18/08/2026
హైద్రాబాద్ లోని ట్యాంక్ బండ్ పై బహుజన వీరుడు, చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహావిష్కరణలో మాజీ మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్, రాజేశం గౌడ్, మండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మరియు గౌడ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ....
బహుజన నాయకుడు, ఆసియా ఖండంలో మొట్టమొదటి చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గుర్తించి పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా జరుపుకున్నాం.
ఈ రోజు విగ్రహావిష్కరణకు కారణం కూడా, ఆనాడు కేటాయించిన ల్యాండ్కు కొనసాగింపుగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది.
సర్వాయి పాపన్న కోట మరమ్మతులు చేయించుకున్నాము. 5 ఎకరాలు ఆత్మగౌరవ భవనానికి కేటాయించుకొని, దానికి సర్దార్ సర్వాయి పాపన్న భవనంగా పేరు పెట్టుకున్నాము.
కుల వృత్తులను కాపాడడమే పాపన్న లక్ష్యం. ఒక సామాన్యుడు రాజు కావచ్చు అని నిరూపించాడు. రాజ్యాధికారంలో వాటా వచ్చినప్పుడే నిజమైన ప్రభుత్వం అని ఆనాడు నిలదీశాడు. అందుకే రాజ్యాధికారంలో సరైన వాటా ఇచ్చేటట్లు ప్రభుత్వాలు మాట నిలబెట్టుకోవాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించి మాటను నిలబెట్టుకోవాలి.
ఇచ్చిన హామీ ప్రకారం జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేయాలి.
భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం కూడా చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలి. జనగణనలో కులగణన చేయాలి. ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, నిధులు కేటాయించాలి.