*అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు*
*--పీఆర్టీయూ తెలంగాణ*
*తెలుగు వారి తొలి పండుగ తొలి ఏకాదశి విశిష్టత - తొలి ఏకాదశి ఎప్పుడు? ఏం చేయాలి?*
*Tholi Ekadashi 2025:*
*విశేషాల సమాహారంగా భావించే ఆషాఢంలో అన్నీ పండుగలే! ముఖ్యంగా ఆషాఢంలో శుద్ధ ఏకాదశి నుంచి తెలుగు వారి పండుగలు మొదలవుతాయని శాస్త్రవచనం. అందుకే తొలి ఏకాదశితో పండుగలు తోసుకొస్తాయని ఒక సామెత కూడా ఉంది. అంటే ఇక్కడ నుంచి వరుసగా పండుగలు వస్తూనే ఉంటాయి. జులై 6 వ తేదీ రేపు ఆదివారం తొలిఏకాదశి పర్వదినం సందర్భంగా తొలి ఏకాదశి విశిష్టత ఏమిటి? ఈ పండుగ ఎలా జరుపుకోవాలి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.*
*తెలుగు వారి తొలి పండుగ తొలి ఏకాదశి మనకు ఒక ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అందులో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. దీనినే పేలాల పండుగ అని కూడా అంటారు. ఈ నాటి నుంచి శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. అందుకే దీనిని శయనైకాదశి అని కూడా అంటారు. ఈ ఏడాది జులై 6వ తేదీ ఆదివారం రోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి తిధి ఉంది కాబట్టి ఈ రోజునే తొలి ఏకాదశి పండుగ జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు.*
*ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు పూజకు శుభ సమయం.*
*దక్షిణాయనం పుణ్యకాలం ప్రారంభం తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది.*
*దేవతలకు రాత్రి సమయమని భావించే ఈ కాలంలో వచ్చే తొలి ఏకాదశి రోజు శయనించిన శ్రీ మహా విష్ణువు తిరిగి కార్తిక శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్ర నుంచి మేల్కొంటాడని స్కాందపురాణం ద్వారా తెలుస్తోంది.*
*దక్షిణాయన పుణ్యకాలం అంటే!*
*మకర సంక్రాంతి నుంచి నాలుగు నెలల పాటు కొనసాగిన ఉత్తరాయణం పూర్తి అయి ఇక్కడ నుండి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, ఈ రోజు నుంచి దక్షిణ దిక్కు వైపుకు ప్రయాణం సాగిస్తాడు. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు, పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. ఉపవాసాలు, పూజల పేరిట పాటించే నియమాలలో గొప్ప ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి.*
*తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఇలా పూజించాలి*
*తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. ఈ పర్వదినం రోజున ఉదయాన్నే తలారా స్నానం చేసి శ్రీ లక్ష్మీ నారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఉండగలిగిన వారు రోజంతా ఉపవాసం ఉంటే మంచిది. పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని గంధం కుంకుమలతో శ్రీలక్ష్మీనారాయణుల విగ్రహాలను అలంకరించాలి. తొలి పండుగ కాబట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే మంచిది. ఆవునేతితో దీపారాధన చేసి, పసుపు రంగు పువ్వులతో, తులసి దళాలతో, అక్షింతలతో శ్రీమన్నారాయణుని పూజించాలి. పులిహోర, చక్రపొంగలి, కొబ్బరికాయ, అరటిపండ్లు వంటి నైవేద్యాలు సమర్పించాలి.*
*ఆలయాలలో ఇలా...*
*ఇంట్లో పూజ పూర్తయ్యాక సమీపంలోని విష్ణు ఆలయ దర్శనం చేయాలి. సాయంత్రం వేళ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. రాత్రంతా భగవన్నామ స్మరణ చేస్తూ, భారత భాగవత కధలు చదువుకుంటూ జాగారం చేయాలి. అనంతరం మరుసటి దినం ద్వాదశి ఘడియలు ప్రవేశించగానే ఒక సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి ఉపవాస దీక్ష విరమణ చేయాలి. ఇలా చేయడం వల్ల సంపూర్ణ ఏకాదశి వ్రతం చేసిన ఫలం వస్తుంది. విష్ణుమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది.*
*పితృదేవతల ప్రీతి కోసం పేలాల పిండి*
*ఇక తొలి ఏకాదశి రోజున మరొక విశేషం ఏమిటంటే ఈ రోజున పేలాల పిండిని తప్పక తినాలని అంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల ఈ రోజు మన పితృదేవతలను గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే ఈ కాలంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈరోజున దేవాలయాల్లోనూ ఇళ్ల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు.*
*పేలాల పిండిని ఇలా తయారు చేస్తారు*
*వేయించిన పేలాలు, బెల్లం నెయ్యి , ఏలకులు శొంఠి కలిపి రోట్లో దంచి తయారు చేసేదే పేలాల పిండి. వర్షా కాలం ఆరంభంలో వచ్చే తొలి ఏకాదశి పండుగ రోజున పితృ దేవతల పేరుతో పేలాల పిండిని తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.*
*పంట పొలాల్లో కూడా తొలకరి వానలు కురిసే ఈ సమయంలో రైతులు తమ పొలాల్లో కూడా ఈ పేలాలు పిండి చల్లుతారు. ఇందువలన వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని విశ్వాసం. రానున్న తొలి ఏకాదశి పండుగను మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం. ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహానికి పాత్రులవుదాం. జై శ్రీమన్నారాయణ!*
*ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.*
(ఈటీవీ నుండి సేకరించబడినది.)
Teachersinfo
All in one info at one place
01/05/2025
https://youtu.be/gQQNjotZtxg?si=GEySMqdrOrcRF-Ge
Raghukula Tilaka Rara Provided to YouTube by The Orchard EnterprisesRaghukula Tilaka Rara · Kondala Swamy · TraditionalRaghukula Tilaka Rara℗ 2025 Motion Pixel TechReleased on: 20...
తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు హర్షణీయం.
శ్యామ్ బాబు
జిల్లా అధ్యక్షుడు
రమాకాంత్
జిల్లా ప్రధాన కార్యదర్శి
వర్కింగ్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి
పీఆర్టీయూ తెలంగాణ
మహబూబ్ నగర్ జిల్లా శాఖ.
తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చే విధంగా విద్యా కమిషన్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాము.
రాష్ట్రంలోని విద్యా వ్యవస్థపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి పూర్తి అవగాహన ఉంది. గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయినది. గత డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే పదేళ్లుగా పెండింగులో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలు,పదోన్నతుల నిర్వహణ, నూతన ఉపాధ్యాయుల నియామకం కోసం డీఎస్సీ నిర్వహణ, అమ్మ ఆదర్శపాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టడం ముదావహం. అదే విధంగా రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద,బడుగు బలహీనవర్గాల విద్యార్థుల చదువు కోసం, విద్యా వ్యవస్థ పటిష్ఠతకు కు అవసరమయిన అన్ని చర్యలు చేపడుతుందని పీఆర్టీయూ తెలంగాణ పక్షాన ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము.
*పలచబడి పోతున్న మానవ సంబంధాలు*
గత ముప్ఫై ఏళ్లుగా కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలు లో వస్తున్న మార్పులను చాలా దగ్గరగా చూస్తూ వచ్చాము .
పెద్దగా ఆస్తులు..చెప్పుకోదగ్గ ఆదాయ వనరులు.. సమాజంలో హోదా.. సౌకర్యాలు సౌఖ్యాలు పెద్దగా లేని రోజుల్లోనే మనుషుల మధ్య ఆప్యాయత అనుబంధాలు చక్కగా (చిక్కగా )వుండేవి..
ఒకరికి ఒకరు చేదోడుగా.. నిజాయితీగా అరమరికలు లేని సంబంధాలు కొనసాగించారు..
వున్నంతలో తృప్తిగా వున్నారు.. కష్టానికి సుఖానికి ఒకరికొకరు కలుసుకోవడం.. అందరం దగ్గర వాళ్ళం అనే అనుభూతి పుష్కలంగా వుండేది..
కుటుంబంలో ఎవరి పిల్లలు అయినా ఏదైనా సాధిస్తే అది కుటుంబం మొత్తం ఉమ్మడిగా సంతోషం వ్యక్తం చేసేవారు..
మా మనవడు లేదా మనవరాలు..అని తాతలు.. మా మేనకోడలు లేదా మేనల్లుడు అని అమ్మమ్మ ఇంటివారు నానమ్మ ఇంటి వారు అందరూ గర్వంగా చెప్పుకునే వారు..
కానీ ఎప్పుడైతే 1983-84 నుంచి కార్పొరేట్ కాలేజ్ సంస్కృతి పెరగడం మొదలైందో.. ఎప్పుడైతే ఒక్కొక్కరు పిల్లలను చదివించడానికి priority ఇవ్వడం మొదలైందో.. ఎప్పుడైతే పిల్లలు కూడా ఒకరికి మించి ఒకరు అవకాశాలు అందిపుచ్చుకుంటూ.. కెరీర్ సృష్టించుకోవడం మొదలైందో..ఈ సంబంధల్లో కూడా compitetion మొదలైంది... పిల్లలో ఈర్ష్య, పెద్దల్లో అసూయ..
మొదట్లో success అయిన వారే కుటుంబాలలో మిగిలిన వారికి మార్గనిర్దేశనం చేసే వారు.. మిగిలిన వారికి అరమరికలు లేకుండా అండదండలు అందించే వారు.. తాము ఎదగడంతో పాటు తమ వారు కూడా ఎదగడం కోసం సహాయ పడ్డారు..
కానీ ఎప్పుడైతే సర్వీస్ సెక్టార్ ప్రాముఖ్యత పెరగడం మొదలైందో.. ఎప్పుడైతే వేగంగా కెరీర్ దొరకడం మొదలైందో.. వేగంగా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారడం మొదలైందో..
అంతకు ముందు కన్నా జీవితంలో సౌఖ్యాలు.. విలాసాలు.. పెరిగాయో ఎందుకో మనుషుల వ్యక్తిత్వం మరింత పరిణతి చెందాల్సిన దగ్గర రివర్స్ లో కుంచించుకు పోవడం మొదలైంది పక్కాగా సంబంధాలు పలుచపడటం మొదలైంది.... అంతా కమర్షియల్ అయిపోయింది
ఏ ఇద్దరు కలిసినా తమ పిల్లలు సాధించిన విజయాలు.. కొన్న ఆస్తులు.. చేయించుకున్న నగలు.. వారు పొందుతున్న సాలరీ ప్యాకేజ్.. వారు పొందుతున్న కంఫర్ట్ గురించి తప్ప..
వెనుకటి రోజుల్లో లాగా ఆప్యాయంగా నోరారా పలకరించు కోవడమే తగ్గిపోయింది..పలకరించుకున్నా ఏదో మొక్కుబడిగానే...
ఆనాటి రోజుల్లో ఇంట్లో కీడు జరిగినా..శుభకార్యం జరిగినా కనీసం 10 మంది చుట్టాలు వారం పది రోజుల ముందు నుంచే వచ్చి వుండేవారు..
తరువాత కూడా ఇంకో వారం రోజులు వుండేవారు..
రాత్రి పూట ఆరుబయట మంచాలు వేసుకుని పొద్దుబోయిందాక చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పడుకునే వారు..
ఇప్పుడు ఎంత దగ్గర వారి కార్యక్రమం అయినా.. చేసే వారు కూడా ఆప్పో సొప్పో చేసి పక్క వాడి కన్నా ఘనంగా చేయాలి అని చూపించే శ్రద్ధ మన వాళ్ళను దగ్గరగా నిలుపుకుందాము అని మర్చిపోతున్నారు..
అటెండ్ అయ్యే వారు కూడా తమ అతిశయం చూపించుకోవడానికి.. తమ స్థితిలో వచ్చిన మార్పు చూపించుకోవడనికి ఇస్తున్న ప్రయారిటీ..
పారదర్శక సంబంధాలు కి ఇవ్వడం లేదు.. చాలా మొక్కుబడిగా ఆహ్వానాలు హజరులు మిగిలిపోతున్నాయి..
అందరికి పిల్లలు దూరంగా వుంటున్నా.. ఇరుగు పొరుగు నే వుంటున్న రక్త సంబంధీకులు తో కూడా ఆత్మీయ అనుబంధాలు వుంచుకోవడం లేదు..
నిష్కారణంగా చిన్న చిన్న కారణాలు తోనే విపరీతమైన అహం అతిశయం తో వ్యవహరిస్తూ.. అందరికి అందరూ గిరిగీసుకుని బతకడానికి అలవాటు పడుతున్నారు..
వయసు పెరిగే కొద్దీ ఓర్పు సహనం పెరగాల్సిన దగ్గర అసూయ ద్వేషాలు పెంచుకుంటున్నారు..
నూటికి 90% కుటుంబాలలో పిల్లలు దూరంగానే వుంటున్నారు.. వీళ్లకు పెద్ధతనం.. ఒంటరి తనం.. అనారోగ్య సమస్యలు.. మనిషి తోడు అవసరం..
అయినా కొద్దిపాటి కూడా సర్దుబాటు ధోరణితో వుండడం లేదు.. విపరీతమైన స్వార్థం పక్క వాడి నీడ కూడా సహించడం లేదు..
దగ్గరి వాళ్ళ మధ్య కూడా గొడవలు.. మాట్లాడుకోక పోవడం.. షరా మాములు అయిపోయింది...
ఈ సందర్భంలోనే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన ఓ డైలాగ్ గుర్తుకు వస్తుంది...
‘"మనం బాగున్నప్పుడు లెక్కలు చూసుకుని... కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు"
’
వీలైతే మనం బాగున్నప్పుడు కూడా అందరితో కలిసి ఉండాలి మన వారికీ అవసరమైన సహాయం అందించాలి.
చాలా కుటుంబాలలో ఇప్పటికే మనుషులు పలచబడ్డారు..
వలసలు పుణ్యాన.. గత 60-70 సంవత్సరాలుగా అనుసరిస్తూ వచ్చిన ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల ఇప్పటికే కుటుంబాల సైజ్ తగ్గిపోయింది..
దానికి తోడు కేవలం కూడూ గుడ్డా కూడా పెట్టని ఈ అడ్డు గోడలు పర్యవసానం..
బాధాకరమైన విషయం ఏంటంటే ఒక వేళ పిల్లలు కజిన్స్ మన రూట్స్ కాపాడుకుందాం అనుకున్నా..రిలేషన్స్ లో ఎమోషన్ వుంచుకుందాము అనుకున్నా మెజారిటీ కుటుంబాలలో పెద్ద వాళ్ళు దూరిపోయి అగాధం పెంచుతున్నారు..
చిన్నప్పటి మా రోజులే బంగారపు రోజులు అనిపిస్తున్నాయి..
నేడు పిల్లలకు అసలు కుటుంబ సంబంధాలు పరిచయం చేయడం ఇన్వాల్వ్ చేయడం ఎప్పుడైతే తగ్గిపోయిందో..
రేపటి రోజున మన తరువాత మన పిల్లలకు మన అనే వారే లేని.. మిగలని పరిస్థితి సృష్టిస్తున్నాము..
నీ ఇంటికి వస్తే ఏమి పెడతావు? నా ఇంటికి వస్తె ఏమి తెస్తావు అన్న భావన నుంచి కొద్దిపాటి అయినా మార్పు చెందాలి..
అందరూ కొద్దిగా ఆలోచించండి.. మన కుటుంబాల్ని మనమే ఎడం చేసుకుంటూ.. మనలో మనమే దూరం పెంచుకుంటూ ఇంకా సమాజం నుంచి మనం ఏమి ఆశిస్తాము..
ఎవ్వరికీ వారు గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి.. మన చిన్ననాడు మనం ఏమేమి పొందాము నేడు మన పిల్లలకు ఏమేమి దూరం చేస్తున్నాము?
ఇప్పటికే చాలా మంది పెద్దవారు వెళ్ళిపోయారు.. మనకి ఎంత టైం వుంటుందో తెలియదు..
మనం సక్రమంగా ఆరోగ్యంగా వున్నప్పుడే కనీసం మన వాళ్ళ దగ్గర అయినా పనికిమాలిన అహం, అతిశయం, వదిలి వెద్ధాము....
ఒక్కడై రావడం... ఒక్కడై పోవడం...
ఈ నడుమ అయినా అందరితో కలసి మెలసి ఉందాం... 🙏🙏
*🔊ఆధార్, ఓటర్ ఐడీ లింక్ చెయ్యొద్దనుకుంటే కారణాలు చెప్పాలి*
*🍥న్యూఢిల్లీ: ఓటర్ ఐడీ కార్డుతో ఆధార్ను లింక్ చెయ్యడం, చెయ్యకపోవడం ప్రజల ఇష్టమని, అయితే, లింక్ చెయ్యొద్దనుకుంటే సరైన కారణాలు చెప్పాల్సి ఉంటుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) సుశీల్ చంద్ర చెప్పారు. ఓటర్ ఐడీతో ఆధార్ను లింక్ చేసే విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే రూల్స్ వస్తాయన్నారు. ఆదివారం ఆయన సీఈసీగా రిటైర్ అవుతున్న నేపథ్యంలో శనివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన హయాంలో రెండు ముఖ్యమైన సంస్కరణలను తీసుకొచ్చానని చెప్పారు. ఒకటి ఓటర్ఐడీకి ఆధార్ను లింక్ చెయ్యడం, 18 ఏండ్లు నిండిన యువత ఓటర్గా నమోదు చేసుకోవడానికి ఒక్క ఏడాదిలో నాలుగు తేదీలను ఖరారు చేయడం వంటి కొత్త రూల్స్ను తీసుకొచ్చానని తెలిపారు.*
*💥అంతకన్నా కారణాలేముంటయ్?*
*🌀ఆధార్ను లింక్ చేసుకోవడం స్వచ్ఛందమే అయినా.. లింక్ చెయ్యకుంటే ఎందుకు వద్దనుకుంటున్నారో సరైన కారణాలూ ఇవ్వాల్సి ఉంటుందని సీఈసీ సుశీల్ చంద్ర చెప్పుకొచ్చారు. ‘‘ఆధార్ లేదు, అప్లై చేసినా ఆధార్ రాలేదు లేదా మరో కారణమేదైనా ఉండొచ్చు. నాకు తెలిసి అంతకు మించిన కారణాలు ఏముంటాయ్?’’ అని ఆయన అన్నారు. ఆధార్ నంబర్లను ఇవ్వడం వల్ల ఎన్నికల సంఘం బోగస్ ఓటర్లను గుర్తించగలుగుతుందన్నారు. అంతేగాకుండా ఓటర్లకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు వీలవుతుందని చెప్పారు. ఓటర్లు నమోదైన బూత్ల వివరాలు, ఎన్నికలు ఎప్పుడు జరిగేది వంటి వివరాలను వారి ఫోన్ నంబర్కే పంపించగలుగుతామని వివరించారు.*
*💥ఓటర్ల నమోదుకు 4 తేదీలు..*
*💠మొన్నటిదాకా ఏటా జనవరి 1నే కొత్త ఓటర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉండేదని సుశీల్ చంద్ర చెప్పారు. దాని వల్ల ఆ తేదీ తర్వాత 18 ఏండ్లు నిండిన యువత ఓటరుగా నమోదయ్యేందుకు చాలా రోజులు వేచి చూడాల్సి వచ్చేదన్నారు. కానీ, తాను వచ్చిన తర్వాత మరికొన్ని ఆప్షన్లు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపానని, దానికి ప్రభుత్వం ఒప్పుకొందని చెప్పారు. అందులో భాగంగా ఒక ఏడాదిలో నాలుగు తేదీల్లో కొత్త ఓటర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం దొరికిందన్నారు. ఈ సంస్కరణను 20 ఏండ్లుగా పెండింగ్లో పెట్టారని ఆయన గుర్తు చేశారు. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆధార్ - ఓటర్ ఐడీ లింకింగ్ బిల్లులో ఈ రూల్ కూడా ఉందని చెప్పారు. వీటికి సంబంధించి అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం రూల్స్ను విడుదల చేస్తుందని పేర్కొన్నారు.*
ఇలాంటి మరిన్ని పోస్ట్లను చూడటానికి మరియు PRTUTS చేరడానికి, ఇక్కడ క్లిక్ చేయండి
*🔊ఆధార్, ఓటర్ ఐడీ లింక్ చెయ్యొద్దనుకుంటే కారణాలు చెప్పాలి* *🍥న్యూఢిల్లీ: ఓటర్ ఐడీ కార్డుతో Shyam Babu Yasarapu
మీరు మీ మొబైల్ ఫోన్లో ఉపయోగిస్తున్న UPI యాప్ల నుంచి లోన్ తీసుకోవచ్చు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, దానిపై ఎటువంటి వడ్డీ వసూలు చేయరు. మీరు Phone Pe , Paytm, Google Pay నుంచి సులభంగా లోన్ తీసుకోవచ్చు.
ఈ యాప్లన్నీ ఇన్స్టంట్ లోన్ను అందిస్తున్నాయి. దీని కోసం కనీస పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఫ్లిప్కార్ట్ కంపెనీ ఫోన్పే తన కస్టమర్ల కోసం ఇటీవలే రుణ సదుపాయాన్ని ప్రారంభించింది.
మీరు లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి, ఆ తర్వాత ఒకటి లేదా రెండు ముఖ్యమైన పత్రాలను ఇవ్వడంతో మీకు లోన్ వస్తుంది. ముందుగా PhonePe నుంచి లోన్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.
ఫోన్ పే లోన్
PhonePe నేరుగా కస్టమర్లకు రుణం ఇవ్వదు. కానీ మాతృ సంస్థ Flipkart నుంచి రుణం పొందడంలో సహాయపడుతుంది. లోన్ పొందడానికి మీరు PhonePe, Flipkart యాప్ రెండింటికీ కనెక్ట్ అయి ఉండాలి.
జీరో పర్సెంట్ లోన్ తీసుకోవడానికి, మీరు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, CIBIL స్కోర్ (700 ప్లస్) అందించాలి. PhonePeతో మీరు రూ.60,000 వరకు తక్షణ రుణాన్ని పొందవచ్చు. 45 వేల కంటే ఎక్కువ రుణం తీసుకుంటే 0.34 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
ఫోన్లో మీరు PhonePe, Flipkart యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు మీ మొబైల్ నంబర్ను PhonePeతో నమోదు చేసుకోవాలి. మీరు అదే మొబైల్ నంబర్తో ఫ్లిప్కార్ట్లో కూడా నమోదు చేసుకోవాలి.
దీని తర్వాత ఫ్లిప్కార్ట్ ప్రొఫైల్ విభాగానికి వెళ్లి, ఫ్లిప్కార్ట్ పే లేటర్ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఫ్లిప్కార్ట్ నుంచి మీ డాక్యుమెంట్లలో కొన్నింటిని అడుగుతారు. అవి ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఇప్పటికే ఖాతా లేకుంటే, మీరు ముందుగా ఫ్లిప్కార్ట్ పే లేటర్ ఖాతాను సృష్టించాలి. ఇక్కడ CIBIL స్కోర్ అడుగుతుంది.
మీకు సరైన CIBIL స్కోర్ ఉంటే, మీరు సులభంగా మంచి లోన్ పొందవచ్చు. ‘మై మనీ’ ఎంపికను క్లిక్ చేయడం ద్వారా UPI ఖాతా బ్యాలెన్స్ని చెక్ చేయండి. ఇది మీ లోన్ డబ్బు వచ్చిందో లేదో తెలుస్తుంది.
గూగుల్ పే లోన్
మీరు Google Pay నుంచి సులభంగా లోన్ తీసుకోవచ్చు. Google Pay నేరుగా రుణాలు ఇవ్వనప్పటికీ బ్యాంకుల నుంచి రుణాలు పొందడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు మీరు ఫెడరల్ బ్యాంక్ నుంచి రుణం తీసుకోవాలనకుంటే.
ముందుగా మీరు Google Pay యాప్ని తెరిచి, డబ్బు విభాగానికి వెళ్లి ఇక్కడ ‘లోన్’పై క్లిక్ చేయండి. ఇక్కడ లోన్ ఆఫర్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ప్రీ-అప్రూవ్డ్ లోన్ ఆఫర్ కనిపిస్తుంది.
మీరు తీసుకోవాలనుకుంటున్న ఆఫర్ను ఎంచుకోండి. ఇక్కడ లోన్ మొత్తం, వ్యవధిని ఎంచుకోండి. మీరు EMI ఎంపికను చూస్తారు. ఇక్కడ బ్యాంకు ఫీజులు, ఛార్జీలు కూడా చూపిస్తాయి. మీ సమాచారాన్ని తనిఖీ చేయడానికి రివ్యూపై క్లిక్ చేయండి. అన్నీ సరిగ్గా ఉంటే, ‘కొనసాగించు’పై క్లిక్ చేయండి. ‘అంగీకరించి వర్తించు’పై క్లిక్ చేసిన తర్వాత మీకు OTP వస్తుంది.
OTPని నమోదు చేసి, సమర్పించుపై క్లిక్ చేయండి. మీరు లోన్ యొక్క నిర్ధారణను పొందుతారు, దాని గురించి మీరు ‘యువర్ లోన్’ ట్యాబ్లో చూడవచ్చు.
Paytm లోన్
UPI వాలెట్ Paytm త్వరిత వ్యక్తిగత రుణాన్ని అందిస్తుంది. Paytm పర్సనల్ లోన్ చిహ్నంపై క్లిక్ చేయడం ద్వారా మీరు దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. Paytmలో మీరు రూ. 10,000 నుండి రూ. 2 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు.
ఇందులో, మీరు KYC మరియు ఉద్యోగం లేదా ఉపాధి సమాచారాన్ని ఇవ్వాలి. లోన్ పొందడానికి బ్యాంక్ ఖాతా వివరాలు, EMI రీపేమెంట్ సెటప్ ఎంచుకోవాలి.
లోన్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు, మీరు వడ్డీ, EMI గురించి సమాచారాన్ని పొందుతారు. దీని కోసం మీరు ప్రాసెసింగ్ ఫీజుతో పాటు జీఎస్టీ చెల్లించాలి. PAN సమాచారం వంటి KYC డేటా సెంట్రల్ KYC రిజిస్ట్రీ నుండి సేకరిస్తారు.
ఇలాంటి మరిన్ని పోస్ట్లను చూడటానికి మరియు PRTUTS చేరడానికి, ఇక్కడ క్లిక్ చేయండి
మీరు మీ మొబైల్ ఫోన్లో ఉపయోగిస్తున్న UPI యాప్ల నుంచి లోన్ తీసుకోవచ్చు. అతి ముఖ్యమైన విషయం ఏమి Shyam Babu Yasarapu
Fun to read :
ఒక పెద్దమనిషి, పనిలేక కాబోలు, చాలా కష్టపడి, పరిశోధించి వాట్సప్ గ్రూప్లో ఉండే సభ్యులను, 14 రకాలుగా విభజించాడు. అందులో నిజమెంతో గానీ, నవ్వుకోడానికి చాలా బాగుంది.
*1. కుప్పరులు*
వీరు రోజస్తమానం కుప్పలు తెప్పలుగా సమాచారమును సమూహములో గ్రుమ్మరించుచుందురు.
*2. ఆకస్మికులు:*
వీరు అప్పుడప్పుడు తమ ఉనికిని తెల్పుటకు అసందర్భపు సమాచారమును సమూహములో ప్రచురించెదరు.
*3. విధ్యుక్తులు:*
వీరు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లేదా రాత్రి వేళలో శుభోదయం, శుభరాత్రి లాంటి సమాచారములు మరియు పుట్టిన రోజు శుభాకాంక్షలు, వివాహ శుభాకాంక్షలు లాంటివి మాత్రమే సమూహములో ప్రచురించెదరు.
*4. గవాక్షులు:*
వీరు సమూహములో ఏమి జరుగుతున్నదో చూచెదరుకాని ఎటువంటి సమాచారమునూ ప్రచురించరు. బహుశా వీరికి సాంకేతిక పరిజ్ఞానం కాని భాషా పరిజ్ఞానం కాని లోపించి ఉండవచ్చు.
*5. అవ్యవస్థితులు:*
వీరు అనేక సమూహములలో సభ్యత్వం కలిగి ఉండుటచే ఏ సమాచారమును ఎక్కడ ముద్రించవలయునో అనే అయోమయావస్థితిలో ఉండి తను ప్రస్తుతం ఉన్న సమూహములోని సమాచారమును అదే సమూహములో ప్రచురించెదరు.
*6. అనుక్రియాయులు:*
వీరు సమూహములో ప్రచురించబడిన ప్రతి సమాచారమునకు, కార్యాలయంలో అధికారి ఎవరి ఉత్తరము వారికి తన నోటింగ్సు వ్రాసి ఏవిథంగా పంచునో ఆ విధంగా తన వ్యాఖ్యానముతో విధిగా ప్రతిస్పందిస్తారు.
*7. తంత్రజ్ఞులు:*
వీరు తమ సమాచారములతో అందరూ ఏకభవించాలని ఆశిస్తారు.
*8. పృథక్కులు:*
సమూహములో వీరి ఉనికి మిగతా సభ్యులెవరికి తెలియదు. తామరాకు మీది నీటి బొట్టులాగా.
*9. అసంబద్ధులు:*
వీరు ప్రచురించే సమాచారమునకు సమయము సందర్భము ఉండదు. సాయంకాలమునకు శుభోదయ మన్నన ఉదయమున శుభ రాత్రి మన్నన లాంటివి ప్రచురించెదరు.
*10. మేషియలు:*
వీరు తమ మేథస్సుననుసరించరు. తమకంటే ముందున్న సమాచారముననుసరించి, తథనుగుణంగా సమాచారమును తప్పు ఒప్పు విచారణ విస్మరించి ప్రచురించెదరు.
*11. తస్కరులు:*
వీరు ఇంతకు ముందే ప్రచురితమైన సమాచారమును కాపీ చేసి పేస్ట్ చేయుదురు.
*12. రవాణాగ్రేసరులు:*
వీరు వివిధ మార్గములలో తమకు సంక్రమించిన సమాచారమును కేవలం రవాణా చేయుదురు. అది ఎటువంటి సమాచారము, ఇతరులకు అది ఉపయోగకరమా అనేది కూడ పట్టించుకోరు.
*13. దైవఙ్ఞులు:*
వీరు సోమవారం శివుడు, మంగళవారం హనుమాన్, బుధవారం వినాయకుడు, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వేంకటేశ్వర స్వామి,
ఆదివారం సకల దేవతలను మనకు దర్శింపచేస్తారు.
*14. వ్యాపార_దిగ్గజాలు:*
అర్థం పర్థం లేకుండా తమ సరుకుల, సేవల గురించి ప్రింటెడ్ ప్రకటనలు పెట్టేస్తుంటారు. మనం ఫలానా మిత్రుడికీ యాక్సిడెంట్ అయిందని పెడితే, వీళ్ళు టక్కున 'అందమైన జుట్టుకు మా నూనెనే వాడండి'
అని మోకాళ్ళ వరకు జుట్టున్న ఒక గిరికన్య ఫోటో పెడతారు. ఇట్లాంటివి ఎన్నో!
ఇది ఎవరిని దృష్టి లో ఉంచుకొని వ్రాసినది కాదు.
ఒకవేళ మీకలా అనిపిస్తే అది కేవలం కాకతాళీయం మాత్రమే. హాయిగా నవ్వుకోండి.
మీరు ఏకోవకు చెందినవారో మీరే నిర్ణయించుకోండి.
ఇలాంటి మరిన్ని పోస్ట్లను చూడటానికి మరియు PRTUTS చేరడానికి, ఇక్కడ క్లిక్ చేయండి
Fun to read : ఒక పెద్దమనిషి, పనిలేక కాబోలు, చాలా కష్టపడి, పరిశోధించి వాట్సప్ గ్రూప్లో ఉండే సభ్యులన Shyam Babu Yasarapu
*♦️నీట్, ఎంసెట్ విద్యార్థులకు సాక్షి మాక్టెస్టులు*
*♦️ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. 2 తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష*
*♦️టాప్ టెన్ ర్యాంకర్లకు ఆకర్షణీయ బహుమతులు*
*♦️సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం.. ఇంజనీరింగ్, లేదా మెడిసిన్. అధికశాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్ను అందించే ఇంజనీరింగ్/మెడికల్ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు. అందుకు ఖర్చులకు వెనుకాడకుండా పిల్లలను కోచింగ్లో చేర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్.. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్/అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో అడ్మిషన్ కల్పించే ఎంసెట్కు లక్షల మంది విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు*
*♦️ఈ నేపథ్యంలో విద్యార్థులకు చేయూతనిచ్చేలా నిపుణుల ఆధ్వర్యంలో ఎంసెట్, నీట్ పరీక్షలకు సాక్షి మాక్టెస్టులు నిర్వహించనుంది. పరీక్షకు కొద్దిరోజుల ముందు వాస్తవ పరీక్షలాంటి వాతావరణంలో జరిగే సాక్షి మాక్ టెస్టులు రాయడం ద్వారా విద్యార్థులు తమ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకుని, ప్రిపరేషన్ను మరింత మెరుగుపరచుకోవచ్చు. అంతేకాకుండా సాక్షి మాక్ టెస్టుల్లో ఉత్తమ ప్రతిభను చూపడం ద్వారా టాప్ టెన్ ర్యాంకర్లు ఆకర్షణీయ బహుమతులూ గెలుచుకోవచ్చు*
*♦️సాక్షి మాక్ ఎంసెట్ (ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్) పరీక్ష 25 జూన్, 2022, 26 జూన్, 2022 (శనివారం, ఆదివారం) తేదీల్లో ఆన్లైన్లో జరగనుంది*
*♦️సాక్షి మాక్ నీట్ పరీక్ష 3 జూలై, 2022 (ఆదివారం) ఆన్లైన్/ఆఫ్లైన్ విధానంలో జరుగుతుంది*
*♦️ఒక్కో పరీక్షకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.250. అభ్యర్థులు https://www. arenaone.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు పూర్తిచేసిన అభ్యర్థుల ఈమెయిల్కు హాల్టికెట్ నంబర్ వస్తుంది. వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్లు: 96666 97219, 99126 71555, 96662 83534*
ఇలాంటి మరిన్ని పోస్ట్లను చూడటానికి మరియు PRTUTS చేరడానికి, ఇక్కడ క్లిక్ చేయండి
https://kutumbapp.page.link/otCP61NdjEttm2SE8?ref=NKY5Z
ప్రశ్న: మనకు వెక్కిళ్లు ఎందుకు వస్తాయి?
జవాబు: మన దేహంలోని ఛాతీ, ఉదర భాగాల్ని వేరు చేసే పలుచని విభాజకం ఒకటుంటుంది. దీనిని ఉదర వితానం (diaphragm) అంటారు. ఇది కిందికి కదిలితే ఛాతీ ఎక్కువ గాలిని నింపుకుంటుంది. పై వైపు కదిలితే ఛాతీలోని కొంత గాలి బయటకు పోతుంది. మనం ప్రతిసారీ ముక్కు ద్వారా గాలిని పీల్చి, వదులుతున్నప్పుడు ఉదరవితానం కిందికీ పైకీ కదులుతూ ఉంటుంది. ఆ విధంగా మనం నిశ్శబ్దంగా శ్వాసిస్తూ ఉంటాం.
శ్వాసించడం అనేది లయబద్ధంగా జరిగే క్రమమైన ప్రక్రియ. కాబట్టి శ్వాసనాళిక లోపలికి, వెలుపలికి వచ్చే గాలి నిశ్శబ్దంగా స్వర పేటికలోకి ప్రవేశిస్తుంది. ఒకోసారి ఉదరవితానానికి అంటుకుని ఉండే నరం ఉత్తేజితమైతే ఉదరవితానం తటాలున కుంచించుకుపోయి కింది వైపు కదులుతుంది. అప్పుడు శ్వాసనాళం పై చివర అంటే స్వర పేటిక మూసుకోవడం మొదలవుతుంది. ఆ దశలో దాని ద్వారా హడావుడిగా వెలుపలికి పోయే గాలి, సీసా మూతిని బిగించిన రబ్బరు బిరడాను గబుక్కున లాగితే వచ్చే 'పక్' (యాక్) లాంటి శబ్దం చేస్తుంది. అలాంటి శబ్దాలు మధ్యమధ్య కొంత కాల వ్యవధిలో వరసగా వస్తాయి. అవే వెక్కిళ్లు. అతిగా మద్యం సేవించడం, కారం ఎక్కువగా ఉండే మసాలా పదార్థాలు తినడం, కడుపులో ఆమ్లాలు ఉత్పత్తి కావడం, పేగులు సరిగా పనిచేయక పోవడం లాంటి కారణాల వల్ల ఉదరవితానానికి అంటుకుని ఉండే నరం ఉత్తేజితమై వెక్కిళ్లు వస్తాయి.
ఇలాంటి మరిన్ని పోస్ట్లను చూడటానికి మరియు PRTUTS చేరడానికి, ఇక్కడ క్లిక్ చేయండి
ప్రశ్న: మనకు వెక్కిళ్లు ఎందుకు వస్తాయి? జవాబు: మన దేహంలోని ఛాతీ, ఉదర భాగాల్ని వేరు చేసే పలుచని Shyam Babu yasarapu
24/04/2022
CREDIT CARD NEW RULES: ...
క్రెడిట్ కార్డ్ లకు RBI కొత్త రూల్స్ ..... ఆ రూల్స్ పాటించకపోతే రోజుకు ₹ 500 జరిమానా
కార్డుల మోసాలు, ఛార్జీల మోత నుంచి వినియోగదారులను రక్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కొత్త మార్గదర్శకాలను తీసుకువస్తోంది
ఇప్పటికే కార్డుల జారీపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని 2022 జులై 1 నుంచి అమలు చేయనుంది. ఈ నిబంధనలతో వినియోగదారులకు రక్షణతో పాటు సేవల్లో పారదర్శకత పెరుగుతుందని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం.. క్రెడిట్ కార్డు క్లోజ్ చేయాలని కస్టమర్ నుంచి విజ్ఞప్తి వస్తే దానిని వారం రోజుల్లోపు పరిష్కరించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు క్లోజింగ్ కు సంబంధించిన విషయం కస్టమర్ కు వెంటనే ఈ-మెయిల్, మెసేజ్ ద్వారా సమాచారం అందించాలి. సమస్యల పరిష్కారానికి ప్రత్యేకమైన మెయిల్ ఐడీతో పాటు, ఐవీఆర్ సేవలను ఉపయోగించాలి. వాటి వివరాలు ఇంటర్నెట్ బ్యాంకింగ్, వెబ్సైట్లలో ప్రత్యేకంగా కనిపించేలా ఏర్పాటు చేయాలి. క్రెడిట్ కార్డు మూసివేత ప్రక్రియలో విజ్ఞప్తుల స్వీకరణకు సులువైన విధానాన్ని పాటించాలి. పోస్ట్ లేదా ఇతర మాధ్యమాల ద్వారానే విజ్ఞప్తి చేయాలంటూ నిబంధనలు విధించకూడదు. క్రెడిట్ కార్డ్ క్రోజింగ్ రిక్వెస్ట్ ను సకాలంలో పూర్తి చేయకపోతే.. ఆలస్యం చేసిన ప్రతిరోజుకు రూ.500 చొప్పున కస్టమర్కు బ్యాంకు జరిమానా చెల్లించాలి.
సమాచారం ఇచ్చాకే..
ఏడాది కంటే ఎక్కువ కాలం పాటు క్రెడిట్ కార్డును వినియోగించకుంటే.. కార్డు యజమానికి సమాచారం అందించిన తర్వాతే ఖాతాను మూసివేయాల్సి ఉంటుంది. 30 రోజుల వ్యవధిలోపు కార్డ్ యజమాని నుంచి ఎటువంటి సమాధానం రాకపోతే.. బకాయిల చెల్లింపునకు లోబడే ఖాతాను మూసివేయాలి. 30 రోజుల వ్యవధిలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీతో కార్డ్ మూసివేత రికార్డును అప్డేట్ చేయాలి. క్రెడిట్ కార్డ్ ఖాతా మూసివేసిన తర్వాత.. ఖాతాలో ఏదైనా క్రెడిట్ కార్డు నగదు ఉంటే దానిని యజమాని బ్యాంక్ ఖాతాకు ట్రాన్ఫర్ చేయాలి. క్రెడిట్ కార్డు ఛార్జీలలో మార్పులు ఉంటే వాటి అమలుకు 30 రోజుల ముందే కస్టమర్లకు తెలపాలి. కార్డు యాక్టివేట్ కాకముందే సిబిల్, ఎక్సిపీరియన్ లాంటి క్రెడిట్ బ్యూరోలకు ఇవ్వకూడదు. క్రెడిట్ కార్డు ద్వారా ఇచ్చే ఈఎంఐల విషయంలో ట్రాన్పరెంట్ గా వ్యవహరించాలి.
బలవంతం చేయకూడదు..
సేవింగ్స్, కరెంట్ అకౌంట్ ఉన్న కస్టమర్లకు మాత్రమే డెబిట్ కార్డులు జారీ చేయాలి. లోన్ అకౌంట్ ఖాతాదారులకు డెబిట్ కార్డులు జారీ చేయకూడదు. డెబిట్ కార్డు తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని కస్టమర్లను ఒత్తిడి చేయకూడదు. డెబిట్ కార్డ్ తీసుకుంటేనే ఇతర సేవలు ఉంటాయంటూ షరతులు పెట్టకూడదు.
ఇలాంటి మరిన్ని పోస్ట్లను చూడటానికి మరియు PRTUTS చేరడానికి, ఇక్కడ క్లిక్ చేయండి
CREDIT CARD NEW RULES: ... క్రెడిట్ కార్డ్ లకు RBI కొత్త రూల్స్ ..... ఆ రూల్స్ పాటించకపోతే రోజుకు ₹ Shyam Babu yasarapu
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Address
Mahabubnagar
509001