్ని తమ రాకపోకలకోసం సింహళ తమిళ ప్రజలు కలిసి రిపేర్ చేసుకున్నారు. ఆ దారిని రామసేతుగా కొందరు కోట్ చేసుకుంటున్నారు. అదొక్కటైతే చెప్పుకుంటున్నారు గానీ మిగతా చరిత్ర ఎందుకు చూపించలేక పోతున్నారు.?
*దేశ జనాభా 140 కోట్లు.....దేశ అప్పు 145 లక్షల కోట్లు .*❗
70 ఏళ్ల భారత దేశ చరిత్ర ఓ లెక్క,...❗
గడిచిన 9 ఏళ్ల భారతం ఇంకో లెక్క....❗
*ఇదంతా ఎవరి ఘనత..*❓
*ఎక్కడ నుంచి పుట్టింది ఈ అప్పంతా...*❓
ఎవరు తీరవాలి ఈ అప్పంతా...❓
యాడికి పోయింది లెక్కంతా...❓
సౌకర్యాలు పెరిగాయా ❗
సంపద పెరిగిందా...❗
ఉపాధి పెరిగిందా...❗
జాతీయ స్థాయి లో చెప్పుకొనే పరిశ్రమలు వచ్చాయా...❗
విద్యా రంగం బాగుపడిందా..❗
వైద్య రంగం ఉచితంగా వైద్యం అందిస్తోందా..❓
ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చాయా..❓
ఇంధన ధరలు అందెంత ఎత్తులో ఉంది కదా ..❗
ప్రభుత్వ సంస్థలు స్థాపించబడ్డాయా ❓
ప్రైవేట్ రంగం కట్టడి చేయబడిందా ❓
రైల్వే లో సామాన్యుడికి బోగీలు పెరిగాయా ❓
టోల్ టాక్స్ లు ఏమైనా తక్కువ చేశారా ❓
దేశంలో పేదరికం తగ్గిందా ❓
మధ్యతరగతి మాసిపోయిందా ❓
*ధనిక వర్గం దగా చేయకుండా ఆగిందా* ❓
రైతులకు బ్యాంకుల్లో ఏ హామీ లేకుండా అప్పు పుడుతోందా...❓
బడాబాబులు ఎగ్గొట్టిన అప్పులు తిరిగి కట్టారా ❓
నిర్మాణ రంగం నిలదొక్కుకునిందా ❓
ఉత్పత్తి రంగం ఊపందుకుందా ❓
*ఇదంతా ఎవరి ఘనత*
*యాడ పెట్టాం ఈ అప్పంతా*
*యాడికి పోయింది లేక్కంతా*
*ఎక్కడికి పోయారు దేశ భక్తులంతా..*
*మూగపోయిందెం మేధావి వర్గమంతా..*
*ప్రశ్నించే జర్నలిస్ట్ ల గొంతు మూగబోయింది ఎందుకు..*❓
*ప్రశ్న అనేది పుట్టకపోతే ఎందుకు పుట్టాం రా ఈ దేశంలో అనుకునే రోజు రానే రావచ్చు*❗
🔴 *తస్మాత్ జాగ్రత్త*
మేలుకో వినియోగ దారుడా అని కేంద్ర ప్రభుత్వం ఒకప్పుడు ప్రచారం చేసేది...
మేలుకో భారతీయుడా అని ఇప్పుడు మనకి మనమే ప్రచారం చేసుకోవాలి అనిపిస్తుంది జరుగుతున్న పరిస్థితి
మేధావులు దొంగలకు సద్దులు మోసే లంగలు
అవును తప్పంతా ఇసుకదే...!
కొట్టుకుపోయిన ఇసుకంతా ఈ అధికారి బుర్రలో చేరినట్టుంది...!!
************************
👉మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణం “కుట్ర” అంటూ మొన్నటివరకూ గగ్గోలు పెట్టిన అధికార యంత్రాంగం, జనాల్లో నవ్వులపాలవుతున్నామని గ్రహించి “కుట్ర” కాదు అని బహిరంగంగా ప్రకటించాల్సి వచ్చింది.
****************************
👉ఈ ప్రకటన వచ్చి ఒక్కరోజు ముగియకముందే, బ్యారేజీ కుంగడానికి కారణం కింద ఉన్న “ఇసుక కదలడమే” అంటూ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ స్థాయి గల ఒక ఐఏఎస్ అధికారి ఈ ప్రకటన చేయడం ప్రభుత్వాన్ని మరింత నవ్వులపాలు చేస్తున్నది. ఇక్కడ డిజైన్ లోపం కానీ, నిర్మాణ లోపం కానీ ఏమాత్రం లేదట. నిర్మాణ లోపం ఉంటే మొత్తం బ్యారేజి కొట్టుకు పోయెదట. ఇలా సాగింది ఈ పెద్దమనిషి వివరణ...
👉ఇంజనీరింగ్ పరిజ్ఞానం పక్కకు పెట్టండి, కనీసం ఇంగిత జ్ఞానం ఉన్నా ఇలాంటి మాటలు ఎవరూ మాట్లాడరు.
👉 మీరు కొత్తగా ఒక ఇల్లు నిర్మాణం చేపట్టారు.... దానిని నిష్ణాతులైన కన్సల్టెంట్లతో డిజైన్లు చేయించి, ఇంజనీర్ల పర్యవేక్షణలో నిర్మాణం పూర్తి చేసిన నాలుగు నెలలకే ఆ ఇల్లు భూమిలోకి కుంగిపోయిందనుకోండి? తప్పేవరిది? బిల్డింగ్ కట్టిన స్థలంలో సరైన భూ పరీక్షలు చేయకుండానే, పైన నిర్మాణం చేపట్టారని మనకు ఆర్దమౌతుంది.
👉“తూచ్...ఇందులో మా తప్పేమీ లేదు, తప్పంతా కింద కుంగిన మట్టిదే” అని ఆ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు అంటే మీరేం చేస్తారు?
“ఇల్లు కట్టేటప్పుడు కనీసం భూమిని పరిశీలించకుండా డిజైన్ ఎందుకు చేసారు? భూమిని పటిష్టం చేయకుండా ఎందుకు నిర్మాణం చేసారు?” అని వాళ్లందరినీ కోర్టుకీడ్చి నష్టపరిహారం వసూలు చేస్తారు. అవునా...?
మరి ఈ కనీస అవగాహన మన “పెద్ద అధికారికి” ఎందుకు లోపించింది?
👉ఎందుకంటే...? ఎవడూ మమ్మల్ని ప్రశ్నించడు అనే ధైర్యం...!
ఎన్ని వేల కోట్ల ప్రజాధనం వృధా అయినా తమకేమీ కాదన్న ధీమా...!!
లేకుంటే ఇలా బరితెగించి మాట్లాడడం అసాధ్యం...
👉లక్షకోట్లు గుమ్మరించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన నాలుగేళ్లలో బయటకొచ్చిన కొన్ని వైఫల్యాలు చూడండి:
1. మేడిగడ్డ పంప్ హౌజ్ ప్రొటెక్షన్ వాల్ కూలింది, పంప్ హౌజ్ మునిగింది, ఆరు మోటార్లు తుక్కుగా మారినై, మొత్తం మోటార్లు నీళ్ళల్లో మునిగినై ... రెండు సార్లు ఈ పంప్ హౌజ్ లో ప్రమాదాలు జరిగాయి.
2. మేడిగడ్డ గ్రావిటీ కెనాల్ కూలింది. ఇలా ఈ కాలువ కూలడం ఏటా ఒక తంతులా మారింది.
3. అన్నారం పంప్ హౌజ్ మునిగింది, మొత్తం మోటార్లన్నీ నీళ్ళల్లో మునిగినై...
4. సుందిళ్ళ బ్యారేజీ కట్టలు దెబ్బతిన్నాయ్...
5. మేడారం పంప్ హౌజులు క్రాకులిచ్చినయ్...
6. రామడుగు సొరంగాలు కూలినయ్...
7. మిడ్ మానేరు డ్యామ్ కుంగింది...
8. కొండపోచమ్మ రిజర్వాయర్ కు పగుళ్లోచ్చినయ్...
10. మల్లన్నసాగర్ కాలువకు బొక్కలు పడి మొత్తం కాలువ కుప్పకూలింది... పంది కొక్కులు ఈ బొక్కలు పెట్టినయ్ అని చెప్పారు.
11. ఎక్కడికక్కడ పంపు హౌజులకు, సొరంగాలకు, కాలువలకు పెచ్చులూడు తున్నయ్...
12. ఇప్పుడు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మేడిగడ్డ బ్యారేజి కూడా కుంగింది...!
ఇంకా బయటకు రాని వైఫల్యాలెన్నో...
**************************"""
100 ఏళ్ళు ఉండాల్సిన ప్రాజెక్టుకు...4ఏళ్లకే వందేళ్లు నిండినయ్...!
అయినా ఏ ఒక్కరి మీద చర్యలు లేవు. పైగా కాంట్రాక్టర్లకు శాలువాలు కప్పి సత్కారాలు...
ఇప్పుడు ఏంచేయాలో తేల్చుకోవాల్సింది ప్రజలే...!
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Location
Category
Telephone
Website
Address
5217 Park Avenue
Memphis, 38119
Coed, Independent 2K-8 School in Memphis, Tennessee--Growing Young Hearts & Minds
6745 Lenox Center Court, Ste 300
Memphis, 38115
Welcome to the Official Universal Cheerleaders Association Fan Page! If you have any questions regarding a camp or competition registration, please contact us at www.uca.varsity.com/
Bert Bornblum And Jess Parrish Library
Memphis, 38101
Welcome to the Reference On the Go virtual desk at the InfoNet Library. We can chat or send a message to [email protected]
University Of Memphis Institute Of Egyptian Art & Archaeology 315 Art And Communication Bldg
Memphis, 38152
The Institute of Egyptian Art and Archaeology is a Center of Excellence at University of Memphis
Memphis, 38152
This page is for faculty, staff, students, alumni, and friends of the Department of History at The University of Memphis.
Memphis
Sandy Adams, a photographer and social media brand strategist, was born/raised in Tennessee and offers a look at various items/topics from her point of view. You can learn more about me at www.sandy-adams.com and on my podcast.
1297 Adelaide Street
Memphis, 38106
We strive to foster in our scholars the life-long love of reading while enhancing the use of tech.
1019 Berclair Road
Memphis, 38122
Brilliant Minds Child Development Center is a premier childcare agency dedicated to nurturing and