23/12/2025
మ్యాథమెటిక్స్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు
శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని పాఠశాలలో మ్యాథమెటిక్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన గణిత ప్రదర్శన (ఎగ్జిబిట్) ను పాఠశాల కరస్పాండెంట్ కీర్తి వీరేందర్ గారు, ప్రిన్సిపల్ ప్రభాకర్ గారు మరియు ఉపాధ్యాయ బృందం సందర్శించి విద్యార్థుల ప్రతిభను అభినందించారు.
తదనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు గణితానికి సంబంధించిన పాటలు, నృత్యాలు, క్విజ్ పోటీలు తదితర కార్యక్రమాలను ఉత్సాహంగా ప్రదర్శించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేసి సత్కరించారు.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ కీర్తి వీరేందర్ గారు మాట్లాడుతూ, నిత్య జీవితంలో లెక్కల ప్రాముఖ్యత, గణిత అధ్యయనం వల్ల పిల్లల్లో లాజికల్ థింకింగ్, సమస్య పరిష్కార నైపుణ్యాలు ఎలా అభివృద్ధి చెందుతాయో వివరించారు. గణితం పిల్లల సమగ్ర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమం విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందించడంలో ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.