30/05/2024
సీపెట్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుకు జూన్ 02తో ముగియనున్న గడువు
భారత ప్రభుత్వ విద్యా సంస్థ “సీపెట్ - విజయవాడ” లో ఉద్యోగ కల్పనే లక్ష్యముగా 10 వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు 3 సం.ల వ్యవధి గల డిప్లోమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ (DPT), డిప్లోమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ (DPMT), బి.యస్సీ (B.Sc.) విద్యార్థులకు 2 సం.లు వ్యవధి గల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లోమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెస్సింగ్ అండ్ టెస్టింగ్ (PGD-PPT) అనే 3 కోర్సులను అందిస్తున్నారు. కళాశాల ప్రాంగణంలోనే విద్యార్థినీ విద్యార్థులకు విడివిడిగా హాస్టల్ వసతి, నిబంధనలను అనుసరించి అర్హులైన విద్యార్థులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి "ఫీజు రీయింబర్స్మెంట్" సదుపాయాలు ఉన్నాయని, దరఖాస్తుకై జూన్ 02, 2024 తో గడువు ముగుస్తున్నదని, విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ డైరెక్టర్ & హెడ్ డాక్టర్. Ch. శేఖర్ తెలిపారు. సిపెట్ అడ్మిషన్ టెస్ట్ (CAT) ను జూన్ 9, 2024 ఆదివారంనాడు విజయవాడ మరియు అనంతపురములలో నిర్వహించి, ర్యాంక్ ఆధారంగా విజయవాడ కేంద్రంలో గల 150 సీట్లను భర్తీ చేస్తారని తెలిపారు. ఈ కోర్సులను పూర్తిచేసిన వారికి ప్లాస్టిక్స్ రంగంలో గల బహుళ జాతి సంస్థ(MNC) & అనుబంధ సంస్థలలో Jr. ఇంజనీర్ (ప్రొడక్షన్), మౌల్డ్ డిజైనర్ & మేకర్, Jr. ఇంజనీర్ (మైంటెనెన్స్), క్వాలిటీ కంట్రోల్ విభాగాలలో ఇన్స్పెక్టర్ వంటి ఉద్యోగ అవకాశాలు కలవని, ప్రారంభ వేతన స్థాయి నెలకు Rs. 16,000/- నుంచి Rs.20,000/- వరకూ ఉంటుందని, సాధారణ విద్యార్థులు కూడా మెరుగైన విజయాన్ని సాధించవచ్చని, ఆన్లైన్ దరఖాస్తు విధానం మరియు ఇతర సహాయతకోసం 9398050255 నెంబర్లో సంప్రదించాలని శ్రీ శేఖర్ సూచించారు.
Sd/-
Dr. Ch. Shekar
Joint Director & Head
CIPET, Vijayawada
Govt. of India