15/11/2022
గౌరవనీయులైన రాజా కుమారస్వామి రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులకు నమస్కరించి తెలియజేయడం ఏమనగా,
మన పాఠశాల స్థాపించి 75 సంవత్సరములు పూర్తి చేసుకున్న కారణంగా వజ్రోత్సవాలను నిర్వహించాలని ఉద్దేశంతో గతవారం ఒక సమావేశాన్ని ఏర్పరచాలనుకున్నాము. కానీ అనివార్య కారణాలవల్ల,
ఆసమావేశం వాయిదా పడినది. ఈ విషయం మీకు తెలిసినదే...
రాబోవు ఆదివారం అనగా
20 11 2022 నాడు వజ్రోత్రోత్సవ సన్నాహక సమావేశము ఉదయం 10 గంటలకు నిర్వహించబడును. కావున పూర్వ విద్యార్థులు అందరూ, వారి వారి బ్యాచ్లకు సంబంధించిన మిత్రులకు తెలియజేసి, కనీసం ఒక్కొక్క బ్యాచినుండి పది మంది సభ్యులకు తక్కువ కాకుండా హజరుకాగలరని ఆశిస్తున్నాము.
ఇప్పటివరకు దాదాపుగా 45 బ్యాచ్ల వివరాలను సేకరించడం జరిగినది. అంటే 1971 నుండి 2015 వరకు ఈ పాఠశాలలో చదివిన విద్యార్థుల వివరాలను పదిమందికి తక్కువ కాకుండా సేకరించాము. వారి, వారి బ్యాచ్ కి సంబంధించిన కొంతమంది మిత్రులు వాలంటీర్లుగా ఏర్పడి, వారి బ్యాచ్ వాళ్లకు ఈ విషయం తెలియజేయవలసిందిగా కోరుతున్నాము.
ఈ సమావేశము ద్వారా మనం వజ్రోత్సవ వేడుకలను నిర్వహించడానికి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కావలసిన సన్నాహాలకు సంబంధించిన సలహాలు, సంప్రదింపులు మరియు మంచి ప్రణాళికను తయారు చేసుకొనవలసి ఉన్నది.
కావున ప్రతి ఒక్కరు ఈ సమావేశమునకు హాజరయ్యి, మీయొక్క ఆలోచనలను, మీ ప్రణాళికలను తెలియజేసి ఈ సమావేశంను జయప్రదం చేయగలరని ఆశిస్తున్నాము.
సమయం తక్కువగా ఉన్న కారణంగా, ప్రతి ఒక్కరు ఈరోజు నుండే మీ మిత్రులకు తెలియజేయడం ప్రారంభించండి.
ఆర్ కె ఎస్ ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సేవా సంఘం, కార్వేటినగరం.
9160171291